ఐదేళ్లూ షాక్.. ఎన్నికలని బ్రేక్!
పాదయాత్ర పేరిట ఊరూవాడా తిరిగిన జగన్... విద్యుత్ ఛార్జీలపై అలవోకగా అబద్ధాలు వల్లెవేశారు. మాటల గారడీతో ప్రజలను బురిడీ కొట్టించారు.
జగన్ పాలనలో ఆరుసార్లు విద్యుత్ ఛార్జీల పెంపు
ప్రజలపై రూ.18,817 కోట్ల భారం మోత
మళ్లీ పీఠమెక్కితే... తక్షణమే రూ.12,491 కోట్లు పిండుకునే ప్రమాదం
గెలిపిస్తే విద్యుత్ ఛార్జీలు పెంచబోమన్నారు...
ఇప్పటికే ఉన్న వాటినీ తగ్గిస్తామన్నారు...
ఒక్కసారి అవకాశమివ్వాలని వేడుకున్నారు...
తమపై భారం తగ్గుతుందేమోనని ప్రజలూ ఆశ పడ్డారు...
ఈవీఎంలపై వారు ఒక్కసారి మీట నొక్కితే...
పీఠమెక్కిన ఈయనేమో ఆరుసార్లు నొక్కారు...
భారం తగ్గించేందుకు కాదు... ఛార్జీలు పెంచేందుకు...!
మరోసారి బాదడానికి అడుగులేసినా...
వ్యూహాత్మకంగా వెనక్కి తగ్గారు...!
పాదయాత్ర పేరిట ఊరూవాడా తిరిగిన జగన్... విద్యుత్ ఛార్జీలపై అలవోకగా అబద్ధాలు వల్లెవేశారు. మాటల గారడీతో ప్రజలను బురిడీ కొట్టించారు. తెదేపా ప్రభుత్వ హయాంలో ప్రజలపై అడ్డగోలుగా విద్యుత్ ఛార్జీల భారం పడిందని... తాను అధికారంలోకి వచ్చాక భారాన్ని తగ్గిస్తానంటూ జగన్ నమ్మబలికారు. అధికారం చేపట్టిన మొదటి ఏడాదే పేదలు, సామాన్యులు, పరిశ్రమలు.. అన్న తేడా లేకుండా అన్ని వర్గాలకు షాక్ ఇచ్చారు. జగన్... ఐదేళ్లలో పెంచిన విద్యుత్ ఛార్జీలు తెలిస్తే నిజంగా షాక్ తగులుతుంది. ఇప్పటికే వేసిన భారాలు అక్షరాలా రూ.18,817.73 కోట్లు. ఇంకా మోపబోయే భారాల ప్రతిపాదన మరో రూ.12,491 కోట్లుగా తేలింది. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆ ప్రతిపాదనలను వ్యూహాత్మకంగా పక్కన పెట్టారు.
బాదుడు-1 రూ.5,200 కోట్లు
జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెలకు 500 యూనిట్లకు మించి వినియోగించే వినియోగదారులపై ఛార్జీల భారాన్ని మోపింది. యూనిట్కు 90 పైసలు పెంచి ఏటా రూ.1,300 కోట్ల అదనపు భారం వేసింది. ఇలా నాలుగేళ్లలో రూ.5,200 కోట్లు వసూలు చేసింది.
