Mukul Rohatgi: యడుయూరప్పకు ఒక ‘లా’.. చంద్రబాబుకు మరో ‘లా’
ఒకే తరహా కేసులలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ భిన్న వాదనలు వినిపించడం న్యాయవర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది.
వాదనలు వినిపించిన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడుయూరప్పకు సెక్షన్ 17ఏ వర్తిస్తుంది
గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి అని గతంలో వాదన
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అది వర్తించదని తాజాగా వాదన
ఈనాడు-దిల్లీ, అమరావతి: ఒకే తరహా కేసులలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ భిన్న వాదనలు వినిపించడం న్యాయవర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. అవినీతి నిరోధక (సవరణ) చట్టం సెక్షన్ 17ఏ వ్యవహారంలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడుయూరప్ప విషయంలో ఓ విధంగా.. తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు విషయంలో మరో విధంగా వాదనలు వినిపించడంపై న్యాయనిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అవినీతి నిరోధక సవరణ చట్టం సెక్షన్ 17ఏ ప్రకారం పబ్లిక్ సర్వెంట్పై అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు కాంపిటెంట్ అథారిటీ నుంచి అనుమతి తీసుకున్నాకే పోలీసులు కేసు నమోదు, దర్యాప్తు చేయాలి. ముఖ్యమంత్రులుగా పనిచేసినవారిపై కేసుల విషయంలో ముందుకెళ్లాలంటే గవర్నర్ ఆమోదం తప్పనిసరి.
- ఓ ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేసేందుకు కుమారుడి ద్వారా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడుయూరప్ప లంచం తీసుకున్నారని, ఆ సొమ్మును ఆయన అనుచరులు షెల్ కంపెనీలకు మళ్లించారని, తిరిగి ఆ సొమ్ము యడుయూరప్ప కుటుంబానికే చెందిందనే ఆరోపణలతో టీజే అబ్రహం అనే వ్యక్తి లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా లోకాయుక్త ఎఫ్ఐఆర్ నమోదుచేసి దర్యాప్తునకు అదేశించింది. అయితే దానిపై విచారణ కొనసాగించడానికి గవర్నర్ ముందస్తు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో సెషన్స్ కోర్టు ఆ కేసును కొట్టేసింది. ఆ తీర్పును సవాలు చేస్తూ ప్రైవేటు ఫిర్యాదుదారు హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టు యడుయూరప్పకు వ్యతిరేకంగా ఉత్తర్వులిచ్చింది. గవర్నర్ అనుమతిని తిరస్కరించడం ఆయనపై విచారణ కొనసాగించడానికి అడ్డంకి కాదని, అందువల్ల ప్రైవేటు ఫిర్యాదుపై తదుపరి విచారణ చేపట్టాలని ఎంపీ, ఎమ్మెల్యేల కేసులు విచారించే ప్రత్యేక కోర్టును ఆదేశించింది. దాంతో ఆ కోర్టు ప్రైవేటు ఫిర్యాదును స్వీకరించి కేసు నమోదు చేయాలని లోకాయుక్త పోలీసులను ఆదేశించింది. ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ యడుయూరప్ప సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
- జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ హిమాకోహ్లితో కూడిన ధర్మాసనం 2022 సెప్టెంబరు 23న విచారణ జరిపింది. యడుయూరప్ప తరఫున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గీ, సిద్ధార్థ దవే వాదనలు వినిపించారు. 2013 అక్టోబరులో అనిల్కుమార్ వర్సెస్ అయ్యప్ప కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగ్ను కోర్టు దృష్టికి తెచ్చారు. అవినీతి కేసుల్లో ప్రభుత్వ అనుమతి లేకుండా పబ్లిక్సర్వెంట్కు వ్యతిరేకంగా దర్యాప్తునకు ఆదేశించే అధికారం మేజిస్ట్రేట్కు లేదన్నారు. యడుయూరప్ప పబ్లిక్ సర్వెంట్ అనే నిర్వచనం పరిధిలోకి వస్తారన్నారు. సెక్షన్ 17ఏ నేపథ్యంలో గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకున్నాకే దర్యాప్తు ప్రారంభించాలన్నారు. ఆయనకు సెక్షన్ 17ఏ వర్తిస్తుందన్నారు. ఆ వాదనలను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు.. బెంగుళూరు అదనపు సిటీ సివిల్ సెషన్స్ జడ్జి ముందు పెండింగ్లో ఉన్న కేసులో తదుపరి విచారణపై స్టే ఇచ్చింది.
