ఐప్యాక్ డైరెక్షన్లో.. జగన్ ప్రాయోజిత భజన
జగన్ భజన పరాకాష్ఠకు చేరింది. ఎంతగా అంటే.. తమకు కుమారులు, కోడళ్లూ అవసరం లేదని, జగన్ ఉంటే చాలని సదస్సులకు హాజరైన వారితో చెప్పించారు. కొందరిని ఎంపిక చేసి.. వారు ఏం మాట్లాడాలో, ఎంతవరకు మాట్లాడాలో కూడా ఎప్పటికప్పుడు ఐప్యాక్ ద్వారా శిక్షణ ఇప్పించారు.
కరోనా సమయంలో మాంసం ఇచ్చారట.. నెహ్రూ కంటే జగన్ గొప్పవారట
కన్నబిడ్డలు, కోడళ్లూ అవసరం లేదట.. జగన్ ఉంటే చాలట
వారించకుండా చిక్కటి చిరునవ్వుతో మురిసిపోయిన సీఎం
తనపై పొగడ్తలు.. చంద్రబాబుపై దూషణలు, శాపనార్థాలు
ఏం మాట్లాడాలో.. ఎలా మాట్లాడాలో అంతా ప్రత్యేక శిక్షణ
‘పింఛనుదారులతో సీఎం ముఖాముఖి’ అసలు రంగు ఇదీ
ఈనాడు, అమరావతి: జగన్ భజన పరాకాష్ఠకు చేరింది. ఎంతగా అంటే.. తమకు కుమారులు, కోడళ్లూ అవసరం లేదని, జగన్ ఉంటే చాలని సదస్సులకు హాజరైన వారితో చెప్పించారు. కొందరిని ఎంపిక చేసి.. వారు ఏం మాట్లాడాలో, ఎంతవరకు మాట్లాడాలో కూడా ఎప్పటికప్పుడు ఐప్యాక్ ద్వారా శిక్షణ ఇప్పించారు. ఎక్కడైనా పదాలు మర్చిపోయినా, తడబడినా.. ఆ సంస్థ ప్రతినిధులు పక్కనే ఉండి మాటలు అందించారు. జగన్ను ఆకాశానికి ఎత్తేస్తూ పొగడ్తల్లో ముంచేశారు.. చంద్రబాబుపై దూషణలు, శాపనార్థాలతో విరుచుకు పడ్డారు. ‘పింఛనుదారులతో సీఎం ముఖాముఖి’ అంటూ ప్రకాశం జిల్లా వెంకటాచలంపల్లిలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో జరిగిందిదే. ఇప్పటి వరకు ‘మేమంతా సిద్ధం’ పేరుతో నిర్వహించిన సభల్లో ప్రతిపక్ష నేతను హంతకుడని విమర్శిస్తూ జగన్ మాట్లాడారు. దీనిపై వివరణ ఇవ్వాలంటూ ఎన్నికల సంఘం ఆదివారం ఆయనకు నోటీసు కూడా ఇచ్చింది.
దీంతో ఈ సదస్సులో ఎంపిక చేసిన వారితో చంద్రబాబుపై దూషణలు చేయిస్తూ.. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వేడుక చూశారు. ‘చంద్రబాబు మట్టికొట్టుకుని పోతారు..’, ‘ఎక్కువ రోజులు బతకరు, మామలాగే ఆయనా పోతారు’, ‘మా ఉసురు తగులుతుంది’ అంటూ శాపనార్థాలు పెడుతుంటే జగన్ ఉబ్బితబ్బిబ్బయ్యారు. వాలంటీర్లంతా దేవునిదూతలుగా మీ రూపంలో వచ్చి పింఛను ఇచ్చారంటూ కొందరు ఆకాశానికి ఎత్తేసేలా మాట్లాడుతుంటే పొంగిపోయారు. చాలా బాగా మాట్లాడారంటూ వారందరినీ జగన్ ప్రశంసించారు. ప్రతిపక్ష నేతను దూషిస్తుంటే వారించాల్సిన బాధ్యత సీఎంకు లేదా? ఇదేం రాజకీయం? అనే ప్రశ్నలు వైకాపా నేతల్లోనే విన్పించాయి. సదస్సుకు హాజరైన వారిలో కొందరు జగన్తో మాట్లాడుతూ తాము వైకాపా అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్రెడ్డికి బంధువులమని చెప్పడం గమనార్హం. నాలుగున్నరేళ్లుగా వైకాపాలో పనిచేస్తున్న వారికి తీవ్ర అన్యాయం జరిగిందని కొందరు సీఎంకు వివరించే ప్రయత్నం చేసినా.. ఆయన పట్టించుకోలేదు.
