Jamuna: దివికేగితివా.. అందాల ఓ చిలకా!
జమున... అభినయ లలన. ఆమె రూపం... ముగ్ధ మనోహరం. కృష్ణుడు అంటే ఎన్టీఆర్ ఎలా గుర్తొస్తారో... సత్యభామ అంటే తెలుగువాళ్లకు గుర్తొచ్చేది జమునే.
నటి జమున కన్నుమూత
కథానాయికగా తనదైన ముద్ర
సత్యభామగా గుర్తింపు
రాజకీయాల్లోనూ ప్రవేశం
అనారోగ్యంతో అస్తమయం
తెలంగాణ గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ సంతాపం
జమున... అభినయ లలన.
ఆమె రూపం... ముగ్ధ మనోహరం.
కృష్ణుడు అంటే ఎన్టీఆర్ ఎలా గుర్తొస్తారో... సత్యభామ అంటే తెలుగువాళ్లకు గుర్తొచ్చేది జమునే.
గడుసుదనం... కొంటెతనంతో కూడిన పాత్రలతో కథానాయికగా తనదైన ముద్ర వేసిన మేటి నటి జమున (86) ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె... హైదరాబాద్ బంజారాహిల్స్లోని తన నివాసంలో శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో 200కిపైగా సినిమాల్లో నటించిన ఆమె అసలు పేరు జానాబాయి. జ్యోతిషుల సూచనతో తల్లిదండ్రులు జమునగా మార్చారు. 1936 ఆగస్టు 30న కర్ణాటకలోని హంపీలో నిప్పణి శ్రీనివాసరావు, కౌసల్యాదేవి దంపతులకు జన్మించారు జమున. పసుపు, పత్తి తదితర ఉత్పత్తుల ఎగుమతి వ్యాపారం చేస్తూ శ్రీనివాసరావు తన కుటుంబంతో గుంటూరు జిల్లా దుగ్గిరాల గ్రామంలో స్థిరపడ్డారు. అక్కడే జమున విద్యాభ్యాసం కొనసాగింది.
సావిత్రి స్ఫూర్తితో..
సావిత్రిని స్ఫూర్తిగా తీసుకుని నాటకాల్లోకి అడుగుపెట్టిన జమునకు, ఊళ్లోనే ఉపాధ్యాయుడిగా పనిచేసిన సీనియర్ నటులు జగ్గయ్య ప్రోత్సాహం తోడైంది. ‘ఖిల్జీరాజు పతనం’ నాటకంలో కీలక పాత్ర పోషించిన ఆమె... ‘మాభూమి’ నాటకంతో గరికపాటి రాజారావు దృష్టిలో పడ్డారు. ఆయన నిర్మించిన ‘పుట్టిల్లు’ సినిమాతోనే తొలి అవకాశాన్ని అందుకున్నారు. ఆ తర్వాత ‘వద్దంటే డబ్బు’, ‘అంతా మనవాళ్లే’ చిత్రాల్లో రెండో కథానాయికగా నటించిన ఆమె ‘దొంగరాముడు’ చిత్రంలో ఏఎన్నార్కు చెల్లెలిగా కనిపించి ప్రేక్షకుల దృష్టిని ప్రముఖంగా ఆకర్షించారు. ‘మిస్సమ్మ’, ‘నిరుపేదలు’ తదితర చిత్రాలతో తిరుగులేని నటిగా నిరూపించుకున్నారు. ‘తెనాలి రామకృష్ణ’, ‘భాగ్యరేఖ’, ‘చిరంజీవులు’ ‘భూకైలాస్’, ‘అప్పు చేసి పప్పు కూడు’, ‘ఇల్లరికం’, ‘జల్సారాయుడు’, ‘గులేబకావళి కథ’, ‘గుండమ్మకథ’, ‘పూజాఫలం’, ‘బొబ్బిలియుద్ధం’, ‘మంచి మనిషి’... తదితర చిత్రాలతో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగారు.
