Aadhaar: ‘ఆధార్’పై మూడీస్ సంచలన ఆరోపణలు.. గట్టిగా బదులిచ్చిన కేంద్రం
Aadhaar: ఆధార్ వినియోగంపై మూడీస్ చేసిన ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. 100 కోట్ల మంది భారతీయులకు దీనిపై విశ్వాసం ఉందని పేర్కొంది.
దిల్లీ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఎలాంటి సేవలు పొందాలన్నా ఇప్పుడు ఆధార్ (Aadhaar) తప్పనిసరి. ఈ ఆధార్పై ప్రముఖ రేటింగ్ సంస్థ మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ (Moody's Investors Service) సంచలన ఆరోపణలు చేసింది. ఆధార్ వల్ల గోప్యత, భద్రతా ముప్పు పొంచి ఉందని, అన్ని వేళలా దాన్ని ఉపయోగించడం విశ్వసనీయం కాదని ఆరోపించింది. అయితే, ఈ ఆరోపణలను కేంద్రం గట్టిగా తిప్పికొట్టింది. అవన్నీ నిరాధారమని కొట్టిపారేసింది.
మూడీస్ ఆరోపణలేంటీ..?
ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ ఐడీ ప్రొగ్రామ్ ‘ఆధార్ (Aadhaar)’ అని పేర్కొన్న మూడీస్.. దీనిపై తాజాగా ‘డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ అండ్ డిజిటల్ అసెట్స్’ పేరుతో ఓ నివేదిక విడుదల చేసింది. ఆధార్ వినియోగం వల్ల భద్రతాపరమైన సమస్యలు ఏర్పడే అవకాశముందని ఆ నివేదికలో ఆరోపించింది. ‘‘అట్టడుగు వర్గాలను ఏకీకృతం చేయడంతో పాటు సంక్షేమ ప్రయోజనాలను చిట్టచివరి వ్యక్తికి విస్తరించడమే లక్ష్యంగా భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఈ ఆధార్ను తీసుకొచ్చింది. చాలా పథకాలకు దీన్ని తప్పనిసరి చేశారు. అయితే దీనివల్ల తరచూ సేవల తిరస్కరణ వంటివి జరుగుతున్నాయి. బయోమెట్రిక్ సరిగా రాక చాలా మందికి సేవలు అందడం లేదు. ముఖ్యంగా అత్యంత వేడి, తేమ వాతావరణంలో పనిచేసే కార్మికులు ఆధార్ను వినియోగించడం అంత విశ్వసనీయమైనది కాదు’’ అని మూడీస్ పేర్కొంది. ఉపాధి హామీ కూలీలకు ఇచ్చే చెల్లింపులకు కేంద్రం ఆధార్ను తప్పనిసరి చేయడాన్ని ప్రస్తావిస్తూ మూడీస్ ఈ వ్యాఖ్యలు చేసింది.
అంతేగాక, పౌరుల సున్నితమైన సమాచారం కలిగి ఉన్న ఆధార్ వల్ల.. డేటా ఉల్లంఘనల ముప్పు పొంచి ఉందని మూడీస్ ఆరోపించింది. ‘‘కేంద్రీకృత వ్యవస్థలో బ్యాంకింగ్ అవసరాలు, సామాజిక మాధ్యమాలు, ప్రభుత్వ సంక్షేమాలు ఇలా అన్నింటికి ఒకే గుర్తింపు కార్డును వినియోగిస్తున్నారు. దీని వల్ల యూజర్ల వ్యక్తిగత డేటా ఇతరుల చేతికి చిక్కే ప్రమాదం ఉంది’’ అని మూడీస్ తన నివేదికలో పేర్కొంది.
పొదుపు తగ్గి అప్పు పెరుగుతోందా? ఈ వ్యూహాలను అనుసరిద్దాం!
కేంద్రం వివరణ ఇదే..
అయితే, మూడీస్ నివేదికను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఎలాంటి ఆధారాల్లేకుండా రేటింగ్ సంస్థ ఆ ఆరోపణలు చేసిందని దుయ్యబట్టింది. ‘‘ప్రపంచంలోనే అత్యంత విశ్వసనీయమైన డిజిటల్ ఐడీ ఆధార్. గత పదేళ్లుగా వంద కోట్లకు పైగా భారతీయులు దీనిపై విశ్వాసం ఉంచారు. తమ గుర్తింపును ధ్రువీకరించేందుకు 100కోట్ల సార్లకు పైగా దీన్ని వినియోగించారు. మూడీస్ తన నివేదికలో చెప్పిన అభిప్రాయాలను సమర్థించేలా ఎలాంటి అధ్యయనాలను ప్రస్తావించలేదు. ఆ సంస్థ చేసిన ఆరోపణలను రుజువు చేసే ప్రయత్నమూ చేయలేదు’’ అని ఉడాయ్ (UIDAI) ఓ ప్రకటనలో వెల్లడించింది.