బాదుడు-2 రూ.1,800 కోట్లు
ఇదో కంటికి కనిపించని బాదుడు. ఛార్జీలు పెంచలేదు. అలాగని ఆదాయం రాకుండా లేదు. గృహ, ఎల్టీ వాణిజ్య విద్యుత్ వినియోగదారులపై స్థిర ఛార్జీల భారాన్ని వేసింది. ఈ రూపంలో ఏటా రూ.600 కోట్ల భారాన్ని వినియోగదారులపై మోపి, మూడేళ్లలో రూ.1,800 కోట్లను వసూలు చేసింది. కనీస వినియోగ ఛార్జీలకు బదులు.. కాంట్రాక్ట్ లోడ్పై స్థిర ఛార్జీల కింద కిలోవాట్కు రూ.10 చొప్పున వసూలు చేసే విధానాన్ని 2021 ఏప్రిల్ నుంచి అమలు చేసింది. మూడు కిలోవాట్ల కాంట్రాక్ట్ లోడ్ తీసుకున్న సింగిల్ ఫేజ్ కనెక్షన్ వినియోగదారుల నుంచి ప్రతినెలా రూ.30, త్రీఫేజ్ కనెక్షన్ వినియోగదారుల నుంచి కనీస కాంట్రాక్ట్ లోడ్ అయిదు కిలోవాట్లపై రూ.50 చొప్పున ప్రతినెలా బిల్లులో కలిపి వసూలు చేసింది.
బాదుడు-3 రూ.2910.74 కోట్లు
2014-19 సంవత్సరాల మధ్య వినియోగించిన విద్యుత్కు ట్రూఅప్ (విద్యుత్ వాస్తవ సరఫరా వ్యయం... వినియోగదారుల నుంచి ప్రతినెలా బిల్లుల రూపేణా వసూలు చేసిన మొత్తానికి మధ్య వ్యత్యాసం) కింద రూ.2910.74 కోట్లు వసూలు చేస్తోంది. ప్రతిపాదించిన మొత్తంలో ఇప్పటికే రూ.1,455.37 కోట్లు వసూలు చేసింది.
బాదుడు-4 రూ.3,082.99 కోట్లు
2021-22లో వినియోగించిన విద్యుత్కు ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరుతో రూ.3,082.99 కోట్ల భారం వేసింది. ఈ మొత్తాన్ని 2023 ఏప్రిల్ నుంచి 12 వాయిదాల్లో వసూలుకు డిస్కంలకు అనుమతించింది. అవి గత ఏప్రిల్ నుంచి 10 నెలల్లో రూ.2,569.16 కోట్లు వసూలు చేశాయి.
బాదుడు-5 రూ.2,944 కోట్లు
విద్యుత్ ఛార్జీల పెంపు.. శ్లాబ్ల్లో మార్పులు చేసి ఏటా రూ.1,400 కోట్ల ఛార్జీల భారాన్ని 2022 ఏప్రిల్ నుంచి ప్రభుత్వం వేసింది. అప్పట్లో సగటు విద్యుత్ వినియోగం రోజుకు 190 ఎంయూలుగా ఉంది. ప్రస్తుతం రోజుకు సగటున 200 ఎంయూలకు చేరింది. ఈ లెక్కన ఏటా అదనంగా పెరిగిన 3,600 ఎంయూల వినియోగంపై ఛార్జీల భారం కలిపితే పెంపు మొత్తం రూ.1,544 కోట్లకు చేరింది. గత రెండేళ్లలో రూ.2,944 కోట్ల భారం వినియోగదారులపై పడింది.
బాదుడు-6 రూ.2880 కోట్లు
2023 ఏప్రిల్ నుంచి ప్రతినెలా విద్యుత్ కొనుగోలుకు అదనంగా చేసిన ఖర్చును ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరుతో (ఎఫ్పీపీసీఏ) యూనిట్కు 40 పైసల చొప్పున ఆ తర్వాత నెల బిల్లులో కలిపి డిస్కంలు వసూలు చేస్తున్నాయి. ప్రతినెలా సగటు విద్యుత్ డిమాండ్ 200 మిలియన్ యూనిట్లు(ఎంయూ)గా పరిగణిస్తే.. నెలకు రూ.240 కోట్ల లెక్కన ఏడాదికి పడుతున్న భారం రూ.2880 కోట్లు.
