Adani: 2023 సవాళ్లను ‘అపూర్వమైన శక్తి’తో ఎదుర్కొన్నాం: అదానీ
Adani: 2023లో అదానీ గ్రూప్నకు అనేక సవాళ్లు ఎదురయ్యాయని.. వాటిని దీటుగా ఎదుర్కొన్నామని ఛైర్మన్ గౌతమ్ అదానీ తెలిపారు.
దిల్లీ: 2023లో ఎదురైన అనేక సవాళ్లను సమర్థంగా ఎదుర్కొన్నామని అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ (Gautam Adani) అన్నారు. అంతర్జాతీయ షార్ట్సెల్లర్ సహా వివిధ గ్రూపుల నుంచి వచ్చిన దాడులను తిప్పికొట్టగలిగామని తెలిపారు. గడ్డు పరిస్థితుల నుంచి తమ వ్యాపారం ‘అత్యద్భుత శక్తి’గా అవతరించిందని వ్యాఖ్యానించారు. నూతన సంవత్సరం సందర్భంగా గ్రూప్ (Adani Group) ఉద్యోగులకు పంపిన వీడియో సందేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘సుమారు 12 నెలల క్రితం అంతర్జాతీయ షార్ట్సెల్లర్ నుంచి మా ప్రతిష్ఠకు అగ్నిపరీక్ష ఎదురైంది. ‘అదానీ’ (Adani Group) ప్రయోజనాలతో విభేదించే వివిధ సమూహాలు స్వలాభం కోసం షార్ట్సెల్లర్ ఆరోపణలను ఉపయోగించుకున్నాయి. దీంతో సమస్య మరింత క్లిష్టంగా మారింది. అవి అదానీ గ్రూప్ ప్రతిష్ఠకు మాత్రమే కాకుండా జాతీయ స్థాయి పాలనా విధానాలకు హాని కలిగించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి’’ అని అదానీ తన సందేశంలో ఆరోపించారు.
ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ, తమ వ్యాపారాల సమగ్రత, పాలనా విధానాలకు సుప్రీంకోర్టు నియమించిన కమిటీ నుంచి పూర్తి మద్దతు లభించిందని అదానీ (Gautam Adani) చెప్పారు. తమ వైపు ఎలాంటి ఉల్లంఘనలు జరిగినట్లు కమిటీ నివేదిక గుర్తించలేదన్నారు. తమ వ్యాపారాలపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవిగా ఇది నొక్కి చెబుతోందన్నారు. నమోదిత సంస్థల షేర్ల విలువను పెంచేందుకు అదానీ గ్రూప్ (Adani Group) అవకతవకలకు పాల్పడుతోందని అమెరికాకు చెందిన షార్ట్సెల్లర్ హిండెన్బర్గ్ 2023 ఆరంభంలో ఆరోపించిన విషయం తెలిసిందే. దీంతో అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు ఓ దశలో భారీగా నష్టపోయాయి. అయితే, మదుపర్లలో విశ్వాసం నింపేందుకు గ్రూప్ అనేక చర్యలు చేపట్టింది. ఫలితంగా షేర్లు మళ్లీ గాడిన పడ్డాయి.
భవిష్యత్లో ఇలాంటి సవాళ్లను అరికట్టేందుకు తమ విధానాల్లో కొన్ని మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందని అదానీ (Gautam Adani) అన్నారు. అయితే, షార్ట్సెల్లర్ దాడిని తమ గ్రూప్ (Adani Group) అసాధారణ స్థాయిలో ఎదుర్కొందని వ్యాఖ్యానించారు. గడ్డుకాలం నుంచి పుంజుకోవడమే కాకుండా, రికార్డు స్థాయి కార్పొరేట్ ఫలితాలను ప్రకటించామని చెప్పారు. దీంతో అత్యంత సవాళ్లతో కూడిన సంవత్సరాన్ని ‘అపూర్వమైన శక్తి’తో ముగించామని వ్యాఖ్యానించారు.
వచ్చే దశాబ్ద కాలంలో 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులను లక్ష్యంగా పెట్టుకొన్నట్లు గౌతమ్ అదానీ తెలిపారు. స్వచ్ఛ ఇంధనం దిశగా ఆ పెట్టుబడులు ఉంటాయన్నారు. జీక్యూజీ పార్ట్నర్స్ వంటి బడా సంస్థాగత మదుపర్ల మద్దతు తమకు కలిసొచ్చిందని తెలిపారు. ఆర్థికంగా తామిప్పుడు మునుపెన్నడూ లేనంత బలంగా ఉన్నామని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మన అంతర్జాతీయ ప్రయాణికుల్లో.. 50శాతం మంది దేశీయ విమానాల్లోనే
మన దేశం నుంచి విదేశాలకు వెళ్లేవారు ప్రస్తుతం విదేశీ విమానయాన సంస్థల విమానాల్లోనే ఎక్కువగా ప్రయాణిస్తున్నారు. ఈ పరిస్థితి శరవేగంగా మారుతోందని, 2027-28 కల్లా మన అంతర్జాతీయ ప్రయాణికుల్లో 50% మంది దేశీయ సంస్థల విమానాల్లో ప్రయాణించే పరిస్థితి ఏర్పడుతుందని క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ తాజా నివేదికలో పేర్కొంది. -
ఆగస్టు నుంచి దేశవ్యాప్తంగా.. బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు
ప్రభుత్వరంగ బీఎస్ఎన్ఎల్ ఈ ఏడాది ఆగస్టు నుంచి దేశ వ్యాప్తంగా 4జీ సేవలను ప్రారంభించనుందని అధికారిక వర్గాలు తెలిపాయి. ‘ఆత్మనిర్భర్’ విధానానికి అనుగుణంగా, 4జీ సేవలకు పూర్తిగా స్వదేశీ సాంకేతికతనే సంస్థ ఉపయోగించనుంది. -
పెద్ద షేర్లలో లాభాల స్వీకరణ
సూచీల్లో అధిక వెయిటేజీ కలిగిన ఎస్బీఐ, రిలయన్స్ వంటి షేర్లకు లాభాల స్వీకరణ ఎదురుకావడంతో సోమవారం సూచీలు స్తబ్దుగా ముగిశాయి. కొన్ని ఎఫ్ఎమ్సీజీ, ఐటీ, ఔషధ షేర్లు మాత్రం రాణించాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 7 పైసలు తగ్గి 83.52 వద్ద ముగిసింది. -
ఎన్ఎస్ఈ నమోదిత కంపెనీల్లో జీవనకాల గరిష్ఠానికి ఎంఎఫ్ల వాటా
ఎన్ఎస్ఈ నమోదిత కంపెనీల్లో మ్యూచువల్ ఫండ్ల (ఎంఎఫ్ల) వాటా జీవనకాల గరిష్ఠానికి చేరింది. 2024 మార్చితో ముగిసిన త్రైమాసికంలో, ఆయా కంపెనీల్లో ఎంఎఫ్ల వాటా 8.92 శాతానికి చేరిందని ప్రైమ్ డేటాబేస్ గ్రూప్నకు చెందిన ప్రైమ్ఇన్ఫోబేస్.కామ్ వెల్లడించింది. -
నరేశ్ గోయెల్కు మధ్యంతర బెయిలు
జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయెల్(75)కు వైద్య చికిత్స నిమిత్తం రెండు నెలల మధ్యంతర బెయిలును బాంబే హైకోర్టు సోమవారం మంజూరు చేసింది. -
అంతర్జాతీయ మొబైల్ నంబర్తోనూ యూపీఐ చెల్లింపులు: ఐసీఐసీఐ బ్యాంక్
భారత్లో ఉన్న ప్రవాసులు (ఎన్ఆర్ఐ), అంతర్జాతీయ మొబైల్ నంబర్లతో యూపీఐ సేవలను ఉపయోగించుకునే వీలు కల్పిస్తున్నట్లు ఐసీఐసీఐ బ్యాంక్ సోమవారం ప్రకటించింది. -
సేవల రంగ వృద్ధి వేగవంతంగానే
దేశీయ సేవల రంగ వృద్ధి ఏప్రిల్లో కాస్త నెమ్మదించినప్పటికీ.. కొత్త వ్యాపారాలు, ఉత్పత్తిపరంగా మెరుగ్గానే ఉందని ఓ సర్వే వెల్లడించింది. హెచ్ఎస్బీసీ ఇండియా సర్వీసెస్ బిజినెస్ యాక్టివిటీ సూచీ మార్చిలో 61.2 పాయింట్లుగా ఉండగా.. ఏప్రిల్లో 60.8 పాయింట్లకు దిగివచ్చింది. -
