ఆక్రమించి నిర్మిస్తాం.. అడ్డుకుంటే అంతు చూస్తాం!
తిరుపతి నగరంతోపాటు చుట్టుపక్కల హథీరామ్జీ మఠానికి వందల ఎకరాల భూములు ఉండగా.. ఇప్పుడు వీటిలో పదుల ఎకరాలు కూడా మిగల్లేదు.
హథీరామ్జీ మఠం భూముల్లో దర్జాగా నిర్మాణాలు
హైకోర్టు స్టేటస్కో ఇచ్చినా ఆగని విల్లాల నిర్మాణం
ఫొటోలు తీయడానికి వెళ్లిన మఠం ఉద్యోగులపై దాడి
పోలీసులకు ఫిర్యాదు చేస్తే అంతుచూస్తామంటూ హెచ్చరికలు
వైకాపా అంటే ‘చెవి’కోసుకునే నేతదే అక్కడ హవా
ఈనాడు-అమరావతి: తిరుపతి నగరంతోపాటు చుట్టుపక్కల హథీరామ్జీ మఠానికి వందల ఎకరాల భూములు ఉండగా.. ఇప్పుడు వీటిలో పదుల ఎకరాలు కూడా మిగల్లేదు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైకాపా నేతలు రెట్టించిన ఉత్సాహంతో ఈ భూములను ఆక్రమిస్తున్నారు. అధికార పార్టీ అంటే ‘చెవి’ కోసుకుంటా అనేలా హడావుడి చేసే ఓ కీలక నేత ఆధ్వర్యంలో తిరుపతి అవిలాల ప్రాంతంలో మఠం భూముల ఆక్రమణ తారస్థాయికి చేరింది. తాజాగా హైకోర్టులో స్టేటస్కో ఉన్నప్పటికీ మఠం భూముల్లో నిర్మాణాలు నిరాటంకంగా సాగుతున్న వైనాన్ని ఫొటోలు తీసేందుకు వెళ్లిన మఠం ఉద్యోగులపై.. ‘చెవి’కోసుకునే నేత అనుయాయులు దాడి చేసి చితక్కొట్టారు. చంపుతామంటూ బెదిరించారు. అయినా సరే దేవాదాయశాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
తిరుపతి గ్రామీణ మండలంలోని అవిలాల పరిధిలో దాదాపు 200 ఎకరాలకు పైనే హథీరామ్జీ మఠం భూములున్నాయి. వీటిని సాగు పేరిట లీజు తీసుకున్నట్లు చూపించి, భారీ భవంతులు, విల్లాలు నిర్మించేస్తున్నారు. గత ఏడాది వరకు మఠం బాధ్యతలు చూసిన మహంతు అర్జున్దాస్ వీటిని అడ్డుకునే ప్రయత్నాలేవీ చేయలేదు. ముఖ్యంగా అధికార పార్టీలో కీలక నేత ఆధ్వర్యంలో ఈ మఠం భూముల్లో దందా సాగింది. ఎందరో వైకాపా నేతలు వీటిలో పాగావేసి సొంతం చేసుకునేలా చూశారు. ఇదే భూముల్లో ముగ్గురు డీఎస్పీలు, నలుగురు సీఐలకు ఆ కీలక నేత విల్లాలు కట్టించి ఇచ్చారనే ఆరోపణలున్నాయి. తాజాగా ఎంఆర్పల్లి పోలీస్స్టేషన్ ఎదురుగా సర్వే నంబరు 242/బిలో హథీరామ్జీ మఠానికి చెందిన 9.89 ఎకరాల్లో ఇద్దరు వేర్వేరుగా సాగు చేసుకునేందుకు లీజు తీసుకున్నారు. దీనిపై అభ్యంతరాలు ఉన్నప్పటికీ కోర్టు ద్వారానే ఆ లీజులు ఆదేశాలు రప్పించుకొని, ఎకరాకు ఏటా రూ.2 వేల చొప్పున చెల్లించేందుకు అంగీకరించారు. అయితే వాటిలో భవంతులు నిర్మిస్తున్నారు. ఇందులో 5.73 ఎకరాల్లో ఇద్దరు సోదరులు విల్లాలు నిర్మిస్తుండటంపై గత నెల మొదటి వారంలో మఠం అధికారులు ఆక్రమణ తొలగింపు నోటీసు (దేవాదాయశాఖ సెక్షన్ 83 నోటీసు) జారీచేశారు. దీనిపై నిర్మాణాలు చేస్తున్న లీజుదారులు హైకోర్టును ఆశ్రయించగా, మఠం అధికారులు అక్కడి నిర్మాణాల ఫొటోలను కోర్టు ముందు ఆధారాలుగా చూపారు. దీంతో యథాతథ స్థితి కొనసాగించాలంటూ హైకోర్టు ఆదేశించింది.
