Aadhaar: ‘ఆధార్’పై మూడీస్ సంచలన ఆరోపణలు.. గట్టిగా బదులిచ్చిన కేంద్రం
Aadhaar: ఆధార్ వినియోగంపై మూడీస్ చేసిన ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. 100 కోట్ల మంది భారతీయులకు దీనిపై విశ్వాసం ఉందని పేర్కొంది.
దిల్లీ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఎలాంటి సేవలు పొందాలన్నా ఇప్పుడు ఆధార్ (Aadhaar) తప్పనిసరి. ఈ ఆధార్పై ప్రముఖ రేటింగ్ సంస్థ మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ (Moody's Investors Service) సంచలన ఆరోపణలు చేసింది. ఆధార్ వల్ల గోప్యత, భద్రతా ముప్పు పొంచి ఉందని, అన్ని వేళలా దాన్ని ఉపయోగించడం విశ్వసనీయం కాదని ఆరోపించింది. అయితే, ఈ ఆరోపణలను కేంద్రం గట్టిగా తిప్పికొట్టింది. అవన్నీ నిరాధారమని కొట్టిపారేసింది.
మూడీస్ ఆరోపణలేంటీ..?
ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ ఐడీ ప్రొగ్రామ్ ‘ఆధార్ (Aadhaar)’ అని పేర్కొన్న మూడీస్.. దీనిపై తాజాగా ‘డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ అండ్ డిజిటల్ అసెట్స్’ పేరుతో ఓ నివేదిక విడుదల చేసింది. ఆధార్ వినియోగం వల్ల భద్రతాపరమైన సమస్యలు ఏర్పడే అవకాశముందని ఆ నివేదికలో ఆరోపించింది. ‘‘అట్టడుగు వర్గాలను ఏకీకృతం చేయడంతో పాటు సంక్షేమ ప్రయోజనాలను చిట్టచివరి వ్యక్తికి విస్తరించడమే లక్ష్యంగా భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఈ ఆధార్ను తీసుకొచ్చింది. చాలా పథకాలకు దీన్ని తప్పనిసరి చేశారు. అయితే దీనివల్ల తరచూ సేవల తిరస్కరణ వంటివి జరుగుతున్నాయి. బయోమెట్రిక్ సరిగా రాక చాలా మందికి సేవలు అందడం లేదు. ముఖ్యంగా అత్యంత వేడి, తేమ వాతావరణంలో పనిచేసే కార్మికులు ఆధార్ను వినియోగించడం అంత విశ్వసనీయమైనది కాదు’’ అని మూడీస్ పేర్కొంది. ఉపాధి హామీ కూలీలకు ఇచ్చే చెల్లింపులకు కేంద్రం ఆధార్ను తప్పనిసరి చేయడాన్ని ప్రస్తావిస్తూ మూడీస్ ఈ వ్యాఖ్యలు చేసింది.
అంతేగాక, పౌరుల సున్నితమైన సమాచారం కలిగి ఉన్న ఆధార్ వల్ల.. డేటా ఉల్లంఘనల ముప్పు పొంచి ఉందని మూడీస్ ఆరోపించింది. ‘‘కేంద్రీకృత వ్యవస్థలో బ్యాంకింగ్ అవసరాలు, సామాజిక మాధ్యమాలు, ప్రభుత్వ సంక్షేమాలు ఇలా అన్నింటికి ఒకే గుర్తింపు కార్డును వినియోగిస్తున్నారు. దీని వల్ల యూజర్ల వ్యక్తిగత డేటా ఇతరుల చేతికి చిక్కే ప్రమాదం ఉంది’’ అని మూడీస్ తన నివేదికలో పేర్కొంది.
పొదుపు తగ్గి అప్పు పెరుగుతోందా? ఈ వ్యూహాలను అనుసరిద్దాం!
కేంద్రం వివరణ ఇదే..
