ఆర్థిక అరాచకత్వంలో పోటీలేని జగన్ (సంపాదకీయం)
మట్టిగుర్రాన్ని నమ్ముకుని ఏట్లోకి దిగితే ఏమవుతుంది? పోనీ, ఆవుల మందకు తోడేలును కాపలా పెడితే ఏం జరుగుతుంది? జవాబు కావాలంటే- జగన్మోహన్రెడ్డి పరిపాలనను పరిశీలిస్తే సరిపోతుంది!
మట్టిగుర్రాన్ని నమ్ముకుని ఏట్లోకి దిగితే ఏమవుతుంది? పోనీ, ఆవుల మందకు తోడేలును కాపలా పెడితే ఏం జరుగుతుంది? జవాబు కావాలంటే- జగన్మోహన్రెడ్డి పరిపాలనను పరిశీలిస్తే సరిపోతుంది! ‘సమసమాజ నిర్మాణానికి కావాల్సిన సుపరిపాలన అందిస్తా’ననే అందమైన అబద్ధంతో అధికారంలోకి వచ్చారాయన. అప్పటినుంచి అసత్యాలు, అర్ధసత్యాలనే జోడెద్దులపై సర్కారీ రథాన్ని నడిపిస్తూ, ఆంధ్ర రాష్ట్ర ఆర్థికారోగ్యాన్ని అప్పుల వెంటిలేటర్పైకి చేర్చారు! ‘రాష్ట్రాలు ఆర్థిక క్రమశిక్షణ పాటించాలి... నిధులను న్యాయబద్ధంగా వినియోగించాలి’ అని నీతిఆయోగ్ తాజా సమావేశంలో ప్రధాని మోదీ హితవు పలికారు. ఆయన హెచ్చరించినట్లు, రుణాల గుదిబండ బరువుకు రాబోయే తరాల నడుములు విరిగిపోకూడదంటే- రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా వ్యవహరించి తీరాలి. ఆ మాటంటే ఒంటిమీద తేళ్లూజెర్రులూ పాకినట్లు కంపరమెత్తిపోయే జగన్ సర్కారు- విచ్చలవిడి అప్పులు, పారదర్శకత లేని పాలనా విధానాలతో ఏపీ భవిష్యత్తుతో చెలగాటమాడుతోంది. ఆర్థిక నిపుణుల అభిప్రాయాలూ అనధికారిక అంచనాల ప్రకారం, పెండింగ్ బిల్లులతో కలిపి లెక్కిస్తే- రాష్ట్ర బకాయిల భారం మొన్న మార్చినాటికే తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు దాటిపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ రెండు నెలల్లోనే జగన్ సర్కారు బహిరంగ మార్కెట్ ద్వారా రూ.13,500 కోట్ల మేరకు రుణాలు సేకరించింది. బడ్జెట్లో చూపించకుండానే భారీయెత్తున అప్పులు చేస్తున్నారని, ఆ సొమ్ములో అత్యధికం రెవిన్యూ ఖర్చుకే ధారపోస్తున్నారని ‘కాగ్’ గతంలోనే ఆందోళన వ్యక్తంచేసింది. రుణ సేకరణలో రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారంటూ కేంద్ర ఆర్థికశాఖ సైతం రాష్ట్ర ప్రభుత్వాన్ని నిరుడు తీవ్రంగా ఆక్షేపించింది. ఎవరు ఏమి చెప్పినా బేఖాతరు చేస్తున్న జగన్- దీర్ఘకాలంలో ప్రయోజనదాయకమైన మూలధన వ్యయాన్ని అటకెక్కించేశారు. సంపద సృష్టించడం ద్వారా రాష్ట్రాభివృద్ధికి పాటుపడటమంటే, దాన్నో మహాపాపంగా భావిస్తున్నారు. 2014-19 మధ్యకాలంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి నాటి ప్రభుత్వం రూ.55,894 కోట్లు ఖర్చుచేసింది. ఉత్తరాంధ్ర, రాయలసీమలను ‘హరితాంధ్ర’గా తీర్చిదిద్దుతామని డంభాలు పలికిన వైకాపా సర్కారేమో జలయజ్ఞానికి నామమాత్రపు కేటాయింపులతో సరిపుచ్చుతోంది. పరిశ్రమలను ప్రోత్సహించడం, ఉపాధికి ఊతమివ్వడం తదితరాల్లోనూ జగన్ చేతలు- రాష్ట్రం నెత్తిన భస్మాసుర హస్తాలవుతున్నాయి!