ఉద్యోగులపై దాడి.. చంపుతామంటూ హెచ్చరిక
కోర్టు ఆదేశాలున్నప్పటికీ ఆ భూముల్లో నిర్మాణాలు మాత్రం ఆపలేదు. దీంతో ప్రస్తుత పరిస్థితిపై ఫొటోలు తీసుకురావాలంటూ ఇద్దరు మఠం ఉద్యోగులను అధికారులు సోమవారం పంపారు. ఫొటోలు తీస్తున్న ఆ ఇద్దరు ఉద్యోగులను కీలక నేత అనుయాయులు ఓ గదిలో బంధించి చితక్కొట్టినట్లు తెలిసింది. చివరగా వారి చేతిలో డబ్బులు ఉంచి, ఫొటోలు తీసినట్లు సమాచారం. ఎవరికైనా ఫిర్యాదు చేసినా, మీడియాకు ఇదంతా చెప్పినా.. డబ్బులు డిమాండ్ చేశారంటూ ఏసీబీకీ పట్టిస్తామని, బయటకు ఇదంతా తెలిస్తే మీ అంతు చూస్తామని తీవ్రస్థాయిలో హెచ్చరించినట్లు తెలిసింది. ఎంఆర్పల్లి పోలీస్స్టేషన్ ఎదురుగా ఉన్న భూమిలోనే ఇదంతా జరిగినా.. ఇప్పటి వరకు మఠం అధికారులుగానీ, దేవాదాయశాఖ ఉన్నతాధికారులు గానీ పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం విస్మయం కలిగిస్తోంది. ఆ ఉద్యోగులు ఇద్దరూ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చేందుకు భయపడుతున్నట్లు తెలిసింది. ఈ విషయం దేవాదాయశాఖ కమిషనర్కు కూడా తెలిసిందని సమాచారం. అయితే ‘ముఖ్య’నేతకు అత్యంత సన్నిహితుడైన కీలక నేత దీనివెనుక ఉండటంతోపాటు, అదే ప్రాంతంలో ఇద్దరు పోలీసు అధికారులు నిర్మించుకున్న భవంతులు కూడా ఉండటంతో.. దేవాదాయశాఖ అధికారులు మౌనంగా ఉన్నారనే విమర్శలు వస్తున్నాయి.
