Mukul Rohatgi: యడుయూరప్పకు ఒక ‘లా’.. చంద్రబాబుకు మరో ‘లా’
ఒకే తరహా కేసులలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ భిన్న వాదనలు వినిపించడం న్యాయవర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది.
వాదనలు వినిపించిన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడుయూరప్పకు సెక్షన్ 17ఏ వర్తిస్తుంది
గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి అని గతంలో వాదన
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అది వర్తించదని తాజాగా వాదన
ఈనాడు-దిల్లీ, అమరావతి: ఒకే తరహా కేసులలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ భిన్న వాదనలు వినిపించడం న్యాయవర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. అవినీతి నిరోధక (సవరణ) చట్టం సెక్షన్ 17ఏ వ్యవహారంలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడుయూరప్ప విషయంలో ఓ విధంగా.. తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు విషయంలో మరో విధంగా వాదనలు వినిపించడంపై న్యాయనిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అవినీతి నిరోధక సవరణ చట్టం సెక్షన్ 17ఏ ప్రకారం పబ్లిక్ సర్వెంట్పై అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు కాంపిటెంట్ అథారిటీ నుంచి అనుమతి తీసుకున్నాకే పోలీసులు కేసు నమోదు, దర్యాప్తు చేయాలి. ముఖ్యమంత్రులుగా పనిచేసినవారిపై కేసుల విషయంలో ముందుకెళ్లాలంటే గవర్నర్ ఆమోదం తప్పనిసరి.
- ఓ ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేసేందుకు కుమారుడి ద్వారా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడుయూరప్ప లంచం తీసుకున్నారని, ఆ సొమ్మును ఆయన అనుచరులు షెల్ కంపెనీలకు మళ్లించారని, తిరిగి ఆ సొమ్ము యడుయూరప్ప కుటుంబానికే చెందిందనే ఆరోపణలతో టీజే అబ్రహం అనే వ్యక్తి లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా లోకాయుక్త ఎఫ్ఐఆర్ నమోదుచేసి దర్యాప్తునకు అదేశించింది. అయితే దానిపై విచారణ కొనసాగించడానికి గవర్నర్ ముందస్తు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో సెషన్స్ కోర్టు ఆ కేసును కొట్టేసింది. ఆ తీర్పును సవాలు చేస్తూ ప్రైవేటు ఫిర్యాదుదారు హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టు యడుయూరప్పకు వ్యతిరేకంగా ఉత్తర్వులిచ్చింది. గవర్నర్ అనుమతిని తిరస్కరించడం ఆయనపై విచారణ కొనసాగించడానికి అడ్డంకి కాదని, అందువల్ల ప్రైవేటు ఫిర్యాదుపై తదుపరి విచారణ చేపట్టాలని ఎంపీ, ఎమ్మెల్యేల కేసులు విచారించే ప్రత్యేక కోర్టును ఆదేశించింది. దాంతో ఆ కోర్టు ప్రైవేటు ఫిర్యాదును స్వీకరించి కేసు నమోదు చేయాలని లోకాయుక్త పోలీసులను ఆదేశించింది. ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ యడుయూరప్ప సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
- జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ హిమాకోహ్లితో కూడిన ధర్మాసనం 2022 సెప్టెంబరు 23న విచారణ జరిపింది. యడుయూరప్ప తరఫున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గీ, సిద్ధార్థ దవే వాదనలు వినిపించారు. 2013 అక్టోబరులో అనిల్కుమార్ వర్సెస్ అయ్యప్ప కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగ్ను కోర్టు దృష్టికి తెచ్చారు. అవినీతి కేసుల్లో ప్రభుత్వ అనుమతి లేకుండా పబ్లిక్సర్వెంట్కు వ్యతిరేకంగా దర్యాప్తునకు ఆదేశించే అధికారం మేజిస్ట్రేట్కు లేదన్నారు. యడుయూరప్ప పబ్లిక్ సర్వెంట్ అనే నిర్వచనం పరిధిలోకి వస్తారన్నారు. సెక్షన్ 17ఏ నేపథ్యంలో గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకున్నాకే దర్యాప్తు ప్రారంభించాలన్నారు. ఆయనకు సెక్షన్ 17ఏ వర్తిస్తుందన్నారు. ఆ వాదనలను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు.. బెంగుళూరు అదనపు సిటీ సివిల్ సెషన్స్ జడ్జి ముందు పెండింగ్లో ఉన్న కేసులో తదుపరి విచారణపై స్టే ఇచ్చింది.
