Adani Group: ఆ నిధులన్నీ వాటాల విక్రయం ద్వారా వచ్చినవే.. రాహుల్ గాంధీకి ‘అదానీ’ కౌంటర్!
Adani Group: అన్ని లావాదేవీలను ఎప్పటికప్పుడు స్టాక్ ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన సమాచారం ద్వారా బహిర్గతం చేసినట్లు అదానీ గ్రూప్ తెలిపింది.
దిల్లీ: బిలియనీర్ గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ (Adani Group).. తమ కంపెనీల్లోకి వచ్చిన పెట్టుబడులపై కీలక ప్రకటన చేసింది. 2019 నుంచి తమ కంపెనీలు 2.87 బిలియన్ డాలర్లు విలువ చేసే వాటాలను విక్రయించినట్లు తెలిపింది. అందులో నుంచే 2.55 బిలియన్ డాలర్లు తమ ప్రమోటర్లు తిరిగి అదానీ గ్రూప్ (Adani Group) వ్యాపారాల్లోకి పెట్టుబడులుగా మళ్లించినట్లు తెలిపింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేస్తున్న ఆరోపణలకు బదులుగానే అదానీ గ్రూప్ తాజా వివరణ ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. అదానీ డొల్ల కంపెనీల్లోకి రూ.20,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయంటూ ఆయన పదే పదే ప్రశ్నిస్తున్న విషయం తెలిసిందే.
అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ గ్రీన్ ఎనర్జీ (AGEL) వంటి కంపెనీల్లో అబుదాబి కేంద్రం పనిచేస్తున్న ఇంటర్నేషనల్ హోల్డింగ్ కంపెనీ PJSC (IHC) 2.593 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టినట్లు అదానీ గ్రూప్ తెలిపింది. అలాగే అదానీ టోటల్ గ్యాస్, అదానీ గ్రీన్లో ప్రమోటర్లు 2.783 బిలియన్ డాలర్లు విలువ చేసే వాటాలను విక్రయించినట్లు వెల్లడించింది. ఈ నిధులనే ప్రమోటర్ సంస్థలు తిరిగి అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, అదానీ ట్రాన్స్మిషన్, అదానీ పవర్ వంటి పోర్ట్ఫోలియో కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసినట్లు తెలిపింది.
అదానీ డొల్ల కంపెనీల్లోకి అకస్మాత్తుగా రూ.20,000 కోట్లు వచ్చిపడ్డట్లు ఇటీవల ‘ఫైనాన్షియల్ టైమ్స్’ అనే పత్రిక కథనాన్ని ప్రచురించింది. దీని ఆధారంగానే రాహుల్ గాంధీ అదానీ గ్రూప్పై విమర్శలు చేసినట్లు తెలుస్తోంది. ‘‘అదానీ గ్రూప్ను కూల్చివేయడానికి జరుగుతున్న పోటీ ఆకర్షణీయంగా ఉండొచ్చు. కానీ, మేం నియంత్రణ సంస్థల నిబంధనలన్నింటినీ పాటిస్తున్నాం. అలాగే ప్రమోటర్ల వాటా, నిధుల సమీకరణకు సంబంధించి ఎలాంటి సమాచారాన్ని దాచిపెట్టడం లేదు’’ అని సోమవారం విడుదల చేసిన ప్రకటనలో అదానీ గ్రూప్ పేర్కొంది.
పునరుత్పాదక ఇంధన సంస్థ AGELలో 20 శాతం వాటాను ఫ్రెంచ్ దిగ్గజం టోటల్ ఎనర్జీస్కు జనవరి 2021లో ప్రమోటర్లు విక్రయించినట్లు అదానీ గ్రూప్ తెలిపింది. తద్వారా రెండు బిలియన్ డాలర్లు సేకరించినట్లు వెల్లడించింది. దీనికి ముందు, వారు సిటీ గ్యాస్ సంస్థ అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్లో 37.4 శాతం వాటాను అదే ఫ్రెంచ్ సంస్థకు 783 మిలియన్ల డాలర్లకు విక్రయించినట్లు తెలిపింది. మరోవైపు టోటల్ ఎనర్జీస్ కొన్ని విదేశీ ఇన్వెస్ట్మెంట్ వెహికల్స్ను కొనుగోలు చేసి ఆ నిధులను తిరిగి అదానీ కంపెనీల్లోని మళ్లించినట్లు పేర్కొంది. అలా విదేశాల నుంచి వచ్చిన నిధులను తిరిగి ఇక్కడి గ్రూప్ సంస్థల్లో పెట్టుబడిగా పెట్టడాన్నే ‘ఇప్పుడు కొందరు డొల్ల కంపెనీల నుంచి వచ్చిన నిధులుగా వ్యవహరిస్తున్న’ట్లు వ్యాఖ్యానించింది. పరోక్షంగా రాహుల్ గాంధీ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టింది.
