Raghu Rama Krishna Raju: ఇది మార్గదర్శిపై కాదు.. ఈనాడుపై దాడి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్గదర్శి సంస్థపై చేస్తున్న దాడి.. వాస్తవానికి ‘ఈనాడు’ పత్రికపై చేస్తున్నట్లని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు.
వ్యాపారాన్ని కూడా పణంగా పెట్టి నిజాలు నిర్భయంగా రాస్తున్న రామోజీరావుకు ప్రజలు అండగా నిలవాలి: ఎంపీ రఘురామకృష్ణంరాజు
ఈనాడు, దిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్గదర్శి సంస్థపై చేస్తున్న దాడి.. వాస్తవానికి ‘ఈనాడు’ పత్రికపై చేస్తున్నట్లని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. మీడియా సంస్థలపై ప్రభుత్వాల దాడిని ప్రజలు హర్షించరని ఏపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గురువారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ‘‘నిజాలను నిర్భయంగా చెప్పడానికి, ఈ ప్రభుత్వ అవినీతి అక్రమాలను ఎండగట్టడానికి రామోజీరావు తన వ్యాపారాలను కూడా పణంగా పెట్టి పోరాడుతున్నారు. అందువల్ల ఆయన వ్యాపార సంస్థలపై ప్రభుత్వం చేస్తున్న దాడులను ప్రజలంతా ఖండించాలి. ప్రజల పక్షాన ‘ఈనాడు’ దినపత్రిక ద్వారా పోరాడుతున్న రామోజీరావుకు సంపూర్ణ సహకారాన్ని అందించాలి. మార్గదర్శి సంస్థపై ఒక్క ఫిర్యాదు కూడా లేకపోయినప్పటికీ, జగన్ ప్రభుత్వం పదేపదే దాడులు చేస్తోంది. ప్రభుత్వం నమోదు చేసిన కేసులపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులు స్టే విధించినా జగన్ ప్రభుత్వం దాడులను ఆపడం మానలేదు. మార్గదర్శి రోజువారి కార్యకలాపాలను అడ్డుకునేందుకు ప్రయత్నించగా, ఆ సంస్థ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించింది.
ఆ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు పచ్చి అబద్ధాలు ఆడారు. తాము మార్గదర్శి రోజువారి కార్యకలాపాలను అడ్డుకోలేదని తెలిపారు. ఆ సంస్థ రోజువారీ కార్యకలాపాలకు ఎటువంటి అడ్డంకులు కలిగించరాదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తన ఉత్తర్వులలో రాష్ట్ర హోంశాఖ ముఖ్యకార్యదర్శితో పాటు ఇతరులను ఆదేశించింది. అయినా, గుంటూరు పట్టణంలోని అరండల్పేట మార్గదర్శి బ్రాంచిలో షట్టర్లను మూసివేసిన, సీసీ కెమెరాలను తొలగించిన దృశ్యాలు వెలుగు చూశాయి. మార్గదర్శి సంస్థలపై దాడి కోసం రెండు మానిటరింగ్ గ్రూపులతో పాటు, 37 సబ్ గ్రూపులను ఏర్పాటుచేసి తాడేపల్లి ప్యాలెస్ సమీపంలోని సీఎస్ఆర్ కల్యాణ మండపంలో వారికి ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి, దిశానిర్దేశం చేశారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగాన్ని రంగంలోకి దింపి, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మార్గదర్శి బ్రాంచ్లలో అగ్నిమాపకశాఖ అనుమతులు పరిశీలించడం, విద్యుత్తు బకాయిలు, జీఎస్టీ చెల్లింపులు, ఇంటి పన్నులు, భవన నిర్మాణ అనుమతులలో ఉల్లంఘనలను గుర్తించాలని ఆదేశించారు. కోర్టు స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత కూడా మార్గదర్శి సంస్థను ప్రభుత్వం వేధిస్తోంది’ అని రఘురామ పేర్కొన్నారు.
తిరుపతి కొండలను బోడి గుండులని అవమానించడం సబబేనా?
తితిదే చైర్మన్గా నియమితుడైన భూమన కరుణాకర్రెడ్డి తిరుపతి కొండలను బోడి గుండులని అవమానించడం సబబేనా? అని రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు. కరుణాకర్రెడ్డి వర్ణన జుగుస్సాకరంగా ఉందన్నారు. ఆ వ్యాఖ్యలు భగవంతుడిపై ఆయనకున్న భక్తి తెలియజేస్తున్నాయని పేర్కొన్నారు.
జగన్కే నష్టం
-చింతా మోహన్
ఈనాడు, తిరుపతి: కక్ష సాధింపులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శి కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తోందని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ ఆరోపించారు. తిరుపతిలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. వీటివల్ల ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికే నష్టం వస్తుందని హెచ్చరించారు. కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని హితవు పలికారు.
పారిశ్రామికవేత్తలెవరైనా రాష్ట్రానికి వస్తారా
-ప్రత్తిపాటి
చిలకలూరిపేట గ్రామీణ, న్యూస్టుడే: కోర్టు ఉత్తర్వులు లెక్క చేయకుండా మార్గదర్శిపై సీఎం జగన్ కక్ష కట్టి ముప్పేట దాడులతో వేధిస్తున్నారని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. వ్యాపార ప్రపంచానికి జగన్ తప్పుడు సంకేతాలు పంపుతున్నారని, ఇలాంటి చర్యలతో ఏ పారిశ్రామికవేత్తా రాష్ట్రం వైపు చూసే పరిస్థితి ఉండదన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ కోసం.. ఎంతకైనా దిగజారుతా
నువ్వు ఇంతకంటే దిగజారవనుకునే ప్రతిసారీ నా నమ్మకం తప్పని నిరూపిస్తున్నావు అంటూ జెర్సీ సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డికి అది అతికినట్టుగా సరిపోతుంది. -
మద్యం మహమ్మారికి ‘జగన్ ముద్దులు’
‘‘నాలుగు సంవత్సరాల్లో మద్యపానాన్ని పూర్తిగా తీసేయాలన్న కసి నాలో ఉంది’’ అని తన తండ్రి సమాధి సాక్షిగా చెప్పిన జగన్మోహన్రెడ్డి - సీఎంగా చేసిందేంటి? కాపురాలను కూల్చే మద్యం మహమ్మారిని కసికసిగా ముద్దుచేశారు. -
వైకాపా వీరభక్త అమ్మిరెడ్డిపై వేటు
వైకాపా సేవే పరమావధిగా, ఆ పార్టీ నేతలు చెప్పిందే వేదంగా భావిస్తూ విధులు నిర్వర్తించిన మరో ‘ఎస్ బాస్’పై ఎన్నికల సంఘం వేటు వేసింది. -
ఏపీ నూతన డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
రాష్ట్ర నూతన డీజీపీగా హరీష్కుమార్ గుప్తా సోమవారం సాయంత్రం బాధ్యతలు చేపట్టారు. 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారైన ఆయన ప్రస్తుతం హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. -
నీరు ఇవ్వలేం... కొనుక్కుని తాగండి!
ఒంగోలు శివారు కాలనీల్లో ప్రజలు ఎన్ని రోజులకోసారి స్నానం చేస్తున్నారో తెలుసా? మూడు రోజులకోసారి. ఇది నీటి కొరత తెచ్చిన దుస్థితి. శివారు కాలనీలకు ఐదు రోజులకోసారి ట్యాంకర్లతో నగరపాలక సంస్థ అరకొరగా నీరు సరఫరా చేస్తోంది. ఇవి అవసరాలకు సరిపోక పోవడంతో స్నానం చేయడం తగ్గించుకున్నారు. -
వైకాపా అరాచకాలపై మేము సైతం పోరాడతాం
‘ఏపీలో అరాచక పాలన సాగుతోంది. అన్ని వర్గాల ప్రజలపై దాడులు జరుగుతున్నాయి. వ్యవస్థలన్నీ నాశనమయ్యాయి. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు మా వంతు పోరాడతాం’ అని అమెరికాలోని ప్రవాస భారతీయ మహిళలు తెలిపారు. -
వైద్య బోధకుల బదిలీల దుమారం
ముందస్తు సమాచారం లేకుండా బదిలీల ఉత్తర్వులు జారీచేసి, వెంటనే రిలీవ్ కావాలని పేర్కొనడంపై వైద్య బోధకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2024-25 విద్యా సంవత్సరానికి పాడేరు, మదనపల్లె, మార్కాపురం, ఆదోని, పులివెందులలోని కొత్త వైద్యకళాశాలల్లో తరగతులు ప్రారంభం కావాలి. -
ఇఫ్కోకు భూకేటాయింపుపై పిల్ కొట్టివేత
యూరియా, అమోనియా ప్లాంట్ నిర్మాణం కోసం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్స్ కోఆపరేటివ్ లిమిటెడ్ (ఇఫ్కో)కు భూములు కేటాయించడాన్ని సవాలు చేస్తూ.. 2017లో దాఖలైన పిల్ను కొట్టేస్తూ సోమవారం హైకోర్టు తీర్పు వెల్లడించింది. -
భరోసానూ బరికేశారు!
