ఐపీఓ వాచ్: ఐదు సబ్స్క్రిప్షన్లు.. నాలుగు లిస్టింగ్లు
IPO Watch: ఈ వారం ఐదు సంస్థలు ఐపీఓలకు రానున్నాయి. రూ.1680 కోట్లు సమీకరించనున్నాయి. ఇందులో రెండు మెయిన్బోర్డు సెగ్మెంట్లో వస్తున్నాయి.
IPO Watch | ఇంటర్నెట్ డెస్క్: ఐపీఓల సందడి వచ్చే వారం కూడా కొనసాగనుంది. సోమవారం నుంచి ఐదు ఐపీఓలు ప్రారంభం కానున్నాయి. మొత్తం రూ.1,680 కోట్లు మార్కెట్ల నుంచి ఆయా సంస్థలు సమీకరించనున్నాయి. ఇందులో రెండు మెయిన్బోర్డ్ ఐపీఓలు కాగా.. మూడు ఎస్ఎంఈ సెగ్మెంట్లో సబ్స్క్రిప్షన్కు వస్తున్నాయి. మరో నాలుగు కంపెనీలు ఈ వారమే లిస్టింగ్కు రానున్నాయి. ఆ వివరాలు ఇవీ..
మెడి అసిస్ట్ ఐపీఓ: మెయిన్బోర్డ్ సెగ్మెంట్లో మెడి అసిస్ట్ హెల్త్కేర్ సర్వీసెస్ ఐపీఓ ఈ నెల 15న ప్రారంభమై 17న ముగియనుంది. ఒక్కో షేరుకు ధరల శ్రేణి రూ.397-418గా నిర్ణయించారు. గరిష్ఠ ధర వద్ద కంపెనీ రూ.1,172 కోట్లు సమీకరించనుంది. రిటైల్ మదుపర్లు కనీసం 35 షేర్లకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇష్యూలో భాగంగా ఆఫర్ ఫర్ సేల్లో 2.8 కోట్ల వరకు ఈక్విటీ షేర్లను ప్రస్తుత వాటాదార్లు, ప్రమోటర్లు విక్రయించనున్నారు.
ఎపాక్ డ్యూరబుల్ ఐపీఓ: ఎపాక్ డ్యూరబుల్ ఐపీఓ సబ్స్క్రిప్షన్ జనవరి 19 నుంచి ప్రారంభం కానుంది. 23న ముగియనుంది. ధరల శ్రేణి వెల్లడి కావాల్సి ఉంది. ఏసీల ఒరిజినల్ డిజైన్ మాన్యూఫ్యాక్చరర్ అయిన ఈ కంపెనీ.. రూ.400 కోట్లు ఫ్రెష్ ఇష్యూ ద్వారా, 1.04 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ ద్వారా విక్రయించనుంది.
- ఎస్ఎంఈ సెగ్మెంట్లో మ్యాక్స్పోజర్ సంస్థ ఐపీఓకు వస్తోంది. జనవరి 15-17 తేదీల్లో సబ్స్క్రిప్షన్కు రానుంది. రూ.20.26 కోట్లను మార్కెట్ల నుంచి సమీకరించనుంది. ధరల శ్రేణి రూ.31-33.
- కాన్స్టెలెక్ ఇంజనీర్స్ సైతం ఎస్ఎంఈ సెగ్మెంట్లోనే ఐపీఓకు వస్తోంది. జనవరి 19 -23 తేదీల్లో సబ్స్క్రిప్షన్కు రానుంది. రూ.28.70 కోట్లు సమీకరించనుంది. ధరల శ్రేణి రూ.66-70.
- దిల్లీకి చెందిన అడిక్టివ్ లెర్నింగ్ టెక్నాలజీ (లాసికో) ఐపీఓ (SME) జనవరి 19-23 తేదీల్లో సబ్స్క్రిప్షన్కు రానుంది. ధరల శ్రేణి రూ.130-140గా నిర్ణయించారు.
గత వారం మెయిన్బోర్డు సెగ్మెంట్లో ఐపీఓకు వచ్చిన జ్యోతి సీఎన్సీ ఆటోమోటివ్ సంస్థ జనవరి 16న స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ కానుంది. ఈ ఐపీఓకు 38.6 రెట్లు సబ్స్క్రిప్షన్ లభించింది. ఎస్ఎంఈ సెగ్మెంట్లో వచ్చిన ఐబీఎల్ ఫైనాన్స్ 16నే లిస్ట్ అవ్వనుంది. ఎస్ఎంఈ సెగ్మెంట్లో వచ్చిన న్యూ స్వాన్ మల్టీటెక్, ఆస్ట్రేలియన్ ప్రీమియం సోలార్ జనవరి 18న లిస్ట్ కానున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు
మారుతీ సుజుకీ త్వరలోనే అందుబాటు ధరలో హైబ్రిడ్ కార్లను తీసుకురావడంపై పని చేస్తోంది. -
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
ఐటీ రంగంలో ఉద్యోగుల సంఖ్య నానాటికీ తగ్గుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో టాప్-5 ఐటీ సంస్థల్లోనే ఉద్యోగుల సంఖ్య 69 వేల వరకు తగ్గింది. -
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్
గూగుల్లో ఉద్యోగం మొదలుపెట్టి 20 ఏళ్లు అయిందని సీఈఓ సుందర్ పిచాయ్ (Sundar Pichai) వెల్లడించారు. ఈ మేరకు ఓ పోస్టు పెట్టారు. -
మహిళా ఆవిష్కర్తలు పెరగాలి
మనదేశంలో మహిళా ఆవిష్కర్తల సంఖ్య తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని, ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. -
వరుస లాభాలకు విరామం
సూచీల అయిదు రోజుల లాభాల ర్యాలీకి కళ్లెం పడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించారు. -
2047 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ
తెలంగాణ 2047 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల (రూ.85 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా మారేందుకు భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తన వంతు పాత్ర పోషిస్తుందని సీఐఐ తెలంగాణ ఛైర్మన్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి డి ప్రసాద్ అన్నారు. -
హార్లిక్స్ ‘హెల్త్ డ్రింక్’ కాదు
హిందుస్థాన్ యునిలీవర్(హెచ్యూఎల్) తన బ్రాండ్ హార్లిక్స్ లేబుల్పై కీలక మార్పులు చేసింది. గతంలో ‘హెల్త్ ఫుడ్ డ్రింక్స్’ కేటగిరిలో ఉన్న హార్లిక్స్ను ‘ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్’ కేటగిరిలోకి మార్చింది. -
రిలయన్స్కు రేటింగ్ సంస్థల ‘జై’
2024 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్కు అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఎస్ అండ్ పీ, ఫిచ్ జై కొట్టాయి. -
భారత జీడీపీ వృద్ధి 6.6 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో భారత జీడీపీ వృద్ధి 6.6 శాతంగా నమోదుకావొచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. -
మారుతీకి విక్రయాల జోష్
జనవరి-మార్చి త్రైమాసికంలో మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం 47.8 శాతం పెరిగి రూ.3,877.70 కోట్లుగా నమోదైంది. -
హెచ్సీఎల్ టెక్ లాభం రూ.3,986 కోట్లు
దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.3,986 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.3,983 కోట్లుగా ఉంది. -
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు ఎస్ఎఫ్బీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు నిర్దేశిత అర్హతలను కలిగి ఉన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల (ఎస్ఎఫ్బీ) నుంచి దరఖాస్తులను ఆహ్వానించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. -
సంక్షిప్త వార్తలు(6)
అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఏహెచ్ఈఎల్) అనుబంధ సంస్థ అపోలో హెల్త్కో లిమిటెడ్(అపోలో 24/7)కు రూ.2,475 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయి. -
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
Flipkart: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది.
తాజా వార్తలు (Latest News)
-
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు
-
వాటిని తెంచుకున్నంత సులువుగా ప్రేమను వదులుకోలేకపోయా: కమల్ హాసన్
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
-
అధికారిక ప్రకటనే లేదు.. ‘రామాయణ’ షూట్ ఫొటోలు వైరల్
-
హెలికాప్టర్లో తూలి పడిపోయిన మమతా బెనర్జీ
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్