‘‘అంతేగాక, ఆధార్ బయోమెట్రిక్ కోసం కేవలం వేలిముద్ర మాత్రమే కాకుండా, ఫేస్ అథెంటికేషన్, ఐరిస్ అథెంటికేషన్ వంటి కాంటాక్ట్లెస్ మార్గాలు కూడా ఉన్నాయన్న విషయాన్ని మూడీస్ విస్మరించింది. దీంతో పాటు.. చాలా కేసుల్లో మొబైల్ ఓటీపీని వినియోగించుకునే సదుపాయం అందుబాటులో ఉంది. ఇక, సెంట్రలైజ్డ్ ఆధార్ వ్యవస్థలో భద్రతా, గోప్యతా ముప్పు పొంచి ఉందని నివేదికలో వాదించారు. కానీ, ఆధార్ డేటాబేస్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి డేటా ఉల్లంఘనలు జరగలేదు. ఆ విషయాన్ని ఇప్పటికే చాలా సార్లు పార్లమెంట్ ముందు నివేదించాం’’ అని ఉడాయ్ తమ ప్రకటనలో వివరించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Stock Market: ఆర్బీఐ ఎఫెక్ట్.. తొలిసారి 21,000 మార్క్ అందుకున్న నిఫ్టీ!
Stock Market Closing bell: సెన్సెక్స్ 303.91 పాయింట్లు పుంజుకొని 69,825.60 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ 68.25 పాయింట్లు లాభపడి 20,969.40 వద్ద ముగిసింది. -
Tata group: మరో ఐఫోన్ల ప్లాంట్కు టాటాలు రెడీ.. 50 వేల మందికి ఉపాధి!
Tata group- iphone: టాటా గ్రూప్ మరో అతిపెద్ద ఐఫోన్ ప్లాంట్ను నెలకొల్పేందుకు సిద్ధమవుతోంది. దీనిద్వారా 50 వేల మందికి ఉపాధి లభించనుంది. -
UPI: ఆర్బీఐ కీలక నిర్ణయం.. ఆటో డెబిట్, ఆ యూపీఐ చెల్లింపుల పరిమితి పెంపు
UPI payments: ఆర్బీఐ ద్రవ్యపరపతి విధాన కమిటీ సమీక్ష నిర్ణయాలను శుక్రవారం వెల్లడించింది. రెపోరేటును 6.5 శాతం వద్ద యథాతథంగా ఉంచింది. మరోవైపు యూపీఐ, ఆటో డెబిట్ పరిమితి విషయంలోనూ కీలక నిర్ణయాలు తీసుకుంది. -
Flipkart: ఫ్లిప్కార్ట్ ఇయర్ ఎండ్ సేల్.. ఈ ఫోన్లపై భారీ డిస్కౌంట్
Flipkart Year End Sale: ఫ్లిప్కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ తేదీలను ప్రకటించింది. పెద్ద ఎత్తున క్యాష్బ్యాక్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో ఈ సేల్ను తీసుకొచ్చినట్లు వెల్లడించింది. -
India Shelter Finance IPO: 13న ఇండియా షెల్టర్ ఫైనాన్స్ ఐపీఓ.. ధరల శ్రేణి రూ.469-493
India Shelter Finance IPO: రూ.1,200 కోట్ల సమీకరణే లక్ష్యంగా ఇండియా షెల్టర్ ఫైనాన్స్ ఐపీఓ ఈ నెల 13న ప్రారంభం కానుంది. -
Onion Exports: ఉల్లి ఎగుమతులపై కేంద్రం నిషేధం..