ఆంధ్ర, తెలంగాణ సహా 12 రాష్ట్రాల్లో డ్రోన్లతో పురుగుమందులు, ఎరువుల పిచికారీ
30 లక్షల ఎకరాల సాగుభూముల్లో పురుగుమందులు, ఎరువుల పిచికారీకి ఇఫ్కోతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు డ్రోన్ కంపెనీ డ్రోన్ డెస్టినేషన్ తెలిపింది. ఒప్పందం ప్రకారం ఎకరాకు రూ.400-800ను చొప్పున చెల్లిస్తారు. -
కోరమాండల్ ఇంటర్నేషనల్ బోర్డులో ఇద్దరు కొత్త డైరెక్టర్లు
ఎరువులు, సస్య రక్షణ ఉత్పత్తులు అందించే కోరమాండల్ ఇంటర్నేషనల్ బోర్డులో ఇద్దరు కొత్త డైరెక్టర్లు అరుణాచలం వెల్లాయన్, నారాయణన్ వెల్లాయన్ నియమితులయ్యారు. -
జీఎస్టీఏటీ తొలి అధ్యక్షుడిగా మిశ్రా
జీఎస్టీ అప్పిలేట్ ట్రైబ్యునల్ (జీఎస్టీఏటీ)కు తొలి అధ్యక్షుడిగా జస్టిస్ (రిటైర్డ్) సంజయ్ కుమార్ మిశ్రాతో సోమవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రమాణ స్వీకారం చేయించారు. అంటే.. జీఎస్టీ సంబంధిత వివాదాల పరిష్కారంలో కీలకంగా వ్యవహరించనున్న జీఎస్టీఏటీ కార్యకలాపాలు ప్రారంభమైనట్లే లెక్క. -
ఫరూఖ్నగర్లో 48 ఎకరాలు కొనుగోలు చేసిన మైక్రోసాఫ్ట్
మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ (ఇండియా) హైదరాబాద్ సమీపంలో 48 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. రంగారెడ్డి జిల్లాలోని ఫరూఖ్నగర్ మండలం ఎలికట్ట గ్రామంలో ఈ భూమిని తీసుకుంది. -
ఆఫ్లైన్లోనూ ఇ-రుపీ
ఇ-రుపీ లేదా సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ(సీబీడీసీ)ని ఆఫ్లైన్ పద్ధతిలోనూ బదిలీ చేసేలా పనిచేస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. -
మాస్చిప్ టెక్నాలజీస్ ఆదాయాల్లో వృద్ధి
సెమీకండక్టర్, సాఫ్ట్వేర్, సిస్టమ్ డిజైన్ సేవల సంస్థ మాస్చిప్ టెక్నాలజీస్ 2023-24 పూర్తి కాలానికి ఏకీకృత ఖాతాల ప్రకారం రూ.293.91 కోట్ల ఆదాయాన్ని, రూ.9.9 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. -
సంక్షిప్త వార్తలు(7)
సువెన్ లైఫ్సైన్సెస్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికానికి రూ.6.66 కోట్ల ఆదాయాన్ని, రూ.26.54 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదేకాలంలో ఆదాయం 8.21 కోట్లు, నష్టం రూ.27.64 కోట్లు ఉండటం గమనార్హం
తాజా వార్తలు (Latest News)
-
నరైన్ నవ్వడెందుకు.. సహచరులు చెప్పిన విశేషాలు..!
-
25 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా.. ఇలా చేయడం బాధగా ఉంది: కరణ్ జోహార్
-
దేవకన్యలా జాన్వీకపూర్.. అందమైన ఫొటోతో దివి ప్రేమ
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (07/05/24)
-
టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. మాకు ముందే తెలుసంటూ నెటిజన్స్ ట్రోల్స్!
-
గుడ్న్యూస్ చెప్పిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ టీమ్.. అది ఏంటంటే..