అయితే, మూడీస్ నివేదికను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఎలాంటి ఆధారాల్లేకుండా రేటింగ్ సంస్థ ఆ ఆరోపణలు చేసిందని దుయ్యబట్టింది. ‘‘ప్రపంచంలోనే అత్యంత విశ్వసనీయమైన డిజిటల్ ఐడీ ఆధార్. గత పదేళ్లుగా వంద కోట్లకు పైగా భారతీయులు దీనిపై విశ్వాసం ఉంచారు. తమ గుర్తింపును ధ్రువీకరించేందుకు 100కోట్ల సార్లకు పైగా దీన్ని వినియోగించారు. మూడీస్ తన నివేదికలో చెప్పిన అభిప్రాయాలను సమర్థించేలా ఎలాంటి అధ్యయనాలను ప్రస్తావించలేదు. ఆ సంస్థ చేసిన ఆరోపణలను రుజువు చేసే ప్రయత్నమూ చేయలేదు’’ అని ఉడాయ్ (UIDAI) ఓ ప్రకటనలో వెల్లడించింది.
‘‘అంతేగాక, ఆధార్ బయోమెట్రిక్ కోసం కేవలం వేలిముద్ర మాత్రమే కాకుండా, ఫేస్ అథెంటికేషన్, ఐరిస్ అథెంటికేషన్ వంటి కాంటాక్ట్లెస్ మార్గాలు కూడా ఉన్నాయన్న విషయాన్ని మూడీస్ విస్మరించింది. దీంతో పాటు.. చాలా కేసుల్లో మొబైల్ ఓటీపీని వినియోగించుకునే సదుపాయం అందుబాటులో ఉంది. ఇక, సెంట్రలైజ్డ్ ఆధార్ వ్యవస్థలో భద్రతా, గోప్యతా ముప్పు పొంచి ఉందని నివేదికలో వాదించారు. కానీ, ఆధార్ డేటాబేస్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి డేటా ఉల్లంఘనలు జరగలేదు. ఆ విషయాన్ని ఇప్పటికే చాలా సార్లు పార్లమెంట్ ముందు నివేదించాం’’ అని ఉడాయ్ తమ ప్రకటనలో వివరించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చైనాలో ఎలాన్ మస్క్ ఆకస్మిక పర్యటన!
Elon Musk: దాదాపు వారం క్రితం ఎలాన్ మస్క్ భారత పర్యటనను రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఆకస్మికంగా చైనాలో పర్యటిస్తున్నట్లు సంబంధిత వ్యక్తులు తెలిపారు. -
రూ.49కే బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ సబ్స్క్రిప్షన్
BSNL Cinemaplus: బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ పేరిట ఓటీటీ ప్యాకేజీలను అందిస్తోంది. దీంట్లో మొత్తం మూడు ప్యాక్లు ఉన్నాయి. తాజాగా స్టార్టర్ ప్యాక్ ధరను సంస్థ కుదించింది. -
వేసవిలో ఫోన్ ఛార్జింగ్ వేగం తగ్గుతుంది..? ఎందుకు?