Onion Exports: దేశంలో ఉల్లి ధరల నియంత్రణకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది మార్చి వరకు వీటి ఎగుమతులపై నిషేధం విధించింది. -
RBI: ఐదోసారీ వడ్డీరేట్లు యథాతథం.. వృద్ధిరేటు అంచనాల పెంపు
RBI: ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన కమిటీ సమావేశ నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం ప్రకటించారు. -
Stock Market: లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
Stock Market Opening bell | ఉదయం 9:26 గంటల సమయంలో సెన్సెక్స్ 195 పాయింట్ల లాభంతో 69,716 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 66 పాయింట్లు పెరిగి 20,967 దగ్గర ట్రేడవుతోంది. -
ఐటీ సెజ్ల్లో స్థలాలకు గిరాకీ
ఐటీ/ఐటీఈఎస్ ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్)ని అభివృద్ధి చేసిన ఒక డెవలపర్ విజ్ఞప్తి నేపథ్యంలో.. అందులో ప్రాసెసింగేతర ప్రాంతాలకు సెజ్ హోదాను రద్దు చేసే అధికారం అంతర్ మంత్రిత్వ శాఖల బోర్డుకు ఉందని ఒక అధికారిక నోటిఫికేషన్ స్పష్టం చేసింది. -
వచ్చే బడ్జెట్లో అద్భుత ప్రకటనలుండవు
వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న వెల్లడించే తన ఆరో బడ్జెట్లో ‘అద్భుత ప్రకటనలు’ ఉండవని, సార్వత్రిక ఎన్నికలకు ముందు కేవలం ఓట్ ఆన్ అకౌంట్గానే సమర్పిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. వచ్చే ఏడాది ఏప్రిల్- మే నెలల్లో సార్వత్రిక ఎన్నికల అనంతరం, కొత్త ప్రభుత్వం జులైలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెడుతుందని సీఐఐ గ్లోబల్ ఎకనమిక్ పాలసీ ఫోరమ్లో మంత్రి తెలిపారు. -
సంస్థల్లో నియామకాలు 12% తగ్గాయ్
వేర్వేరు రంగాల కార్యాలయాల్లో నైపుణ్యంతో కూడిన (వైట్-కాలర్) ఉద్యోగాల నియామకాలు గత 2 నెలల్లో తగ్గినట్లు నౌకరీ జాబ్స్పీక్ సూచీ నివేదిక వెల్లడించింది. ఇందుకు సంబంధించిన ఉద్యోగ పోస్టింగ్లు 2022 అక్టోబరు, నవంబరులో 2781 కాగా, ఈ ఏడాది అదే సమయంలో 12 శాతం తగ్గి 2,433 కు పరిమితమయ్యాయని తెలిపింది. -
2025కు పునరుత్పాదక ఇంధన సామర్థ్యం 170 గిగా వాట్లకు: ఇక్రా
దేశంలో పునరుత్పాదక ఇంధన సామర్థ్యం 2025 నాటికి 170 గిగా వాట్లకు చేరుకుంటుందని ఇక్రా వైస్ ప్రెసిడెంట్, సెక్టార్ హెడ్ - కార్పొరేట్ రేటింగ్స్ వి.విక్రమ్ అంచనా వేశారు. ప్రస్తుతం దేశీయ పునరుత్పాదక ఇంధన సామర్థ్యం 130 గిగా వాట్లుగా ఉంది. -
ఏడు రోజుల జోరుకు విరామం
సూచీల ఏడు రోజుల వరుస లాభాలకు గురువారం అడ్డుకట్ట పడింది. ఇటీవల భారీగా పెరిగిన షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించడమే ఇందుకు కారణం. బలహీన అంతర్జాతీయ సంకేతాలు ప్రభావం చూపాయి. ఆర్బీఐ పరపతి నిర్ణయాలు శుక్రవారం (నేడు) వెలువడనుండటంతో, మదుపర్లు కొంత అప్రమత్తత పాటించారు. -
వివో కేసులో తొలి ఛార్జిషీట్ దాఖలు
చైనాకు చెందిన స్మార్ట్ఫోన్ కంపెనీ వివో అనుబంధ సంస్థ వివో ఇండియాపై, మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఛార్జిషీట్ దాఖలు చేసింది. వివోతో పాటు మరికొందరిపై వచ్చిన మనీలాండరింగ్ ఆరోపణలపై దర్యాప్తు చేసిన ఈడీ, తొలి ఛార్జిషీట్ను ప్రత్యేక కోర్టులో వేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద వివో ఇండియాపై అభియోగాలు మోపింది. -
దూసుకెళ్తున్న ఈవీలు