సత్యభామ పాత్రలతో...
‘వినాయక చవితి’, ‘శ్రీకృష్ణ తులాభారం’ చిత్రాల్లో సత్యభామగా ఆమె అభినయం ప్రదర్శించిన తీరు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. రెండుసార్లు ఫిలిం ఫేర్ పురస్కారాన్ని పొందిన జమున... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2008లో ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు.
రాజకీయాల్లో...
ఇందిరాగాంధీ అంటే ఎంతో ఇష్టపడే జమున... ఆమెనే స్ఫూర్తిగా తీసుకుని 1983లో కాంగ్రెస్ పార్టీలో చేరారు.1985లో మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆమె ఓటమి చెందారు. 1989లో రాజమండ్రి లోక్సభ స్థానం నుంచి విజయం సాధించారు. ఆ తర్వాత వచ్చిన మధ్యంతర ఎన్నికల్లో ఆమెకు ఓటమి ఎదురైంది. తనకు కాంగ్రెస్ పార్టీలో గౌరవం లభించడం లేదని కొన్నాళ్లు భాజపాలోనూ కొనసాగారు.
తిరుపతిలో వివాహం
జమున 1965లో ప్రొఫెసర్ జూలూరి రమణారావును తిరుపతిలో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు కుమారుడు వంశీకృష్ణ, కుమార్తె స్రవంతి ఉన్నారు. వంశీకృష్ణ అమెరికాలో ప్రొఫెసర్గా స్థిరపడగా, స్రవంతి హైదరాబాద్లో తనయుడితో కలిసి నివసిస్తున్నారు. జమున భర్త జూలూరు రమణారావు 2014లో కన్నుమూశారు.
పలువురి నివాళులు
జమున మృతి వార్త తెలిసి పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో భౌతిక కాయాన్ని ఆమె నివాసం నుంచి ఫిల్మ్ఛాంబర్కు తరలించారు. రెండు చోట్లా వివిధ రంగాల ప్రముఖులు ఆమెకు నివాళులుఅర్పించారు. సాయంత్రం 4 గంటల సమయంలో జమున అంతిమయాత్ర ప్రారంభమైంది. వాహనంలోకి జమున భౌతికకాయాన్ని తరలించే క్రమంలో సినీ నటుడు మురళీమోహన్ పాడె మోశారు. మహాప్రస్థానంలోని మోక్షస్థల్ దహన వాటికలో ఆమె అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అమెరికా నుంచి కుమారుడు రావటానికి సమయం పట్టనుండటంతో చితికి కుమార్తె స్రవంతి నిప్పంటించారు.
జమున మృతి తీరనిలోటు
ప్రముఖ సినీనటి జమున మృతి సినీ పరిశ్రమలకు తీరనిలోటని తెలంగాణ గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్లు తీవ్ర సంతాపం తెలిపారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలుగువారి అభిమానతారగా ఆమె వెలుగొందారని ఆయన గుర్తుచేశారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, సీపీఐ, సీపీం రాష్ట్ర కార్యదర్శులు కూనంనేని సాంబశివరావు, తమ్మినేని వీరభద్రం, ఇతర నేతలు జమున మృతి పట్ల తీవ్ర సంతాపం ప్రకటించారు.
ఈనాడు, హైదరాబాద్-న్యూస్టుడే, బంజారాహిల్స్ ఫిలింనగర్, రాయదుర్గం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పతి దేవుడికి గుడి కట్టింది!
కరోనా మహమ్మారి ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం భర్త కొవిడ్తో మృతి చెందడంతో ఆమె ఒంటరిగా మారారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
రాష్ట్రంలో వంతెనల పరిశీలన..!
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు. -
యాదాద్రి విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. -
మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి
మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్జేసీ, మోడల్, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిలు నిరాకరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావుకు ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు
లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజును వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు (4)
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత