Viveka Murder Case - Avinash Reddy: ఎ-8గా అవినాష్రెడ్డి
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ కోర్టుకు శుక్రవారం సీబీఐ అనుబంధ అభియోగపత్రం సమర్పించింది.
నిందితులుగా భాస్కరరెడ్డి, ఉదయ్కుమార్రెడ్డి
అనుమానితులుగా ఎం.వి.కృష్ణారెడ్డి, ఏదుల ప్రకాష్
వివేకా హత్యకేసులో సీబీఐ అనుబంధ అభియోగ పత్రం
జులై 14 వరకు నిందితుల రిమాండు పొడిగిస్తూ సీబీఐ కోర్టు ఉత్తర్వులు
ఈనాడు, హైదరాబాద్: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ కోర్టుకు శుక్రవారం సీబీఐ అనుబంధ అభియోగపత్రం సమర్పించింది. ఇందులో ఎ-6గా ఉదయ్కుమార్రెడ్డి, ఎ-7గా వై.ఎస్.భాస్కరరెడ్డి, ఎ-8గా వై.ఎస్.అవినాష్రెడ్డిలను పేర్కొంది. వివేకా వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసిన ఎం.వి.కృష్ణారెడ్డి, వివేకా ఇంట్లో వంటమనిషి లక్ష్మి కుమారుడు ఏదుల ప్రకాష్లను ఇదే కేసులో అనుమానితులుగా పేర్కొంది. జూన్ 30లోగా వివేకా హత్యకేసులో దర్యాప్తును పూర్తిచేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో సీబీఐ అభియోగపత్రం దాఖలు చేసింది. దీంతోపాటు ఇప్పటివరకూ నమోదుచేసిన సాక్షుల వాంగ్మూలాలు, సేకరించిన ఆధారాలను జతచేసింది. సీబీఐ సమర్పించిన అన్ని ఆధారాలనూ పరిశీలించిన తర్వాత కోర్టు యంత్రాంగం న్యాయమూర్తి ముందు ఉంచుతుంది. అభియోగపత్రాన్ని, అందులో పేర్కొన్న అభియోగాలను, ఆధారాలను పరిశీలించాక న్యాయమూర్తి దాన్ని విచారణ నిమిత్తం పరిగణనలోకి తీసుకుని నిందితులకు సమన్లు జారీచేయాల్సి ఉంది.
రిమాండు పొడిగింపు
ఈ కేసులో నిందితులైన గంగిరెడ్డి, యాదాటి సునీల్యాదవ్, గజ్జల ఉమాశంకర్రెడ్డి, డి.శివశంకర్రెడ్డి, ఉదయ్కుమార్రెడ్డి, వై.ఎస్.భాస్కరరెడ్డిలను చంచల్గూడ జైలునుంచి తీసుకొచ్చి శుక్రవారం కోర్టు ముందు హాజరుపరిచారు. వీరందరికీ జడ్జి సీహెచ్.రమేశ్బాబు జులై 14 వరకు రిమాండును పొడిగిస్తూ ఉత్తర్వులు జారీచేశారు.
దర్యాప్తు కొనసాగుతుందా?
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ అభియోగపత్రం దాఖలు చేసినా.. ఇంకా దర్యాప్తు కొనసాగించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. వివేకా చనిపోయే ముందు రాసిన లేఖలో నిగూఢ వేలిముద్రలనూ గుర్తించడంలో భాగంగా లేఖను కోర్టు నుంచి సీబీఐ తీసుకుని, దిల్లీ ఎఫ్ఎస్ఎల్కు పంపింది. నిన్హైడ్రిన్ పరీక్ష ద్వారా వేలిముద్రలను గుర్తించాలని కోరింది. ఎం.వి.కృష్ణారెడ్డి, వంటమనిషి లక్ష్మి కుమారుడు ప్రకాష్లను అనుమానితులుగా పేర్కొంది. వీటన్నింటిపై స్పష్టత నిమిత్తం దర్యాప్తును మరికొంతకాలం కొనసాగించే అవకాశాలున్నాయి. తదుపరి దర్యాప్తులో సమాచారం వెల్లడైతే సమర్పిస్తామంటూ కోర్టును కోరే అవకాశం ఉంది. వివేకా హత్యకు డబ్బు సమకూర్చిందెవరు, ఆ డబ్బు ఎక్కడ ఉందన్న వివరాలు తెలియాల్సి ఉంది.
నేరంలో నిందితుల పాత్ర స్పష్టం
వివేకా హత్య వెనుక జరిగిన కుట్రలో నిందితుల పాత్ర స్పష్టంగా ఉందని సీబీఐ దాఖలుచేసిన అభియోగ పత్రంలో పేర్కొన్నట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు... ‘‘నిందితులు ఎర్ర గంగిరెడ్డి, సునీల్యాదవ్, ఉమాశంకర్రెడ్డి హత్యలో ప్రత్యక్షంగా పాల్గొనగా సాక్ష్యాలు విధ్వంసం చేయడంలో అవినాష్రెడ్డి, భాస్కరరెడ్డి, శివశంకర్రెడ్డి, గంగిరెడ్డి పాత్ర ఉన్నట్లు తేలింది. అవినాష్రెడ్డి డ్రాయింగ్ రూం లోపల, లాన్ ప్రాంతంలో ఉండగా, శివశంకర్రెడ్డి, మనోహర్రెడ్డి, గంగిరెడ్డిలతో కలిసి భాస్కరరెడ్డి బెడ్రూంలో ఉంటూ సాక్ష్యాలు విధ్వంసం చేయించారు. హత్య పథకం అమలుకు అవినాష్రెడ్డి, భాస్కరరెడ్డి నగదు సమకూర్చుతారని గంగిరెడ్డి చెప్పినట్లు దస్తగిరి వాంగ్మూలం ఇచ్చారు. అవినాష్రెడ్డి ఇతరులతో చర్చించిన తర్వాత సీఐ శంకరయ్యకు ఫోన్ చేసి బందోబస్తుకు పోలీసులను పంపాలని చెప్పి, గుండెపోటుతో మృతిచెందినట్లు ప్రకటించడం కుట్రలో భాగమే. సీఐకి కేసు నమోదు చేయవద్దని, పోస్టుమార్టం కూడా అవసరం లేదని మొదట చెప్పారు. తర్వాత సునీత తదితరులు వచ్చాక కేసు నమోదు చేశారు. అవినాష్రెడ్డి సూచనల మేరకు అస్పష్టమైన వివరాలతో గాయాలు, రక్తపుమడుగులో మృతదేహం పడి ఉన్నా.. కనీసం వాటి ప్రస్తావన లేకుండా ఎం.వి.కృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు’’ అని సీబీఐ పేర్కొంది.
రాజకీయ విభేదాలూ కారణమే
‘‘కడప జిల్లా రాజకీయాల్లో వివేకా చురుకైన పాత్ర పోషిస్తుండటంతో అవినాష్రెడ్డి, భాస్కరరెడ్డి, శివశంకర్రెడ్డి రాజకీయ విభేదాలతో కక్ష పెంచుకుని ఆయనకు వ్యతిరేకంగా కుట్ర పన్నడం ప్రారంభించారు. 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో పులివెందుల డివిజన్ మినహా మిగిలిన ప్రాంతాల్లో గెలవడం వైకాపా శ్రేణులకు ఆశ్చర్యం కలిగించింది. గెలుస్తానన్న ధీమాతో వివేకా తన డివిజన్ను వదిలి ఇతర డివిజన్లపై దృష్టి సారించారు. పులివెందుల వ్యవహారాలను అవినాష్రెడ్డి, భాస్కరరెడ్డి, శివశంకర్రెడ్డి పర్యవేక్షిస్తూ వివేకా ఓటమికి కారకులయ్యారు. వెన్నుపోటు గురించి తెలుసుకున్న వివేకా ఆగ్రహం వ్యక్తం చేసి, గంగిరెడ్డిని పలుమార్లు తిట్టారు. ఎంపీ టికెట్ అవినాష్రెడ్డికి దక్కకుండా వివేకా ప్రయత్నించారని అవినాష్ కక్ష పెంచుకున్నారు. దీంతో నేరచరిత్ర ఉన్న శివశంకర్రెడ్డి ద్వారా హత్యకు కుట్రపన్నినట్లు ప్రాసంగిక సాక్ష్యాలు వెల్లడిస్తున్నాయి’’ అని అభియోగపత్రంలో సీబీఐ తెలిపింది.
