ఉపాధ్యాయ ఖాళీలపై సమావేశానికో మాట
ప్రభుత్వ పాఠశాలల్లో 771 పోస్టులే ఖాళీగా ఉన్నాయి. పదవీవిరమణ వయసు 62ఏళ్లకు పెంచడం వల్ల ఖాళీలు రాలేదు.
గత అసెంబ్లీ సమావేశాల్లో 771.. ఇప్పుడు 8,366 అవసరమన్న మంత్రి బొత్స
ప్రభుత్వ లెక్కల ప్రకారం 18,520 పోస్టులు ఖాళీ
హేతుబద్ధీకరణ, విలీనంతో భారీగా రద్దు
ప్రభుత్వ పాఠశాలల్లో 771 పోస్టులే ఖాళీగా ఉన్నాయి. పదవీవిరమణ వయసు 62ఏళ్లకు పెంచడం వల్ల ఖాళీలు రాలేదు. మంజూరు పోస్టులను ఎక్కడా రద్దుచేయలేదు.
2023 మార్చి 20న శాసనమండలిలో మంత్రి బొత్స సమాధానం
8,366 పోస్టులు అవసరం. వాటి భర్తీకి చర్యలు తీసుకుంటాం.
శాసనమండలి ప్రశ్నోత్తరాల్లో మంత్రి బొత్స సత్యనారాయణ
ఈనాడు, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలపై ప్రభుత్వ ప్రకటనలు గందరగోళంగా మారాయి. గత అసెంబ్లీ సమావేశాల సందర్భంగా 771 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రకటించిన మంత్రి బొత్స సత్యనారాయణ.. తాజాగా 8,366 పోస్టులు అవసరమని శాసనమండలిలో ప్రకటించారు. ఇప్పుడు ఇన్ని పోస్టులు ఎక్కడి నుంచి వచ్చాయి? మంత్రి లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానం ప్రకారం రాష్ట్రంలో మంజూరైన ఉపాధ్యాయ పోస్టులు 1,88,162 ఉంటే పనిచేస్తున్న వారు 1,69,642 మంది. ఈ లెక్కన 18,520 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మంత్రి 8,366 పోస్టులే అవసరమన్నారు. మిగతా 10,154 పోస్టులను ప్రభుత్వం రద్దు చేసేస్తుందా? లేక తరగతుల విలీనం, ఉపాధ్యాయుల సర్దుబాటు కారణంగా అవసరం లేకుండా పోయాయా? ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ రాష్ట్రంలో 23వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని లెక్కతేల్చారు. చంద్రబాబు 7,900 పోస్టులకే డీఎస్సీ ఇచ్చారని, తాను అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ నిర్వహిస్తానని హామీ గుప్పించారు. వచ్చి నాలుగున్నరేళ్లు గడచినా ఇంతవరకు మెగా డీఎస్సీ నిర్వహించలేదు.
హేతుబద్ధీకరణతో పోస్టులు మాయం
పోస్టుల హేతుబద్ధీకరణ, 3,4,5 తరగతుల విలీనం, 1-9 తరగతుల్లో ఒకే మాధ్యమం, 9,10 తరగతుల్లో సెక్షన్కు 60మంది విద్యార్థులను పెంచిన ప్రభుత్వం... పోస్టులు భారీగా మిగుల్చుకుంది.
- ఉపాధ్యాయ పోస్టుల హేతుబద్ధీకరణతో సెకండరీ గ్రేడ్ టీచర్స్(ఎస్జీటీ) పోస్టులు 7వేలకుపైగా మిగులుగా ఉన్నట్లు ప్రభుత్వం తేల్చింది. 3,4,5 తరగతులకు సబ్జెక్టు టీచర్లతో బోధనంటూ వీటిని ఉన్నత, ప్రాథమికోన్నత బడుల్లో కలిపేసింది. దీంతో ఎస్జీటీ పోస్టుల అవసరం లేకుండా పోయింది.
- పాఠశాల విద్యాశాఖ లెక్కల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఎంపీపీ పాఠశాలల్లో 4,102 ఎస్జీటీలు అవసరం కాగా.. 9,912 మంది మిగులుగా ఉన్నారు. సర్దుబాటు చేసిన తర్వాత ఇంకా 5,817 మంది మిగలనున్నారు. ఒక్క కర్నూలు జిల్లాలోనే ఎస్జీటీల అవసరం ఉంది. భవిష్యత్తులో డీఎస్సీ నిర్వహించినా ఎస్జీటీ పోస్టులు ఉండకపోవచ్చు.
- అర్హత కలిగిన ఎస్జీటీలకు సబ్జెక్టు టీచర్లుగా పదోన్నతులు కల్పించడంతో మరోపక్క స్కూల్ అసిస్టెంట్ల పోస్టులు తగ్గిపోయాయి.
- కొత్త నియామకాలు లేకపోగా.. ఉన్న పోస్టులను ప్రభుత్వం రద్దుచేసింది. ఆదర్శ పాఠశాలల్లో 3,260 పోస్టులకు సర్వీసు నిబంధనల కోసమంటూ 4,764 ఎస్జీటీ పోస్టులను రద్దు చేశారు.
