Dream 11: గేమింగ్ కంపెనీలకు షాక్.. ఒక్క డ్రీమ్ 11కే ₹25 వేల కోట్ల పన్ను నోటీసు..!
Tax notices to gaming firms: జీఎస్టీ బకాయిలకు సంబంధించి గేమింగ్ కంపెనీలకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటిలిజెన్స్ పన్ను నోటీసులు పంపింది. ఒక్క డ్రీమ్ 11కే రూ.25 వేల కోట్ల పన్ను నోటీసు జారీ చేసినట్లు తెలిసింది.
ఇంటర్నెట్ డెస్క్: దేశంలో పలు రియల్ మనీ గేమింగ్ కంపెనీలకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటిలిజెన్స్ (DGGI) ప్రీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. మొత్తం 12 కంపెనీలకు ఈ నోటీసులు ఇచ్చింది. ఇందులో ప్రముఖ ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్ఫామ్ డ్రీమ్ 11 (Dream 11) సహా పలు కంపెనీలు ఉన్నాయి. మొత్తం రూ.55వేల కోట్ల పన్ను బకాయిలకు సంబంధించి ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలిపింది. ఒక్క డ్రీమ్ 11కే రూ.25వేల కోట్లు జీఎస్టీ బకాయిలు చెల్లించాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నట్లు తెలిసింది.
ఆన్లైన్ గేమింగ్పై జీఎస్టీని 28 శాతానికి పెంచుతూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించిన నేపథ్యంలో డీజీజీఐ ఈ నోటీసులు జారీ చేయడం గమనార్హం. అయితే, అదాయపు పన్ను శాఖ షోకాజ్ నోటీసులు జారీ చేయకముందు ఎంతెంత బకాయిలు ఉన్నాయో ఆయా కంపెనీలకు తెలియజేస్తూ ఈ ప్రీ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఇందులో డ్రీమ్ 11, రమ్మీ సర్కిల్, మై 11 వంటి కంపెనీలు ఉన్నాయి. మున్ముందు మరిన్ని కంపెనీలకూ నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, డీజీజీఐ ప్రీ షోకాజ్ నోటీసులు జారీ చేయడంపై డ్రీమ్ 11 బాంబే హైకోర్టును ఆశ్రయించింది.
‘ఆధార్’పై మూడీస్ సంచలన ఆరోపణలు.. గట్టిగా బదులిచ్చిన కేంద్రం
దేశంలో ఇప్పటి వరకు ఈ స్థాయిలో పన్ను నోటీసులు పంపించడం ఇదే ప్రథమం. గతేడాది బెంగళూరుకు చెందిన గేమ్స్క్రాఫ్ట్ టెక్నాలజీకి రూ.21వేల కోట్ల ట్యాక్స్ నోటీసు పంపించారు. అయితే, కర్ణాటక హైకోర్టు నోటీసును రద్దు చేసింది. ఈ నిర్ణయంపై డీజీజీఐ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. హైకోర్టు నిర్ణయాన్ని కొట్టివేస్తూ తదుపరి విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. డీజీజీఐ జారీ చేసిన నోటీసులను కంపెనీలు సవాలు చేసే అవకాశం ఉందని నిపుణలు పేర్కొంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నవ లిమిటెడ్.. రుణ రహితం
ఫెర్రో అల్లాయ్స్, మైనింగ్, విద్యుదుత్పత్తిలో నిమగ్నమై ఉన్న నవ లిమిటెడ్, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో ఏకీకృత ఖాతాల ప్రకారం రూ.951.6 కోట్ల ఆదాయాన్ని, రూ.255.1 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. -
వసూళ్లు 27%.. వదులుకుంది 73%
నిరర్థక ఆస్తులుగా మారిన రుణాల నుంచి వసూళ్లకు చేపట్టిన దివాలా పరిష్కార ప్రక్రియ, ఆర్థిక సంస్థలకు ఎంతగా ఉపయోగ పడుతోందో ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. -
నలుపు రంగులో అపాచీ ఆర్టీఆర్ 160
టీవీఎస్ మోటార్ తన ‘అపాచీ 160 ఆర్టీఆర్’ బైక్లో బ్లాక్ డార్క్ ఎడిషన్ (నలుపు రంగు)ను తీసుకొచ్చింది. -
టీవీ ఛానళ్లతో పాటు ఓటీటీ ప్రసారాలూ.. స్మార్ట్ ప్లస్ను ఆవిష్కరించిన డిష్ టీవీ
టీవీ ఛానళ్లతోపాటు, ఓటీటీ ప్రసారాలూ అందించే స్మార్ట్ ప్లస్ సేవలు ప్రారంభిస్తున్నట్లు డైరెక్ట్-టు-హోమ్ సేవలను అందించే డిష్ టీవీ ప్రకటించింది. -
2031కి రిటైల్ విపణి రెట్టింపు
భారత వినియోగ వస్తు- సేవల విపణి 2031 కల్లా రెట్టింపు కావొచ్చని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అభిప్రాయపడ్డారు. -
మదుపర్ల సంపద రూ.410 లక్షల కోట్లకు
వరుసగా రెండో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. ఎం అండ్ ఎం, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. అయితే విదేశీ మదుపర్ల అమ్మకాలు కొనసాగడంతో లాభాలు పరిమితమయ్యాయి. -
ప్రస్తుత కంపెనీలకూ ప్రోత్సాహకాలు!
