Sundar Pichai : వావ్.. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా!
బెంగళూరుకు (Bengaluru) చెందిన ఓ టెకీ (Techie) అమెరికా (America) వెళ్లారు. శాన్ఫ్రాన్సిస్కో వీధుల్లో గూగుల్ (Google) సీఈవో సుందర్ పిచాయ్ (Sundar Pichai) ఆయనకు ఎదురు కావడంతో ఆశ్చర్యపోయారు.
Image : PuriSid
ఇంటర్నెట్ డెస్క్ : సుందర్ పిచాయ్ (Sundar Pichai).. ఐటీ రంగం నిపుణులకు స్ఫూర్తినిచ్చే పేరు. భారత్ (India) నుంచి అమెరికా (America) వెళ్లి అక్కడి దిగ్గజ కంపెనీల్లో ఒకటైన గూగుల్కు సీఈవో అయ్యారు. అలాంటి టెక్ టైటాన్ ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా అమెరికా వీధుల్లో తిరుగుతుంటారని ఎవరు ఊహిస్తారు చెప్పండి. అయితే, ఓ బెంగళూరు టెకీకి ఆయన అలా ఎదురుకావడంతో ఆశ్చర్యపోయారు. వెంటనే సార్ మీతో ఓ ఫొటో తీసుకోవచ్చా అని అడిగారు. దానికి పిచాయ్ కూడా ఓకే చెప్పారు. ప్రస్తుతం ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. సుందర్ పిచాయ్ సింప్లిసిటీని మెచ్చుకుంటూ పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
₹12వేలకే లావా 5జీ ఫోన్.. రిపేరైతే ఇంటికొచ్చి సర్వీస్!
బెంగళూరుకు చెందిన టెకీ సిద్ పురి రీటూల్ అనే కంపెనీలో పనిచేస్తున్నారు. గత వారం ఆయన ఆమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో వెళ్లారు. అక్కడ సరదాగా వాకింగ్ చేస్తుండగా గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కనిపించారు. సిద్ వెంటనే సుందర్ పిచాయ్ను రిక్వెస్ట్ చేసి ఓ ఫొటో దిగారు. ఆ ఫొటోను సిద్ తాజాగా ట్విటర్, లింక్డ్ ఇన్లో పోస్టు చేయగా.. అది వైరల్గా మారింది. ఫొటోలో సుందర్ పిచాయ్ బ్లూ జీన్స్, జాకెట్, బ్లాక్ సన్ గ్లాసెస్ ధరించి కనిపిస్తున్నారు. దాంతో సుందర్ పిచాయ్ సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సెక్యూరిటీ ఎవరూ లేరా? అని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. తోడుగా ఉన్న ఒకే ఒక సెక్యూరిటీ ఆ ఫొటో తీశాడని సిద్ బదులిచ్చారు.
‘వావ్ సుందర్ పిచాయ్ ఎలాంటి సెక్యూరిటీ లేకుండానే అక్కడి వీధుల్లో నడుస్తున్నారా? ఆయన సాదాసీదాగా కనిపించడం చూస్తే సంతోషంగా ఉంది. అయితే సెక్యూరిటీ లేకుండా తిరగడం కొంత ఆందోళన కూడా కలిగిస్తోందని’ ఓ నెటిజన్ పేర్కొన్నాడు. ‘ఆయన పిక్సెల్ 8 ఫోన్ వాడుతున్నారా?’ అని మరో నెటిజన్ సరదాగా చమత్కరించాడు. మదురైలో పుట్టిన సుందర్ పిచాయ్ ఐఐటీ ఖరగ్పుర్లో ఇంజినీరింగ్ చదివారు. ఆ తరువాత అమెరికా వెళ్లి గూగుల్, దాని మాతృసంస్థ ఆల్ఫాబెట్ సీఈవో స్థాయికి ఎదిగారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Tech tip: గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్.. స్పీడ్ చలాన్లకు ఇక చెక్
Google: గూగుల్ మ్యాప్స్లో కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా స్పీడ్ చలాన్లకు చెక్ పెట్టొచ్చు. ఇంతకీ ఈ ఫీచర్ ఎలా ఉపయోగపడుతుంది? ఎలా యాక్టివేట్ చేసుకోవాలి? -
రామలింగ రాజు, మరో నలుగురు రూ.624 కోట్లు లాభపడ్డారు
దాదాపు 14 ఏళ్ల నాటి సత్యం కంప్యూటర్ సర్వీసెస్ కేసులో, మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా) కీలక ఉత్తర్వులు ఇచ్చింది. -
జోష్
దేశ ఆర్థిక వ్యవస్థ సెప్టెంబరు త్రైమాసికంలో అంచనాలను మించి రాణించడంతో, శుక్రవారం స్టాక్ మార్కెట్లు దూసుకెళ్లాయి. నిఫ్టీ మరో కొత్త శిఖరానికి చేరగా.. మదుపర్ల సంపద రికార్డు గరిష్ఠాలను అధిరోహించింది -