మాటలతో కోటలు కట్టి, జనాన్ని బురిడీ కొట్టించడంలో జగన్ నైపుణ్యం అనితరసాధ్యం. నీతిఆయోగ్ సమావేశంలోనూ ఆయన తన ప్రతిభను నిరుపమానంగా ప్రదర్శించారు. ఆర్థిక వ్యవస్థ శీఘ్రగతిన పురోగమించాలంటే- ఆరోగ్యకరమైన పెట్టుబడుల ద్వారా మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాలని జగన్ మహాగొప్పగా ప్రవచించారు. ఆ మేరకు స్వరాష్ట్రంలో ఆయన చేస్తున్నదేమిటంటే- హళ్లికిహళ్లి సున్నకుసున్న! 2019 అక్టోబరు నుంచి 2022 జూన్ నడుమ దేశంలోకి రూ.11.79 లక్షల కోట్ల విలువైన విదేశీ పెట్టుబడులు వెల్లువెత్తాయి. వాటిలో ఏపీలోకి వచ్చినవి కేవలం రూ.4,056 కోట్లు. కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ తదితరాలతో పోటీ సంగతి దేవుడెరుగు- 2021లో మూలధన పెట్టుబడులను ఆకర్షించడంలో రాజస్థాన్, పశ్చిమ్ బెంగాల్ వంటి వాటికన్నా ఏపీ వెనకపడిపోయింది. వివిధ రాష్ట్రాల్లో సరకు రవాణా సౌకర్యాల స్థితిగతులను ‘లీడ్స్’ సర్వే పేరిట కేంద్రం సరిపోలుస్తుంటుంది. 2019కిగాను అందులో మూడో స్థానంలో నిలిచిన ఏపీ- 2021లో తొమ్మిదో స్థానానికి పడిపోయింది. మౌలిక సదుపాయాలు, సర్కారీ సేవలపరంగా నాణ్యతలేమే ఏపీ దుస్థితికి కారణమని ‘లీడ్స్’ నివేదిక కుండ బద్దలుకొట్టింది. నీతిఆయోగ్ రూపొందించిన ‘భారతదేశ నవకల్పనా సూచీ’లో 17 పెద్దరాష్ట్రాల్లో తెలంగాణ రెండోదిగా నిలిస్తే- ఏపీ తొమ్మిదో స్థానానికి పరిమితమైంది. కేంద్ర ప్రభుత్వం మొన్న ఫిబ్రవరిలో రాజ్యసభలో వెల్లడించిన వివరాల మేరకు- అంకురసంస్థలకు ప్రోత్సాహక వాతావరణ పరికల్పనలోనైతే ఏపీది ఏకంగా 29వ స్థానం! 31 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మిజోరం, లద్దాఖ్ మాత్రమే ఆంధ్ర కంటే వెనక ఉన్నాయి. అభివృద్ధి పొడగిట్టని జగన్ అధ్వాన పాలనకు ప్రత్యక్ష నిదర్శనాలే ఇవన్నీ. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం ఏదైనా సరే, ప్రజలకు జవాబుదారీగా మెలగాలి. ఏయే రూపాల్లో ఎన్నెన్ని అప్పులు తెస్తున్నారన్న సమాచారాన్ని వైకాపా సర్కారు ఏనాడూ సక్రమంగా బయటికి వెల్లడించడం లేదు. ప్రజల బతుకులను బలిపీఠంపైకి ఈడ్చుకుపోయే ఆర్థిక అరాచకత్వంలో జగన్ ప్రభుత్వానికి వేరొకరితో పోటీయే లేదు!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిజం చెబితే.. గురువులకు నోటీసులు!
‘ఎప్పుడూ సత్యమే పలకాలని’ పిల్లలకు చెప్పే ఉపాధ్యాయులు.. తాము నిజం చెబితే షోకాజ్ నోటీసులు అందుకోవలసి వస్తోంది. వైకాపాతో అంటకాగుతున్న పాఠశాల విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి బరితెగించి వ్యవహరిస్తున్నారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
ప్రజా రక్షకులు కారు.. వైకాపా సేవకులు!
