Kodali Geethika: విజయగీతిక
ఆశయం.. అందుకు తగ్గ శ్రమ ఉంటే అవకాశాలకు హద్దులు ఉండవని ఓ తెలుగు యువ కెరటం నిరూపించింది. తక్కువ వయసులోనే అమెరికాలోని క్రికెట్ జట్టుకు సారథ్యం వహించే స్థాయికి ఎదిగింది. 11వ ఏట బ్యాట్ చేతపట్టి..
14 ఏళ్లకే అమెరికా మహిళా క్రికెట్ జట్టులోకి
17 ఏళ్లకే అండర్-19 జట్టుకు సారథ్యం
తెలుగు యువ కెరటం గీతిక కొడాలి
ఈనాడు, అమరావతి: ఆశయం.. అందుకు తగ్గ శ్రమ ఉంటే అవకాశాలకు హద్దులు ఉండవని ఓ తెలుగు యువ కెరటం నిరూపించింది. తక్కువ వయసులోనే అమెరికాలోని క్రికెట్ జట్టుకు సారథ్యం వహించే స్థాయికి ఎదిగింది. 11వ ఏట బ్యాట్ చేతపట్టి.. 14 ఏళ్లకే యూఎస్ మహిళా క్రికెట్ జట్టులో ఆడే అవకాశం దక్కించుకుంది. 17 ఏళ్లకు అండర్-19 జట్టుకు సారథ్యం వహిస్తోంది గీతిక కొడాలి. విజయవాడకు చెందిన కొడాలి ప్రశాంత్, మాధవిల కుమార్తె గీతిక.. అమెరికాలోని నార్త్కరోలినాలో 12వ తరగతి చదువుతూనే క్రికెట్లో సత్తా చాటుతోంది. కెప్టెన్గా తమ బృందాన్ని విజయపథంలో నడిపిస్తూ తొలి సిరీస్లోనే విజయాన్ని అందుకుంది. యూఎస్ ఉమెన్స్ జట్టు కెప్టెన్గా వరల్డ్ కప్లో ఆడటమే లక్ష్యం అంటున్న గీతిక ‘ఈనాడు-ఈటీవీ’కి చెప్పిన ముచ్చట్లు..
యూఎస్ మహిళా జట్టుకు ఎంపికై
చిన్నప్పటి నుంచి క్రీడలంటే ఎంతో ఇష్టం. కానీ క్రికెటే నా లోకం అవుతుందని ఎప్పుడూ ఊహించలేదు. బంధువుల ఇంటికి వెళ్లినప్పుడు అమ్మానాన్నల సూచనతో కోచ్ రఘును కలిశాం. శిక్షణ తీసుకుంటే క్రికెట్లో బాగా రాణిస్తావని ఆయన చెప్పారు. రెండేళ్ల శిక్షణ తర్వాత 14వ ఏట అమెరికన్ మహిళా జట్టులోకి వెళ్లే అవకాశం లభించింది. జట్టు ఎంపిక కోసం మూడు క్యాంప్లు జరిగాయి. 32 మంది హాజరయ్యారు. 14 ఏళ్ల విభాగంలో ఎంపికయ్యా. జట్టులో నేనే చిన్నదాన్ని. నేషనల్ ఉమెన్ క్రికెట్ లీగ్కు ఆడాను. సీనియర్ల నుంచి మెలకువలు నేర్చుకోవడంతోపాటు.. ఫిట్నెస్, బౌలింగ్ సామర్థ్యాలను మెరుగుపరుచుకున్నాను. కెనడా, మెక్సికో, జింబాబ్వే తదితర దేశాల్లో 20 మ్యాచ్లు ఆడాను.
అమ్మానాన్న సహకారంతోనే
అమ్మ మాధవి, నాన్న ప్రశాంత్ సహకారంతోనే క్రికెట్లో రాణిస్తున్నా. చిన్ననాటి నుంచి ఎంతో ప్రోత్సహించారు. నార్త్కరోలినా అయితే క్రికెట్కు మంచి సౌకర్యాలు ఉంటాయని.. నా కోసమే కాలిఫోర్నియా నుంచి నివాసం మార్చారు. ఇది నా చదువుకు కూడా దోహదపడింది. నా చిన్నతనంలో ఏటా ఆంధ్రప్రదేశ్కు వచ్చే వాళ్లం. హైస్కూల్కు వచ్చాక సమ్మర్ ఇంటర్న్షిప్తో అవకాశం కుదరలేదు. ఈ లోగా కొవిడ్ రావడమూ కారణమైంది. త్వరలో ఇండియాకు వస్తాను. మన గడ్డపై కూడా క్రికెట్ ఆడతాను.
