మన అంతర్జాతీయ ప్రయాణికుల్లో.. 50శాతం మంది దేశీయ విమానాల్లోనే
మన దేశం నుంచి విదేశాలకు వెళ్లేవారు ప్రస్తుతం విదేశీ విమానయాన సంస్థల విమానాల్లోనే ఎక్కువగా ప్రయాణిస్తున్నారు. ఈ పరిస్థితి శరవేగంగా మారుతోందని, 2027-28 కల్లా మన అంతర్జాతీయ ప్రయాణికుల్లో 50% మంది దేశీయ సంస్థల విమానాల్లో ప్రయాణించే పరిస్థితి ఏర్పడుతుందని క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ తాజా నివేదికలో పేర్కొంది.
2027-28 కల్లా సాకారం: క్రిసిల్
ముంబయి
మన దేశం నుంచి విదేశాలకు వెళ్లేవారు ప్రస్తుతం విదేశీ విమానయాన సంస్థల విమానాల్లోనే ఎక్కువగా ప్రయాణిస్తున్నారు. ఈ పరిస్థితి శరవేగంగా మారుతోందని, 2027-28 కల్లా మన అంతర్జాతీయ ప్రయాణికుల్లో 50% మంది దేశీయ సంస్థల విమానాల్లో ప్రయాణించే పరిస్థితి ఏర్పడుతుందని క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ తాజా నివేదికలో పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో, దేశీయ సంస్థల విమానాల్లో మన అంతర్జాతీయ ప్రయాణికుల వాటా 43 శాతంగా ఉండగా.. 2027-28 కల్లా ఇది మరో 7% వృద్ధి చెంది 50 శాతానికి చేరుతుందని అంచనా వేసింది. ఈ నివేదికలో ముఖ్యాంశాలు..
- అంతర్జాతీయంగా కొత్త మార్గాలను నిర్దేశించుకుని, అందుకనువైన పెద్ద విమానాలను జత చేసుకోనుండడంతో అంతర్జాతీయ ప్రయాణికుల రద్దీలో భారతీయ విమాన సంస్థల వాటా పెరగనుంది. విదేశీ విమానాలతో పోలిస్తే దేశీయ మార్గాల్లో మన విమానాలకు అనుసంధానత ఎక్కువగా ఉండడం కలిసి రానుంది.
- అంతర్జాతీయ రద్దీలో వాటా పెరుగుతున్నందున, దేశీయ విమానయాన కంపెనీల వ్యాపారమూ బలోపేతం కానుంది. దేశీయ మార్గాలతో పోలిస్తే అంతర్జాతీయ మార్గాల్లో లాభాలు ఎక్కువ.
- 2023-24లో భారత అంతర్జాతీయ ప్రయాణికుల రద్దీ 7 కోట్లకు చేరింది. కొవిడ్ అనంతరం అంతర్జాతీయ ప్రయాణాలకు భారతీయులు మొగ్గుచూపడమే ఇందుకు నేపథ్యం. కరోనా సంవత్సరం (2020-21)లో ఈ రద్దీ కోటికి పరిమితమైంది.
- వీసా నిబంధనలు సడలడానికి తోడు ఖర్చుపెట్టేందుకు సరిపడా ఆదాయాలు పెరగడం, దేశీయంగా కొత్త విమానాశ్రయాలు ప్రారంభమై, మెట్రోలకు అనుసంధానత పెరగడం వల్ల, అంతర్జాతీయ ప్రయాణాలు సులువవుతున్నాయి.
- భారత్ను పర్యాటక కేంద్రంగా మార్చడంపై కేంద్రం దృష్టి పెట్టడంతో దేశీయ రద్దీ మరింత పెరగనుంది.
- వచ్చే నాలుగు ఆర్థిక సంవత్సరాల్లో అంతర్జాతీయ ప్రయాణికుల రద్దీ వార్షిక వృద్ధి రేటు(సీఏజీఆర్) 10-11 శాతంగా నమోదు కావొచ్చు. కరోనా ముందు ఇది 5 శాతానికి దరిదాపుల్లోనే ఉంది.
- భారతీయ విమాన కంపెనీలు గత 15 నెలల్లో కొత్తగా 55 అంతర్జాతీయ మార్గాలను జత చేసుకోవడంతో, మొత్తం సంఖ్య 300కు చేరింది. అమెరికా, ఐరోపా, ఆస్ట్రేలియాకు నేరుగా సర్వీసుల ప్రారంభమూ కలిసొస్తోంది.
- మన ప్రయాణికులు దేశీయ నగరాల నుంచి, ఇబ్బంది పడకుండా అంతర్జాతీయ గమ్యస్థానానికి చేరేందుకు అవసరమయ్యే అనుసంధానత కోసం విదేశీ విమాన కంపెనీలతో కోడ్షేర్ ఒప్పందాలు కుదుర్చుకోవడమూ మన సంస్థలకు ప్రయోజనాన్ని చేకూర్చబోతోంది. ఇందువల్ల చిన్న నగరాల నుంచి ఒకే టికెట్పై అంతర్జాతీయ గమ్యానికి చేరే సదుపాయం కల్పించడంలో, విదేశీ విమానయాన కంపెనీలపై మన సంస్థలు పైచేయి సాధిస్తున్నాయి.
- చిన్న, పెద్ద స్థాయి విమానాలు సమకూర్చుకునేందుకు పెట్టుబడులు పెట్టడం; కీలక, సుదూర గమ్యస్థానాలకు నాన్-స్టాప్ విమానాలను ఆవిష్కరించడం; కొత్త అంతర్జాతీయ మార్గాలను ప్రారంభించడంతో అంతర్జాతీయ ప్రయాణాల్లో తమ వాటాను దేశీయ కంపెనీలు పదిలపరుచుకుంటున్నాయి. నీ భౌగోళికంగా భారత్ స్థానం కూడా అంతర్జాతీయ ప్రయాణాలకు కేంద్రంగా మారేందుకు ఉపయోగపడుతోంది.
ఇండిగో నుంచి 30 ఏ350-900 విమానాలకు ఆర్డర్: ఎయిర్బస్
దిల్లీ: అంతర్జాతీయ విమాన సర్వీసులు పెంచుకునేందుకు సన్నాహాలు చేస్తున్న ఇండిగో, ఇందుకోసం ఎయిర్బస్కు 30 పెద్ద (వైడ్బాడీ) విమానాలకు ఆర్డరు ఇచ్చింది. 300-410 సీట్లు ఉండే ఏ350-900 విమానాల కోసం ఇండిగో నుంచి కచ్చితమైన ఆర్డర్ లభించినట్లు విమాన తయారీ సంస్థ ఎయిర్బస్ సోమవారం ప్రకటించింది. 2027 సంవత్సరం నుంచి ఇవి సరఫరా కానున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎయిర్లైన్స్ లాభాల్లో బిగ్ జంప్.. ఉద్యోగులకు 8 నెలల జీతం బోనస్..
అంచనాలకు మించి లాభాలు నమోదు చేయడంతో సింగపూర్ ఎయిర్లైన్స్ తన ఉద్యోగులకు 8 నెలల జీతాన్ని బోనస్గా అందిస్తున్నట్లు ప్రకటించింది. -
అందుకే భారత్తో వాణిజ్య బంధం తెగిపోయింది: పాక్
Pakistan: పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్ మధ్య సంబంధాలు క్షీణించిన విషయం తెలిసిందే. ఇరు దేశాల మధ్య వాణిజ్యం సైతం దెబ్బతింది. తాజాగా దీనిపై ఆ దేశ విదేశాంగ మంత్రి స్పందించారు. -
Artificial Intelligence: ఎటు చూసినా ఏఐ...
మనదేశంలో ఏఐ (కృత్రిమ మేధ) వినియోగం శరవేగంగా పెరుగుతోంది. కార్యాలయాల్లో అధిక శాతం ఉద్యోగులు ఈ నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సమర్థంగా సేవలు అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. -
స్టాక్ మార్కెట్.. ఎఫ్అండ్ఓపై ఎందుకింత మోజు..?
దేశంలో పొదుపు మొత్తాలు ఎఫ్అండ్ఓ (ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్) ట్రేడ్లోకి వెళ్తున్నాయని, దీనిపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోందని కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారుడు వి.అనంత నాగేశ్వరన్ అన్నారు. -
మన సమాచారం సురక్షితమేనా?
దేశంలో డిజిటల్ ఆర్థిక లావాదేవీలు విపరీతంగా పెరుగుతున్నాయి. అదే సమయంలో సైబర్ నేరాల సంఖ్యా అధికమవుతోంది. వీటిని నివారించేందుకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఎప్పటికప్పుడు తమ వివరాల్లో మార్పులేమైనా ఉంటే సమర్పించాలని ఖాతాదారులను కోరుతున్నాయి. -
ఐసీఐసీఐ మాజీ ఛైర్మన్ వాఘుల్ కన్నుమూత
ప్రభుత్వ రంగంలోని ఐసీసీఐని ప్రైవేటు సంస్థగా మార్చడంలో కీలక పాత్ర పోషించిన నారాయణ్ వాఘుల్ (88) ఆరోగ్య సమస్యలతో శనివారం చెన్నైలోని ఒక ఆసుపత్రిలో మరణించారు. బ్యాంకింగ్ పరిశ్రమలో ఆయన ప్రస్థానం 1960లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రారంభమైంది. -
ఓయో ఐపీఓ దరఖాస్తు ఉపసంహరణ!
తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) కోసం సెబీకి సమర్పించిన దరఖాస్తును ఓయో ఉపసంహరించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కంపెనీ రీఫైనాన్సింగ్ ప్రణాళికను ఖరారు చేసే పనిలో ఉందని.. ఈ ప్రక్రియ పూర్తయ్యాక తిరిగి ఐపీఓకు దరఖాస్తు చేసే యోచనలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
ఆభరణాల దిగుమతులు భారీగా పెరిగాయ్
ఈ ఏడాది ఏప్రిల్లో దేశంలోకి పసిడి ఆభరణాల దిగుమతులు భారీగా పెరిగి రూ.2225 కోట్ల (268.04 మిలియన్ డాలర్ల) స్థాయికి చేరాయని జెమ్ అండ్ జువెలరీ ఎగుమతుల ప్రోత్సాహక మండలి తెలిపింది. 2023 ఏప్రిల్లో ఇవి సుమారుగా రూ.267 కోట్ల (32.12 మిలియన్ డాలర్ల) స్థాయిలోనే ఉన్నాయి. -
చైనా ఈవీలు, లోహాలపై దిగుమతి సుంకాల పెంపు
చైనాలో తయారయ్యే విద్యుత్ వాహనాలు (ఈవీ), అత్యాధునిక బ్యాటరీలు, సోలార్ సెల్స్, వైద్య సామగ్రితో పాటు అక్కడ నుంచి దిగుమతి అయ్యే ఉక్కు, అల్యూమినియంపై కొత్త టారిఫ్లు విధిస్తామని బైడెన్ ప్రభుత్వం ప్రకటించింది. -
ప్రత్యేక ట్రేడింగ్లో స్వల్ప లాభాలు
విదేశీ మదుపర్ల కొనుగోళ్ల మద్దతుతో ప్రత్యేక ట్రేడింగ్ సెషన్లో సూచీలు స్వల్ప లాభాలతో ముగిశాయి. ప్రాథమిక సైట్లో వైఫల్యం తలెత్తినా ఎదుర్కొనేందుకు వాటి సంసిద్ధతను తనిఖీ చేయడానికి బీఎస్ఈ, ఎన్ఎస్ఈలు ఈ ప్రత్యేక ట్రేడింగ్ సెషన్ను శనివారం రెండు దఫాలుగా నిర్వహించాయి. -
వ్యవసాయ అంకురాలు దూసుకెళ్తున్నాయ్
అనుకూల వ్యాపార విధానాలు, ప్రభుత్వ మద్దతు కారణంగా గత తొమ్మిదేళ్లలో వ్యవసాయ - అనుబంధ రంగాల్లో అంకురాల సంఖ్య దాదాపు 7,000కు పైగా పెరిగిందని అఖిల భారత రైతు సంఘాల సమాఖ్య (ఫైఫా) వెల్లడించింది. -
సంక్షిప్త వార్తలు
దొడ్ల డెయిరీ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ.787.4 కోట్ల ఆదాయం, రూ.46.8 కోట్ల నికర లాభం, రూ.7.79 ఈపీఎస్ నమోదు చేసింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఆదాయం రూ.724.3 కోట్లు, నికరలాభం రూ.22.5 కోట్లు, ఈపీఎస్ రూ.3.76 ఉన్నాయి. -
50ఎంపీ సెల్ఫీ కెమెరాతో టెక్నో నుంచి రెండు కొత్త మొబైల్స్
Tecno: టెక్నో కెమన్ సిరీస్లో రెండు కొత్త మొబైల్స్ను లాంచ్ చేసింది. వాటి ధర, ఫీచర్ల విషయాలపై ఓ లుక్కేద్దాం..
తాజా వార్తలు (Latest News)
-
శ్రీశైలంలో భక్తులకు చుక్కలు చూపించిన ట్రాఫిక్
-
ఆర్సీబీ ఇంపాక్ట్ ప్లేయర్గా క్రిస్గేల్: జెర్సీ ఇంకా ఫిట్గానే ఉందన్న యూనివర్స్ బాస్
-
రిషి సునాక్ దంపతుల సంపద.. రాజు ఆస్తుల కంటే ఎక్కువ!
-
ధోనీపై కమల్ ప్రశంసలు.. క్రిస్గేల్తో రిషబ్ ఫొటో
-
ఎయిర్లైన్స్ లాభాల్లో బిగ్ జంప్.. ఉద్యోగులకు 8 నెలల జీతం బోనస్..
-
బలహీనపడిన ఆవర్తనం.. తెలంగాణలో మరో 3 రోజుల పాటు వర్షాలు