నిషేధిత జాబితాలో ఉన్నా.. అడ్డుకోలేరు
హథీరామ్జీ మఠానికి అవిలాల, తుమ్మలకుంట, చింతలక్ష్మీ కాలనీ.. తదితర అనేక ప్రాంతాల్లో ఉన్న భూములు ఆక్రమణలకు గురయ్యాయి. ముఖ్యంగా అవిలాలలో ఎక్కువగా రాజకీయ నేతలు, ఎర్రచందనం స్మగ్లర్లు, పోలీసుశాఖలో అధికారులు, ప్రముఖులు దర్జాగా భారీ భవంతులు, విల్లాలు నిర్మించుకున్నారు. గత ఏడాది మఠం మహంతును ప్రభుత్వం తొలగించి, ఓ డిప్యూటీ కలెక్టర్ను ఫిట్ పర్సన్గా నియమించింది. ఆ తర్వాత మఠం సిబ్బంది ఏదైనా ఆక్రమణల జోలికి వెళితే.. ముందుగా అవిలాలలో బడాబాబుల భవంతులను కూల్చిన తర్వాత మా దగ్గరకు రండని ఆక్రమణదారులు ఎదురుతిరుగుతున్నారు. అయితే అవిలాలలో ఆక్రమణలు, నిర్మాణాల వెనుక కీలక నేత, ఆయన సోదరుడు ఉండటంతో అధికారులు వాటి జోలికివెళ్లే సాహసం చేయడం లేదు. గతంలో ఉన్న మఠం మహంతు నిర్లక్ష్యం, కోర్టులో సకాలంలో అప్పీళ్లకు వెళ్లపోవడం కారణంగా వివిధ సర్వే నంబర్లలో 174.75 ఎకరాలు వ్యవసాయ భూమి నుంచి వ్యవసాయేతర భూమిగా మార్చి, ఇళ్లు నిర్మించుకునే అవకాశం ఏర్పడింది. ఈ భూములన్నీ నిషేధిత భూముల జాబితా (22ఎ)లో ఉన్నాయి. వీటి రిజిస్ట్రేషన్, క్రయవిక్రయాలకు అవకాశం లేదు. అయినాసరే స్టాంప్ పేపర్లపై అగ్రిమెంట్ల ద్వారా దందా సాగిపోతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
15 శాతం స్థానికేతర కోటా యథాతథం
కొత్త విద్యాసంవత్సరం(2024-25)లో రాష్ట్రంలో ఇంజినీరింగ్ తదితర వివిధ ఉన్నత విద్య కోర్సుల్లో గతంలో మాదిరిగానే ప్రవేశాలు నిర్వహించనున్నారు. -
భయపెడుతున్న ఏపీ రెవెన్యూ, ద్రవ్యలోటు
రెవెన్యూ ఖర్చుల నియంత్రణ, అప్పుల నియంత్రణపైనే రాష్ట్ర ఆర్థిక నిర్వహణ ఆధారపడి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఎప్పటికప్పుడు రెవెన్యూ లోటు పెరిగిపోతూ ఉంది. ఎఫ్ఆర్బీఎం నిబంధనల ప్రకారం రెవెన్యూ లోటు లేకుండా చూడాలి. -
రూ.లక్షల్లో జీతాలు.. ఫలితాలు అంతంతమాత్రమా?
‘రూ.లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారు.. ఫలితాలు మాత్రం అంతంతమాత్రంగానే ఉన్నాయి.. ఇలాగైతే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉద్యోగాలు ఎలా వస్తాయి..’ అని ఉపాధ్యాయులు, విద్యా శాఖ అధికారులను పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ప్రకాశ్ ప్రశ్నించారు. -
చాట్ జీపీటీ కంటే మెరుగైన తెలుగు సాఫ్ట్వేర్ తీసుకొస్తాం
చాట్ జీపీటీ కంటే మెరుగ్గా తెలుగులో సరికొత్త సాఫ్ట్వేర్ తీసుకొచ్చేందుకు కృషిచేస్తున్నట్లు స్వేచ్ఛ సంస్థ వ్యవస్థాపకులు వై.కిరణ్చంద్ర తెలిపారు. -
ఏం చెప్పినా.. తందానతాన!
కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర కీలక స్థానాల్లో అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నవారిని ఏరికోరి నియమించిందీ ఆయనే..! కొన్ని జిల్లాల్లో వివాదాస్పద అధికారులున్నారని, వారు ఎన్నికల వేళ అధికార పార్టీతో అంటకాగుతున్నారన్న విపక్షాల ఫిర్యాదుల్ని పట్టించుకోకుండా చోద్యం చూసిందీ ఆయనే..! తీరా ఎన్నికల సంఘం కన్నెర్ర చేస్తే.. -
పల్నాడు కలెక్టర్గా శ్రీకేష్ బాలాజీ లఠ్కర్
రాష్ట్రంలోని మూడు జిల్లాలకు కొత్త ఎస్పీలను, ఒక జిల్లాకు కలెక్టర్ను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. పల్నాడు జిల్లా కలెక్టర్గా శ్రీకేష్ బాలాజీరావు లఠ్కర్, ఎస్పీగా మలికా గార్గ్, అనంతపురం ఎస్పీగా గౌతమి శాలి, తిరుపతి ఎస్పీగా వి.హర్షవర్ధన్ రాజును నియమించింది. -
ప్రవాస వైద్యుడిపై పోలీసుల దాష్టీకం
జగన్ ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్నందుకు ఏపీ పోలీసులు కక్షగట్టి తనను కొట్టడంతోపాటు అమానుషంగా ప్రవర్తించారని అమెరికా పౌరుడైన గుంటూరు జిల్లా వెంకటాపురానికి చెందిన డాక్టర్ ఉయ్యూరు లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. -
తెలంగాణ ఎప్సెట్లో ఏపీ విద్యార్థుల విజయదుందుభి
తెలంగాణ ఎప్సెట్-2024లో ఏపీ విద్యార్థులు సత్తా చాటారు. ఎప్సెట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల ర్యాంకులను శనివారం ఆ రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య ఆర్.లింబాద్రి తదితరులు విడుదల చేశారు. -
రాజేంద్రనాథరెడ్డి సిబ్బందే సిట్ సభ్యులు!
ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ రోజున, ఆ తర్వాత చెలరేగిన హింసాకాండకు పూర్వ డీజీపీ, ప్రస్తుత ఏసీబీ డీజీ కేవీ రాజేంద్రనాథరెడ్డి నియమించిన అధికారులే కారణమని ఓ వైపు విమర్శలు వ్యక్తమవుతుంటే.. మళ్లీ ఆయన ఆధ్వర్యంలో పనిచేస్తున్న సిబ్బందినే సిట్లో నియమించడమేంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. -
ఎప్సెట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ వారంలో..
తెలంగాణ ఎప్సెట్ ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ కాలపట్టికను వారం రోజుల్లో విడుదల చేస్తామని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
ఈఏపీసెట్ ఇంజినీరింగ్ విభాగ పరీక్షలు ప్రారంభం
ఏపీఈఏపీసెట్-2024 ఇంజినీరింగ్ విభాగ పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఉదయం సెషన్ ఒకటే నిర్వహించినట్లు సెట్ ఛైర్మన్, జేఎన్టీయూకే వీసీ జీవీఆర్ ప్రసాదరాజు, కన్వీనర్ కె.వెంకటరెడ్డి తెలిపారు. -
ఆరు వారాల్లో తేల్చండి.. ఏపీ చెస్ అసోసియేషన్కు గుర్తింపుపై హైకోర్టు ఆగ్రహం
ఏపీ చెస్ అసోసియేషన్కు అనుబంధ గుర్తింపు ఇచ్చే వ్యవహారంలో జాతీయ క్రీడల కోడ్ నిబంధనలకు లోబడి తగిన ఉత్తర్వులు జారీచేయాలని అఖిల భారత చదరంగ సమాఖ్య కార్యదర్శిని.. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ఫొటోతో నకిలీ వాట్సప్ కాల్స్
ఆర్టీసీ ఎండీ సిహెచ్.ద్వారకా తిరుమలరావు ఫొటోను వాట్సప్ డీపీగా పెట్టి.. ఆయనే ఫోన్ చేస్తున్నట్లుగా 70334 00216 నంబరుతో పలువురికి వాట్సప్ కాల్స్ చేసి బురిడీ కొట్టించేందుకు సైబర్ నేరగాళ్లు యత్నించారు. -
‘ప్రమాదాలు ఆందోళనకరం..’ పట్టించుకోని అధికారగణం!