వాహన అమ్మకాలకు పండగ హుషారు
ఈ ఏడాది నవంబరులో కంపెనీల నుంచి డీలర్లకు ప్రయాణికుల వాహనాల సరఫరా రికార్డు స్థాయిలో జరిగింది. పండగ సీజను గిరాకీకి తగ్గట్లుగా డీలర్లకు కంపెనీలు భారీగా వాహనాలను అందించాయి -
జీఎస్టీ వసూళ్లు రూ.1.68 లక్షల కోట్లు
నవంబరులో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు రూ.1.68 లక్షల కోట్లుగా నమోదయ్యాయని ఆర్థిక శాఖ వెల్లడించింది. 2022 నవంబరులో జీఎస్టీ వసూళ్లు రూ.1.45 లక్షల కోట్ల కంటే ఇవి 15 శాతం అధికం. ‘2023 నవంబరులో స్థూలంగా రూ.1,67,929 కోట్ల జీఎస్టీ వసూలైంది. -
భారత ఆర్థిక భవితపై సీఎఫ్ఓలు ఆశావహం
దేశ ఆర్థిక భవిష్యత్తుపై 94 శాతం భారత కంపెనీల ముఖ్య ఆర్థిక అధికారులు (సీఎఫ్ఓ) విశ్వాసం వ్యక్తం చేశారని డెలాయిట్ ఇండియా పేర్కొంది. ఆసియా పసిఫిక్ (అపాక్) ప్రాంతంలో ఇదే అత్యధిక ఆశావహ శాతమని వెల్లడించింది. -
న్యాయ సలహాదారును నియమించుకోనున్న రేమండ్ స్వతంత్ర డైరెక్టర్లు
రేమండ్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) గౌతమ్ సింఘానియా విడాకుల వివాదం వల్ల ఏర్పడ్డ పరిస్థితులను పరిశీలిస్తున్నామని ఆ కంపెనీ స్వతంత్ర డైరెక్టర్లు పేర్కొన్నారు. కంపెనీ వ్యవహారాలు, వ్యాపారంపై ప్రభావం పడకుండా చూడాలన్నది వీరి ఉద్దేశం. -
రూ.9,760 కోట్ల విలువైన రూ.2000 నోట్లు ఇంకా ప్రజల వద్దే
చలామణి నుంచి వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించిన రూ.2,000 నోట్లు ఇంకా పూర్తిగా బ్యాంకింగ్ వ్యవస్థలోకి రాలేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది -
డీప్ఫేక్ వీడియోలపై ఆసక్తి లేదు
డీప్ఫేక్ వీడియోలపై యూట్యూబ్కు ఎంతమాత్రం ఆసక్తి లేదని ఆ కంపెనీ ఇండియా డైరెక్టర్ ఇషాన్ జాన్ ఛటర్జీ పేర్కొన్నారు. తప్పుడు వార్తలు/సమాచారంతో అనుబంధం ఉండాలని మా భాగస్వాములెవరూ భావించడం లేదనీ తెలిపారు. -
ఒక కంపెనీకి ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వం
ఒక రంగంలోని సంస్థలన్నింటికీ ఒకే రకమైన ప్రోత్సాహకాలను ప్రభుత్వం ప్రకటిస్తుంది కానీ, ఒక విభాగంలోని ఒక కంపెనీకి ప్రత్యేకంగా ఎటువంటి రాయితీలను ఇవ్వదని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు -
రూ.22 పెరిగిన వాణిజ్య సిలిండర్
హోటళ్లు, రెస్టారెంట్ వంటి వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కిలోగ్రాముల గ్యాస్ సిలిండర్ ధర స్వల్పంగా పెరిగింది. ఈ సిలిండర్ ధర హైదరాబాద్లో రూ.2002 నుంచి రూ.22 పెరిగి రూ.2024 అయ్యింది. -
సంక్షిప్త వార్తలు(6)
హోండా మోటార్సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా(హెచ్ఎమ్ఎస్ఐ) తన హైనెస్ సీబీ350, సీబీ350ఆర్ఎస్ బైక్లను వెనక్కి పిలిపిస్తున్నట్లు శుక్రవారం పేర్కొంది.


తాజా వార్తలు (Latest News)
-
KRMB: సాగర్ ఘటన.. ముగిసిన జలశక్తి శాఖ కీలక సమావేశం
-
Tech tip: గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్.. స్పీడ్ చలాన్లకు ఇక చెక్
-
Aditya-L1: ‘ఆదిత్య-ఎల్ 1’లో రికార్డయిన సౌరగాలులు.. ఫొటో షేర్ చేసిన ఇస్రో
-
Modi-Meloni Selfie: మోదీ, మెలోనీ ‘మెలోడీ’ సెల్ఫీ చూశారా..?
-
SpiceJet: ఏడు గంటల ఆలస్యంగా ఎయిర్పోర్ట్కు విమానం.. గొడవకు దిగిన ప్రయాణికులు
-
Chandrababu: దుర్గమ్మ సేవలో చంద్రబాబు దంపతులు