విద్యుత్ వాహనాల (ఈవీల) అమ్మకాలు రాణిస్తున్నాయి. విద్యుత్తు విభాగంలో ప్రయాణికులు- వాణిజ్య వాహనాలు కలిపి నవంబరులో 1,52,606 యూనిట్లు అమ్ముడైనట్లు వాహన డీలర్ల సమాఖ్య ఫాడా గురువారం వెల్లడించింది. -
1 నుంచి హ్యుందాయ్ ధరల పెంపు
వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా (హెచ్ఎమ్ఐఎల్), జనవరి 1 నుంచి ధరలు పెంచనున్నట్లు ప్రకటించింది. పెరిగిన ముడి పదార్థాల ధరలు, ప్రతికూల మారకపు రేటు, అధిక కమొడిటీ ధరల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. -
స్టార్బక్స్కు రూ.91,500 కోట్ల నష్టం
సియాటెల్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న స్టార్బక్స్ కార్పొరేషన్ ఆదాయంపై, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల ప్రభావం వేగంగా కనిపించింది. విక్రయాలు తగ్గడంతో, సుమారు 11 బిలియన్ డాలర్ల (సుమారు రూ.91,500 కోట్ల) మేర విలువను కంపెనీ నష్టపోయింది. -
పంచదార ధరల అదుపునకు చర్యలు
దేశంలో పెరుగుతున్న చక్కెర ధరలను అదుపు చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇథనాల్ ఉత్పత్తికి చెరకు రసం వినియోగించకుండా నిషేధం విధిస్తూ, చక్కెర మిల్లులు, డిస్టిలరీలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. దేశీయ అవసరాలకు తగినంత చక్కెరను అందుబాటులో ఉంచడంతో పాటు, ధరలు అదుపులో ఉంచేందుకే ఈ నిర్ణయం తీసుకుంది. -
ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్లో వార్బర్గ్ పింకస్ 1.3 శాతం వాటా విక్రయం
ఐడీఎఫ్సీ బ్యాంక్లో అమెరికాకు చెందిన ప్రైవేటు ఈక్విటీ సంస్థ వార్బర్గ్ పింకస్ 1.3 శాతం వాటాను రూ.790.18 కోట్లకు విక్రయించింది. ఓపెన్ మార్కెట్ లావాదేవీ ద్వారా ఈ విక్రయం జరిగింది. ఈ వార్తలతో బీఎస్ఈలో ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ షేరు 3.02 శాతం నష్టపోయి రూ.87.69 వద్ద ముగిసింది. -
వచ్చే బడ్జెట్లో అద్భుత ప్రకటనలుండవు
వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న వెల్లడించే తన ఆరో బడ్జెట్లో ‘అద్భుత ప్రకటనలు’ ఉండవని, సార్వత్రిక ఎన్నికలకు ముందు కేవలం ఓట్ ఆన్ అకౌంట్గానే సమర్పిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. వచ్చే ఏడాది ఏప్రిల్- మే నెలల్లో సార్వత్రిక ఎన్నికల అనంతరం, కొత్త ప్రభుత్వం జులైలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెడుతుందని సీఐఐ గ్లోబల్ ఎకనమిక్ పాలసీ ఫోరమ్లో మంత్రి తెలిపారు. -
భారత్ 8% వృద్ధి సాధిస్తుంది
మన ఆర్థిక వ్యవస్థకు 8 శాతం వృద్ధి సాధించే సత్తా ఉందని నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ సుమన్ బెర్రీ పేర్కొన్నారు. కార్మిక శక్తి బలంగా ఉండటంతో పాటు ప్రజాస్వామ పరంగా సంస్థాగత అనుభవం ఉందని అభిప్రాయపడ్డారు. దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే ఉత్తర భారతదేశం అంతగా రాణించడం లేదని, సార్వభౌమ వ్యవస్థలో ఇది ఉద్రిక్తతలను సృష్టించొచ్చని అన్నారు.


తాజా వార్తలు (Latest News)
-
APPSC: ఏపీలో గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల
-
Stock Market: ఆర్బీఐ ఎఫెక్ట్.. తొలిసారి 21,000 మార్క్ అందుకున్న నిఫ్టీ!
-
Allu Arjun: యానిమల్ మైండ్ బ్లోయింగ్ మూవీ.. మెచ్చుకున్న అల్లు అర్జున్
-
Lok Sabha: మరో ఇద్దరు భాజపా ఎంపీల రాజీనామాలు ఆమోదం
-
Supreme Court: చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ
-
PM Modi: ‘వెడ్ ఇన్ ఇండియా’ను మీరే ప్రారంభించాలి.. సంపన్న కుటుంబాలకు ప్రధాని మోదీ సూచన