పెద్ద షేర్లలో లాభాల స్వీకరణ
సూచీల్లో అధిక వెయిటేజీ కలిగిన ఎస్బీఐ, రిలయన్స్ వంటి షేర్లకు లాభాల స్వీకరణ ఎదురుకావడంతో సోమవారం సూచీలు స్తబ్దుగా ముగిశాయి. కొన్ని ఎఫ్ఎమ్సీజీ, ఐటీ, ఔషధ షేర్లు మాత్రం రాణించాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 7 పైసలు తగ్గి 83.52 వద్ద ముగిసింది.
సమీక్ష
సూచీల్లో అధిక వెయిటేజీ కలిగిన ఎస్బీఐ, రిలయన్స్ వంటి షేర్లకు లాభాల స్వీకరణ ఎదురుకావడంతో సోమవారం సూచీలు స్తబ్దుగా ముగిశాయి. కొన్ని ఎఫ్ఎమ్సీజీ, ఐటీ, ఔషధ షేర్లు మాత్రం రాణించాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 7 పైసలు తగ్గి 83.52 వద్ద ముగిసింది. బ్యారెల్ ముడిచమురు 0.80% పెరిగి 83.62 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లలో షాంఘై, హాంకాంగ్ లాభపడ్డాయి. జపాన్, కొరియా సూచీలు పనిచేయలేదు. ఐరోపా మార్కెట్లు మెరిశాయి.
సెన్సెక్స్ ఉదయం 74,196.68 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 74,359.69 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకిన సూచీ, అమ్మకాలతో 73,786.29 పాయింట్లకు పడిపోయింది. చివరకు 17.39 పాయింట్లు పెరిగి 73,895.54 వద్ద ముగిసింది. నిఫ్టీ 33.15 పాయింట్లు తగ్గి 22,442.70 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 22,409.45- 22,588.80 పాయింట్ల మధ్య కదలాడింది.
- త్రైమాసిక లాభం 25% పెరగడంతో కోటక్ మహీంద్రా బ్యాంక్ షేరు 5.01% పరుగులు తీసి రూ.1,624.75 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.15,406.39 కోట్లు పెరిగి రూ.3.22 లక్షల కోట్లకు చేరింది.
- మార్చి త్రైమాసిక ఫలితాలు నిరాశపరచడంతో టైటన్ షేరు ఒకదశలో 7.87% నష్టపోయి రూ.3,257.05కు చేరింది. చివరకు 7.18% కోల్పోయి రూ.3,281.65 దగ్గర స్థిరపడింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.22,527.56 కోట్లు తగ్గి రూ.2.91 లక్షల కోట్లకు చేరింది.
- అమల్లో ఉన్న ప్రాజెక్టులకు ఇచ్చే రుణాల నిబంధనలను కఠినతరం చేయాలని ఆర్బీఐ ప్రతిపాదించడంతో ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లు నీరసపడ్డాయి. పీఎన్బీ 6.41%, కెనరా బ్యాంక్ 5.42%, బ్యాంక్ ఆఫ్ బరోడా 3.71%, సెంట్రల్ బ్యాంక్ 3.12%, బ్యాంక్ ఆఫ్ ఇండియా 2.57% కుదేలయ్యాయి. విద్యుత్ రుణ కంపెనీలు పీఎఫ్సీ 8.93%, ఆర్ఈసీ 7.35% క్షీణించాయి.
- సెన్సెక్స్ 30 షేర్లలో 19 లాభపడ్డాయి. టీసీఎస్ 2.12%, హెచ్యూఎల్ 1.80%, ఎం అండ్ ఎం 1.45%, సన్ఫార్మా 1.41%, ఇండస్ఇండ్ బ్యాంక్ 1.06%, టెక్ మహీంద్రా 1.01%, హెచ్సీఎల్ టెక్ 0.89% పెరిగాయి. ఎస్బీఐ 2.86%, ఎన్టీపీసీ 2.31%, పవర్గ్రిడ్ 1.22%, ఎల్ అండ్ టీ 1.06%, బజాజ్ ఫైనాన్స్ 1.03%, రిలయన్స్ 1.03% నష్టపోయాయి. రంగాల వారీ సూచీల్లో.. మన్నికైన వినిమయ వస్తువులు 3.85%, సేవలు 1.95%, యుటిలిటీస్ 1.76%, విద్యుత్ 1.26%, పరిశ్రమలు 0.80%, కమొడిటీస్ 0.78% డీలాపడ్డాయి. ఆరోగ్య సంరక్షణ, ఐటీ, వాహన, స్థిరాస్తి, టెక్ రాణించాయి. బీఎస్ఈలో 1207 షేర్లు లాభాల్లో ముగియగా, 2726 స్క్రిప్లు నష్టపోయాయి. 161 షేర్లలో ఎటువంటి మార్పు లేదు.
- 6 ఏళ్ల గరిష్ఠానికి పీ-నోట్ పెట్టుబడులు: దేశీయ స్టాక్ మార్కెట్లలో పార్టిసిపేటరీ నోట్ల (పీ-నోట్లు) ద్వారా వచ్చిన పెట్టుబడులు ఫిబ్రవరి చివరకు ఆరేళ్ల గరిష్ఠమైన రూ.1.5 లక్షల కోట్లకు చేరాయి. 2024 జనవరిలో రూ.1,43,011 కోట్లుగా ఉన్న పెట్టుబడులు, ఫిబ్రవరి ముగిసేసరికి రూ.1,49,517 కోట్లుగా నమోదయ్యాయి. అంతకు ముందు 2017 జూన్లో అత్యధికంగా పీ-నోట్ పెట్టుబడులు రూ.1.65 లక్షల కోట్లకు చేరాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో వచ్చిన రూ.1.50 లక్షల కోట్లలో.. ఈక్విటీల్లోకి రూ.1.27 లక్షల కోట్లు, డెట్లోకి రూ.21,303 కోట్లు, హైబ్రిడ్ సెక్యూరిటీల్లోకి రూ.541 కోట్లు వచ్చాయి.
- కంపెనీ సీఈఓగా అభయ్ ఓజాను తొలగించినట్లు జీ మీడియా కార్పొరేషన్ ప్రకటించింది. మే 4 నుంచి ఇది అమల్లోకి వచ్చిందని తెలిపింది. ఇందుకు కారణాలను వెల్లడించలేదు.
- ఐపీఓ ద్వారా నిధులు సమీకరించేందుకు, పుణె కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ఆన్లైన్ ఇ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫస్ట్క్రై మాతృసంస్థ బ్రెయిన్బీస్ సొల్యూషన్స్ సెబీ వద్ద ముసాయిదా పత్రాలను మళ్లీ దాఖలు చేసింది. అదనపు సమాచారాన్ని కోరుతూ మళ్లీ పత్రాలను దాఖలు చేయమని బ్రెయిన్బీస్ను సెబీ గతంలో ఆదేశించింది. రూ1816 కోట్ల విలువైన తాజా షేర్లతో పాటు ప్రస్తుత వాటాదార్లకు చెందిన 5.44 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్లో విక్రయించాలన్నది ప్రతిపాదన.
- ఎనర్జీ మిషన్ మెషినరీస్ (ఇండియా) ఐపీఓ ఈనెల 9న ప్రారంభమై 13న ముగియనుంది. ఇందుకు ధరల శ్రేణిగా రూ.131-138ను నిర్ణయించారు. గరిష్ఠ ధర వద్ద కంపెనీ రూ.41.15 కోట్లు సమీకరించనుంది. ఐపీఓ అనంతరం కంపెనీ షేర్లు ఎన్ఎస్ఈ ఎస్ఎమ్ఈ ప్లాట్ఫామ్పై నమోదుకానున్నాయి. రిటైల్ మదుపర్లు కనీసం 1000 షేర్లకు దరఖాస్తు చేసుకోవాలి.
నేటి బోర్డు సమావేశాలు: డాక్టర్ రెడ్డీస్, పిడిలైట్, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, యునైటెడ్ బ్రూవరీస్, వోల్టాస్, ఐడీఎఫ్సీ, ఛంబల్ ఫెర్టిలైజర్స్, గ్రాఫైట్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎయిర్లైన్స్ లాభాల్లో బిగ్ జంప్.. ఉద్యోగులకు 8 నెలల జీతం బోనస్..
అంచనాలకు మించి లాభాలు నమోదు చేయడంతో సింగపూర్ ఎయిర్లైన్స్ తన ఉద్యోగులకు 8 నెలల జీతాన్ని బోనస్గా అందిస్తున్నట్లు ప్రకటించింది. -
అందుకే భారత్తో వాణిజ్య బంధం తెగిపోయింది: పాక్
Pakistan: పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్ మధ్య సంబంధాలు క్షీణించిన విషయం తెలిసిందే. ఇరు దేశాల మధ్య వాణిజ్యం సైతం దెబ్బతింది. తాజాగా దీనిపై ఆ దేశ విదేశాంగ మంత్రి స్పందించారు. -
Artificial Intelligence: ఎటు చూసినా ఏఐ...
మనదేశంలో ఏఐ (కృత్రిమ మేధ) వినియోగం శరవేగంగా పెరుగుతోంది. కార్యాలయాల్లో అధిక శాతం ఉద్యోగులు ఈ నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సమర్థంగా సేవలు అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. -
స్టాక్ మార్కెట్.. ఎఫ్అండ్ఓపై ఎందుకింత మోజు..?
దేశంలో పొదుపు మొత్తాలు ఎఫ్అండ్ఓ (ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్) ట్రేడ్లోకి వెళ్తున్నాయని, దీనిపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోందని కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారుడు వి.అనంత నాగేశ్వరన్ అన్నారు. -
మన సమాచారం సురక్షితమేనా?
దేశంలో డిజిటల్ ఆర్థిక లావాదేవీలు విపరీతంగా పెరుగుతున్నాయి. అదే సమయంలో సైబర్ నేరాల సంఖ్యా అధికమవుతోంది. వీటిని నివారించేందుకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఎప్పటికప్పుడు తమ వివరాల్లో మార్పులేమైనా ఉంటే సమర్పించాలని ఖాతాదారులను కోరుతున్నాయి. -
ఐసీఐసీఐ మాజీ ఛైర్మన్ వాఘుల్ కన్నుమూత
ప్రభుత్వ రంగంలోని ఐసీసీఐని ప్రైవేటు సంస్థగా మార్చడంలో కీలక పాత్ర పోషించిన నారాయణ్ వాఘుల్ (88) ఆరోగ్య సమస్యలతో శనివారం చెన్నైలోని ఒక ఆసుపత్రిలో మరణించారు. బ్యాంకింగ్ పరిశ్రమలో ఆయన ప్రస్థానం 1960లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రారంభమైంది. -
ఓయో ఐపీఓ దరఖాస్తు ఉపసంహరణ!
తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) కోసం సెబీకి సమర్పించిన దరఖాస్తును ఓయో ఉపసంహరించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కంపెనీ రీఫైనాన్సింగ్ ప్రణాళికను ఖరారు చేసే పనిలో ఉందని.. ఈ ప్రక్రియ పూర్తయ్యాక తిరిగి ఐపీఓకు దరఖాస్తు చేసే యోచనలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
ఆభరణాల దిగుమతులు భారీగా పెరిగాయ్
ఈ ఏడాది ఏప్రిల్లో దేశంలోకి పసిడి ఆభరణాల దిగుమతులు భారీగా పెరిగి రూ.2225 కోట్ల (268.04 మిలియన్ డాలర్ల) స్థాయికి చేరాయని జెమ్ అండ్ జువెలరీ ఎగుమతుల ప్రోత్సాహక మండలి తెలిపింది. 2023 ఏప్రిల్లో ఇవి సుమారుగా రూ.267 కోట్ల (32.12 మిలియన్ డాలర్ల) స్థాయిలోనే ఉన్నాయి. -
చైనా ఈవీలు, లోహాలపై దిగుమతి సుంకాల పెంపు
చైనాలో తయారయ్యే విద్యుత్ వాహనాలు (ఈవీ), అత్యాధునిక బ్యాటరీలు, సోలార్ సెల్స్, వైద్య సామగ్రితో పాటు అక్కడ నుంచి దిగుమతి అయ్యే ఉక్కు, అల్యూమినియంపై కొత్త టారిఫ్లు విధిస్తామని బైడెన్ ప్రభుత్వం ప్రకటించింది. -
ప్రత్యేక ట్రేడింగ్లో స్వల్ప లాభాలు
విదేశీ మదుపర్ల కొనుగోళ్ల మద్దతుతో ప్రత్యేక ట్రేడింగ్ సెషన్లో సూచీలు స్వల్ప లాభాలతో ముగిశాయి. ప్రాథమిక సైట్లో వైఫల్యం తలెత్తినా ఎదుర్కొనేందుకు వాటి సంసిద్ధతను తనిఖీ చేయడానికి బీఎస్ఈ, ఎన్ఎస్ఈలు ఈ ప్రత్యేక ట్రేడింగ్ సెషన్ను శనివారం రెండు దఫాలుగా నిర్వహించాయి. -
వ్యవసాయ అంకురాలు దూసుకెళ్తున్నాయ్
అనుకూల వ్యాపార విధానాలు, ప్రభుత్వ మద్దతు కారణంగా గత తొమ్మిదేళ్లలో వ్యవసాయ - అనుబంధ రంగాల్లో అంకురాల సంఖ్య దాదాపు 7,000కు పైగా పెరిగిందని అఖిల భారత రైతు సంఘాల సమాఖ్య (ఫైఫా) వెల్లడించింది. -
సంక్షిప్త వార్తలు
దొడ్ల డెయిరీ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ.787.4 కోట్ల ఆదాయం, రూ.46.8 కోట్ల నికర లాభం, రూ.7.79 ఈపీఎస్ నమోదు చేసింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఆదాయం రూ.724.3 కోట్లు, నికరలాభం రూ.22.5 కోట్లు, ఈపీఎస్ రూ.3.76 ఉన్నాయి. -
50ఎంపీ సెల్ఫీ కెమెరాతో టెక్నో నుంచి రెండు కొత్త మొబైల్స్
Tecno: టెక్నో కెమన్ సిరీస్లో రెండు కొత్త మొబైల్స్ను లాంచ్ చేసింది. వాటి ధర, ఫీచర్ల విషయాలపై ఓ లుక్కేద్దాం..
తాజా వార్తలు (Latest News)
-
రాయ్బరేలీలో రాహుల్ పోటీ.. సోనియాపై ప్రధాని విమర్శలు
-
శ్రీశైలంలో భక్తులకు చుక్కలు చూపించిన ట్రాఫిక్
-
ఆర్సీబీ ఇంపాక్ట్ ప్లేయర్గా క్రిస్గేల్: జెర్సీ ఇంకా ఫిట్గానే ఉందన్న యూనివర్స్ బాస్
-
రిషి సునాక్ దంపతుల సంపద.. రాజు ఆస్తుల కంటే ఎక్కువ!
-
ధోనీపై కమల్ ప్రశంసలు.. క్రిస్గేల్తో రిషబ్ ఫొటో
-
ఎయిర్లైన్స్ లాభాల్లో బిగ్ జంప్.. ఉద్యోగులకు 8 నెలల జీతం బోనస్..