- మరోవైపు తనపై నమోదుచేసిన ఎఫ్ఐఆర్, దాని ఆధారంగా జ్యుడిషియల్ రిమాండు విధిస్తూ అనిశా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టేయాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఈ వ్యాజ్యంలో సీఐడీ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ మంగళవారం హైకోర్టులో వాదనలు వినిపించారు. సెక్షన్ 17ఏ చంద్రబాబుకు వర్తించదని వాదించారు. చంద్రబాబు విషయంలో కేసు నమోదు చేయాలన్నా, దర్యాప్తు ప్రారంభించాలన్నా గవర్నర్ ఆమోదం పొందాల్సిన అవసరం లేదన్నారు. 17ఏ సెక్షన్ను చంద్రబాబు తప్పుగా అర్థం చేసుకున్నారని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రులైన యడుయూరప్ప, చంద్రబాబు విషయంలో ముకుల్ రోహత్గీ ఇలా భిన్న వాదనలు వినిపించడం న్యాయసమాజంలో విస్తృతచర్చకు దారితీసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపాకు మద్దతిస్తున్నారని.. ఎస్టీ కాలనీకి తాగునీరు బంద్
తెదేపాకు సానుకూలంగా ఉన్నారన్న అక్కసుతో ఎస్టీ కాలనీకి తాగునీటి సరఫరాను నిలిపేసిన దారుణ ఘటన పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలంలో చోటుచేసుకుంది. -
విశాఖ తీరానికి విలాసవంతమైన నౌక
ప్రఖ్యాత అంతర్జాతీయ క్రూయిజ్ నౌక ‘ది వరల్డ్’ ఆదివారం విశాఖ పోర్టుకు చేరుకుంది. పోర్టు అధికారులు నౌకలో వచ్చిన వారికి ఘన స్వాగతం పలికారు. -
ఆలయం నుంచి బయటకెళ్లు.. దళిత సర్పంచిని అవమానించిన వైకాపా నాయకులు
నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండలం పారుమంచాల గ్రామంలోని రామాలయానికి వెళ్లిన తనను వైకాపా నాయకులు లోకేశ్వరరెడ్డి, జగదీశ్వరరెడ్డిలు అవమానించారంటూ అదే పార్టీకి చెందిన గ్రామ దళిత సర్పంచి మాధవరం ప్రకాశం ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ఇచ్చింది రూ.50 వేలు.. లాగింది రూ.3.5 లక్షలు
డ్రైవర్ అన్నలు... నా మిత్రులు అన్నారు ఎప్పటికీ అండగా ఉంటామన్నారు... జగన్ మాటకు చేతకు పొంతన ఉండదుగా... ఏదో మొక్కుబడిగా సాయం చేశారు. -
‘ప్రభుత్వానికి భజన చేస్తూ.. కొన్ని సంఘాలు దిగజారాయి’
ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు అంశాలకు పరిష్కారం లభించకపోయినా.. ఒకటో తేదీన వేతనాలు, పింఛన్లు రాకపోయినా కొన్ని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి ఆహా, ఓహో అంటూ భజన చేస్తూ దిగజారిపోయాయని ఏపీ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ మండిపడ్డారు. -
కంట్రోల్లోనే ఉన్నాం.. చెప్పినట్లు సమావేశాలు పెడుతున్నాం
సకల శాఖ మంత్రిగా ప్రచారంలో ఉన్న ఓ ప్రభుత్వ సలహాదారు కళ్లలో ఆనందం చూసేందుకు ఏపీ ఎన్జీఓ సంఘం నాయకులు తహతహలాడుతున్నారు. -
జవహర్రెడ్డి జగన్నాటకం
ఒక ఎత్తు కాకపోతే మరో ఎత్తు. ఒక వ్యూహం కాకపోతే మరో వ్యూహం. ఏది అమలుచేసినా అంతిమంగా వైకాపాకు మేలు చేయడమే లక్ష్యం. -
మే 1న బ్యాంకు ఖాతాల్లో పింఛను జమ
వచ్చేనెల సామాజిక పింఛన్ల సొమ్మును మే 1న లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తీవ్ర అనారోగ్యం, అస్వస్థత, నడవలేని స్థితిలో ఉన్నవారు, మంచం పట్టినవారు, వీల్ ఛైర్లో ఉన్నవారు, దివ్యాంగులు, సైనిక పింఛన్లు తీసుకునే వారికి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఇళ్ల దగ్గరే అందించనున్నారు. -
వారికి నో.. వీరికి ఎస్
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథరెడ్డిలు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని.. వారు ఆ పోస్టుల్లో కొనసాగితే రాష్ట్రంలో ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరగవని.. వారిని తక్షణం బదిలీ చేయాలని విపక్ష పార్టీలన్నీ నెత్తీనోరూ కొట్టుకుంటున్నా.. ఈసీ పట్టించుకోలేదు. -
రూ.3000,00,00,000.. మూడేళ్లలో ఇసుకలో చేసిన లూటీ ఇది
జగన్ ప్రభుత్వం రాగానే ఉచిత ఇసుక విధానం రద్దుచేసి.. తొలుత ప్రభుత్వరంగ సంస్థకు ఇసుక వ్యాపారం అప్పగించింది. అది విఫలమైందని సాకుచూపించి.. బినామీలను గుత్తేదారులుగా రంగంలోకి దింపింది. -
పోలా.. ‘పరువు పోలా!’