విద్యుత్ వాహన (ఈవీ) నూతన విధానాన్ని అనుసరించి, పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న సంస్థలకు ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేయనుంది. -
విదేశీ ఫండ్ల ఆస్తుల్లో 20% వరకే మన మార్కెట్లకు! : సెబీ ప్రతిపాదన
మ్యూచువల్ ఫండ్లలో విదేశీ పెట్టుబడులను మరింత సులభతరం చేసే దిశగా మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ కొన్ని చర్యలను ప్రతిపాదించింది. -
కియా కార్లు అద్దెకూ తీసుకోవచ్చు.. హైదరాబాద్ సహా 6 నగరాల్లో
కారు కొంటే బీమా - నిర్వహణ ఖర్చుల వంటివి తప్పవు. మరో కొత్త మోడల్ కొనుగోలుకు పాత కారు విక్రయించాలంటే తగిన ధర వస్తుందో రాదో అనే బెంగ ఒకటి. -
సంక్షిప్త వార్తలు(5)
కేన్సర్ వ్యాధి చికిత్సలో వినియోగించే కాబోజాంటినిబ్ ట్యాబ్లెట్లను హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎంఎస్ఎన్ ల్యాబ్స్ ఉత్పత్తి చేసి, జైడస్ లైఫ్సైన్సెస్కు సరఫరా చేయనుంది. -
ఇక కంటితోనే స్క్రీన్ను ఆపరేట్ చేసేలా: త్వరలో యాపిల్ కొత్త ఫీచర్లు
Apple: దివ్యాంగులు కూడా ఐఫోన్, ఐప్యాడ్లను సులువుగా వినియోగించేందుకు వీలుగా యాపిల్ కొత్త ఫీచర్లును త్వరలోనే తీసుకురానున్నట్లు వెల్లడించింది. -
ఆరోగ్యకరమైన ఆహారం.. జొమాటోలో కొత్త ఫీచర్
Zomato: జొమాటోలో కొత్త ఫీచర్ని తీసుకొచ్చినట్లు కంపెనీ సీఈఓ దీపిందర్ గోయల్ ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు. ఇంతకీ ఆ ఫీచర్ ఎలా ఉపయోగపడనుందంటే..
తాజా వార్తలు (Latest News)
-
కియా కార్లు అద్దెకూ తీసుకోవచ్చు.. హైదరాబాద్ సహా 6 నగరాల్లో
-
చివరి మ్యాచ్లో ముంబయిపై లఖ్నవూ గెలుపు.. టోర్నీ నుంచి నిష్క్రమించిన ఇరు జట్లు
-
హైదరాబాద్ మెట్రో రైలు సమయం పొడిగింపు
-
మరో 30 ఏళ్లకు మనం అంగారకుడి సిటీలో: ఎలాన్ మస్క్ ఆసక్తికర పోస్ట్
-
గాల్లో ఉండగా విమానం ‘ఏసీ’లో మంటలు.. అత్యవసర ల్యాండింగ్!
-
48 గంటల్లో పోలింగ్ శాతాలపై.. ఈసీ స్పందన కోరిన సుప్రీంకోర్టు