సాంకేతిక ఆధారాలున్నాయి
‘‘దర్యాప్తులో భాగంగా అనుమానితుల కాల్ డేటా, హత్య జరిగిన ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజి, గూగుల్ టేక్ ఔట్, కాల్డేటా రికార్డులు, అనుమానితుల ఫోన్ల నుంచి సేకరించిన డేటాతో పాటు వివేకా ఇంట్లోని రౌటర్ నుంచి వై-ఫై లాగ్స్, ఏఐఐఎంఎస్ నిపుణుల నుంచి అభిప్రాయాలతో సహా భారీ ఎత్తున ఎలక్ట్రానిక్ డేటా సేకరించి పరిశీలించాం. దిల్లీ సీఎఫ్ఎస్ఎల్ నుంచి గూగుల్ టేక్ ఔట్ గురించి అందిన నివేదికలో సాక్ష్యాల ధ్వంసం, హత్య వెనుక కుట్రలో ఉదయ్కుమార్రెడ్డి, వై.ఎస్.భాస్కరరెడ్డి, అవినాష్రెడ్డిల పాత్ర ఉంది. వివేకా హత్య తర్వాత 15 తెల్లవారుజామున 1.58 గంటలకు అవినాష్ ఇంట్లో సునీల్యాదవ్ ఉన్నట్లు గూగుల్ ద్వారా తేలింది. గూగుల్ టేక్ఔట్ ప్రకారం సునీల్యాదవ్ ఈ సమయంలో 6.15 నుంచి 6.33 మధ్య అవినాష్రెడ్డి వాళ్ల ఇంట్లో ఉంటూ కత్తి తీసుకురావడానికి కదిరి వెళ్లిన దస్తగిరి కోసం ఎదురు చూస్తున్నాడు. అవినాష్రెడ్డి ఇంటికి ఉదయ్కుమార్రెడ్డి 6.53కు వచ్చి 8.07 గంటల వరకు ఉన్నాడు. శివశంకర్రెడ్డి 15న 8.25 నుంచి 12.45 వరకు పులివెందుల స్టేషన్ సమీపంలో ఉన్నట్లు గూగూల్ టేక్ఔట్ ద్వారా వెల్లడైంది. అంటే ఫిర్యాదు సమయంలో కృష్ణారెడ్డితో పాటు ఉన్నట్లు తెలుస్తోంది’’ అని తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ కోసం.. ఎంతకైనా దిగజారుతా
నువ్వు ఇంతకంటే దిగజారవనుకునే ప్రతిసారీ నా నమ్మకం తప్పని నిరూపిస్తున్నావు అంటూ జెర్సీ సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డికి అది అతికినట్టుగా సరిపోతుంది. -
మద్యం మహమ్మారికి ‘జగన్ ముద్దులు’
‘‘నాలుగు సంవత్సరాల్లో మద్యపానాన్ని పూర్తిగా తీసేయాలన్న కసి నాలో ఉంది’’ అని తన తండ్రి సమాధి సాక్షిగా చెప్పిన జగన్మోహన్రెడ్డి - సీఎంగా చేసిందేంటి? కాపురాలను కూల్చే మద్యం మహమ్మారిని కసికసిగా ముద్దుచేశారు. -
వైకాపా వీరభక్త అమ్మిరెడ్డిపై వేటు
వైకాపా సేవే పరమావధిగా, ఆ పార్టీ నేతలు చెప్పిందే వేదంగా భావిస్తూ విధులు నిర్వర్తించిన మరో ‘ఎస్ బాస్’పై ఎన్నికల సంఘం వేటు వేసింది. -
ఏపీ నూతన డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
రాష్ట్ర నూతన డీజీపీగా హరీష్కుమార్ గుప్తా సోమవారం సాయంత్రం బాధ్యతలు చేపట్టారు. 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారైన ఆయన ప్రస్తుతం హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. -
నీరు ఇవ్వలేం... కొనుక్కుని తాగండి!
ఒంగోలు శివారు కాలనీల్లో ప్రజలు ఎన్ని రోజులకోసారి స్నానం చేస్తున్నారో తెలుసా? మూడు రోజులకోసారి. ఇది నీటి కొరత తెచ్చిన దుస్థితి. శివారు కాలనీలకు ఐదు రోజులకోసారి ట్యాంకర్లతో నగరపాలక సంస్థ అరకొరగా నీరు సరఫరా చేస్తోంది. ఇవి అవసరాలకు సరిపోక పోవడంతో స్నానం చేయడం తగ్గించుకున్నారు. -
వైకాపా అరాచకాలపై మేము సైతం పోరాడతాం
‘ఏపీలో అరాచక పాలన సాగుతోంది. అన్ని వర్గాల ప్రజలపై దాడులు జరుగుతున్నాయి. వ్యవస్థలన్నీ నాశనమయ్యాయి. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు మా వంతు పోరాడతాం’ అని అమెరికాలోని ప్రవాస భారతీయ మహిళలు తెలిపారు. -
వైద్య బోధకుల బదిలీల దుమారం
ముందస్తు సమాచారం లేకుండా బదిలీల ఉత్తర్వులు జారీచేసి, వెంటనే రిలీవ్ కావాలని పేర్కొనడంపై వైద్య బోధకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2024-25 విద్యా సంవత్సరానికి పాడేరు, మదనపల్లె, మార్కాపురం, ఆదోని, పులివెందులలోని కొత్త వైద్యకళాశాలల్లో తరగతులు ప్రారంభం కావాలి. -
ఇఫ్కోకు భూకేటాయింపుపై పిల్ కొట్టివేత
యూరియా, అమోనియా ప్లాంట్ నిర్మాణం కోసం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్స్ కోఆపరేటివ్ లిమిటెడ్ (ఇఫ్కో)కు భూములు కేటాయించడాన్ని సవాలు చేస్తూ.. 2017లో దాఖలైన పిల్ను కొట్టేస్తూ సోమవారం హైకోర్టు తీర్పు వెల్లడించింది. -
భరోసానూ బరికేశారు!