వేసవిలో స్మార్ట్ఫోన్ ఛార్జింగ్లో వేగం మందగిస్తుంది. దీనికి కారణమేంటి? ఎందుకు వేగం తగ్గుతుంది? -
ఐసీఐసీఐ లాభం రూ.11,672 కోట్లు
ఐసీఐసీఐ బ్యాంక్ ఆర్థిక ఫలితాలకు తక్కువ కేటాయింపులు కలిసివచ్చాయి. దీంతో మార్చి త్రైమాసికంలో బ్యాంక్ ఏకీకృత నికర లాభం 18.5 శాతం వృద్ధి చెంది రూ.11,672 కోట్లకు చేరుకుంది. -
ఒకే పాలసీలోనే అన్ని ధీమాలు
అందరికీ బీమా పాలసీలను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఐఆర్డీఏఐ) ఒక ప్రామాణిక పాలసీ ‘బీమా విస్తార్’ను అందుబాటులోకి తీసుకురానుంది. -
హైదరాబాద్లో కార్యాలయాల అద్దె లావాదేవీలు పెరిగాయ్
కార్పొరేట్ల నుంచి గిరాకీ స్థిరంగా ఉండటంతో ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో కార్యాలయాల అద్దె లావాదేవీలు 13 శాతం వృద్ధితో 1.34 కోట్ల చదరపు అడుగులకు చేరిందని స్థిరాస్తి సేవలను అందించే వెస్టియన్ తెలిపింది. -
మ్యూచువల్ ఫండ్ కొత్త పథకాల్లోకి రూ.66,364 కోట్లు
గత ఆర్థిక సంవత్సరంలో మ్యూచువల్ ఫండ్ సంస్థలు(ఏఎంసీ) 185 కొత్త పథకాలను(ఎన్ఎఫ్ఓ-న్యూ ఫండ్ ఆఫర్) విడుదల చేశాయి. -
వైద్య ఉత్పత్తుల రంగంలో భారత్ కీలకం
వైద్య ఉత్పత్తుల రంగంలో భారతదేశానికి ఎంతో ముఖ్యమైన బాధ్యత ఉన్నట్లు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్ఎఫ్డీఏ) కమిషనర్ డాక్టర్ రాబర్ట్ కాలిఫ్ అన్నారు. -
ఆర్బీఎల్ బ్యాంక్ లాభంలో 30% వృద్ధి
జనవరి- మార్చి త్రైమాసికంలో ఆర్బీఎల్ బ్యాంక్ నికర లాభం 30 శాతం పెరిగి రూ.353 కోట్లకు చేరింది. -
యెస్ బ్యాంక్ లాభం రెట్టింపు
జనవరి- మార్చి త్రైమాసికంలో యెస్ బ్యాంక్ నికర లాభం స్టాండలోన్ పద్ధతిలో రూ.452 కోట్లుగా నమోదైంది. -
పూరీ విమానాశ్రయం ప్రాజెక్టు పోటీలో జీఎంఆర్, అదానీ గ్రూపు, ఫెయిర్ఫాక్స్?
ఒడిశా రాష్ట్రంలోని పూరీలో కొత్త విమానాశ్రయాన్ని నిర్మించి, నిర్వహించే అవకాశం కోసం జీఎంఆర్, అదానీ గ్రూపు, విదేశీ సంస్థ అయిన ఫెయిర్ఫాక్స్ పోటీ పడుతున్నాయి. -
భారత్లో షార్ప్ సెమీ కండక్టర్ల యూనిట్
జపాన్ ఎలక్ట్రానిక్ దిగ్గజం షార్ప్ దేశంలో సెమీకండక్టర్ ఫ్యాబ్ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. -
సంక్షిప్త వార్తలు
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సీకే బిర్లా గ్రూపు కంపెనీ, హెచ్ఐఎల్ లిమిటెడ్, పైపులు- ఫిట్టింగ్స్ వ్యాపారంలోకి విస్తరిస్తోంది. -
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
ఐటీ రంగంలో ఉద్యోగుల సంఖ్య నానాటికీ తగ్గుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో టాప్-5 ఐటీ సంస్థల్లోనే ఉద్యోగుల సంఖ్య 69 వేల వరకు తగ్గింది. -
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
Amazon: అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ వచ్చేసింది. మే 2 నుంచి ఈ సేల్ ప్రారంభం కానుందని ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
పాలు ఎప్పుడు తాగాలి? ఎందుకు తాగాలి? పూర్తి సమాచారం ఇదిగో!
-
చైనాలో ఎలాన్ మస్క్ ఆకస్మిక పర్యటన!
-
వెంకటగిరిలో జగన్ సభ.. జనాలకు చుక్కలు చూపించిన వైకాపా
-
టాలీవుడ్లో చరిత్ర లిఖించిన రోజు.. ఎన్ని బ్లాక్బస్టర్లు విడుదలయ్యాయంటే?
-
శంషాబాద్ ఎయిర్పోర్టు సమీపంలో చిరుత సంచారం!
-
రూ.49కే బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ సబ్స్క్రిప్షన్