- అయిదు అదనపు డైరెక్టర్ల పోస్టులను సృష్టించేందుకు 2021 అక్టోబరులో 15, కొత్తగా 692 మండల విద్యాధికారుల పోస్టులను సృష్టించేందుకు 1,145 ఆర్ట్, క్రాఫ్ట్, డ్రాయింగ్ పోస్టులను ప్రభుత్వం రద్దుచేసింది.
- హైస్కూల్ ప్లస్లో ఇంటర్మీడియట్ బోధనకు 1,752 స్కూల్ అసిస్టెంట్ల కోసం 1,752 ఎస్జీటీ పోస్టులను తొలగించింది. కర్నూలు జిల్లాలో ప్రధానోపాధ్యాయుల పోస్టుల కోసం 76 ఎస్జీటీ పోస్టులను రద్దుచేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చంద్రబాబు బెయిల్ రద్దు కేసు పది వారాలు వాయిదా
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ను రద్దుచేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు 10 వారాలకు వాయిదా వేసింది. -
ఏపీ సీఎస్ ఉదాసీనతతో పండుటాకులకు పాట్లు
పింఛనుదార్లకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇంటి వద్దే నగదు అందించేలా చర్యలు తీసుకోవాలని విపక్ష పార్టీలు ఎన్ని విజ్ఞప్తులు చేసినా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) జవహర్రెడ్డి పట్టించుకోలేదు. -
కావలిలో ఇంకా తొలగించని డబుల్ ఓట్లు
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో డబుల్ ఓట్లపై గతంలో ‘ఈనాడు’లో వరుస కథనాలు రాగా.. వాటిలో చాలా వరకు తొలగించారు. -
మంత్రి పెద్దిరెడ్డి వీర విధేయులపై వేటు
అధికార వైకాపాకు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వీర విధేయుల్లా పనిచేస్తున్న చిత్తూరు జిల్లా పలమనేరు డీఎస్పీ మహేశ్వరరెడ్డి, సదుం ఎస్సై మారుతిలపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు మంగళవారం వేటు వేసింది. -
మోదీజీ.. మీరు పునాది వేసిన అమరావతి ఇప్పుడిలా!
‘‘హైదరాబాద్ని మించిన మహానగరాన్ని కడతాం. కేంద్రం సహాయం చేసినా, చేయకపోయినా నిర్మించితీరతాం. ఎలా అంటే మా బుర్రలోంచి వచ్చిన ఆలోచన నుంచి కడతాం’’- ఇవి జగన్ ప్రతిపక్షంలో ఉండగా పలికిన అబద్ధాలివి. -
‘బందోబస్తు’ బహుపరాక్!
సిద్ధం.. సిద్ధం.. అంటూ హోరెత్తిస్తున్న అధికార వైకాపా.. ఎన్నికల వేళ తీవ్ర హింసకు సర్వం సిద్ధం చేసిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
అనూహ్య వర్షాలతో అతలాకుతలం
వాతావరణంలో ఒక్కసారిగా వచ్చిన అనూహ్య మార్పులు రాష్ట్రంలోని పలు ప్రాంతాలను ఉక్కిరిబిక్కిరి చేశాయి. -
అంత అత్యవసరం ఏమిటో చెప్పమనండి
ఎన్నికలు పూర్తయ్యేవరకూ రైతులకు పెట్టుబడి రాయితీ (ఇన్పుట్ సబ్సిడీ), విద్యాదీవెన, చేయూత పథకాల కింద నిధుల విడుదలకు అనుమతి నిరాకరిస్తూ ఎన్నికల సంఘం (ఈసీ) తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు మంగళవారం అత్యవసరంగా విచారణ జరిపింది. -
రాజమహేంద్రవరం విలవిల
అధికారమిస్తే ప్రగతిని పరుగులు పెట్టిస్తానని మాయమాటలు చెప్పిన సీఎం జగన్.. అయిదేళ్ల పాలనలో కనీసం నగరాలను పట్టించుకోలేదని తేలిపోయింది. -
‘సొంత’వారికే వంత!
ప్రభుత్వాలు ఏవైనా రాజ్యాంగానికి అనుగుణంగా నడుచుకోవాలి. కానీ, మన రాష్ట్రంలో మొత్తం రివర్స్ కదా.. పేదల పక్షపాతినని డబ్బా కొట్టుకునే సీఎం జగన్.. తన అరాచకాల్ని ప్రశ్నించే విపక్ష నాయకులు, ఇతరులపై పెత్తందారులని ముద్ర వేస్తారు. -
పథకాలు ఆపాలని ఎన్నికల సంఘం చెప్పలేదు
ప్రభుత్వ పథకాలు ఆపాలని ఎన్నికల సంఘం చెప్పలేదని.. 5 నుంచి 10 రోజుల తరువాత అమలు చేయాలని సూచించిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా స్పష్టం చేశారు. -
‘వివేకం’ సినిమాకి 2.1 కోట్లకు పైగా వ్యూస్.. పక్క రాష్ట్రాల్లోనూ ఆసక్తి
సీఎం జగన్మోహన్రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యోదంతం ఆధారంగా తెరకెక్కిన ‘వివేకం’ చిత్రానికి మంగళవారం నాటికి అన్ని యూట్యూబ్ ఛానళ్లలో కలిపి సుమారు 2.1 కోట్లలకు పైగా వీక్షణలు వచ్చాయి. -
‘ఆ చీకటి చట్టం రాకముందే’ ఇన్ని అగచాట్లా?
