సంక్షిప్త వార్తలు (7)
ఎన్నికల విధుల్లో భాగంగా ఇతర జిల్లాల్లో పనిచేసే సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవడానికి మే మొదటి వారంలో ఒకరోజు సాధారణ సెలవుగా ప్రకటించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనాకు ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్, ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగ సంఘాల నేతలు శుక్రవారం విజ్ఞప్తి చేశారు.
పోస్టల్ బ్యాలెట్ కోసం సిబ్బందికి సెలవు ప్రకటించాలి
సీఈవోను కోరిన ఉద్యోగ సంఘాల నేతలు
ఈనాడు డిజిటల్, అమరావతి: ఎన్నికల విధుల్లో భాగంగా ఇతర జిల్లాల్లో పనిచేసే సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవడానికి మే మొదటి వారంలో ఒకరోజు సాధారణ సెలవుగా ప్రకటించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనాకు ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్, ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగ సంఘాల నేతలు శుక్రవారం విజ్ఞప్తి చేశారు. ఎండల తీవ్రత దృష్ట్యా సిబ్బందిని వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రం వద్దకు ముందురోజు మధ్యాహ్నంలోగా చేర్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పోస్టల్ బ్యాలెట్ నమోదు, జారీ ప్రక్రియపై కొంతమంది అధికారుల్లో ఉన్న అనుమానాలను తొలగించేలా ఎన్నికల సంఘం తగు సూచనలు చేయాలని కోరారు.
గ్రామ, వార్డు సచివాలయశాఖకు ఎమ్మెల్వోలతో సంబంధం లేదు
ఈనాడు, అమరావతి: వాలంటీర్లకు శిక్షణ ఇచ్చేందుకంటూ ఎమ్మెల్వోల నియామకానికి సంబంధించి ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీతో గ్రామ, వార్డు సచివాలయశాఖ చేసుకున్న ఒప్పందం ఈ ఏడాది ఫిబ్రవరి 29తోనే ముగిసినట్టు ఆశాఖ వెల్లడించింది. ఎఫ్వోఏతో.. అందులో పనిచేసే ఎమ్మెల్వోలతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఆ శాఖ ఆదేశాలు జారీ చేసింది.
29 నుంచి గ్రంథాలయాల్లో వేసవి విజ్ఞాన శిబిరాలు
వాయిదా వేయాలని కోరుతున్న ఉద్యోగులు
ఈనాడు, అమరావతి: విద్యార్థులకు గ్రంథాలయాల్లో ఈ నెల 29 నుంచి జూన్ 7 వరకు వేసవి విజ్ఞాన శిబిరాలు నిర్వహించాలని పౌర గ్రంథాలయాల శాఖ డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఆయా గ్రంథాలయాలకు అనుసంధానం చేసిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో కలిసి విద్యార్థులకు సూచనలివ్వాలని పేర్కొన్నారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ కార్యక్రమాలు నిర్వహించాలని, విద్యార్థులు వేసవి శిబిరాలకు వచ్చేలా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ప్రోత్సహించాలని సూచించారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటం, ఎన్నికల కోడ్ ఉన్నందున ఈ కార్యక్రమాన్ని వాయిదా వేయాలని ఏపీ జిల్లా గ్రంథాలయ సంస్థ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కళ్లెపల్లి మధుసూదనరాజు, పి.కమ్మన్న డిమాండ్ చేశారు. గ్రంథాలయ అధికారులు, సిబ్బందికి ఎన్నికల విధులు వేశారని, ఇప్పుడున్న పరిస్థితుల్లో వేసవి శిబిరాలు నిర్వహించడం మంచిది కాదని పేర్కొన్నారు.
బాలల హక్కుల ఉల్లంఘన జరిగినట్లు ఫిర్యాదు చేస్తే విచారిస్తాం
బాలల హక్కుల కమిషన్ ఛైర్మన్ కేసలి అప్పారావు
ఈనాడు డిజిటల్, అమరావతి: సీఎం జగన్పై జరిగిన దాడి కేసులో పోలీసులు, ఇతర అధికారులు బాలల హక్కులను ఉల్లంఘించినట్లు ఫిర్యాదు అందలేదని, ఈ ఘటనలో నిందితులిద్దరు మేజర్లని బాలల హక్కుల కమిషన్ ఛైర్మన్ కేసలి అప్పారావు తెలిపారు. ఎప్పుడైనా, ఎక్కడైనా బాలల హక్కులకు భంగం కలిగించే విధంగా ప్రవర్తిస్తే సుమోటోగా విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. సీఎం పై దాడి ఘటనలో ఉల్లంఘనలు జరిగినట్లు పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేస్తే విచారణ చేపడతామని తెలిపారు. రాజ్యాంగం, చట్టాలకు అనుగుణంగా వ్యవస్థలు పనిచేస్తాయని దీనికి ఎవరూ అతీతులు కాదని శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. బాలల న్యాయ చట్టం పరిధిలో మాత్రమే బాలల హక్కుల కమిషన్ పనిచేస్తుందని వెల్లడించారు. కమిషన్కు వచ్చిన ఫిర్యాదులు, సమస్యలపై విచారణ చేపట్టి, వాటిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫార్సులు చేస్తామన్నారు.
22న డీఈ సెట్ ప్రకటన
ఈనాడు, అమరావతి: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో ప్రవేశాలకు నిర్వహించే డీఈ సెట్-24కు ఈ నెల 22న ప్రకటన విడుదల చేయనున్నట్లు కమిషనర్ సురేష్కుమార్ తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు డైట్ కళాశాలల్లో ప్రవేశాలు, సమాచార బులెటిన్ను వెబ్సైట్లో ఉంచనున్నట్లు వెల్లడించారు.
విద్యార్థులను ప్రలోభపెట్టే ప్రయత్నమేనా..?
26న ఏయూలో ‘అచీవర్స్ డే’ నిర్వహణకు ప్రణాళిక
ఈనాడు డిజిటల్, విశాఖపట్నం: విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ప్రలోభపెట్టేందుకు ఆంధ్ర విశ్వవిద్యాలయం అధికారులు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏయూ సైన్స్, టెక్నాలజీ కళాశాలకు చెందిన పలువురు విద్యార్థులు ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగాలు సాధించారు. వారిని సన్మానించేందుకు ఈనెల 26న ‘అచీవర్స్ డే’ కార్యక్రమం నిర్వహించనున్నారు. దీనికి ఎంపికైన విద్యార్థులు, తల్లిదండ్రులను ఆహ్వానించి వారి సమక్షంలో విద్యార్థులకు నియామక పత్రాలు అందజేయనున్నారు. ఈ కార్యక్రమానికి దాదాపు 800 మంది హాజరయ్యే అవకాశముంది. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా నియామక పత్రాలు అందజేసే కార్యక్రమం ఎలా నిర్వహిస్తారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ ప్రభుత్వ హయాంలో ఉద్యోగాలు వచ్చాయని ప్రచారం చేసే అవకాశముందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
రికార్డు స్థాయిలో ట్రాక్ పునరుద్ధరణ
ఈనాడు, హైదరాబాద్: రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనుల్ని 2023-24 ఆర్థిక సంవత్సరంలో రికార్డుస్థాయిలో చేపట్టినట్లు ద.మ.రైల్వే తెలిపింది. జోన్ పరిధిలో 649 కి.మీ.ట్రాక్ని పునరుద్ధరించినట్లు తెలిపింది. 2022-23 తో పోలిస్తే 45 శాతం అధికం అని పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. వేసవి కాలంలో జోన్ పరిధిలో 1079 ట్రిప్పుల అదనపు రైళ్లను నడిపించనున్నట్లు తెలిపింది. ఈ రైళ్లు ఏప్రిల్, మే నెలల్లో అందుబాటులో ఉంటాయని పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా హయాంలో ఎస్సీ కమిషన్ నిర్వీర్యం
వైకాపా హయాంలో రాష్ట్ర ఎస్సీ కమిషన్ పూర్తిగా నిర్వీర్యం అయిందని ఎస్సీ కమిషన్ మాజీ సభ్యుడు కట్టెపోగు బసవరావు ధ్వజమెత్తారు. సమతా సైనిక్దళ్ ఆధ్వర్యంలో గురువారం విజయవాడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
14 నియోజకవర్గాల్లోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్
అత్యంత సమస్యాత్మకమైన 14 నియోజకవర్గాల పరిధిలో మొత్తం అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ పెడతామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
పథకాలకు గండికొట్టి.. గొంతెండబెట్టి!
ధ్వంసరచనే తప్ప దార్శనికత లేని జగన్ పాలనలో పట్టణాల్లో గుక్కెడు తాగునీళ్లూ కరవయ్యాయి. తెదేపా తెచ్చిందన్న ఏకైక కారణంతో రూ.వేల కోట్ల పథకాలను ఎండబెట్టిన ఈ నీరో చక్రవర్తి ఎండల్లో జనం గొంతెండి అలమటిస్తుంటే... తాడేపల్లి ప్యాలెస్లో ఫిడేల్ వాయిస్తూ కూర్చున్నారు... కేవలం తన పంతం కోసం జనం సంక్షేమాన్ని వదిలేసిన ఈ ప్రభుత్వాధినేతను ఏమని పిలవాలి? -
పార్టీలకు కొమ్ముకాస్తున్న కొందరు ఐఏఎస్ అధికారులు
‘ప్రజలకు మేలు చేయాల్సిన కొందరు ఐఏఎస్లు... తమ స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీలకు కొమ్ముకాస్తున్నారు. అలాంటి వారిని రాజద్రోహులుగా ప్రకటించాలి’ అని ఆర్థిక నిపుణుడు, ప్రభుత్వ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ పీవీ రమేష్ డిమాండ్ చేశారు. -
రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 4,14,01,887
రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 4,14,01,887కు చేరింది. ఈ ఏడాది జనవరి 22న విడుదల చేసిన తుది జాబితాలో 4,08,07,356 మంది ఓటర్లు ఉన్నారు. -
బకాయిలు కట్టకపోతే కరెంట్ కట్.!
విద్యుత్ బకాయిల్ని వెంటనే చెల్లించకపోతే వారి ఫ్లాట్లకు కరెంట్ కట్ చేస్తామని రాష్ట్ర సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల్లో పనిచేస్తూ ఉచిత వసతి సదుపాయాన్ని వినియోగించుకుంటున్న ఉద్యోగులకు ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. -
ఏడాది పొడవునా బీఈడీ ప్రవేశాలా?
బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్(బీఈడీ) ప్రవేశాల కౌన్సెలింగ్ను ఉన్నత విద్యామండలి ఏడాది పొడవునా నిర్వహించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ప్రకాశం జిల్లా ఎండ్రపల్లిలో 47.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత
భగభగ మండే ఎండలతో రాష్ట్రం నిప్పుల కుంపటిని తలపిస్తోంది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. కర్నూలు, కావలి, నంద్యాల, ఆరోగ్యవరం తదితర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 నుంచి 5 డిగ్రీలు పెరిగాయి. -
ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్పై వింత నాటకం
ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రచారం చేసే ఎన్నికల సంఘం.. ఉద్యోగులపై మాత్రం కక్షగట్టినట్లు వ్యవహరిస్తోంది. -
బ్యాంకుల్లో నగదు జమకాని వారికి.. 4న ఇంటింటికీ పింఛన్ పంపిణీ
బ్యాంకు ఖాతాలు మనుగడలో లేని కారణంగా పింఛను నగదు జమకాని వారికి మే 4వ తేదీన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటికీ పంపిణీ చేయనున్నట్టు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్కుమార్ వెల్లడించారు. -
బకాయిలు చెల్లించకపోతే వైద్యం అందించలేం
బకాయిలు చెల్లించకపోతే ఈ నెల 4 నుంచి ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్) నగదు రహిత సేవలను నిలిపివేస్తామని ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ (ఆశా) ప్రకటించింది. -
కేజీబీవీ సిబ్బంది సేవల్లో ప్రభుత్వం కొత్త మెలిక
కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయా(కేజీబీవీ)ల ఒప్పంద ఉపాధ్యాయినుల జీవితాలతో ప్రభుత్వం ఆటలాడుతోంది. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై సీఎం వెనక్కి తగ్గరు
ల్యాండ్ టైటిలింగ్ యాక్టును సీఎం జగన్ కచ్చితంగా అమలు చేసి తీరుతారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. -
ప్రత్యేక అధికారుల పాలన పొడిగింపు
రాజమహేంద్రవరం నగరపాలక సంస్థతో పాటు రాజాం, తణుకు, గుడివాడ, బాపట్ల, గూడూరు (తిరుపతి జిల్లా), భీమవరం, తాడేపల్లిగూడెం, పాలకొల్లు పురపాలక సంఘాలు, నగర పంచాయతీల ప్రత్యేక అధికారుల పాలనను మరో ఆరు నెలలపాటు పొడిగిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. -
ఈ పాపం జగన్దే
జగన్ అనుకున్నంత పనీ చేశారు. పింఛనుదారుల ప్రాణాలను పణంగా పెట్టే కుట్రను యథేచ్ఛగా నడిపారు. వారి చేతికి నగదు సజావుగా అందకుండా చేసి ముప్పుతిప్పలు పెట్టారు. ఇంటింటికీ పింఛను పంపిణీ చేసే సులువైన అవకాశమున్నా...వారు సుదూరంలో ఉండే బ్యాంకుల వద్దకు వెళ్లి గంటల తరబడి క్యూలైన్లలో పడిగాపులు కాసేలా చేశారు. -
అన్నం ముద్దపైనా అక్కసే!
అత్తమీద కోపం దుత్తమీద చూపినట్టుగా.. విపక్షాలపైన తనకున్న ఉక్రోషాన్ని.. నిర్భాగ్యులమీద చూపారు జగన్... గత తెదేపా ప్రభుత్వం తెచ్చిన అన్న క్యాంటీన్లను వచ్చీరాగానే మూసేయించారు... రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటుచేసిన ఆ క్యాంటీన్లు.. రోజూ వేల మంది క్షుద్భాద తీర్చేవి. దీనిపై విమర్శలు పెరిగాక.. ‘ఆహా’ క్యాంటీన్లు తెచ్చినా... జగన్ పాలనలానే.. దిక్కూదివానం లేనట్లుంది వాటి పరిస్థితి. -
‘అన్నపూర్ణ’ అప్పుల కుప్ప
అద్భుత రాజధానిగా రూపుదిద్దుకుంటున్న అమరావతి... 70 శాతం పూర్తయిన పోలవరం... ఆశతో దూసుకొచ్చిన వందలాది ఐటీ పరిశ్రమలతో... ... కలిసొచ్చే కాలానికి నడిచొచ్చిన బిడ్డలా... ఐదేళ్ల కిందట జగన్ చేతికొచ్చింది ఆంధ్రావని! -
‘భీమ్లీ’ ఖల్ నాయక్!
‘‘నాయక్ నహీ.. ఖల్ నాయక్ మై హూ..!’’ అంటూ ఆయన చేసే హడావుడి అంతాఇంతా కాదు. ‘‘ఏం చేస్తున్నావ్? యూనిఫామ్ తీసేయ్..!’’ అంటూ పోలీసులపైనే రుసరుసలాడతారు. -
అంతా.. ఆ ఏడు చేపలకే!
వడ్డించే వాడు జగన్ అయితే... కేటాయింపులు ఇలాగే ఉంటాయి మరి. తన తండ్రి హయాంలోనే కంపెనీలతో రూ.లక్షల కోట్ల ‘క్విడ్ప్రోకో’ లావాదేవీలకు తెరతీసిన ఆయన... తాను గద్దెనెక్కాక ‘గంపగుత్త’ సూత్రాన్ని అనుసరించారు. -
ఐదేళ్లలో ఉద్యోగులపై 1500కుపైగా కేసులు
జగన్ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో ఉద్యోగులపై 1,500కుపైగా కేసులు పెట్టారని, చివరికి ధర్నా చేశారంటూ 80ఏళ్ల వయసుపైబడిన పెన్షనర్లపైనా కేసులు నమోదు చేశారని అఖిల భారత రాష్ట్ర పెన్షనర్ల సమాఖ్య మాజీ ప్రధాన కార్యదర్శి పూర్ణచంద్రరావు ఆవేదన వ్యక్తం చేశారు. -
నూతన నేర న్యాయ చట్టాలపై పరిజ్ఞానం పెంచుకోవాలి
ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య చట్టాలు జులై 1 నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో వాటిపై పరిజ్ఞానాన్ని పెంచుకోవాలని హైకోర్టు న్యాయమూర్తి, ఏపీ జ్యుడిషియల్ అకాడమీ అధ్యక్షుడు జస్టిస్ యు.దుర్గాప్రసాదరావు అన్నారు.