‘మీ బిడ్డ అబద్ధాలు చెప్పలేడు. మోసాలు చేయలేడు’ అంటూ జగన్ విధేయత ఒలికించారు. ‘పథకాలకు సంవత్సరానికి రూ.70వేల కోట్లు ఇవ్వడం జగన్కే చాలా కష్టంగా ఉంటే.. రూ.1.40లక్షల కోట్లు ఇస్తామని చంద్రబాబు సునాయాసంగా చెబుతుంటే అర్థం ఏమిటి? అందర్నీ మోసం చేయడానికే కదా?’ అంటూ నమ్మించే ప్రయత్నం చేశారు. మద్య నిషేధం చేశాకే వచ్చి ఓట్లడుగుతానన్న హామీ సంగతేంటి? ఇది మోసం చేయడం కాదా? వాలంటీరు వ్యవస్థ రద్దు కాకున్నా.. రద్దు చేశారని, మళ్లీ వస్తే తొలి సంతకం చేస్తానని చెప్పడం అబద్ధం కాదా? అడుగడుగునా.. అబద్ధాలు, మోసాలతోనే సిద్ధం యాత్ర సాగుతుందనే సంగతి సామాన్యుడికి సైతం అర్థమైంది. అందుకే ప్రకాశం జిల్లాలో ఆది, సోమవారాల్లో జరిగిన యాత్ర వెలవెలబోయింది.
కరోనా సమయంలో ఇంటింటికి మాంసం పంపారట
‘కరోనా సమయంలో జగన్మోహన్రెడ్డి మాంసంతో సహా అన్నీ గడప గడపకు పంపారట..’ జగన్ ప్రాయోజిత పింఛనుదారుల ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న ఒక మహిళ చెప్పిన విషయం ఇది. చంద్రబాబును తీవ్ర పదజాలంతో దూషిస్తూ తన ప్రసంగం ప్రారంభించిన ఆమె.. తర్వాత జగన్ను ఆకాశానికి ఎత్తేశారు. వైకాపా తరఫున పోటీ చేస్తున్న బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, ఆయన తల్లి వెంకాయమ్మ తమ ఇళ్లకు వచ్చి వంట చేసుకుంటున్నామో లేదో కూడా చూస్తున్నారని చెప్పారు. ‘వాలంటీరు వ్యవస్థ కావాలి.. తీసేస్తే ఒప్పుకోం. నా కన్నబిడ్డ కూడా కూడు పెట్టడం లేదు’ అని పేర్కొన్నారు. తనకు మాట్లాడటం రాదని, చదువులేదని చెప్పారు. మరికొందరు తమకు కుమారులు, కోడళ్లు కూడా అవసరం లేదని జగన్ ఉంటే చాలంటూ భజన చేశారు.
నెహ్రూ కంటే జగనే గొప్పవారట..
