AP Govt: మావాడైతే చాలు.. సీనియారిటీతో మాకేం పని
‘మేం అరాచకాలకు తెగబడ్డా.. అక్రమాలకు పాల్పడ్డా.. వాటికి వెన్నుదన్నుగా ఉండాలి. మాకు రాజకీయంగా గిట్టని వారిని అక్రమ కేసులతో వేధించాలి.. ప్రతిపక్షాలు పల్లెత్తి మాటన్నా సరే వారిని అణచివేయాలి. భయపెట్టాలి.
11 మంది సీనియర్లను తొక్కేసి డీజీపీగా రాజేంద్రనాథరెడ్డి నియామకం
రెండేళ్ల నుంచి ఇన్ఛార్జిగా ఆయనే
పూర్తిస్థాయి డీజీపీ నియామకం కోసం కేంద్రానికి జాబితా పంపని జగన్ ప్రభుత్వం
సుప్రీంకోర్టు ఆదేశాలన్నా లెక్కలేదు..
యూపీఎస్సీ మార్గదర్శకాలు బేఖాతర్
ఈనాడు-అమరావతి: ‘మేం అరాచకాలకు తెగబడ్డా.. అక్రమాలకు పాల్పడ్డా.. వాటికి వెన్నుదన్నుగా ఉండాలి. మాకు రాజకీయంగా గిట్టని వారిని అక్రమ కేసులతో వేధించాలి.. ప్రతిపక్షాలు పల్లెత్తి మాటన్నా సరే వారిని అణచివేయాలి. భయపెట్టాలి. దాడులు చేసే మమ్మల్ని వదిలేసి రివర్స్ కేసులతో బాధితులను హడలెత్తించాలి. మా మాటే చట్టం కావాలి. ఐపీసీ (ఇండియన్ పీనల్ కోడ్) పక్కనపెట్టి జేపీసీ (జగన్ పీనల్ కోడ్) అమలు చేయాలి. సీఆర్పీసీ (క్రిమినల్ ప్రొసీజర్ కోడ్) స్థానంలో వైఎస్ఆర్సీపీ (వైఎస్ఆర్ క్రిమినల్ ప్రోసీజర్ కోడ్) పాటించాలి. వీటన్నింటికీ తోడు అదనంగా ‘మా వాడు’ అయిఉండాలి. ఈ కనీస అర్హతలుంటే చాలు.. సీనియారిటీ జాబితాలో అట్టడుగున ఉన్నా సరే... మిగతా అధికారులందర్నీ కిందకు తొక్కేసి మరీ డీజీపీగా కొనసాగిస్తుంటాం. సీనియారిటీలో ముందుకొచ్చేంతవరకూ కూడా ఏ ఇబ్బందీ రాకుండా ఇన్ఛార్జి హోదాలో కొనసాగిస్తుంటాం’ అనే రీతిలో జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది.
సుప్రీంకోర్టు ఆదేశాలంటే లెక్కలేదు. యూపీఎస్సీ మార్గదర్శకాలు బేఖాతర్.. తాను చెప్పిందల్లా చేసే వారే డీజీపీ (పోలీసు దళాల అధిపతి). దాని కోసం నిబంధనలను కాల రాస్తోంది. డీజీపీ హోదా కలిగిన 11 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులను పక్కనపెట్టేసి మరీ కేవీ రాజేంద్రనాథరెడ్డిని ఇన్ఛార్జీ డీజీపీ (పోలీసు దళాల అధిపతి)గా నియమించిన జగన్ ప్రభుత్వం..రెండేళ్లుగా ఆయన్ను అదే హోదాలో కొనసాగిస్తోంది. పూర్తిస్థాయి (రెగ్యులర్) డీజీపీ ఎంపిక కోసం అర్హులైన అధికారుల వివరాలతో జాబితా పంపాలని కేంద్ర హోంశాఖ పదే పదే లేఖలు రాస్తున్నా ఖాతరు చేయడం లేదు. డీజీపీ నియామకం విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను పట్టించుకోవడమే లేదు. ఈ నేపథ్యంలోనే ‘తాత్కాలిక డీజీపీ వద్దు.. పూర్తిస్థాయి డీజీపీని వెంటనే నియమించండి’ అంటూ కేంద్ర హోంశాఖ తాజాగా మరోసారి ఏపీ ప్రభుత్వానికి లేఖ పంపించింది.