‘వారసత్వంగా వచ్చిన పట్టా భూమి మ్యుటేషన్ చేయడానికి స్పెషల్ సీఎస్గా పనిచేసిన నన్నే ఇన్ని ఇబ్బందులు పెడుతుంటే.. రాష్ట్రంలో సాధారణ రైతులు, బడుగులు, చదువురాని వాళ్లు ఏమైపోవాలి.. వారికి న్యాయం జరిగేదెలా?’ అని ఆర్థికవేత్త, విశ్రాంత ఐఏఎస్ అధికారి, మాజీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పీవీ రమేశ్ ఆందోళన వ్యక్తం చేశారు. -
నడవాలు ‘నాశనం’!
‘నాకు దక్కకపోతే ఎవరికీ దక్కకూడదు’... ఇది ముఖ్యమంత్రి జగన్ వైఖరి. కేవలం గత ప్రభుత్వ హయాంలో వచ్చిన ప్రాజెక్టులను కొనసాగిస్తే ఆ కీర్తి వారికి చెందుతుందనే వికృత ఆలోచనతో అభివృద్ధికి చోదక శక్తిలాంటి పారిశ్రామిక నడవాల నడకను ఆపేశారు. -
అమరావతి అభివృద్ధితోనే ఏపీ పురోగతి
రాజధాని అమరావతిపై ప్రధాని మోదీ ఇస్తున్న భరోసాతో రాజధాని వాసుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. -
‘అంబేడ్కర్’ను తొలగించి.. తన పేరు తగిలించి..!
గొప్పింటి బిడ్డలే విశ్వవిఖ్యాత విశ్వవిద్యాలయాల్లో చదువుకోవాలా? ప్రతిభ ఉన్న పేద పిల్లలు చదువుకోకూడదా? ప్రఖ్యాత వర్సిటీల్లో సీటు పొందిన పేద విద్యార్థులకు ఫీజు చెల్లించే స్థోమత ఉండదు. -
విజన్ ఉన్న నాయకుడినే ఎన్నుకోవాలి
రానున్న 25 ఏళ్లలో రాష్ట్ర, దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని విజన్ ఉన్న నాయకుడినే ఎన్నుకోవాలని ప్రవాస భారతీయుడు రంగనాథబాబు గొర్రెపాటి సూచించారు. -
జీపీఎఫ్ ఖాతాల నుంచి ప్రభుత్వమే రూ.500 కోట్లు దొంగిలించింది
జగన్ సర్కారు ఉద్యోగులకు బకాయిలు చెల్లించకపోగా.. జీపీఎఫ్ ఖాతాల నుంచి రూ.500 కోట్లు దొంగతనంగా లాగేసిందని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఛైర్మన్ కేఆర్ సూర్యనారాయణ మండిపడ్డారు. -
పోలీసు వ్యవస్థపైనే స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణ బాధ్యత
రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోన్న నేపథ్యంలో స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణ బాధ్యత పోలీసు వ్యవస్థపైనే ఉందని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ (సీఎఫ్డీ) కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్కుమార్ పేర్కొన్నారు. -
ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై వైకాపా ఫిర్యాదు నాన్ కాగ్నిజబుల్ నేరం
‘ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై ప్రజలను తప్పుదోవ పట్టించే సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని, ఆ చట్టాన్ని వినియోగించి వైకాపా, జగన్ ప్రజల భూములను లాక్కుంటున్నట్లు తెదేపా చెబుతోంది. -
దురుద్దేశంతో కేసు నమోదు
పులివెందుల పోలీసులు తమపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ వివేకా కుమార్తె డాక్టర్ సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, సీబీఐ ఎస్పీ రామ్సింగ్ దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టులో వాదనలు ముగిశాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘పుష్ప2’ తర్వాత అత్యధిక పారితోషికం తీసుకునే విలన్ మీరేనా? ఫహద్ సమాధానం ఇదే!
-
పూంఛ్ దాడిలో పాక్ మాజీ కమాండో.. గుర్తించిన ఏజెన్సీలు..!
-
జపాన్లో ఖాళీగా 90 లక్షల ఇళ్లు..!
-
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి
-
ఐఎఫ్ఎస్ తుది ఫలితాలు వచ్చేశాయ్.. టాప్ 10 ర్యాంకర్లు వీరే..
-
ఆస్ట్రేలియాలో చదువు.. బ్యాంకు బ్యాలెన్స్ రూ.16 లక్షలు ఉండాల్సిందే!