రైతుబంధు కింద తెలంగాణలో ఎకరానికి ఏడాదికి ఇస్తోంది రూ.10,000. ఐదెకరాలుంటే రూ.50 వేలు. అంటే ఐదేళ్లలో ఒక్కో రైతుకు అందింది కనీసం రూ.2.50 లక్షలు. -
ముందుచూపుతో ప్రజల్ని నడిపించే దార్శనికులు రావాలి
పౌరులు ధైర్యంగా ప్రభుత్వాల్ని ప్రశ్నించగలిగినప్పుడే ప్రజాస్వామ్యం మనగలుగుతుందని సామాజికవేత్త డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. దురదృష్టవశాత్తూ రాష్ట్రంలో ప్రశ్నించే వారిపై భౌతికదాడులు సర్వసాధారణంగా మారాయని, వారికి పథకాలు నిలిపివేయడం.. -
ఉద్యోగాలు సృష్టించే వారికే ఓటేయాలి
‘హైదరాబాద్ అభివృద్ధి చెందడానికి ప్రధాన కారణం అక్కడి మౌలిక వసతులే. అటువంటి పరిస్థితులు ఏపీలో కనిపించడం లేదు. కనీసం రోడ్లు కూడా సరిగ్గా లేవు. అన్ని వసతులు కల్పిస్తేనే పెట్టుబడులు వస్తాయి. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు నేనే ప్రత్యక్ష బాధితుడిని
ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు తానే ప్రత్యక్ష బాధితుడినని విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ పీవీ రమేశ్ తన ఎక్స్ ఖాతాలో సోమవారం ట్వీట్ చేశారు. చనిపోయిన తన తల్లిదండ్రులకు చెందిన కృష్ణా జిల్లా విన్నకోటలోని పట్టాభూములను మ్యుటేషన్ చేసేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరించారని పేర్కొన్నారు. -
ఎన్నికలు పూర్తయ్యే వరకూ.. నిధుల విడుదల వాయిదా
రైతులకు పెట్టుబడి రాయితీ, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదలకు అనుమతి కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి అధ్యక్షతన స్క్రీనింగ్ కమిటీ పంపిన ప్రతిపాదనలను ఎన్నికల సంఘం తిరస్కరించింది. -
రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు
ద్రోణి ప్రభావంతో రాబోయే 4 రోజుల్లో రాష్ట్రంలో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. -
‘బిల్లుల చెల్లింపులపై విచారణ జరిపించండి’
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక.. మొదట బిల్లులు అప్లోడ్ అయిన గుత్తేదారులకు తొలుత చెల్లింపు విధానం(ఫిఫో) పాటించలేదని, దీనిపై విచారణ జరిపించాలని స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ (సబ్కా) కోరింది. -
ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలకు ప్రకటన జారీ
ట్రిపుల్ ఐటీ కళాశాలలో అర్హులైన అభ్యర్థుల నుంచి ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు ఆర్జీయూకేటీ కులపతి కేసీ రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
ఇదీ సంగతి!
-
పెద్దల మాట
-
గోడు విన్నా.. ‘గోల్డ్’ ఇవ్వలే!
ఓ సంస్థ చేసిన మోసంతో వారు అప్పటికే పీకలతు మునగగా ఆ బాధితులను జగన్ నిండాముంచారు. అగ్రిగోల్డ్ ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని, వాటికి వేలం వేసి బాధితులకు న్యాయం చేస్తామని పూటకో మాట మార్చారు. తలమీద చెయ్యివేసి గోడు వింటుంటే.. ఇక తమ కష్టాలు గట్టెక్కినట్లేనని బాధితులు ఎంతో ఆశపడ్డారు. -
ఆర్.నారాయణమూర్తికి జగన్ ఝలక్!
సామాజిక సమస్యల నేపథ్యంలో సినిమాలు తీసే ఆర్.నారాయణమూర్తి నిరాడంబరుడు, సౌమ్యుడు, మంచివాడని సినిమా పరిశ్రమలో పేరుంది. అలాంటి నారాయణమూర్తికే ముఖ్యమంత్రి జగన్ ఝలక్ ఇచ్చారు.