ఓట్లు వస్తున్నాయని కాసుల వేటకు విరామం
- 2022-23 ఆర్థిక సంవత్సరంలో టారిఫ్, శ్లాబ్ల పెంపు ద్వారా ఇప్పటికే రూ.1,400 కోట్ల భారం వేసిన డిస్కంలు... మరో రూ.7,200 కోట్లను ట్రూఅప్ కింద వసూలు చేసుకోడానికి అనుమతించాలని ఏపీఈఆర్సీకి ప్రతిపాదించాయి. ఎన్నికల నేపథ్యంలో ఈ ప్రతిపాదనను ఏపీఈఆర్సీ పక్కన పెట్టింది.
- 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఎఫ్పీపీసీఏ కింద ప్రతి యూనిట్కు రూ.1.10 చొప్పున డిస్కంలు ఖర్చు చేశాయి. నిబంధన మేరకు అందులో యూనిట్కు గరిష్ఠంగా 40 పైసలు గత ఏడాది ఏప్రిల్ నుంచి బిల్లులో కలిపి వసూలు చేశాయి. డిస్కంల ప్రతిపాదన ప్రకారం సుమారు రూ.5,040 కోట్లు ట్రూఅప్ భారాన్ని ప్రజలపై వేసే అవకాశముంది.
- 2024-25లో రైల్వేలకు ఛార్జీల పెంపు, విద్యుత్ ఛార్జింగ్ కేంద్రాలకు ఇచ్చే రాయితీ ఉపసంహరణ ద్వారా మరో రూ.251 కోట్ల భారం వేయాలని డిస్కలు ప్రతిపాదించాయి. దీనిపై ప్రజాభిప్రాయ సేకరణను ఏపీఈఆర్సీ పూర్తి చేసింది. త్వరలో అమలవుతుంది. అంటే వైకాపా ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తే ప్రజల నుంచి మరో రూ.12,491 కోట్లను వసూలు చేసే ప్రమాదం ఉంది.
ప్రణాళికతో మోసం
విద్యుత్ ఛార్జీల భారాలను ప్రజలపై మోపే విషయంలో జగన్ ప్రభుత్వం ఒక ప్రణాళిక ప్రకారం వ్యవహరించింది. అన్ని వర్గాలపై ఒకేసారి ఛార్జీల భారం వేస్తే.. అంతా ఒకేసారి గగ్గోలు పెడతారని గ్రహించి, ఒక్కో ఏడాది ఒక కేటగిరీని లక్ష్యంగా చేసుకుంది. ఇలా ఐదేళ్లూ షాక్ల మీద షాక్లు ఇస్తూనే వచ్చింది. మరోవైపు సంక్షేమం పేరిట బటన్ నొక్కి ఆదుకుంటున్నామంటూ ప్రజలను మభ్యపెడుతోంది.
ఈనాడు, అమరావతి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపాకు మద్దతిస్తున్నారని.. ఎస్టీ కాలనీకి తాగునీరు బంద్
తెదేపాకు సానుకూలంగా ఉన్నారన్న అక్కసుతో ఎస్టీ కాలనీకి తాగునీటి సరఫరాను నిలిపేసిన దారుణ ఘటన పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలంలో చోటుచేసుకుంది. -
ఇచ్చింది రూ.50 వేలు.. లాగింది రూ.3.5 లక్షలు
డ్రైవర్ అన్నలు... నా మిత్రులు అన్నారు ఎప్పటికీ అండగా ఉంటామన్నారు... జగన్ మాటకు చేతకు పొంతన ఉండదుగా... ఏదో మొక్కుబడిగా సాయం చేశారు. -
‘ప్రభుత్వానికి భజన చేస్తూ.. కొన్ని సంఘాలు దిగజారాయి’
ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు అంశాలకు పరిష్కారం లభించకపోయినా.. ఒకటో తేదీన వేతనాలు, పింఛన్లు రాకపోయినా కొన్ని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి ఆహా, ఓహో అంటూ భజన చేస్తూ దిగజారిపోయాయని ఏపీ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ మండిపడ్డారు. -
కంట్రోల్లోనే ఉన్నాం.. చెప్పినట్లు సమావేశాలు పెడుతున్నాం
సకల శాఖ మంత్రిగా ప్రచారంలో ఉన్న ఓ ప్రభుత్వ సలహాదారు కళ్లలో ఆనందం చూసేందుకు ఏపీ ఎన్జీఓ సంఘం నాయకులు తహతహలాడుతున్నారు. -
విశాఖ తీరానికి విలాసవంతమైన నౌక
ప్రఖ్యాత అంతర్జాతీయ క్రూయిజ్ నౌక ‘ది వరల్డ్’ ఆదివారం విశాఖ పోర్టుకు చేరుకుంది. పోర్టు అధికారులు నౌకలో వచ్చిన వారికి ఘన స్వాగతం పలికారు. -
ఆలయం నుంచి బయటకెళ్లు.. దళిత సర్పంచిని అవమానించిన వైకాపా నాయకులు
నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండలం పారుమంచాల గ్రామంలోని రామాలయానికి వెళ్లిన తనను వైకాపా నాయకులు లోకేశ్వరరెడ్డి, జగదీశ్వరరెడ్డిలు అవమానించారంటూ అదే పార్టీకి చెందిన గ్రామ దళిత సర్పంచి మాధవరం ప్రకాశం ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
జవహర్రెడ్డి జగన్నాటకం
ఒక ఎత్తు కాకపోతే మరో ఎత్తు. ఒక వ్యూహం కాకపోతే మరో వ్యూహం. ఏది అమలుచేసినా అంతిమంగా వైకాపాకు మేలు చేయడమే లక్ష్యం. -
మే 1న బ్యాంకు ఖాతాల్లో పింఛను జమ
వచ్చేనెల సామాజిక పింఛన్ల సొమ్మును మే 1న లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తీవ్ర అనారోగ్యం, అస్వస్థత, నడవలేని స్థితిలో ఉన్నవారు, మంచం పట్టినవారు, వీల్ ఛైర్లో ఉన్నవారు, దివ్యాంగులు, సైనిక పింఛన్లు తీసుకునే వారికి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఇళ్ల దగ్గరే అందించనున్నారు. -
వారికి నో.. వీరికి ఎస్
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథరెడ్డిలు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని.. వారు ఆ పోస్టుల్లో కొనసాగితే రాష్ట్రంలో ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరగవని.. వారిని తక్షణం బదిలీ చేయాలని విపక్ష పార్టీలన్నీ నెత్తీనోరూ కొట్టుకుంటున్నా.. ఈసీ పట్టించుకోలేదు. -
రూ.3000,00,00,000.. మూడేళ్లలో ఇసుకలో చేసిన లూటీ ఇది
జగన్ ప్రభుత్వం రాగానే ఉచిత ఇసుక విధానం రద్దుచేసి.. తొలుత ప్రభుత్వరంగ సంస్థకు ఇసుక వ్యాపారం అప్పగించింది. అది విఫలమైందని సాకుచూపించి.. బినామీలను గుత్తేదారులుగా రంగంలోకి దింపింది. -
పోలా.. ‘పరువు పోలా!’
‘రోడ్లు ఇట్లా ఉంటే మీ ప్రభుత్వానికే ఓట్లు పడవు. మీరు మరమ్మతులు చేయిస్తారా? లేకుంటే మా రాష్ట్ర నిధులతో మమ్మల్నే ప్యాచ్ వర్క్ చేయించమంటారా?’ -
సుందరనాయుడి సేవలు నిరుపమానం
అందరూ ఆప్యాయంగా చిత్తూరు పెద్దాయన అని పిలుచుకునే.. కోళ్ల పరిశ్రమ పితామహుడు దివంగత డాక్టర్ ఉప్పలపాటి సుందరనాయుడి సేవలు చిరస్మరణీయమని కోళ్ల రైతులు పేర్కొన్నారు. -
ఉత్తీర్ణత పెంచడం ఓట్ల కోసమేనా?
పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తీర్ణత పెంచడం, మార్కులు అధికంగా వేయడం తల్లిదండ్రుల ఓట్ల కోసమేనా అని సామాజిక వేత్త గుంటుపల్లి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో ప్రశ్నించారు. -
కొండల్ని మింగి.. గోతులు మిగిల్చారు!
విజయవాడ సమీపం జక్కంపూడి, కొత్తూరు తాడేపల్లి, కొండపావులూరు పరిసరాల్లో కొండ ప్రాంతాల్లో విచ్చలవిడిగా తవ్వేశారు. -
వైకాపా బాణసంచా పేల్చడంతో అగ్ని ప్రమాదం
వైకాపా ఎన్నికల ప్రచారంలో భారీగా బాణసంచా కాల్చడంతో అగ్నిప్రమాదం సంభవించి జామాయిల్ తోటలు, పశువుల మేత, మోటార్లు కాలిపోయాయి. -
ఉపాధి లేదు.. ఉద్యోగం అడగొద్దు
రాష్ట్రంలో చదువుకుని, లక్షల సంఖ్యలో ఉన్న నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలన్న ఆలోచన లేదు! ఉపాధి అవకాశాల్లేక యువత ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు తరలిపోతుంటే.. ఆంధ్రప్రదేశ్ వృద్ధుల రాష్ట్రంగా మిగిలిపోతోందన్న బాధ లేదు! -
నామినేషన్ ర్యాలీకి వెళ్లలేదని గ్రామానికి నీటి సరఫరా నిలిపివేత
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్ నామినేషన్ ర్యాలీకి వెళ్లలేదని ఓ గిరిజన గ్రామానికి నీటి సరఫరా నిలిపివేసిన దారుణ ఉదంతమిది. -
మాటల ఏలిక.. మీటలో మెలిక!
అక్కచెల్లెమ్మలకు మంచి జరగాలనే ఆలోచనతో వారికి వ్యాపార అవకాశాలను కల్పించాలని నిర్ణయించాం. హిందుస్థాన్ లీవర్, పీఅండ్జీ, ఐటీసీ, రిలయన్స్, అమూల్ సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. -
గురుదక్షిణగా కారు.. అందజేసిన లేపాక్షి నవోదయ పూర్వవిద్యార్థులు
జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకునేలా స్ఫూర్తి నింపిన గురువుకు శిష్యులు రూ.12లక్షల విలువైన కారును బహుమతిగా అందజేశారు. -
దండుకో.. వాటాలు పంచుకో!
జగన్ పాలనలో దోచుకున్నోళ్లకు దోచుకున్నంత.. అన్న విధంగా వైకాపా నాయకులు, కొందరు ఐఏఎస్ అధికారులు చెలరేగిపోతున్నారు. -
రోగుల సమాచారం మీకెందుకు?
వైద్యం కోసం ఆసుపత్రులకు వెళ్లే రోగుల సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సేకరిస్తోందని, అలా ఎందుకు తీసుకుంటుందో చెప్పాలని భారత వైద్య మండలి(ఐఎంఏ) జాతీయ అధ్యక్షుడు డా.ఆర్వీ.అశోకన్ ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
కడప కార్పొరేటర్లపై వైకాపాకు అనుమానాలు!
-
పది బంతుల్లోనే 50 TO 100.. వారి వల్లే ఇది సాధ్యం: విల్ జాక్స్
-
రంగంలోకి బైడెన్.. గాజాలోకి మరింత సాయానికి ఇజ్రాయెల్ అనుమతి
-
యూపీఎస్సీ ఫలితాల్లో టీ మాస్టర్ కుమారుడి సత్తా
-
డబ్బన్నావ్.. డబ్బాకొట్టుకున్నావ్!!
-
‘ప్రభుత్వానికి భజన చేస్తూ.. కొన్ని సంఘాలు దిగజారాయి’