రాష్ట్రంలో వరస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వాహనాలు నడిపే వారి నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణలోపం ఫలితంగా వందల మంది ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఐదు రోజుల కిందట చిలకలూరిపేట వద్ద ప్రైవేటు బస్సు లారీని ఢీకొట్టడంతో మంటలు ఎగిసి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. -
స్ట్రాంగ్రూమ్ కారిడార్లోకి వర్షపు నీరు
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం జూపూడి నిమ్రా కళాశాలలో ఏర్పాటుచేసిన ఈవీఎంల స్ట్రాంగ్రూమ్ కారిడార్లోకి వర్షపు నీరు చేరుతుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. -
స్ట్రాంగ్రూమ్ల వద్ద పకడ్బందీ భద్రత ఉండాలి
ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్రూమ్ల వద్ద అన్ని రకాల భద్రతా ప్రమాణాలు పాటించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా ఆదేశించారు. -
24లోగా రబీ పంట నష్టాన్ని లెక్కించండి
రబీ కరవు ప్రభావిత ప్రాంతాల్లో ఈ నెల 24 లోగా పంటనష్టం గణన పూర్తి చేయాలని వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్ హరికిరణ్ ఆదేశించారు. రాజకీయ లబ్ధికి తావులేకుండా నష్టాన్ని లెక్కించాలని ఎన్నికల సంఘం ఆదేశించిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఆ మేరకు చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారులకు సూచించారు. -
ఏబీ వెంకటేశ్వరరావుకు మద్దతుగా సంతకాల సేకరణ
జగన్ ప్రభుత్వ కక్షపూరిత చర్యలకు బలైపోయిన డీజీ ర్యాంకు సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు పౌర సమాజం నుంచి విశేష మద్దతు లభిస్తోంది. ఆయనకు న్యాయం చేయాలంటూ రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేస్తూ ‘ఛేంజ్.ఓఆర్జీ’లో వేల మంది సంతకాలు చేస్తున్నారు. -
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సర్వదర్శనానికి క్యూలైన్లో వచ్చిన భక్తులకు 24 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనం టైమ్స్లాట్ టోకెన్లు లేని భక్తులు శనివారం వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోని కంపార్ట్మెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయి ఔటర్రింగ్ రోడ్డు, శిలాతోరణం వరకు వేచి ఉన్నారు. -
ఉన్నత విద్యామండలి ఛైర్మన్పై గవర్నర్కు ఫిర్యాదు
ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డిపై గవర్నర్కు ఇద్దరు వ్యక్తులు వేర్వేరుగా ఫిర్యాదు చేయగా.. చర్యల కోసం వాటిని ఉన్నత విద్యాశాఖకు పంపించారు. -
కోడ్ ఉల్లంఘన ఆరోపణలతో ఏయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ సస్పెన్షన్
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారనే ఆరోపణలతో ఆంధ్ర విశ్వవిద్యాలయం కంప్యూటర్ సైన్స్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.జి.లావణ్య దేవిని సస్పెండ్ చేస్తూ రిజిస్ట్రార్ ఆదేశాలు జారీ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
యాదాద్రి క్షేత్రానికి పోటెత్తిన భక్తులు.. ఉచిత దర్శనానికి 3 గంటల సమయం
-
మలుపు తిప్పిన రనౌట్.. డుప్లీ సూపర్ క్యాచ్.. యశ్ లాస్ట్ ఓవర్ వీడియోలు వైరల్!
-
నరసరావుపేటలో ‘సిట్’ దర్యాప్తు.. హింసాత్మక ఘటనలపై ఆరా
-
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో మంటలు.. బెంగళూరులో ఎమర్జెన్సీ ల్యాండింగ్
-
15 శాతం స్థానికేతర కోటా యథాతథం
-
ట్రంప్నకు జాతీయ రైఫిల్ అసోసియేషన్ మద్దతు..!