అండర్-19 జట్టు సారథిగా
అమెరికాలో తొలిసారిగా గతేడాది అండర్-19 జట్టును ఏర్పాటు చేశారు. జట్టుకు కెప్టెన్గా నాయకత్వం వహించే అవకాశం మొదటగా నాకే లభించింది. మొత్తం 15 మందితో కూడిన మా జట్టు తొలి పర్యటనలో భాగంగా కరేబియన్ ఐలాండ్స్లో సెయింట్ విన్సెంట్లో ఆడాం. ఈ జట్టులో అత్యధికులు భారతీయ సంతతి వారే. సిరీస్లో భాగంగా నాలుగు మ్యాచ్లు ఆడి.. మూడు గెలిచాం. బృంద సభ్యుల్లో విశ్వాసం నింపుతూ.. విజయం దిశగా అడుగేశాం. మే నెలలో దుబాయ్లో జరిగే ఫెయిర్బ్రేక్ టోర్నమెంట్కు మా బృందం సిద్ధమవుతోంది. మహిళా క్రికెట్ను యూఎస్ క్రికెట్ అసోసియేషన్తో పాటు ఐసీసీ ఛార్టర్ ఎంతో ప్రోత్సహిస్తున్నాయి. శాటిలైట్ కోచ్ సెషన్స్ ఏర్పాటు చేసి.. స్థానికంగా శిక్షణ ఇచ్చేవారు. అక్కడ సిద్ధమయ్యాక.. టీమ్ ప్రాక్టీసెస్, మ్యాచ్కు వారంముందు బృందం సభ్యులంతా కలిసి మళ్లీ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వేసవిలో రీజినల్స్, నేషనల్ ఆడాం. క్రికెట్ నాకు సమయపాలన నేర్పింది. చదువు, ఆటను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లేలా ప్రణాళిక రూపొందించుకుంటున్నాను. తొమ్మిది, పదో గ్రేడ్ల వరకు స్కూల్లో రాణిస్తూనే క్రికెట్ ఆడేదాన్ని. 11, 12 గ్రేడ్లలో పాఠశాలకు వెళ్లలేని పరిస్థితుల్లో ఉపాధ్యాయులు సహకారం అందించారు. క్రికెట్తో నాలో టైమ్ మేనేజ్మెంట్ స్కిల్స్ పెరిగాయి.
ఇండియా ఉమెన్స్ ఐపీఎల్లో పాల్గొనాలి
గీతిక చిన్నప్పటి నుంచి క్రికెట్ ఆడేది. కోచ్ రఘును కలవగా క్రికెట్లో బాగా రాణిస్తుందని చెప్పారు. రెండేళ్ల శిక్షణ తర్వాత యూఎస్ ట్రైఔట్స్కు వెళ్లి.. విజయవంతంగా ఎంపికైంది. ఇప్పుడు ఆల్రౌండర్గా అడుగేస్తోంది. అంతర్జాతీయ స్థాయి సిరీస్లో తొలి విజయం నమోదు చేయడం సంతోషించదగ్గ విషయం. ఇండియా ఉమెన్స్ ఐపీఎల్లో ఆమె పాల్గొనాలని కోరుకుంటున్నాం.
-తల్లిదండ్రులు కొడాలి ప్రశాంత్, మాధవి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపాకు మద్దతిస్తున్నారని.. ఎస్టీ కాలనీకి తాగునీరు బంద్
తెదేపాకు సానుకూలంగా ఉన్నారన్న అక్కసుతో ఎస్టీ కాలనీకి తాగునీటి సరఫరాను నిలిపేసిన దారుణ ఘటన పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలంలో చోటుచేసుకుంది. -
విశాఖ తీరానికి విలాసవంతమైన నౌక
ప్రఖ్యాత అంతర్జాతీయ క్రూయిజ్ నౌక ‘ది వరల్డ్’ ఆదివారం విశాఖ పోర్టుకు చేరుకుంది. పోర్టు అధికారులు నౌకలో వచ్చిన వారికి ఘన స్వాగతం పలికారు. -
ఆలయం నుంచి బయటకెళ్లు.. దళిత సర్పంచిని అవమానించిన వైకాపా నాయకులు
నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండలం పారుమంచాల గ్రామంలోని రామాలయానికి వెళ్లిన తనను వైకాపా నాయకులు లోకేశ్వరరెడ్డి, జగదీశ్వరరెడ్డిలు అవమానించారంటూ అదే పార్టీకి చెందిన గ్రామ దళిత సర్పంచి మాధవరం ప్రకాశం ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ఇచ్చింది రూ.50 వేలు.. లాగింది రూ.3.5 లక్షలు
డ్రైవర్ అన్నలు... నా మిత్రులు అన్నారు ఎప్పటికీ అండగా ఉంటామన్నారు... జగన్ మాటకు చేతకు పొంతన ఉండదుగా... ఏదో మొక్కుబడిగా సాయం చేశారు. -
‘ప్రభుత్వానికి భజన చేస్తూ.. కొన్ని సంఘాలు దిగజారాయి’
ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు అంశాలకు పరిష్కారం లభించకపోయినా.. ఒకటో తేదీన వేతనాలు, పింఛన్లు రాకపోయినా కొన్ని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి ఆహా, ఓహో అంటూ భజన చేస్తూ దిగజారిపోయాయని ఏపీ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ మండిపడ్డారు. -
కంట్రోల్లోనే ఉన్నాం.. చెప్పినట్లు సమావేశాలు పెడుతున్నాం
సకల శాఖ మంత్రిగా ప్రచారంలో ఉన్న ఓ ప్రభుత్వ సలహాదారు కళ్లలో ఆనందం చూసేందుకు ఏపీ ఎన్జీఓ సంఘం నాయకులు తహతహలాడుతున్నారు. -
జవహర్రెడ్డి జగన్నాటకం
ఒక ఎత్తు కాకపోతే మరో ఎత్తు. ఒక వ్యూహం కాకపోతే మరో వ్యూహం. ఏది అమలుచేసినా అంతిమంగా వైకాపాకు మేలు చేయడమే లక్ష్యం. -
మే 1న బ్యాంకు ఖాతాల్లో పింఛను జమ
వచ్చేనెల సామాజిక పింఛన్ల సొమ్మును మే 1న లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తీవ్ర అనారోగ్యం, అస్వస్థత, నడవలేని స్థితిలో ఉన్నవారు, మంచం పట్టినవారు, వీల్ ఛైర్లో ఉన్నవారు, దివ్యాంగులు, సైనిక పింఛన్లు తీసుకునే వారికి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఇళ్ల దగ్గరే అందించనున్నారు. -
వారికి నో.. వీరికి ఎస్
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథరెడ్డిలు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని.. వారు ఆ పోస్టుల్లో కొనసాగితే రాష్ట్రంలో ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరగవని.. వారిని తక్షణం బదిలీ చేయాలని విపక్ష పార్టీలన్నీ నెత్తీనోరూ కొట్టుకుంటున్నా.. ఈసీ పట్టించుకోలేదు. -
రూ.3000,00,00,000.. మూడేళ్లలో ఇసుకలో చేసిన లూటీ ఇది
జగన్ ప్రభుత్వం రాగానే ఉచిత ఇసుక విధానం రద్దుచేసి.. తొలుత ప్రభుత్వరంగ సంస్థకు ఇసుక వ్యాపారం అప్పగించింది. అది విఫలమైందని సాకుచూపించి.. బినామీలను గుత్తేదారులుగా రంగంలోకి దింపింది. -
పోలా.. ‘పరువు పోలా!’
‘రోడ్లు ఇట్లా ఉంటే మీ ప్రభుత్వానికే ఓట్లు పడవు. మీరు మరమ్మతులు చేయిస్తారా? లేకుంటే మా రాష్ట్ర నిధులతో మమ్మల్నే ప్యాచ్ వర్క్ చేయించమంటారా?’ -
సుందరనాయుడి సేవలు నిరుపమానం
అందరూ ఆప్యాయంగా చిత్తూరు పెద్దాయన అని పిలుచుకునే.. కోళ్ల పరిశ్రమ పితామహుడు దివంగత డాక్టర్ ఉప్పలపాటి సుందరనాయుడి సేవలు చిరస్మరణీయమని కోళ్ల రైతులు పేర్కొన్నారు. -
ఉత్తీర్ణత పెంచడం ఓట్ల కోసమేనా?
పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తీర్ణత పెంచడం, మార్కులు అధికంగా వేయడం తల్లిదండ్రుల ఓట్ల కోసమేనా అని సామాజిక వేత్త గుంటుపల్లి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో ప్రశ్నించారు. -
కొండల్ని మింగి.. గోతులు మిగిల్చారు!
విజయవాడ సమీపం జక్కంపూడి, కొత్తూరు తాడేపల్లి, కొండపావులూరు పరిసరాల్లో కొండ ప్రాంతాల్లో విచ్చలవిడిగా తవ్వేశారు. -
వైకాపా బాణసంచా పేల్చడంతో అగ్ని ప్రమాదం
వైకాపా ఎన్నికల ప్రచారంలో భారీగా బాణసంచా కాల్చడంతో అగ్నిప్రమాదం సంభవించి జామాయిల్ తోటలు, పశువుల మేత, మోటార్లు కాలిపోయాయి. -
ఉపాధి లేదు.. ఉద్యోగం అడగొద్దు
రాష్ట్రంలో చదువుకుని, లక్షల సంఖ్యలో ఉన్న నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలన్న ఆలోచన లేదు! ఉపాధి అవకాశాల్లేక యువత ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు తరలిపోతుంటే.. ఆంధ్రప్రదేశ్ వృద్ధుల రాష్ట్రంగా మిగిలిపోతోందన్న బాధ లేదు! -
నామినేషన్ ర్యాలీకి వెళ్లలేదని గ్రామానికి నీటి సరఫరా నిలిపివేత
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్ నామినేషన్ ర్యాలీకి వెళ్లలేదని ఓ గిరిజన గ్రామానికి నీటి సరఫరా నిలిపివేసిన దారుణ ఉదంతమిది. -
మాటల ఏలిక.. మీటలో మెలిక!
అక్కచెల్లెమ్మలకు మంచి జరగాలనే ఆలోచనతో వారికి వ్యాపార అవకాశాలను కల్పించాలని నిర్ణయించాం. హిందుస్థాన్ లీవర్, పీఅండ్జీ, ఐటీసీ, రిలయన్స్, అమూల్ సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. -
గురుదక్షిణగా కారు.. అందజేసిన లేపాక్షి నవోదయ పూర్వవిద్యార్థులు
జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకునేలా స్ఫూర్తి నింపిన గురువుకు శిష్యులు రూ.12లక్షల విలువైన కారును బహుమతిగా అందజేశారు. -
దండుకో.. వాటాలు పంచుకో!
జగన్ పాలనలో దోచుకున్నోళ్లకు దోచుకున్నంత.. అన్న విధంగా వైకాపా నాయకులు, కొందరు ఐఏఎస్ అధికారులు చెలరేగిపోతున్నారు. -
రోగుల సమాచారం మీకెందుకు?
వైద్యం కోసం ఆసుపత్రులకు వెళ్లే రోగుల సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సేకరిస్తోందని, అలా ఎందుకు తీసుకుంటుందో చెప్పాలని భారత వైద్య మండలి(ఐఎంఏ) జాతీయ అధ్యక్షుడు డా.ఆర్వీ.అశోకన్ ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
పాఠ్య పుస్తకాల అప్డేషన్పై NCERTకి కేంద్రం కీలక సూచన!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!
-
‘మీ బిడ్డను’ అంటూ.. జగన్ ఊరూరా తిరిగినప్పుడే అనుమానించా: లోకేశ్
-
అమిత్ షా ‘వీడియో సోర్స్’పై పోలీసుల దృష్టి.. సోషల్ మీడియా సంస్థలకు లేఖ
-
ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసు.. సుప్రీంలో దీదీ సర్కార్కు ఊరట
-
కంట్రోల్ తప్పిన హెలికాప్టర్.. అమిత్ షాకు త్రుటితో తప్పిన ప్రమాదం