‘నెహ్రూ ప్రభుత్వం ఉన్నప్పుడు.. భూపేష్ గుప్తా, డాంగే, చండ్ర రాజేశ్వరరావు తదితర నలుగురు మేధావులు ప్రతిపక్షంలో ఉండేవారు. వారు ఆలోచించుకుని పది, పన్నెండు అడిగితే అందులో నెహ్రూ ఒకటి, రెండు పథకాలే చేసేవారు. జగన్ సొంతంగా వంద సంక్షేమ పథకాలు ప్రకటించి 98 చేశారు. అప్పట్లో నలుగురు మేధావులు కలిసి ఆలోచించి అడిగేవారు. ఇప్పుడు జగన్కు ఎవరు చెప్పారు? అన్నీ ఆయన బంగారపు మెదడు నుంచి వచ్చిన ఆలోచనలే.. ఇలాంటి మేధావి ముఖ్యమంత్రిగా ఉండటం మా అదృష్టం’ అని వృద్ధుడు ఒకరు చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పల్నాడులో సాఫ్ట్వేర్ ఉద్యోగికి బేడీలు.. కుటుంబసభ్యులు, నాయకుల అభ్యంతరం
ఎన్నికల అనంతరం జరిగిన ఘర్షణల్లో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని, రైతును అరెస్టుచేసిన పోలీసులు.. వైద్యపరీక్షల కోసం వారికి బేడీలు తొడిగి ఆసుపత్రికి తీసుకెళ్లాలనుకోవడం వివాదాస్పదంగా మారింది. -
గుంటూరు పశ్చిమలో.. పోస్టల్ బ్యాలట్ బాక్సులకు సీలు వేయని అధికారులు
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పోస్టల్ బ్యాలట్ బాక్సుల విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై తెదేపా నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. -
అంతా మెతక వైఖరే
వందల మంది వైకాపా వర్గీయులు రాళ్లు, మారణాయుధాలతో దాడులకు తెగబడితే హత్యాయత్నం సెక్షన్లే పెట్టలేదు. అధికారపార్టీ నాయకులే పోలింగ్ కేంద్రాల్లోకి చొరబడి ఈవీఎంలు ధ్వంసం చేస్తే ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్లు వర్తింపజేయలేదు. -
అంతరిక్ష యాత్రికుడు బెజవాడ బిడ్డే
భారతదేశ తొలి స్పేస్ టూరిస్టు గోపీచంద్ తోటకూరకు విజయవాడతో విడదీయలేని బంధం ఉంది. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్కు చెందిన బ్లూ ఆరిజన్ సంస్థ రూపొందించిన న్యూ షెపర్డ్-25 వ్యోమనౌకలో ఆయన ఇటీవల అంతరిక్షంలోకి వెళ్లి వచ్చిన విషయం తెలిసిందే. -
రెవెన్యూ రికార్డుల్లో ఇష్టానుసారం మార్పులేంటి?
భూ యజమానులకు తెలియకుండా, నోటీసిచ్చి వారి వాదనలు వినకుండా అధికారులు రెవెన్యూ రికార్డుల్లో పేర్లను మార్చడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. -
ఏపీకి తుపాను ముప్పు లేనట్లే..!
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం తుపానుగా బలపడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. -
సోషల్ ట్రోలింగ్.. లైట్ తీసుకుందాం!
అసలే చదువుల ఒత్తిళ్లు. ఉరుకులు పరుగులు. ఇతరులతో సమానంగా ఎదగాలనే ఆశతో ఎన్నో ఇబ్బందులు పడుతూ చదువుకుంటూ ఉంటారు. -
శ్రీవారి వీఐపీ బ్రేక్ టికెట్ల జారీ పునఃప్రారంభం
ఎన్నికల కోడ్ అమలుతో గత నెల నుంచి ఆగిపోయిన వీఐపీ బ్రేక్ దర్శన టికెట్ల సిఫార్సు లేఖలను సోమవారం నుంచి అనుమతిస్తున్నారు. -
ఏపీలో రేపటి నుంచి ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేత
ఆరోగ్యశ్రీ కింద రోగులకు అందించిన చికిత్స బిల్లులను ప్రభుత్వం చెల్లించట్లేదని ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ (ఆశా) సోమవారం వెల్లడించింది. -
24 నుంచి ‘పది’ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
రాష్ట్రంలో ఈ నెల 24 నుంచి జూన్ 3 వరకు నిర్వహించనున్న పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు 1,61,877 మంది హాజరుకానున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు దేవానందరెడ్డి తెలిపారు. -
ఏపీసీపీఎస్ఈఏ నూతన కార్యవర్గం ఎన్నిక
ఏపీ కాంట్రిబ్యూటరీ పెన్షన్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏపీసీపీఎస్ఈఏ) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా పఠాన్ బాజీ, కరిమి రాజేశ్వరరావు ఎన్నికయ్యారు. -
గులకరాయి కేసు.. నిందితుడి బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా
సీఎం జగన్పై జరిగిన గులకరాయి దాడి ఘటనలో నిందితుడు సతీష్కుమార్ బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. -
జూ.ఎన్టీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన లోకేశ్
జూనియర్ ఎన్టీఆర్కు తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. -
కాలిఫోర్నియా కోర్టు జడ్జిగా తెలుగు మహిళ
కాలిఫోర్నియాలోని శాక్రమెంటో సుపీరియర్ కోర్టు జడ్జిగా తెలుగు మహిళ జయ బాడిగ నియమితులయ్యారు. -
పోలీసులు అమాయకులను బలిచేశారు
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో పోలీసులు సుధాకర్రెడ్డి, హరికృష్ణను అన్యాయంగా ఇరికించి కడప జైలుకు తరలించారని బాధిత కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. -
మీ పిల్లలకు పలక ఇచ్చారా?
-
విధి వంచితులకు చేయూత
అప్పటివరకు సాఫీగా సాగుతున్న వారి జీవితంపై విధి పగబట్టింది. ఆడుకుంటూ విద్యుత్తు షాక్కు గురై చేయి కోల్పోయిన చిన్నారి ఒకరు. -
నైపుణ్యాల ప్రయాణం ఇలా విజయవంతం!
విద్యార్థులూ, తాజా గ్రాడ్యుయేట్లూ తమ అభిరుచిమేరకు కెరియర్ను రూపొందించుకునే ప్రయత్నాల్లో ఉంటారు. వీరు వాస్తవ ప్రపంచ విలువైన అనుభవాన్ని గడించడానికి ఇంటర్న్షిప్లు తోడ్పడతాయి. -
ప్రపంచంలో బలమైన శక్తిగా భారత్ ఎదుగుతోంది
ప్రపంచంలోనే భారత్ బలమైన శక్తిగా ఎదుగుతోందని.. అందుకు యువత, విద్యార్థులు కీలకపాత్ర పోషించనున్నారని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ అన్నారు. -
నాలుగు సబ్డివిజన్లకు కొత్త డీఎస్పీలు
రాష్ట్రంలోని నరసరావుపేట, గురజాల, తిరుపతి, తాడిపత్రి సబ్డివిజన్లకు కొత్త డీఎస్పీలను ఎన్నికల సంఘం నియమించింది. -
ప్రైవేటు, ప్రభుత్వ బడులు రెండూ అవసరమైన ఆస్తులే: మంత్రి బొత్స
ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల నుంచి ఉత్తమ విద్యార్థులను ఆశిస్తున్నందున.. రెండింటినీ అవసరమైన ఆస్తులుగా రాష్ట్ర ప్రభుత్వం చూస్తోందని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇద్దరు నడిరోడ్డుపై ప్రాణాలు కోల్పోతే.. 15 గంటల్లో బెయిలా..?
-
బోర్గ్ డ్రింకింగ్.. అమెరికా యువతను మత్తెక్కిస్తున్న కొత్త ట్రెండ్!
-
రాజీవ్గాంధీ సేవలు చిరస్మరణీయం: సీఎం రేవంత్
-
సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంట్లో అనిశా సోదాలు
-
మా కూటమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది: ఖర్గే
-
ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్.. వర్షంతో రద్దైతే పరిస్థితేంటి? విజేత ఎవరు?