ఉప రాష్ట్రపతి ధన్‌ఖడ్‌తో గవర్నర్‌ హరిచందన్‌ భేటీ

ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌తో ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ శుక్రవారం భేటీ అయ్యారు. దిల్లీలోని ఉప రాష్ట్రపతి అధికారిక నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన ఆయన పలు అంశాలపై చర్చించారు.

Published : 08 Oct 2022 03:40 IST

ఈనాడు, దిల్లీ: ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌తో ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ శుక్రవారం భేటీ అయ్యారు. దిల్లీలోని ఉప రాష్ట్రపతి అధికారిక నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన ఆయన పలు అంశాలపై చర్చించారు. అంతకుముందు ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం(ఇగ్నో)లో ‘ఫ్రీడం స్ట్రగుల్‌ అండ్‌ ప్రొగ్రెసివ్‌ ఇండియా జీ 75 ’ అంశంపై ఆయన ప్రసంగించారు. స్వాతంత్య్ర అమృత మహోత్సవాలను పురస్కరించుకొని సెంటర్‌ ఫర్‌ ఫ్రీడం స్ట్రగుల్‌ అండ్‌ డయాస్పోరిక్‌ స్టడీస్‌ ఆధ్వర్యంలో జరిగిన ఉపన్యాస వాహినిలో ప్రసంగించిన గవర్నర్‌ ..స్వాతంత్య్ర పోరాట క్రమాన్ని, జాతీయోద్యమ నాయకుల త్యాగాలను వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని