Disney-Reliance Merger: డిస్నీ, రిలయన్స్ విలీన ఒప్పందం ఖరారు!
Disney-Reliance Merger: గత కొన్ని నెలలుగా రిలయన్స్ ఇండస్ట్రీస్, డిస్నీ మధ్య విలీన ఒప్పందం జరగనుందంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా దీనిపై ఇరు సంస్థలు సంతకాలు చేసినట్లు సమాచారం.
దిల్లీ: భారత్లో మీడియా వ్యాపారాలను విలీనం చేసే నిమిత్తం వాల్డ్ డిస్నీ (Walt Disney) కంపెనీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) నిశ్చయాత్మక ఒప్పందంపై సంతకాలు చేసినట్లు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ బ్లూమ్బర్గ్ వెల్లడించింది. విలీనానంతర సంస్థలో 61 శాతం వాటా కలిగి ఉండేలా రిలయన్స్ ఇండస్ట్రీస్ పెట్టుబడులు పెడుతుందని ఆ వర్గాలు తెలిపాయి. మిగిలిన వాటా డిస్నీ చేతిలో ఉంటుంది. నగదు- షేర్ల బదిలీ రూపంలో ఈ లావాదేవీ జరిగే అవకాశం ఉందని సమాచారం. దీనిపై ఇరు సంస్థలు ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు.
ఇరు సంస్థల మధ్య వాటాల పంపకాలు ఒప్పందం పూర్తయ్యే లోపు మారొచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. బ్రాడ్కాస్ట్ సర్వీస్ ప్రొవైడర్ టాటా ప్లే లిమిటెడ్లో డిస్నీకి మైనారిటీ వాటాలు ఉన్నాయి. దీన్ని రిలయన్స్ కొనుగోలు చేసే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు సబ్స్క్రైబర్లను నిలిపి ఉంచుకోవడంలో డిస్నీకి భారత్లో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. అదే సమయంలో రిలయన్స్ ఇటీవల దేశంలో అనేక ఎంటర్టైన్మెంట్, మీడియా వ్యాపారాల్లో ఇన్వెస్ట్ చేసింది. ఇప్పటికే నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్లను ఆకర్షించిన దేశీయ మీడియా, వినోద రంగంపై పట్టు సాధించాలని ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఉవ్విళ్లూరుతోంది. 2022లో డిస్నీని వెనక్కి నెట్టి ఐపీఎల్ ప్రసార హక్కులను రిలయన్స్ సొంతం చేసుకున్న సంగతి విదితమే. అదే క్రమంలో గతంలో డిస్నీ చేతిలో ఉన్న వార్నర్ బ్రదర్స్ డిస్కవరీకి చెందిన హెచ్బీఓ షోల బ్రాడ్కాస్ట్ను సైతం దక్కించుకుంది.
విలీనానంతర సంస్థ దేశంలోని దిగ్గజ వినోద రంగ సంస్థల్లో ఒకటిగా నిలవనుంది. ఈ సంస్థకు స్టార్ ఇండియా నుంచి ఎనిమిది భాషల్లో 70 ఛానళ్లు, రిలయన్స్కు చెందిన వయాకామ్ 18 నుంచి 38 ఛానళ్లు లభిస్తాయి. ఇవే కాకుండా రెండు స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లు- డిస్నీ హాట్స్టార్, జియో సినిమా కూడా ఉంటాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రూ.49కే బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ సబ్స్క్రిప్షన్
BSNL Cinemaplus: బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ పేరిట ఓటీటీ ప్యాకేజీలను అందిస్తోంది. దీంట్లో మొత్తం మూడు ప్యాక్లు ఉన్నాయి. తాజాగా స్టార్టర్ ప్యాక్ ధరను సంస్థ కుదించింది. -
వేసవిలో ఫోన్ ఛార్జింగ్ వేగం తగ్గుతుంది..? ఎందుకు?
వేసవిలో స్మార్ట్ఫోన్ ఛార్జింగ్లో వేగం మందగిస్తుంది. దీనికి కారణమేంటి? ఎందుకు వేగం తగ్గుతుంది? -
ఐసీఐసీఐ లాభం రూ.11,672 కోట్లు
ఐసీఐసీఐ బ్యాంక్ ఆర్థిక ఫలితాలకు తక్కువ కేటాయింపులు కలిసివచ్చాయి. దీంతో మార్చి త్రైమాసికంలో బ్యాంక్ ఏకీకృత నికర లాభం 18.5 శాతం వృద్ధి చెంది రూ.11,672 కోట్లకు చేరుకుంది. -
ఒకే పాలసీలోనే అన్ని ధీమాలు
అందరికీ బీమా పాలసీలను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఐఆర్డీఏఐ) ఒక ప్రామాణిక పాలసీ ‘బీమా విస్తార్’ను అందుబాటులోకి తీసుకురానుంది. -
హైదరాబాద్లో కార్యాలయాల అద్దె లావాదేవీలు పెరిగాయ్
కార్పొరేట్ల నుంచి గిరాకీ స్థిరంగా ఉండటంతో ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో కార్యాలయాల అద్దె లావాదేవీలు 13 శాతం వృద్ధితో 1.34 కోట్ల చదరపు అడుగులకు చేరిందని స్థిరాస్తి సేవలను అందించే వెస్టియన్ తెలిపింది. -
మ్యూచువల్ ఫండ్ కొత్త పథకాల్లోకి రూ.66,364 కోట్లు
గత ఆర్థిక సంవత్సరంలో మ్యూచువల్ ఫండ్ సంస్థలు(ఏఎంసీ) 185 కొత్త పథకాలను(ఎన్ఎఫ్ఓ-న్యూ ఫండ్ ఆఫర్) విడుదల చేశాయి. -
వైద్య ఉత్పత్తుల రంగంలో భారత్ కీలకం
వైద్య ఉత్పత్తుల రంగంలో భారతదేశానికి ఎంతో ముఖ్యమైన బాధ్యత ఉన్నట్లు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్ఎఫ్డీఏ) కమిషనర్ డాక్టర్ రాబర్ట్ కాలిఫ్ అన్నారు. -
ఆర్బీఎల్ బ్యాంక్ లాభంలో 30% వృద్ధి
జనవరి- మార్చి త్రైమాసికంలో ఆర్బీఎల్ బ్యాంక్ నికర లాభం 30 శాతం పెరిగి రూ.353 కోట్లకు చేరింది. -
యెస్ బ్యాంక్ లాభం రెట్టింపు
జనవరి- మార్చి త్రైమాసికంలో యెస్ బ్యాంక్ నికర లాభం స్టాండలోన్ పద్ధతిలో రూ.452 కోట్లుగా నమోదైంది. -
పూరీ విమానాశ్రయం ప్రాజెక్టు పోటీలో జీఎంఆర్, అదానీ గ్రూపు, ఫెయిర్ఫాక్స్?
ఒడిశా రాష్ట్రంలోని పూరీలో కొత్త విమానాశ్రయాన్ని నిర్మించి, నిర్వహించే అవకాశం కోసం జీఎంఆర్, అదానీ గ్రూపు, విదేశీ సంస్థ అయిన ఫెయిర్ఫాక్స్ పోటీ పడుతున్నాయి. -
భారత్లో షార్ప్ సెమీ కండక్టర్ల యూనిట్
జపాన్ ఎలక్ట్రానిక్ దిగ్గజం షార్ప్ దేశంలో సెమీకండక్టర్ ఫ్యాబ్ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. -
సంక్షిప్త వార్తలు
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సీకే బిర్లా గ్రూపు కంపెనీ, హెచ్ఐఎల్ లిమిటెడ్, పైపులు- ఫిట్టింగ్స్ వ్యాపారంలోకి విస్తరిస్తోంది. -
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
ఐటీ రంగంలో ఉద్యోగుల సంఖ్య నానాటికీ తగ్గుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో టాప్-5 ఐటీ సంస్థల్లోనే ఉద్యోగుల సంఖ్య 69 వేల వరకు తగ్గింది. -
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
Amazon: అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ వచ్చేసింది. మే 2 నుంచి ఈ సేల్ ప్రారంభం కానుందని ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
టాలీవుడ్లో చరిత్ర లిఖించిన రోజు.. ఎన్ని బ్లాక్బస్టర్లు విడుదలయ్యాయంటే?
-
శంషాబాద్ ఎయిర్పోర్టు సమీపంలో చిరుత సంచారం!
-
రూ.49కే బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ సబ్స్క్రిప్షన్
-
నవాబులు, సుల్తాన్ల అరాచకాలపై మౌనమా?: రాహుల్పై మోదీ ధ్వజం
-
ధోనీ ‘ఐపీఎల్’ జర్నీ సక్సెస్కు కారణమిదే!
-
పండుగాడికి పద్దెనిమిదేళ్లు .. ‘పోకిరి’ ఆసక్తికర విశేషాలు..