- మరోవైపు తనపై నమోదుచేసిన ఎఫ్ఐఆర్, దాని ఆధారంగా జ్యుడిషియల్ రిమాండు విధిస్తూ అనిశా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టేయాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఈ వ్యాజ్యంలో సీఐడీ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ మంగళవారం హైకోర్టులో వాదనలు వినిపించారు. సెక్షన్ 17ఏ చంద్రబాబుకు వర్తించదని వాదించారు. చంద్రబాబు విషయంలో కేసు నమోదు చేయాలన్నా, దర్యాప్తు ప్రారంభించాలన్నా గవర్నర్ ఆమోదం పొందాల్సిన అవసరం లేదన్నారు. 17ఏ సెక్షన్ను చంద్రబాబు తప్పుగా అర్థం చేసుకున్నారని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రులైన యడుయూరప్ప, చంద్రబాబు విషయంలో ముకుల్ రోహత్గీ ఇలా భిన్న వాదనలు వినిపించడం న్యాయసమాజంలో విస్తృతచర్చకు దారితీసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చంద్రబోస్కు గురజాడ విశిష్ట పురస్కారం
గురజాడ రచనల్లో వాడుక భాష ఎంతో గొప్పదని, అదే తనకు నచ్చిన అంశమని ప్రముఖ సినీ గేయ రచయిత చంద్రబోస్ అన్నారు. -
‘ఎంఎస్ఎంఈ ఏపీ వన్’ పేరుతో కొత్త సర్వే
ఆర్భాటం.. ప్రచారం అనేది జగన్ ప్రభుత్వానికే సాధ్యమైన విద్యలు. చిన్న పరిశ్రమల కష్టాలను తామే తీర్చేస్తున్నంతగా మాటలు చెబుతూ.. ఉత్త చేయి అందించడం ప్రభుత్వానికే చెల్లింది. -
దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టులు హుష్కాకి
విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక పోస్టుల భర్తీకి ప్రభుత్వం జారీ చేసిన ప్రకటనలో దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టులు మాయమయ్యాయి. -
Cyclone Michaung: ముంచుకొస్తున్న తుపాను
నైరుతి బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన మిగ్జాం తుపాను మంగళవారం తీవ్ర తుపానుగా బలపడనుంది. -
తమిళనాడు వాసులకు తాడికొండలో ఓట్లు
తమిళనాడు వాసులకు తాడికొండలో ఓట్లు.. కాకినాడ, తిరుపతి చిరునామాలతో రాజంపేట జాబితాలో చోటు.. అసలు ఎవరో తెలియనివారి పేరిట వందలాది ఓట్లు.. ఒకే డోర్నంబరుతో పదులకొద్దీ బోగస్ ఓట్లు.. రాష్ట్ర ఓటర్ల జాబితా పరిశీలిస్తున్నా కొద్దీ ఇలా లెక్కలేనన్ని అక్రమాలు, అవకతవకలు బయటపడుతూనే ఉన్నాయి. -
సాగర్ వద్ద సాధారణ పరిస్థితులు
నాగార్జునసాగర్ జలాశయం వద్ద పరిస్థితులు యథాస్థితికి వచ్చాయి. నవంబరు 29కి ముందునాటి వాతావరణం నెలకొంది. -
ఆర్అండ్బీని భయపెడుతున్న తుపాను
రాష్ట్రాన్ని వణికిస్తున్న తుపాను.. రహదారులు భవనాలశాఖ ఇంజినీర్లను కూడా భయపెడుతోంది. తుపాను తీవ్రతతో రహదారులు దెబ్బతింటే చేతులెత్తేయాల్సిన దుస్థితిలో ఇంజినీర్లు ఉన్నారు. -
కళ్ల ముందు 1977 నాటి పీడకల!
మిగ్జాం తీవ్ర తుపాను కృష్ణా జిల్లా దివిసీమ దగ్గరలో తీరం దాటనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. దీని కేంద్ర స్థానం నుంచి 200 కి.మీ. మేర ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. -
కేసీఆర్ కన్నా జగన్ చిత్తుగా ఓడిపోతారు
మూడు రాజధానులంటూ అమరావతిని అరణ్యంలా మారుస్తున్న సీఎం జగన్.. భారాస అధినేత కేసీఆర్ కన్నా చిత్తుగా ఓడిపోతారని రాజధాని రైతులు ధ్వజమెత్తారు. -
మేము రాము బిడ్డో జగనన్న కాలనీకి..!
నంద్యాల జిల్లా డోన్ సమీపంలోని దొరపల్లె గుట్ట వద్ద ఉన్న జగనన్న కాలనీలోకి ఇంటి నిర్మాణ సామగ్రిని తీసుకెళ్లలేకపోతున్నామని ఆటో డ్రైవర్లు తెగేసి చెప్పేస్తున్నారు. -
కల్లాల్లో ధాన్యం.. కళ్లల్లో దైన్యం..
తుపాను హెచ్చరికలతో రైతులకు కంటిమీద కునుకు లేకుండాపోయింది. ఏ క్షణంలో గాలులు వీచి చేతికొచ్చిన పంట నేలవాలుతుందోనని ఆందోళన చెందుతున్నారు. -
తిరుమలలో ఘనంగా కార్తిక స్నపన తిరుమంజనం
పవిత్ర కార్తిక మాసంలో నిర్వహించే కార్తిక వనభోజన మహోత్సవంలో భాగంగా ఆదివారం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారికి స్నపన తిరుమంజనం అత్యంత వైభవంగా జరిగింది. -
ఇలా ఇచ్చారు.. అలా చక్రం ఊడింది!
బ్యాటరీ ట్రై సైకిళ్లకు చక్రాలు సరిగ్గా బిగించకుండానే పంపిణీ చేయడంతో వైయస్ఆర్ జిల్లా మైదుకూరులో ప్రమాదవశాత్తు ఓ దివ్యాంగుడు కింద పడ్డారు. -
కుప్పం ఓటరు జాబితా సవరణలో విచిత్ర దరఖాస్తు
చిత్తూరు జిల్లా కుప్పంలోని ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో విచిత్ర పరిస్థితి నెలకొంది. పురపాలికలోని 173వ పోలింగ్ బూత్ పరిధిలో.. మరణించిన మహిళ ఓటును తొలగించాలని మృతి చెందిన ఇంకో మహిళ పేరుతో ఫారం-7 దాఖలు అయింది. -
రచయితలపై సామాజిక బాధ్యత
కవులు, రచయితలు, కథకులపై సామాజిక బాధ్యత ఉందని కవి కె.శివారెడ్డి పేర్కొన్నారు. -
ఎయిర్ ఇండియా విమానం రద్దు
తుపాను కారణంగా విమాన ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. న్యూదిల్లీ నుంచి హైదరాబాదు మీదుగా తిరుపతి జిల్లా రేణిగుంటకు ప్రతిరోజూ రాకపోకలు సాగించే ఎయిర్ ఇండియా విమానాన్ని ఆదివారం రద్దు చేశారు. -
అమర్యాదగా మాట్లాడటం సరికాదు
విశాఖ జిల్లా పద్మనాభం మండలం ఎంపీడీఓపై భీమిలి వైకాపా ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు అమర్యాదగా మాట్లాడటం సరికాదని ఏపీ పంచాయతీరాజ్ అధికారుల సంఘం మండిపడింది. -
బకాయిల తుది గడువుపై ఏం చేద్దాం?
ప్రభుత్వ బకాయిలను రాబట్టుకునేందుకు బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బాయ్) సోమవారం మరోసారి భేటీ కానుంది. -
ఉద్యోగుల్ని వేధిస్తే తెలంగాణ ఫలితాలే
ఉద్యోగుల్ని, ఉపాధ్యాయుల్ని వేధిస్తే తెలంగాణలో బీఆర్ఎస్కు ఎదురైన ఫలితాలే ఏపీలోనూ పునరావృతమవుతాయని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం హెచ్చరించింది. -
ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవోగా అభిషిక్త్ కిశోర్ నియామకం
ఆర్థికశాఖ డిప్యూటీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న ఎమ్.అభిషిక్త్ కిశోర్ను ఆరోగ్యశ్రీ హెల్త్కేర్ ట్రస్ట్ సీఈవోగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. -
ఇదీ సంగతి!


తాజా వార్తలు (Latest News)
-
PM Modi: ఈ ఫలితాలు వారికి సువర్ణావకాశం: కాంగ్రెస్కు మోదీ హితవు
-
IND vs AUS: 10 పరుగులే చేసినా రికార్డు సృష్టించాడు.. వాళ్లు ఈ సిరీస్లో ప్రభావం చూపారు: వేడ్
-
Congress: కాసేపట్లో సీఎల్పీ భేటీ.. నేడు సీఎం, ఇద్దరు డిప్యూటీ సీఎంల ప్రమాణస్వీకారం?
-
Chhattisgarh: కేవలం 94 ఓట్లతో ఓడిపోయిన డిప్యూటీ సీఎం..
-
Chennai: ‘మిగ్జాం’ ఎఫెక్ట్.. స్తంభించిన చెన్నై
-
Yuvagalam: తుపాను ఎఫెక్ట్.. యువగళం పాదయాత్రకు తాత్కాలిక విరామం