మార్గదర్శిపై మరో కట్టుకథ
రామోజీ గ్రూప్ సంస్థల ప్రతిష్ఠను దెబ్బతీయడమే లక్ష్యంగా జగన్ ప్రభుత్వం మరో భారీ కుట్రకు తెరతీసింది. మార్గదర్శిపై అక్రమంగా దాడులు చేసి, కేసులు పెట్టి, ఖాతాదారుల్ని భయభ్రాంతుల్ని చేస్తున్న ప్రభుత్వం ఇంకో కట్టుకథ అల్లింది.
జగన్ ప్రభుత్వ కుట్రలో భాగంగా ఇంకో కేసు
మార్గదర్శిలో తన తండ్రి పెట్టిన రూ.5వేల పెట్టుబడికి రూ.39.74 లక్షల డివిడెండ్ పొందిన యూరిరెడ్డి
ఆ షేర్లు సంస్థకే విక్రయించిన వైనం
బలవంతంగా తీసుకున్నారంటూ ఏడేళ్ల తర్వాత తప్పుడు ఆరోపణలతో ఫిర్యాదు
ఏపీ సీఐడీయే సూత్రధారి
ఈనాడు, అమరావతి: రామోజీ గ్రూప్ సంస్థల ప్రతిష్ఠను దెబ్బతీయడమే లక్ష్యంగా జగన్ ప్రభుత్వం మరో భారీ కుట్రకు తెరతీసింది. మార్గదర్శిపై అక్రమంగా దాడులు చేసి, కేసులు పెట్టి, ఖాతాదారుల్ని భయభ్రాంతుల్ని చేస్తున్న ప్రభుత్వం ఇంకో కట్టుకథ అల్లింది. యూరిరెడ్డి అనే వ్యక్తితో తప్పుడు ఫిర్యాదు చేయించి.. మార్గదర్శి సంస్థ ఛైర్మన్ రామోజీరావు, ఎండీ శైలజాకిరణ్ల ప్రతిష్ఠ దెబ్బతీసేందుకు ఏపీ సీఐడీతో కుట్రపూరితంగా మరో కేసు నమోదు చేయించింది. తాను హైదరాబాద్లో ఉంటున్నానని, నేరమూ అక్కడే జరిగిందని ఆరోపిస్తున్న వ్యక్తి అక్కడ ఫిర్యాదు చేయకుండా.. మంగళగిరి వచ్చి మరీ ఏపీ సీఐడీకి ఫిర్యాదు చేయడాన్ని బట్టే ఇది ఎంత పెద్ద కుట్రో, దాని వెనుక ఉన్నదెవరో అర్థమవుతోంది. ఆ ఫిర్యాదులో మార్గదర్శిపై యూరిరెడ్డి చేసిన ఆరోపణలన్నీ పచ్చి అబద్ధాలు.
వారి విజ్ఞప్తి మేరకే షేర్ల కొనుగోలు
జి.జె.రెడ్డి అనే వ్యక్తి 1962లో మార్గదర్శిలో పెట్టిన రూ.5 వేల పెట్టుబడికి సంబంధించిన 90 షేర్లను (బోనస్ షేర్లతో కలిపి 288 షేర్లను) ఆయన కుమారుల విజ్ఞప్తి మేరకు మార్గదర్శి సంస్థ కంపెనీ వారిలో ఒకరి పేరు మీద బదిలీ చేసింది. వారికి చెందాల్సిన రూ.39.74 లక్షల డివిడెండ్కు చెక్కు ఇచ్చింది. దాన్ని జి.జె.రెడ్డి కుమారుడు యూరిరెడ్డి వెంటనే నగదుగా మార్చుకున్నారు. యూరిరెడ్డి, ఆయన సోదరుడి విజ్ఞప్తి మేరకు వారి పేరు మీదున్న షేర్లను మార్గదర్శి సంస్థ ప్రమోటర్లు 2016లో కొన్నారు. ప్రతిఫలంగా వారికి రూ.2.88 లక్షల చెక్కును అందజేశారు. అయితే ఆ చెక్కును యూరిరెడ్డి నగదుగా మార్చుకోలేదు. కొన్ని సందేహాలను లేవనెత్తుతూ లేఖ రాశారు. వాటన్నింటినీ నివృత్తి చేస్తూ కంపెనీ వెంటనే బదులిచ్చింది. ఏడేళ్లుగా మౌనంగా ఉన్న యూరిరెడ్డిని ఇప్పుడు సీఐడీ ట్రాప్ చేసి, మార్గదర్శిపై తప్పుడు కేసు పెట్టించిందన్న భావన వ్యక్తమవుతోంది. 2016లో జరిగిన షేర్ల బదిలీ ప్రక్రియ నిబంధనల ప్రకారం, పూర్తి పారదర్శకంగా జరిగింది. యూరిరెడ్డి సోదరులిద్దరూ తమ న్యాయవాదిని సంప్రదించి, అన్ని విషయాల్నీ ఆకళింపు చేసుకుని, పూర్తి స్పృహతోనే షేర్ల విక్రయ ఒప్పందంపై సంతకాలు చేశారు. తమ షేర్లు కొనుగోలు చేయాలన్న విజ్ఞప్తిని మన్నించినందుకు ఛైర్మన్ రామోజీరావుకు వారు ఈ-మెయిల్ ద్వారా కృతజ్ఞతలు కూడా తెలిపారు.
మాట మార్చి... పచ్చి అబద్ధాలు
యూరిరెడ్డి ఫిర్యాదుతో ఈ నెల 13న ఏపీ సీఐడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో పేర్కొన్న అంశాలకు, 2017లో ఆయన చేసిన ఫిర్యాదులోని అంశాలకు మధ్య చాలా వైరుధ్యాలున్నాయి. షేర్ల బదిలీకి సంబంధించిన ఫారంపై అనుకోకుండా సంతకం చేశానని ఆయన అప్పట్లో చెప్పారు. గన్పాయింట్లో బెదిరించడంతో ట్రాన్స్ఫర్ డీడ్పై సంతకం చేయాల్సి వచ్చిందని ఇప్పుడు కొత్త పల్లవి ఎత్తుకున్నారు. షేర్ల ట్రాన్స్ఫర్కు (కంపెనీలోని ఒకరి షేర్లను మరొకరికి బదిలీ చేయడానికి) సంబంధించిన ఎస్హెచ్-4 పత్రంపై అది షేర్ల ట్రాన్స్మిషన్ (షేర్హోల్డర్ చనిపోతే చట్టప్రకారం వారి వారసులకు షేర్లు దఖలు పడేందుకు ఉద్దేశించిన) పత్రంగా భావించి సంతకం చేశానని ఆయన ఇప్పుడు చెప్పడం పచ్చి అబద్ధం.
ప్రమోటర్లను బ్లాక్మెయిల్ చేసేందుకు కుట్ర
2016లో జరిగిన షేర్ల బదిలీపై ఫిర్యాదుదారుకు అసంతృప్తి, అభ్యంతరాలేవైనా ఉంటే చట్టప్రకారం పరిష్కరించుకోవడానికి హైదరాబాద్లోని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ లేదా ఎన్సీఎల్టీని సంప్రదించేవారే తప్ప.. ఏపీసీఐడీకి ఫిర్యాదు చేసేవారు కాదు. షేర్లు బదిలీ జరిగిన విషయాన్ని ఏడేళ్ల తర్వాత ఇప్పుడే గుర్తించినట్టుగా యూరిరెడ్డి ఫిర్యాదు చేయడమూ విడ్డూరంగానే ఉంది. మార్గదర్శి ప్రమోటర్లను బ్లాక్మెయిల్ చేసేందుకు ఇలా మోసపూరితంగా వ్యవహరిస్తున్న యూరిరెడ్డి, ఆయనను ఆడిస్తున్న ఏపీ సీఐడీపైనా న్యాయపరమైన చర్యలకు సంస్థ సిద్ధమవుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇదీ స్ట్రాంగ్రూమే.. టార్పాలిన్ కప్పి ఉంచిన గదిలో పోస్టల్ బ్యాలట్ పెట్టెలు
చిత్రంలో టార్పాలిన్ కప్పి ఉంచిన కార్యాలయ గది బాపట్ల శాసనసభ నియోజకవర్గ పోస్టల్ బ్యాలట్ పెట్టెలను భద్రపరిచిన స్ట్రాంగ్రూమ్. -
విమానాశ్రయంలో ప్రవాస వైద్యుడు లోకేశ్ అడ్డగింత
అమెరికా పౌరుడైన గుంటూరు జిల్లా వెంకటాపురానికి చెందిన డాక్టర్ ఉయ్యూరు లోకేశ్ను గన్నవరం విమానాశ్రయ భద్రతా సిబ్బంది అడ్డుకొని, గన్నవరం పోలీసులకు అప్పగించారు. -
పొలాలన్నీ దున్నేశాక.. పంటనష్టం లెక్కలా!
జూన్ 1 నుంచి ఖరీఫ్ పంట కాలం కిందే లెక్క.. నైరుతి రుతుపవనాలూ వచ్చేస్తున్నాయి. అతి త్వరలోనే రాష్ట్రాన్ని కూడా తాకనున్నాయి. అంటే రైతులకు మళ్లీ పొలం పనులు మొదలైనట్లే. రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడు రబీ పంటనష్టం గుర్తొచ్చింది. అదీ ఈ నెల 24 లోగా పూర్తిచేయాలి. దుక్కులు దున్నించి.. మళ్లీ విత్తనం వేసేందుకు సిద్ధం చేసిన పొలాల్లో వ్యవసాయాధికారులకు ఏ పంటనష్టం కనిపిస్తుందో మరి? ఇది వైకాపా నేతలు, కార్యకర్తల కరవు తీర్చడానికా? నిజంగా నష్టపోయిన రైతుల్ని ఆదుకోవడానికా? అనే ప్రశ్నలు అన్నదాతల్లో వ్యక్తమవుతున్నాయి. -
పోలీసులపై ప్రశ్నల పరంపర
పల్నాడు జిల్లా నరసరావుపేట, తిరుపతి జిల్లా చంద్రగిరి, అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ సందర్భంగానూ.. ఆ తర్వాత జరిగిన దమనకాండపై సిట్ అధికారులు రెండో రోజైన ఆదివారం కూడా విచారణ జరిపారు. -
విద్యార్థుల లెక్కలపై ప్రభుత్వం దొంగాట!
ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య భారీగా పడిపోయింది. ‘విద్యా కానుక’ కోసం ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు ఈ విషయాన్ని బహిర్గతం చేశాయి. -
రూ.5 వేలకు ఓటు అమ్ముకొని సస్పెండైన మంగళగిరి ఎస్సై
ఓ పోలీసు అధికారి తన పోస్టల్ బ్యాలట్ ఓటును అమ్ముకొని.. సస్పెండయ్యారు. గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణ స్టేషన్లో ఎస్సైగా పనిచేస్తున్న ఖాజాబాబుది ప్రకాశం జిల్లా కురిచేడు. -
మన వ్యాధుల భారంలో 56%.. తిండి వల్లే
మన జీవనశైలి, ఆహారపు అలవాట్లలో గణనీయ మార్పులు వస్తున్నాయి. ఇవి ఆరోగ్యంపై పెను ప్రభావాన్ని చూపుతున్నాయి. -
దేశానికి తెలుగు ‘వెలుగు’లు
మీ ఇంట్లో కరెంటు వెలుగు రావాలన్నా, మీరు వినియోగించే అనేక ఉత్పత్తుల తయారీ పరిశ్రమలు నడవాలన్నా కావాల్సిన కీలక ఇంధనం బొగ్గు. -
బాధితుల గొంతు వినిపించడం నేరమా?
ఎన్డీయే అభ్యర్థులకు ఓటు వేశామనే అక్కసుతో తమపై వైకాపా మూకలు దాడికి తెగబడి తలలు పగలకొట్టి రక్తపాతం సృష్టించారంటూ బాధితులు చెబితే.. ఆ విషయాన్ని టీవీ ఛానళ్లలో ప్రసారం చేయడం నేరమా? వారికి జరిగిన అన్యాయాన్ని, వారి ఆవేదనను రిపోర్టింగ్ చేయడం వర్గాల మధ్య శత్రుత్వం పెంచడమా? -
ముగ్గురు ఐపీఎస్లపై అభియోగాల నమోదు
రాష్ట్రంలో పోలింగ్ రోజు, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలకు బాధ్యుల్ని చేస్తూ ఎన్నికల సంఘం సస్పెండ్ చేసిన అనంతపురం, పల్నాడు ఎస్పీలు అమిత్ బర్దర్, బిందుమాధవ్ గరికపాటి, బదిలీ వేటుకు గురైన తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్ పటేల్పై రాష్ట్ర ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించింది. -
మమ్మల్ని వెంటనే భారత్కు రప్పించండి
కిర్గిజ్స్థాన్ రాజధాని బిష్కెక్లో స్థానికులు, ఈజిప్ట్ విద్యార్థులకు మధ్య జరిగిన ఘర్షణల నేపథ్యంలో అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న విశాఖ జిల్లా విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. -
శ్రీవారిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి
ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సురేష్రెడ్డి, రాష్ట్ర విభజన సమయంలో యాక్టింగ్ సీజేగా పనిచేసి ఇటీవల పదవీవిరమణ పొందిన జస్టిస్ ప్రవీణ్కుమార్ ఆదివారం శ్రీవారిని దర్శించుకున్నారు. -
అప్పన్న సన్నిధిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సందీప్ మెహతా ఆదివారం సతీసమేతంగా సింహాద్రి అప్పన్నస్వామిని దర్శించుకున్నారు. -
తాడిపత్రిలో రెండోరోజు కొనసాగిన సిట్ విచారణ
అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలింగ్ తర్వాత జరిగిన అల్లర్లపై సిట్ అధికారులు రెండోరోజైన ఆదివారం కూడా విచారణ కొనసాగించారు. -
రెండు రోజుల్లో తుపానుపై స్పష్టత
బంగాళాఖాతంలో ఈ నెల 22న అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఇది ఈశాన్య దిశగా పయనించి 24 నాటికి వాయుగుండంగా బలపడనుంది. -
వైభవంగా అన్నవరం సత్యనారాయణస్వామి కల్యాణం
కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామివారి కల్యాణ మహోత్సవం ఆదివారం కనులపండువగా జరిగింది. రాత్రి 9.30 గంటలకు కల్యాణతంతు ప్రారంభించారు. -
గవి మఠం భూమి నొక్కేసిన ఉద్యోగి
కంచే చేను మేసిన చందంగా.. దేవాదాయశాఖ పరిధిలోని ఓ మఠంలో పనిచేసిన ఉద్యోగి, ఆ మఠానికి చెందిన భూమిని ఎవరికీ తెలియకుండా తన కుటుంబసభ్యుల పేరిట రికార్డుల్లో రాయించుకున్నారు. -
అక్క మరణం తట్టుకోలేక ఆగిన చెల్లెలి గుండె
తనతో ఎంతో స్నేహంగా ఉండే అక్క ఇక లేదని తెలిసి మానసిక వికలాంగురాలైన చెల్లెలు తట్టుకోలేకపోయింది. మౌనంగానే రోదించి గంటల వ్యవధిలోనే తనూ కన్నుమూసింది. -
తప్పిన విద్యుత్ లెక్కలు.. ప్రజలపై రూ.250 కోట్ల భారం!
వేసవిలో విద్యుత్ డిమాండ్పై ఇంధనశాఖ లెక్కలు తారుమారయ్యాయి. ఆ కారణంగా సుమారు రూ.259 కోట్ల మేర అదనపు భారం పడనుంది. -
పులివర్తి నానిపై దాడి ఘటనలో అక్రమ అరెస్టులు
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో పోలీసులు అక్రమ అరెస్టులు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు
భక్తుల రద్దీ దృష్ట్యా తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 24 గంటల సమయం పడుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
సీఎం సోదరుడి ఓటు గల్లంతు..
-
ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్బర్
-
ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నాం: ఏపీ స్పెషాల్టీ ఆస్పత్రుల సంఘం
-
హీరో- హార్లే భాగస్వామ్యంలో మరిన్ని మోటార్ సైకిల్స్
-
అప్పుడు నిరాశ చెందా.. ఓపిక విలువేంటో అర్థమైంది: మంచు మనోజ్
-
ప్లేఆఫ్స్ తొలి పోరు... రైడర్స్పై సన్ ‘రైజ్’ అయితే ఫైనల్కు!