Mark Zuckerberg: జుకర్బర్గ్ ఆసియా టూర్.. ఏఐ చిప్స్, అంబానీ ప్రీ-వెడ్డింగ్
Mark Zuckerberg: టెక్ దిగ్గజం మార్క్ జుకర్బర్గ్ త్వరలో భారత్కు రానున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ చిన్న కుమారుడి వివాహ ముందుస్తు వేడుకలకు హాజరుకానున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఫేస్బుక్ (Facebook) మాతృ సంస్థ మెటా (Meta) అధిపతి మార్క్ జుకర్బర్గ్ (Mark Zuckerberg) ఆసియా పర్యటన చేపట్టారు. కుటుంబంతో కలిసి సోమవారం జపాన్ చేరుకున్న ఆయన.. అక్కడినుంచి దక్షిణకొరియా వెళ్లి ఆ తర్వాత భారత్కు రానున్నారు. ఈ పర్యటనలో పలు కీలక సమావేశాల్లో ఆయన పాల్గోనున్నారు. యాపిల్తో పోటీ పడేందుకు ఓ డీల్ కుదుర్చుకోనున్నారు. ఇక, ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ (Mukesh Ambani) తనయుడి ప్రీ వెడ్డింగ్ వేడుకకు ఆయన హాజరుకానున్నారు.
కత్తుల తయారీని నేర్చుకుని..
ప్రస్తుతం జపాన్లో ఉన్న జుకర్.. అక్కడ సంప్రదాయ కటానా (కత్తులు) ఎలా తయారుచేస్తారో నేర్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆయన ఇన్స్టాలో పంచుకున్నారు. స్వయంగా కొలిమిలోని ఇనుమును సుత్తితో కొట్టి కత్తిని తయారుచేశారు. ఈ పర్యటనలో భాగంగా టోక్యోలోని ఫేస్బుక్ డెవలపర్లతో ఆయన వరుస సమావేశాలు నిర్వహించనున్నారు.
అనంత్ అంబానీ ముందస్తు పెళ్లి వేడుకలకు విలాస టెంట్లు
యాపిల్తో పోటీ పడేందుకు..
అక్కడినుంచి జుకర్బర్గ్ దక్షిణాఫ్రికా చేరుకోనున్నారు. ఆ దేశాధ్యక్షుడు యూన్ సుక్ యోల్తో సమావేశం కానున్నారు. ఏఐ చిప్స్ ప్రధాన అజెండాగా శామ్సంగ్ ఎలక్ట్రానిక్స్, ఎస్ హినిక్స్ ప్రతినిధులతో ఆయన భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఇక, యాపిల్ విజన్ ప్రోతో పోటీ పడేందుకు మిక్స్డ్ రియాల్టీ హెడ్సెట్ను మెటా తీసుకురానున్న విషయం తెలిసిందే. దీని అభివృద్ధికి ఎల్జీ ఎలక్ట్రానిక్స్ సీఈవోతో జుకర్ చర్చించనున్నట్లు కొరియన్ మీడియా కథనాలు వెల్లడించాయి.
అంబానీ ఇంట వేడుకకు..
మార్చి 1-3 తేదీల్లో గుజరాత్లోని జామ్నగర్ వేదికగా జరిగే అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ ముందస్తు వివాహ వేడుకలకు హాజరయ్యే ప్రపంచ ప్రఖ్యాత అతిథుల్లో జుకర్ కూడా ఉన్నారు. రిలయన్స్కు చెందిన డిజిటల్ విభాగం జియో ప్లాట్ఫామ్స్లో మెటా బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టిన సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్
గూగుల్లో ఉద్యోగం మొదలుపెట్టి 20 ఏళ్లు అయిందని సీఈఓ సుందర్ పిచాయ్ (Sundar Pichai) వెల్లడించారు. ఈ మేరకు ఓ పోస్టు పెట్టారు. -
మహిళా ఆవిష్కర్తలు పెరగాలి
మనదేశంలో మహిళా ఆవిష్కర్తల సంఖ్య తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని, ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. -
వరుస లాభాలకు విరామం
సూచీల అయిదు రోజుల లాభాల ర్యాలీకి కళ్లెం పడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించారు. -
2047 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ
తెలంగాణ 2047 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల (రూ.85 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా మారేందుకు భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తన వంతు పాత్ర పోషిస్తుందని సీఐఐ తెలంగాణ ఛైర్మన్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి డి ప్రసాద్ అన్నారు. -
హార్లిక్స్ ‘హెల్త్ డ్రింక్’ కాదు
హిందుస్థాన్ యునిలీవర్(హెచ్యూఎల్) తన బ్రాండ్ హార్లిక్స్ లేబుల్పై కీలక మార్పులు చేసింది. గతంలో ‘హెల్త్ ఫుడ్ డ్రింక్స్’ కేటగిరిలో ఉన్న హార్లిక్స్ను ‘ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్’ కేటగిరిలోకి మార్చింది. -
రిలయన్స్కు రేటింగ్ సంస్థల ‘జై’
2024 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్కు అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఎస్ అండ్ పీ, ఫిచ్ జై కొట్టాయి. -
భారత జీడీపీ వృద్ధి 6.6 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో భారత జీడీపీ వృద్ధి 6.6 శాతంగా నమోదుకావొచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. -
మారుతీకి విక్రయాల జోష్
జనవరి-మార్చి త్రైమాసికంలో మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం 47.8 శాతం పెరిగి రూ.3,877.70 కోట్లుగా నమోదైంది. -
హెచ్సీఎల్ టెక్ లాభం రూ.3,986 కోట్లు
దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.3,986 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.3,983 కోట్లుగా ఉంది. -
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు ఎస్ఎఫ్బీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు నిర్దేశిత అర్హతలను కలిగి ఉన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల (ఎస్ఎఫ్బీ) నుంచి దరఖాస్తులను ఆహ్వానించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. -
సంక్షిప్త వార్తలు(6)
అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఏహెచ్ఈఎల్) అనుబంధ సంస్థ అపోలో హెల్త్కో లిమిటెడ్(అపోలో 24/7)కు రూ.2,475 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయి. -
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
Flipkart: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది.
తాజా వార్తలు (Latest News)
-
జైల్లో కేజ్రీవాల్ ఆరోగ్యంగానే..: ఎయిమ్స్ మెడికల్ బోర్డు..!
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
-
ఆలిన్ హెర్బల్ పరిశ్రమలో మళ్లీ వ్యాపించిన మంటలు
-
రోడ్డుపై పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: అమెరికా కారు ప్రమాదంలో 3 భారతీయులు దుర్మరణం
-
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్
-
హాలీవుడ్కు వెళ్లాక భయపడ్డా.. ఆ భావన మనసును కుంగదీసింది: ప్రియాంక చోప్రా