ఖాకీలంటే... ప్రజారక్షణకు రాఖీలు... కానీ జగన్ హయాంలో కొందరు... వైకాపా పోకిరీలుగా మారి... అధికార పార్టీకి చాకిరీ చేశారు. స్వతంత్రంగా నిష్పాక్షికంగా వ్యవహరిస్తూ- ప్రజల ప్రాణాలు, ఆస్తిపాస్తులు, వారి హక్కులు, గౌరవమర్యాదలను కాపాడటం పోలీసుల విధ్యుక్త ధర్మం. -
యథా రాజ... తథా విద్య!
విద్య లేని వాడు వింత పశువు... మరి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసేవారిని ఏమనాలి? పాఠశాల విద్యార్థులను బైజూస్,బకలారియేట్ విధానాలతో కలవరపెట్టి.. స్కూళ్లలో ఉపాధ్యాయుల ఉనికే లేకుండా చేసి... ఎయిడెడ్ పాఠశాలలను బెదిరించి...మూయించి... ఇంటర్ విద్యార్థులకిచ్చే ఉచిత పుస్తకాల పంపిణీ రద్దు చేసి.. ఇంటర్న్షిప్ పేరుతో డిగ్రీ విద్యార్థులతో రొయ్యలు ఒలిపించి.. పీజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేసి.. విశ్వవిద్యాలయాలను రాజకీయ కార్యకలాపాలకు బలిచేసి... చదువుకోవాలనుకునే వారిని పక్కరాష్ట్రాలకు వలస పంపించింది అక్షరాలా... జగన్ సర్కారే! -
‘కోడ్’ కొండెక్కుతోంది?
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న ‘ఎచీవర్స్ డే’ పేరుతో భారీ సమావేశం నిర్వహిస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఐఏఎస్ అధికారి గుల్జార్పై నిప్పులు చెరిగిన హైకోర్టు
ఓ వ్యక్తికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చే విషయంలో హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఉత్తర్వులిచ్చిన ఐఏఎస్ అధికారి, ఆర్థికశాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి ఎన్.గుల్జార్పై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
తెలుగు మాధ్యమంలో ఉత్తీర్ణత ఉద్దేశపూర్వకంగానే తగ్గిస్తున్నారా?
రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా రద్దు చేయాలని కంకణం కట్టుకుందని సామాజిక కార్యకర్త డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. -
భారీ యంత్రాలతో ఇసుక తోడేద్దాం..
రాష్ట్రంలో ‘ముఖ్య’ నేత సోదరుడి కనుసన్నల్లో సాగుతున్న ఇసుక దోపిడీని మరింత భారీ స్థాయిలో చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. -
స్వగ్రామాల్లో జీవనం సాగించేలా పిటిషనర్లకు రక్షణ కల్పించండి
రాజకీయ కక్షతో తమను గ్రామాల నుంచి తరిమేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన అనుచరుల నుంచి రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు స్పందించింది. -
అవినీతి ‘ప్రసాద’ం.. దందాల ‘రాజ’సం!
ఇసుకలో కోట్లాది రూపాయల సారం.. ఇళ్ల పట్టాల్లోనూ నిబంధనల పేరిట బేరం.. కాగితాలకు దొరకని వ్యాపారం.. బినామీలు, అనుచరులతోనే వ్యవహారం.. వంతెన మార్గాన్నే మార్చి భూముల పందేరం.. కొవిడ్ విరాళాల్లో స్వాహాకారం.. మొత్తంగా.. ఆ గోదారి తీరం.. అక్కడి ప్రజాప్రతినిధికి వేయాలి అవినీతి హారం.. వెరసి పేదలు, సామాన్యుల హాహాకారం.. -
పేరుకే పెంపు.. ఊకదంపు
పేదలే నా ప్రాణం... వారి ఆయురారోగ్యాలే నా ధ్యేయం... ఆరోగ్యశ్రీ వారి కోసమేనంటూ... జగన్ తన ప్రసంగాల్లో ఊదరగొడుతున్నారు... వాస్తవంగా చూస్తే పథకానికే అనారోగ్యమొచ్చింది... ప్రచారం చేసుకుంటున్నంత గొప్పతనమేమీ లేదు! ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకోవడమే లేదు!! -
హీరో ఎవరు? విలన్ ఎవరు?
‘మనమంతా సినిమాకు పోతాం. ఆ సినిమాలో హీరో ఎందుకు నచ్చుతాడో, విలన్ ఎందుకు నచ్చడో అందరూ ఆలోచించాలి. -
ఓటమి ‘కాసు‘క్కూర్చుంది!
ఈ అయిదేళ్లలో గురజాల పట్టణంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఈ రోడ్లు కూడా గత ప్రభుత్వంలో వేసినవే. అందువల్లే ఈసారి ఇక్కడ మార్పు కావాలనుకుంటున్నాం. -
నిఘా విభాగాధిపతి పోస్టుకు సంజయ్ పేరు ఎలా ప్రతిపాదిస్తారు?
నిఘా విభాగాధిపతి పోస్టు కోసం ముగ్గురు అధికారుల పేర్లతో పంపిన ప్యానల్ జాబితాలో సీఐడీ విభాగాధిపతి ఎన్.సంజయ్ పేరును.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్రెడ్డి చేర్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పండుటాకులపై పగ.. ఇది జగన్ మార్కు దగా.. అ‘విశ్రాంత’ ఆవేదన
బాధ్యతల బరువును మోసి... జీవితమంతా ఎన్నో శ్రమలకోర్చి... ఇక హాయిగా ఉందామనుకున్న విశ్రాంత ఉద్యోగుల బతుకుల్లో జగన్ రేపిన కల్లోలం అంతా ఇంతా కాదు... ఐఆర్, డీఆర్లకు గండికొట్టి... క్వాంటం పెన్షన్లలో కొర్రీ పెట్టి... వచ్చే ఆ నాలుగు రూపాయలనూ సమయానికి రాకుండా చేసి...వారిని రోడ్డున పడేశారు. చివరకు వారూ ధర్నాలు చేసే పరిస్థితి తెచ్చారు. -
ఫాం-12 సమర్పించినా రశీదు ఇవ్వడం లేదు
ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్లపై ఉద్యోగులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలట్ ఫాం-12 సమర్పించినా కొన్ని చోట్ల రశీదులు ఇవ్వడం లేదు. -
నేడు 54 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. బుధవారం 69 మండలాల్లో తీవ్ర వడగాలులు, 105 మండలాల్లో వడగాలులు వీచాయి. -
గిరిజన మహిళలను దూషిస్తే కేసు నమోదు చేయరా?
‘‘యానాదోళ్ల అమ్మాయి తెదేపాలో చేరారు. ఆమె నెత్తిన రూపాయి పెడితే ఐదు పైసలు విలువ చేయరు. గతంలో వాలంటీరుగా ఉంటే.. గౌతమ్బాబు ఆత్మకూరు ఛైర్పర్సన్గా చేశారు. -
చెల్లెమ్మలకు ఏం సమాధానం చెబుతారు జగన్?
‘మీ ఆడబిడ్డలం కొంగు చాచి అడుగుతున్నాం. న్యాయం చేయండి. ఒకవైపు రాజశేఖరరెడ్డి బిడ్డ ఎన్నికల్లో నిలబడింది.. మరోవైపు రాజశేఖరరెడ్డి తమ్ముడు వివేకా హత్య కేసులో నిందితుడు బరిలో ఉన్నారు. -
జగన్.. మరీ ఇంత బరితెగింపా?
నా ఎస్సీలు.. అంటూ నిత్యం మైకు ముందు దళితులపై ప్రేమ ఒలకబోస్తున్నట్లు నటించే జగన్ నిజస్వరూపం ఏమిటో మరోసారి బయటపడింది. -
మహాత్ముడు మన్నించినా.. ప్రజలు క్షమించరు!
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైకాపా అభ్యర్థి మొండితోక జగన్మోహనరావు నామినేషన్ ర్యాలీ సందర్భంగా బుధవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు హంగామా సృష్టించారు.
తాజా వార్తలు (Latest News)
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