రైతుబంధు కింద తెలంగాణలో ఎకరానికి ఏడాదికి ఇస్తోంది రూ.10,000. ఐదెకరాలుంటే రూ.50 వేలు. అంటే ఐదేళ్లలో ఒక్కో రైతుకు అందింది కనీసం రూ.2.50 లక్షలు. -
ముందుచూపుతో ప్రజల్ని నడిపించే దార్శనికులు రావాలి
పౌరులు ధైర్యంగా ప్రభుత్వాల్ని ప్రశ్నించగలిగినప్పుడే ప్రజాస్వామ్యం మనగలుగుతుందని సామాజికవేత్త డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. దురదృష్టవశాత్తూ రాష్ట్రంలో ప్రశ్నించే వారిపై భౌతికదాడులు సర్వసాధారణంగా మారాయని, వారికి పథకాలు నిలిపివేయడం.. -
ఉద్యోగాలు సృష్టించే వారికే ఓటేయాలి
‘హైదరాబాద్ అభివృద్ధి చెందడానికి ప్రధాన కారణం అక్కడి మౌలిక వసతులే. అటువంటి పరిస్థితులు ఏపీలో కనిపించడం లేదు. కనీసం రోడ్లు కూడా సరిగ్గా లేవు. అన్ని వసతులు కల్పిస్తేనే పెట్టుబడులు వస్తాయి. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు నేనే ప్రత్యక్ష బాధితుడిని
ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు తానే ప్రత్యక్ష బాధితుడినని విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ పీవీ రమేశ్ తన ఎక్స్ ఖాతాలో సోమవారం ట్వీట్ చేశారు. చనిపోయిన తన తల్లిదండ్రులకు చెందిన కృష్ణా జిల్లా విన్నకోటలోని పట్టాభూములను మ్యుటేషన్ చేసేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరించారని పేర్కొన్నారు. -
ఎన్నికలు పూర్తయ్యే వరకూ.. నిధుల విడుదల వాయిదా
రైతులకు పెట్టుబడి రాయితీ, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదలకు అనుమతి కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి అధ్యక్షతన స్క్రీనింగ్ కమిటీ పంపిన ప్రతిపాదనలను ఎన్నికల సంఘం తిరస్కరించింది. -
రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు
ద్రోణి ప్రభావంతో రాబోయే 4 రోజుల్లో రాష్ట్రంలో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. -
‘బిల్లుల చెల్లింపులపై విచారణ జరిపించండి’
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక.. మొదట బిల్లులు అప్లోడ్ అయిన గుత్తేదారులకు తొలుత చెల్లింపు విధానం(ఫిఫో) పాటించలేదని, దీనిపై విచారణ జరిపించాలని స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ (సబ్కా) కోరింది. -
ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలకు ప్రకటన జారీ
ట్రిపుల్ ఐటీ కళాశాలలో అర్హులైన అభ్యర్థుల నుంచి ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు ఆర్జీయూకేటీ కులపతి కేసీ రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
ఇదీ సంగతి!
-
పెద్దల మాట
-
గోడు విన్నా.. ‘గోల్డ్’ ఇవ్వలే!
ఓ సంస్థ చేసిన మోసంతో వారు అప్పటికే పీకలతు మునగగా ఆ బాధితులను జగన్ నిండాముంచారు. అగ్రిగోల్డ్ ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని, వాటికి వేలం వేసి బాధితులకు న్యాయం చేస్తామని పూటకో మాట మార్చారు. తలమీద చెయ్యివేసి గోడు వింటుంటే.. ఇక తమ కష్టాలు గట్టెక్కినట్లేనని బాధితులు ఎంతో ఆశపడ్డారు. -
ఆర్.నారాయణమూర్తికి జగన్ ఝలక్!
సామాజిక సమస్యల నేపథ్యంలో సినిమాలు తీసే ఆర్.నారాయణమూర్తి నిరాడంబరుడు, సౌమ్యుడు, మంచివాడని సినిమా పరిశ్రమలో పేరుంది. అలాంటి నారాయణమూర్తికే ముఖ్యమంత్రి జగన్ ఝలక్ ఇచ్చారు.