అన్ని లావాదేవీలను ఎప్పటికప్పుడు స్టాక్ ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన సమాచారం ద్వారా బహిర్గతం చేసినట్లు అదానీ గ్రూప్ తెలిపింది. అలాగే AGELలో అదనపు వాటాల కొనుగోలు, రుణాలు ఇతర సెక్యూరిటీల ద్వారా AGELకు మద్దతుగా నిలిచిన వ్యవహారం కూడా ప్రజలకు తెలిసిన విషయమేనని పేర్కొంది. ఆయా సమయాల్లో సంబంధిత రెగ్యులేటరీ ఫైలింగ్ల ద్వారా వెల్లడించిన వివరాల నుంచి వాస్తవాలు సులభంగా, పారదర్శకంగా అందుబాటులో ఉంటాయని తెలిపింది. ‘‘తప్పుదోవ పట్టించే కథనం’’ ‘‘విచారకరమైన’’ రాజకీయ సమస్యగా మారిందని వ్యాఖ్యానించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..
Mobile Apps: స్మార్ట్ఫోన్ వినియోగదారులు కచ్చితంగా భద్రతకు ప్రాధాన్యమివ్వాలి. యాప్ను డౌన్లోడ్ చేసుకునే ముందు యాప్ స్టోర్, గోప్యతా విధానాలు, డేటా సేకరణ, సమీక్షలు, మానిటైజేషన్ పద్ధతులు, వివిధ అనుమతుల వంటి అంశాలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి. -
ఎయిర్లైన్స్ లాభాల్లో బిగ్ జంప్.. ఉద్యోగులకు 8 నెలల జీతం బోనస్..
అంచనాలకు మించి లాభాలు నమోదు చేయడంతో సింగపూర్ ఎయిర్లైన్స్ తన ఉద్యోగులకు 8 నెలల జీతాన్ని బోనస్గా అందిస్తున్నట్లు ప్రకటించింది. -
అందుకే భారత్తో వాణిజ్య బంధం తెగిపోయింది: పాక్
Pakistan: పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్ మధ్య సంబంధాలు క్షీణించిన విషయం తెలిసిందే. ఇరు దేశాల మధ్య వాణిజ్యం సైతం దెబ్బతింది. తాజాగా దీనిపై ఆ దేశ విదేశాంగ మంత్రి స్పందించారు. -
Artificial Intelligence: ఎటు చూసినా ఏఐ...
మనదేశంలో ఏఐ (కృత్రిమ మేధ) వినియోగం శరవేగంగా పెరుగుతోంది. కార్యాలయాల్లో అధిక శాతం ఉద్యోగులు ఈ నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సమర్థంగా సేవలు అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. -
స్టాక్ మార్కెట్.. ఎఫ్అండ్ఓపై ఎందుకింత మోజు..?
దేశంలో పొదుపు మొత్తాలు ఎఫ్అండ్ఓ (ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్) ట్రేడ్లోకి వెళ్తున్నాయని, దీనిపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోందని కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారుడు వి.అనంత నాగేశ్వరన్ అన్నారు. -
మన సమాచారం సురక్షితమేనా?
దేశంలో డిజిటల్ ఆర్థిక లావాదేవీలు విపరీతంగా పెరుగుతున్నాయి. అదే సమయంలో సైబర్ నేరాల సంఖ్యా అధికమవుతోంది. వీటిని నివారించేందుకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఎప్పటికప్పుడు తమ వివరాల్లో మార్పులేమైనా ఉంటే సమర్పించాలని ఖాతాదారులను కోరుతున్నాయి. -
ఐసీఐసీఐ మాజీ ఛైర్మన్ వాఘుల్ కన్నుమూత
ప్రభుత్వ రంగంలోని ఐసీసీఐని ప్రైవేటు సంస్థగా మార్చడంలో కీలక పాత్ర పోషించిన నారాయణ్ వాఘుల్ (88) ఆరోగ్య సమస్యలతో శనివారం చెన్నైలోని ఒక ఆసుపత్రిలో మరణించారు. బ్యాంకింగ్ పరిశ్రమలో ఆయన ప్రస్థానం 1960లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రారంభమైంది. -
ఓయో ఐపీఓ దరఖాస్తు ఉపసంహరణ!
తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) కోసం సెబీకి సమర్పించిన దరఖాస్తును ఓయో ఉపసంహరించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కంపెనీ రీఫైనాన్సింగ్ ప్రణాళికను ఖరారు చేసే పనిలో ఉందని.. ఈ ప్రక్రియ పూర్తయ్యాక తిరిగి ఐపీఓకు దరఖాస్తు చేసే యోచనలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
ఆభరణాల దిగుమతులు భారీగా పెరిగాయ్
ఈ ఏడాది ఏప్రిల్లో దేశంలోకి పసిడి ఆభరణాల దిగుమతులు భారీగా పెరిగి రూ.2225 కోట్ల (268.04 మిలియన్ డాలర్ల) స్థాయికి చేరాయని జెమ్ అండ్ జువెలరీ ఎగుమతుల ప్రోత్సాహక మండలి తెలిపింది. 2023 ఏప్రిల్లో ఇవి సుమారుగా రూ.267 కోట్ల (32.12 మిలియన్ డాలర్ల) స్థాయిలోనే ఉన్నాయి. -
చైనా ఈవీలు, లోహాలపై దిగుమతి సుంకాల పెంపు
చైనాలో తయారయ్యే విద్యుత్ వాహనాలు (ఈవీ), అత్యాధునిక బ్యాటరీలు, సోలార్ సెల్స్, వైద్య సామగ్రితో పాటు అక్కడ నుంచి దిగుమతి అయ్యే ఉక్కు, అల్యూమినియంపై కొత్త టారిఫ్లు విధిస్తామని బైడెన్ ప్రభుత్వం ప్రకటించింది. -
ప్రత్యేక ట్రేడింగ్లో స్వల్ప లాభాలు
విదేశీ మదుపర్ల కొనుగోళ్ల మద్దతుతో ప్రత్యేక ట్రేడింగ్ సెషన్లో సూచీలు స్వల్ప లాభాలతో ముగిశాయి. ప్రాథమిక సైట్లో వైఫల్యం తలెత్తినా ఎదుర్కొనేందుకు వాటి సంసిద్ధతను తనిఖీ చేయడానికి బీఎస్ఈ, ఎన్ఎస్ఈలు ఈ ప్రత్యేక ట్రేడింగ్ సెషన్ను శనివారం రెండు దఫాలుగా నిర్వహించాయి. -
వ్యవసాయ అంకురాలు దూసుకెళ్తున్నాయ్
అనుకూల వ్యాపార విధానాలు, ప్రభుత్వ మద్దతు కారణంగా గత తొమ్మిదేళ్లలో వ్యవసాయ - అనుబంధ రంగాల్లో అంకురాల సంఖ్య దాదాపు 7,000కు పైగా పెరిగిందని అఖిల భారత రైతు సంఘాల సమాఖ్య (ఫైఫా) వెల్లడించింది. -
సంక్షిప్త వార్తలు
దొడ్ల డెయిరీ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ.787.4 కోట్ల ఆదాయం, రూ.46.8 కోట్ల నికర లాభం, రూ.7.79 ఈపీఎస్ నమోదు చేసింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఆదాయం రూ.724.3 కోట్లు, నికరలాభం రూ.22.5 కోట్లు, ఈపీఎస్ రూ.3.76 ఉన్నాయి. -
50ఎంపీ సెల్ఫీ కెమెరాతో టెక్నో నుంచి రెండు కొత్త మొబైల్స్
Tecno: టెక్నో కెమన్ సిరీస్లో రెండు కొత్త మొబైల్స్ను లాంచ్ చేసింది. వాటి ధర, ఫీచర్ల విషయాలపై ఓ లుక్కేద్దాం..
తాజా వార్తలు (Latest News)
-
పీర్జాదిగూడ మేయర్, కార్పొరేటర్ల కిడ్నాప్నకు కాంగ్రెస్ యత్నం: హరీశ్రావు
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
బహిరంగ సభ మధ్యలోనే వెనుదిరిగిన రాహుల్.. కారణమిదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
నిలిచిపోయిన కాగజ్నగర్, నవజీవన్ ఎక్స్ప్రెస్ రైళ్లు .. ప్రయాణికుల ఆందోళన
-
భార్య, కుమారుడు వేధిస్తున్నారు, భరణం ఇప్పించండి - మాజీ మంత్రి వేడుకోలు