‘రోడ్లు ఇట్లా ఉంటే మీ ప్రభుత్వానికే ఓట్లు పడవు. మీరు మరమ్మతులు చేయిస్తారా? లేకుంటే మా రాష్ట్ర నిధులతో మమ్మల్నే ప్యాచ్ వర్క్ చేయించమంటారా?’ -
సుందరనాయుడి సేవలు నిరుపమానం
అందరూ ఆప్యాయంగా చిత్తూరు పెద్దాయన అని పిలుచుకునే.. కోళ్ల పరిశ్రమ పితామహుడు దివంగత డాక్టర్ ఉప్పలపాటి సుందరనాయుడి సేవలు చిరస్మరణీయమని కోళ్ల రైతులు పేర్కొన్నారు. -
ఉత్తీర్ణత పెంచడం ఓట్ల కోసమేనా?
పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తీర్ణత పెంచడం, మార్కులు అధికంగా వేయడం తల్లిదండ్రుల ఓట్ల కోసమేనా అని సామాజిక వేత్త గుంటుపల్లి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో ప్రశ్నించారు. -
కొండల్ని మింగి.. గోతులు మిగిల్చారు!
విజయవాడ సమీపం జక్కంపూడి, కొత్తూరు తాడేపల్లి, కొండపావులూరు పరిసరాల్లో కొండ ప్రాంతాల్లో విచ్చలవిడిగా తవ్వేశారు. -
వైకాపా బాణసంచా పేల్చడంతో అగ్ని ప్రమాదం
వైకాపా ఎన్నికల ప్రచారంలో భారీగా బాణసంచా కాల్చడంతో అగ్నిప్రమాదం సంభవించి జామాయిల్ తోటలు, పశువుల మేత, మోటార్లు కాలిపోయాయి. -
ఉపాధి లేదు.. ఉద్యోగం అడగొద్దు
రాష్ట్రంలో చదువుకుని, లక్షల సంఖ్యలో ఉన్న నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలన్న ఆలోచన లేదు! ఉపాధి అవకాశాల్లేక యువత ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు తరలిపోతుంటే.. ఆంధ్రప్రదేశ్ వృద్ధుల రాష్ట్రంగా మిగిలిపోతోందన్న బాధ లేదు! -
నామినేషన్ ర్యాలీకి వెళ్లలేదని గ్రామానికి నీటి సరఫరా నిలిపివేత
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్ నామినేషన్ ర్యాలీకి వెళ్లలేదని ఓ గిరిజన గ్రామానికి నీటి సరఫరా నిలిపివేసిన దారుణ ఉదంతమిది. -
మాటల ఏలిక.. మీటలో మెలిక!
అక్కచెల్లెమ్మలకు మంచి జరగాలనే ఆలోచనతో వారికి వ్యాపార అవకాశాలను కల్పించాలని నిర్ణయించాం. హిందుస్థాన్ లీవర్, పీఅండ్జీ, ఐటీసీ, రిలయన్స్, అమూల్ సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. -
గురుదక్షిణగా కారు.. అందజేసిన లేపాక్షి నవోదయ పూర్వవిద్యార్థులు
జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకునేలా స్ఫూర్తి నింపిన గురువుకు శిష్యులు రూ.12లక్షల విలువైన కారును బహుమతిగా అందజేశారు. -
దండుకో.. వాటాలు పంచుకో!
జగన్ పాలనలో దోచుకున్నోళ్లకు దోచుకున్నంత.. అన్న విధంగా వైకాపా నాయకులు, కొందరు ఐఏఎస్ అధికారులు చెలరేగిపోతున్నారు. -
రోగుల సమాచారం మీకెందుకు?
వైద్యం కోసం ఆసుపత్రులకు వెళ్లే రోగుల సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సేకరిస్తోందని, అలా ఎందుకు తీసుకుంటుందో చెప్పాలని భారత వైద్య మండలి(ఐఎంఏ) జాతీయ అధ్యక్షుడు డా.ఆర్వీ.అశోకన్ ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!
-
‘మీ బిడ్డను’ అంటూ.. జగన్ ఊరూరా తిరిగినప్పుడే అనుమానించా: లోకేశ్
-
అమిత్ షా ‘వీడియో సోర్స్’పై పోలీసుల దృష్టి.. సోషల్ మీడియా సంస్థలకు లేఖ
-
ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసు.. సుప్రీంలో దీదీ సర్కార్కు ఊరట
-
కంట్రోల్ తప్పిన హెలికాప్టర్.. అమిత్ షాకు త్రుటితో తప్పిన ప్రమాదం
-
4 నెలలకే ఓలా క్యాబ్స్ సీఈఓ రాజీనామా.. 10% మంది ఉద్యోగులకు ఉద్వాసన!