సీనియారిటీలో అట్టడుగున ఉన్నా పట్టం
వడ్డించే వాడు మనవాడైతే అన్నట్లుగా.. పోస్టింగ్ ఇచ్చేది ‘‘మనవాడు’’ కావటంతో సీనియారిటీలో అట్టడుగున ఉన్నప్పటికీ రాజేంద్రనాథరెడ్డిని ఇన్ఛార్జి డీజీపీగా నియమించుకున్నారు. 1992 బ్యాచ్ అధికారైన ఆయనను అదనపు డీజీపీ నుంచి డీజీపీగా పదోన్నతి పొందిన కొద్ది రోజుల్లోనే...పోలీసు దళాల అధిపతిగా నియమిస్తూ 2020 ఫిబ్రవరి 15న జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డీజీపీ ర్యాంకులో అప్పటికి వీఎస్కే కౌముది (1986 బ్యాచ్) ఎన్.వి.సురేంద్రబాబు, ఏ.ఆర్.అనూరాధ (1987 బ్యాచ్), ఏబీ వెంకటేశ్వరరావు, కేఆర్ఎం కిషోర్కుమార్, సీహెచ్. ద్వారకా తిరుమలరావు (1989 బ్యాచ్), అంజనా సిన్హా (1990 బ్యాచ్), మాదిరెడ్డి ప్రతాప్, మహ్మద్ హసన్ రెజా (1991), హరీష్కుమార్ గుప్తా, పీఎస్ఆర్ ఆంజనేయులు (1992)ఉన్నారు. సీనియారిటీ జాబితాలో వీరంతా రాజేంద్రనాథరెడ్డి కంటే ముందు వరుసలో ఉన్నప్పటికీ వైకాపా ప్రభుత్వం వారందర్నీ కిందకు తొక్కిపెట్టి ‘‘తమ వాడికి’’ డీజీపీగా పట్టం కట్టి పైకి తీసుకొచ్చింది.
రెండేళ్లలో అయిదుగురు అధికారుల పదవీ విరమణ
రాజేంద్రనాథరెడ్డి ఇన్ఛార్జి డీజీపీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గత రెండేళ్ల వ్యవధిలో డీజీ ర్యాంకు అధికారులైన వీఎస్కే కౌముది, ఎన్.వి.సురేంద్రబాబు, ఏ.ఆర్.అనూరాధ, కేఆర్ఎం కిషోర్కుమార్, మహ్మద్ హసన్ రెజాలు పదవీ విరమణ చేశారు. పూర్తిస్థాయి డీజీపీ ఎంపిక కోసం అప్పట్లోనే జగన్ ప్రభుత్వం కేంద్రానికి జాబితా పంపించి ఉంటే వీరందరి పేర్లు అందులో పొందుపరచాల్సి వచ్చేది. కానీ దురుద్దేశంతో తాత్సారం చేయటం వల్ల వీరికి పోలీసు దళాల అధిపతిగా పనిచేసే అవకాశం దక్కనీయకుండా చేసింది.
- సీనియర్ అధికారులు ఒక్కొక్కరూ పదవీ విరమణ చేయటంతో.. ప్రస్తుతం (2024 జనవరి 18 నాటికి) రాజేంద్రనాథరెడ్డి సీనియారిటీ జాబితాలో ఏడో స్థానానికి ఎగబాకారు. ప్రస్తుతం ఆయన కంటే ముందు వరుసలో ఏబీ వెంకటేశ్వరరావు, సీహెచ్ ద్వారకా తిరుమలరావు, అంజనా సిన్హా, మాదిరెడ్డి ప్రతాప్, హరీష్కుమార్ గుప్తా, పీఎస్ఆర్ ఆంజనేయులు ఉన్నారు. కానీ వారందర్నీ పక్కనపెట్టి మరీ రాజేంద్రనాథరెడ్డినే ఇంకా ఇన్ఛార్జిగా కొనసాగిస్తున్నారు.
- 1993, 1994 బ్యాచ్లకు చెందిన ఐపీఎస్ అధికారులకు జనవరి నెలలో అదనపు డీజీపీ నుంచి డీజీపీగా పదోన్నతులు రావాలి. కానీ భవిష్యత్తులో ఇబ్బంది రాకుండా వాటికి కూడా మోకాలడ్డారు.
ఇది క్విడ్ ప్రోకో కాకపోతే మరేంటి?
ఇన్ఛార్జి డీజీపీగా వ్యవహరిస్తున్న రాజేంద్రనాథరెడ్డి తొలి నుంచి వైకాపాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. ప్రతిపక్షాలపై ఎన్ని దాష్టీకాలు జరుగుతున్నా ఆయన ఏ రోజూ పట్టించుకోలేదు. ఈయన హయాంలో ప్రతిపక్ష నాయకులు, ప్రభుత్వ విధానాల్ని ప్రశ్నించేవారిపై పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారు. ప్రతిపక్షాలకు చెందిన వారిపై ఫిర్యాదులివ్వడానికి వచ్చేవారిని సాదరంగా ఆహ్వానించి మరీ ఫిర్యాదులు స్వీకరిస్తారు. వైకాపా నాయకుల దాష్టీకాలపై ఫిర్యాదులివ్వడానికి వెళ్లే ప్రతిపక్ష నాయకుల్ని ఆయన కలవనే కలవరు. కనీసం కార్యాలయం లోపలికి కూడా అనుమతించరు. ఇందుకోసమే ఆయన్ను ఇన్ఛార్జి డీజీపీగా కొనసాగిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది క్విడ్ ప్రోకో కాకపోతే మరేంటి అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.
దురుద్దేశపూరిత తాత్సారం
- డీజీపీగా ఉన్న గౌతమ్సవాంగ్ను ఆకస్మికంగా, అర్ధంతరంగా ఆ పోస్టు నుంచి పక్కకు తప్పించి.. ఆ స్థానంలో ఇన్ఛార్జి డీజీపీగా కేవీ రాజేంద్రనాథరెడ్డిని నియమించిన జగన్ ప్రభుత్వం నిబంధనలను తుంగలో తొక్కింది.
- ప్రకాశ్సింగ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం.. రాష్ట్ర క్యాడర్లో డీజీపీ హోదాలో ఉన్న అధికారుల్లో సీనియారిటీ ప్రకారం అయిదుగురి పేర్లను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపించాలి. సర్వీసు రికార్డు, నిజాయితీ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత వారిలో ముగ్గురి పేర్లను యూపీఎస్సీ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తుంది. అందులో ఒకర్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి డీజీపీగా ఎంపిక చేయాలి.
- ఇన్ఛార్జి డీజీపీని నియమించి రెండేళ్లవుతున్నా... పూర్తిస్థాయి డీజీపీ నియామకం కోసం జగన్ ప్రభుత్వం ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వానికి జాబితా పంపలేదు. దురుద్దేశంతోనే ఈ తాత్సారం చేసిందని సీనియర్ ఐపీఎస్లు అంతర్గత సంభాషణల్లో చెబుతున్నారు. ఒకవేళ యూపీఎస్సీకి జాబితా పంపిస్తే.. సీనియారిటీలో 12వ స్థానంలో ఉన్న రాజేంద్రనాథరెడ్డి పేరు అందులో పొందుపరచడం సాధ్యం కాదు. దీంతో తమకు కావాల్సిన వ్యక్తి రెగ్యులర్ డీజీపీ అయ్యేందుకు అవకాశం ఉండదు. అందుకే సీనియారిటీ జాబితాలో రాజేంద్రనాథరెడ్డి పేరు ముందు వరుసలోకి వచ్చేంతవరకూ జాబితా పంపకుండా నిలిపేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇదీ స్ట్రాంగ్రూమే.. టార్పాలిన్ కప్పి ఉంచిన గదిలో పోస్టల్ బ్యాలట్ పెట్టెలు
చిత్రంలో టార్పాలిన్ కప్పి ఉంచిన కార్యాలయ గది బాపట్ల శాసనసభ నియోజకవర్గ పోస్టల్ బ్యాలట్ పెట్టెలను భద్రపరిచిన స్ట్రాంగ్రూమ్. -
విమానాశ్రయంలో ప్రవాస వైద్యుడు లోకేశ్ అడ్డగింత
అమెరికా పౌరుడైన గుంటూరు జిల్లా వెంకటాపురానికి చెందిన డాక్టర్ ఉయ్యూరు లోకేశ్ను గన్నవరం విమానాశ్రయ భద్రతా సిబ్బంది అడ్డుకొని, గన్నవరం పోలీసులకు అప్పగించారు. -
పొలాలన్నీ దున్నేశాక.. పంటనష్టం లెక్కలా!
జూన్ 1 నుంచి ఖరీఫ్ పంట కాలం కిందే లెక్క.. నైరుతి రుతుపవనాలూ వచ్చేస్తున్నాయి. అతి త్వరలోనే రాష్ట్రాన్ని కూడా తాకనున్నాయి. అంటే రైతులకు మళ్లీ పొలం పనులు మొదలైనట్లే. రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడు రబీ పంటనష్టం గుర్తొచ్చింది. అదీ ఈ నెల 24 లోగా పూర్తిచేయాలి. దుక్కులు దున్నించి.. మళ్లీ విత్తనం వేసేందుకు సిద్ధం చేసిన పొలాల్లో వ్యవసాయాధికారులకు ఏ పంటనష్టం కనిపిస్తుందో మరి? ఇది వైకాపా నేతలు, కార్యకర్తల కరవు తీర్చడానికా? నిజంగా నష్టపోయిన రైతుల్ని ఆదుకోవడానికా? అనే ప్రశ్నలు అన్నదాతల్లో వ్యక్తమవుతున్నాయి. -
పోలీసులపై ప్రశ్నల పరంపర
పల్నాడు జిల్లా నరసరావుపేట, తిరుపతి జిల్లా చంద్రగిరి, అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ సందర్భంగానూ.. ఆ తర్వాత జరిగిన దమనకాండపై సిట్ అధికారులు రెండో రోజైన ఆదివారం కూడా విచారణ జరిపారు. -
విద్యార్థుల లెక్కలపై ప్రభుత్వం దొంగాట!
ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య భారీగా పడిపోయింది. ‘విద్యా కానుక’ కోసం ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు ఈ విషయాన్ని బహిర్గతం చేశాయి. -
రూ.5 వేలకు ఓటు అమ్ముకొని సస్పెండైన మంగళగిరి ఎస్సై
ఓ పోలీసు అధికారి తన పోస్టల్ బ్యాలట్ ఓటును అమ్ముకొని.. సస్పెండయ్యారు. గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణ స్టేషన్లో ఎస్సైగా పనిచేస్తున్న ఖాజాబాబుది ప్రకాశం జిల్లా కురిచేడు. -
మన వ్యాధుల భారంలో 56%.. తిండి వల్లే
మన జీవనశైలి, ఆహారపు అలవాట్లలో గణనీయ మార్పులు వస్తున్నాయి. ఇవి ఆరోగ్యంపై పెను ప్రభావాన్ని చూపుతున్నాయి. -
దేశానికి తెలుగు ‘వెలుగు’లు
మీ ఇంట్లో కరెంటు వెలుగు రావాలన్నా, మీరు వినియోగించే అనేక ఉత్పత్తుల తయారీ పరిశ్రమలు నడవాలన్నా కావాల్సిన కీలక ఇంధనం బొగ్గు. -
బాధితుల గొంతు వినిపించడం నేరమా?
ఎన్డీయే అభ్యర్థులకు ఓటు వేశామనే అక్కసుతో తమపై వైకాపా మూకలు దాడికి తెగబడి తలలు పగలకొట్టి రక్తపాతం సృష్టించారంటూ బాధితులు చెబితే.. ఆ విషయాన్ని టీవీ ఛానళ్లలో ప్రసారం చేయడం నేరమా? వారికి జరిగిన అన్యాయాన్ని, వారి ఆవేదనను రిపోర్టింగ్ చేయడం వర్గాల మధ్య శత్రుత్వం పెంచడమా? -
ముగ్గురు ఐపీఎస్లపై అభియోగాల నమోదు
రాష్ట్రంలో పోలింగ్ రోజు, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలకు బాధ్యుల్ని చేస్తూ ఎన్నికల సంఘం సస్పెండ్ చేసిన అనంతపురం, పల్నాడు ఎస్పీలు అమిత్ బర్దర్, బిందుమాధవ్ గరికపాటి, బదిలీ వేటుకు గురైన తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్ పటేల్పై రాష్ట్ర ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించింది. -
మమ్మల్ని వెంటనే భారత్కు రప్పించండి
కిర్గిజ్స్థాన్ రాజధాని బిష్కెక్లో స్థానికులు, ఈజిప్ట్ విద్యార్థులకు మధ్య జరిగిన ఘర్షణల నేపథ్యంలో అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న విశాఖ జిల్లా విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. -
శ్రీవారిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి
ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సురేష్రెడ్డి, రాష్ట్ర విభజన సమయంలో యాక్టింగ్ సీజేగా పనిచేసి ఇటీవల పదవీవిరమణ పొందిన జస్టిస్ ప్రవీణ్కుమార్ ఆదివారం శ్రీవారిని దర్శించుకున్నారు. -
అప్పన్న సన్నిధిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సందీప్ మెహతా ఆదివారం సతీసమేతంగా సింహాద్రి అప్పన్నస్వామిని దర్శించుకున్నారు. -
తాడిపత్రిలో రెండోరోజు కొనసాగిన సిట్ విచారణ
అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలింగ్ తర్వాత జరిగిన అల్లర్లపై సిట్ అధికారులు రెండోరోజైన ఆదివారం కూడా విచారణ కొనసాగించారు. -
రెండు రోజుల్లో తుపానుపై స్పష్టత
బంగాళాఖాతంలో ఈ నెల 22న అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఇది ఈశాన్య దిశగా పయనించి 24 నాటికి వాయుగుండంగా బలపడనుంది. -
వైభవంగా అన్నవరం సత్యనారాయణస్వామి కల్యాణం
కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామివారి కల్యాణ మహోత్సవం ఆదివారం కనులపండువగా జరిగింది. రాత్రి 9.30 గంటలకు కల్యాణతంతు ప్రారంభించారు. -
గవి మఠం భూమి నొక్కేసిన ఉద్యోగి
కంచే చేను మేసిన చందంగా.. దేవాదాయశాఖ పరిధిలోని ఓ మఠంలో పనిచేసిన ఉద్యోగి, ఆ మఠానికి చెందిన భూమిని ఎవరికీ తెలియకుండా తన కుటుంబసభ్యుల పేరిట రికార్డుల్లో రాయించుకున్నారు. -
అక్క మరణం తట్టుకోలేక ఆగిన చెల్లెలి గుండె
తనతో ఎంతో స్నేహంగా ఉండే అక్క ఇక లేదని తెలిసి మానసిక వికలాంగురాలైన చెల్లెలు తట్టుకోలేకపోయింది. మౌనంగానే రోదించి గంటల వ్యవధిలోనే తనూ కన్నుమూసింది. -
తప్పిన విద్యుత్ లెక్కలు.. ప్రజలపై రూ.250 కోట్ల భారం!
వేసవిలో విద్యుత్ డిమాండ్పై ఇంధనశాఖ లెక్కలు తారుమారయ్యాయి. ఆ కారణంగా సుమారు రూ.259 కోట్ల మేర అదనపు భారం పడనుంది. -
పులివర్తి నానిపై దాడి ఘటనలో అక్రమ అరెస్టులు
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో పోలీసులు అక్రమ అరెస్టులు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు
భక్తుల రద్దీ దృష్ట్యా తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 24 గంటల సమయం పడుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
కోహ్లీ రికార్డు బద్దలు.. నాకు మంచి రోజులు నడుస్తున్నాయ్: అభిషేక్ శర్మ
-
ఇరాన్ అధ్యక్షుడు రైసీ దుర్మరణం.. మోదీ దిగ్భ్రాంతి
-
బెంగళూరులో 100 మందితో రేవ్పార్టీ.. పట్టుబడ్డ తెలుగు టీవీ నటీనటులు!
-
బ్యాన్ చేస్తామని బెదిరిస్తున్నారు.. లీగల్ యాక్షన్కు సిద్ధమైన పాయల్ రాజ్పుత్
-
రైసీ తర్వాత ఇప్పుడు అధికారం ఎవరు చేపడతారు..?
-
హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం