Sundar Pichai : వావ్.. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా!
బెంగళూరుకు (Bengaluru) చెందిన ఓ టెకీ (Techie) అమెరికా (America) వెళ్లారు. శాన్ఫ్రాన్సిస్కో వీధుల్లో గూగుల్ (Google) సీఈవో సుందర్ పిచాయ్ (Sundar Pichai) ఆయనకు ఎదురు కావడంతో ఆశ్చర్యపోయారు.
Image : PuriSid
ఇంటర్నెట్ డెస్క్ : సుందర్ పిచాయ్ (Sundar Pichai).. ఐటీ రంగం నిపుణులకు స్ఫూర్తినిచ్చే పేరు. భారత్ (India) నుంచి అమెరికా (America) వెళ్లి అక్కడి దిగ్గజ కంపెనీల్లో ఒకటైన గూగుల్కు సీఈవో అయ్యారు. అలాంటి టెక్ టైటాన్ ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా అమెరికా వీధుల్లో తిరుగుతుంటారని ఎవరు ఊహిస్తారు చెప్పండి. అయితే, ఓ బెంగళూరు టెకీకి ఆయన అలా ఎదురుకావడంతో ఆశ్చర్యపోయారు. వెంటనే సార్ మీతో ఓ ఫొటో తీసుకోవచ్చా అని అడిగారు. దానికి పిచాయ్ కూడా ఓకే చెప్పారు. ప్రస్తుతం ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. సుందర్ పిచాయ్ సింప్లిసిటీని మెచ్చుకుంటూ పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
₹12వేలకే లావా 5జీ ఫోన్.. రిపేరైతే ఇంటికొచ్చి సర్వీస్!
బెంగళూరుకు చెందిన టెకీ సిద్ పురి రీటూల్ అనే కంపెనీలో పనిచేస్తున్నారు. గత వారం ఆయన ఆమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో వెళ్లారు. అక్కడ సరదాగా వాకింగ్ చేస్తుండగా గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కనిపించారు. సిద్ వెంటనే సుందర్ పిచాయ్ను రిక్వెస్ట్ చేసి ఓ ఫొటో దిగారు. ఆ ఫొటోను సిద్ తాజాగా ట్విటర్, లింక్డ్ ఇన్లో పోస్టు చేయగా.. అది వైరల్గా మారింది. ఫొటోలో సుందర్ పిచాయ్ బ్లూ జీన్స్, జాకెట్, బ్లాక్ సన్ గ్లాసెస్ ధరించి కనిపిస్తున్నారు. దాంతో సుందర్ పిచాయ్ సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సెక్యూరిటీ ఎవరూ లేరా? అని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. తోడుగా ఉన్న ఒకే ఒక సెక్యూరిటీ ఆ ఫొటో తీశాడని సిద్ బదులిచ్చారు.
‘వావ్ సుందర్ పిచాయ్ ఎలాంటి సెక్యూరిటీ లేకుండానే అక్కడి వీధుల్లో నడుస్తున్నారా? ఆయన సాదాసీదాగా కనిపించడం చూస్తే సంతోషంగా ఉంది. అయితే సెక్యూరిటీ లేకుండా తిరగడం కొంత ఆందోళన కూడా కలిగిస్తోందని’ ఓ నెటిజన్ పేర్కొన్నాడు. ‘ఆయన పిక్సెల్ 8 ఫోన్ వాడుతున్నారా?’ అని మరో నెటిజన్ సరదాగా చమత్కరించాడు. మదురైలో పుట్టిన సుందర్ పిచాయ్ ఐఐటీ ఖరగ్పుర్లో ఇంజినీరింగ్ చదివారు. ఆ తరువాత అమెరికా వెళ్లి గూగుల్, దాని మాతృసంస్థ ఆల్ఫాబెట్ సీఈవో స్థాయికి ఎదిగారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రూ.49కే బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ సబ్స్క్రిప్షన్
BSNL Cinemaplus: బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ పేరిట ఓటీటీ ప్యాకేజీలను అందిస్తోంది. దీంట్లో మొత్తం మూడు ప్యాక్లు ఉన్నాయి. తాజాగా స్టార్టర్ ప్యాక్ ధరను సంస్థ కుదించింది. -
వేసవిలో ఫోన్ ఛార్జింగ్ వేగం తగ్గుతుంది..? ఎందుకు?
వేసవిలో స్మార్ట్ఫోన్ ఛార్జింగ్లో వేగం మందగిస్తుంది. దీనికి కారణమేంటి? ఎందుకు వేగం తగ్గుతుంది? -
ఐసీఐసీఐ లాభం రూ.11,672 కోట్లు
ఐసీఐసీఐ బ్యాంక్ ఆర్థిక ఫలితాలకు తక్కువ కేటాయింపులు కలిసివచ్చాయి. దీంతో మార్చి త్రైమాసికంలో బ్యాంక్ ఏకీకృత నికర లాభం 18.5 శాతం వృద్ధి చెంది రూ.11,672 కోట్లకు చేరుకుంది. -
ఒకే పాలసీలోనే అన్ని ధీమాలు
అందరికీ బీమా పాలసీలను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఐఆర్డీఏఐ) ఒక ప్రామాణిక పాలసీ ‘బీమా విస్తార్’ను అందుబాటులోకి తీసుకురానుంది. -
హైదరాబాద్లో కార్యాలయాల అద్దె లావాదేవీలు పెరిగాయ్
కార్పొరేట్ల నుంచి గిరాకీ స్థిరంగా ఉండటంతో ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో కార్యాలయాల అద్దె లావాదేవీలు 13 శాతం వృద్ధితో 1.34 కోట్ల చదరపు అడుగులకు చేరిందని స్థిరాస్తి సేవలను అందించే వెస్టియన్ తెలిపింది. -
మ్యూచువల్ ఫండ్ కొత్త పథకాల్లోకి రూ.66,364 కోట్లు
గత ఆర్థిక సంవత్సరంలో మ్యూచువల్ ఫండ్ సంస్థలు(ఏఎంసీ) 185 కొత్త పథకాలను(ఎన్ఎఫ్ఓ-న్యూ ఫండ్ ఆఫర్) విడుదల చేశాయి. -
వైద్య ఉత్పత్తుల రంగంలో భారత్ కీలకం
వైద్య ఉత్పత్తుల రంగంలో భారతదేశానికి ఎంతో ముఖ్యమైన బాధ్యత ఉన్నట్లు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్ఎఫ్డీఏ) కమిషనర్ డాక్టర్ రాబర్ట్ కాలిఫ్ అన్నారు. -
ఆర్బీఎల్ బ్యాంక్ లాభంలో 30% వృద్ధి
జనవరి- మార్చి త్రైమాసికంలో ఆర్బీఎల్ బ్యాంక్ నికర లాభం 30 శాతం పెరిగి రూ.353 కోట్లకు చేరింది. -
యెస్ బ్యాంక్ లాభం రెట్టింపు
జనవరి- మార్చి త్రైమాసికంలో యెస్ బ్యాంక్ నికర లాభం స్టాండలోన్ పద్ధతిలో రూ.452 కోట్లుగా నమోదైంది. -
పూరీ విమానాశ్రయం ప్రాజెక్టు పోటీలో జీఎంఆర్, అదానీ గ్రూపు, ఫెయిర్ఫాక్స్?
ఒడిశా రాష్ట్రంలోని పూరీలో కొత్త విమానాశ్రయాన్ని నిర్మించి, నిర్వహించే అవకాశం కోసం జీఎంఆర్, అదానీ గ్రూపు, విదేశీ సంస్థ అయిన ఫెయిర్ఫాక్స్ పోటీ పడుతున్నాయి. -
భారత్లో షార్ప్ సెమీ కండక్టర్ల యూనిట్
జపాన్ ఎలక్ట్రానిక్ దిగ్గజం షార్ప్ దేశంలో సెమీకండక్టర్ ఫ్యాబ్ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. -
సంక్షిప్త వార్తలు
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సీకే బిర్లా గ్రూపు కంపెనీ, హెచ్ఐఎల్ లిమిటెడ్, పైపులు- ఫిట్టింగ్స్ వ్యాపారంలోకి విస్తరిస్తోంది. -
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
ఐటీ రంగంలో ఉద్యోగుల సంఖ్య నానాటికీ తగ్గుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో టాప్-5 ఐటీ సంస్థల్లోనే ఉద్యోగుల సంఖ్య 69 వేల వరకు తగ్గింది. -
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
Amazon: అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ వచ్చేసింది. మే 2 నుంచి ఈ సేల్ ప్రారంభం కానుందని ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
టాలీవుడ్లో చరిత్ర లిఖించిన రోజు.. ఎన్ని బ్లాక్బస్టర్లు విడుదలయ్యాయంటే?
-
శంషాబాద్ ఎయిర్పోర్టు సమీపంలో చిరుత సంచారం!
-
రూ.49కే బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ సబ్స్క్రిప్షన్
-
నవాబులు, సుల్తాన్ల అరాచకాలపై మౌనమా?: రాహుల్పై మోదీ ధ్వజం
-
ధోనీ ‘ఐపీఎల్’ జర్నీ సక్సెస్కు కారణమిదే!
-
పండుగాడికి పద్దెనిమిదేళ్లు .. ‘పోకిరి’ ఆసక్తికర విశేషాలు..