Business news: డాక్టర్ రెడ్డీస్ లాభం రూ.1,188 కోట్లు
డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి ఏకీకృత ఖాతాల ప్రకారం రికార్డు స్థాయిలో రూ.1,188 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది.
అనూహ్యంగా పెరిగిన ఇతర ఆదాయం
ఈనాడు, హైదరాబాద్: డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి ఏకీకృత ఖాతాల ప్రకారం రికార్డు స్థాయిలో రూ.1,188 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదేకాల లాభం రూ.570 కోట్లతో పోల్చితే, ఇది 108 శాతం అధికం. ఇదే సమయంలో ఆదాయం కూడా రూ.4,919 కోట్ల నుంచి 6 శాతం వృద్ధితో రూ.5,215 కోట్లకు పెరిగింది. సమీక్షా త్రైమాసికంలో ఇతర ఆదాయం అధికంగా నమోదు కావడం గమనార్హం. ఇండీవియర్ ఇంక్, ఇండీవియర్ యూకే, అక్వెస్టివ్ థెరప్యూటిక్స్ ఇంక్., అనే సంస్థలతో జనరిక్ బుప్రెనోర్ఫైన్, నలోగ్జోన్ సబ్లింగువల్ ఫిల్మ్ అనే మందుకు సంబంధించిన వివాదాన్ని డాక్టర్ రెడ్డీస్ ఇటీవల పరిష్కరించుకుంది. మరికొన్ని సర్దుబాట్ల వల్ల లభించిన ప్రతిఫలంతో, కంపెనీకి ఇతర ఆదాయం అనూహ్యంగా రూ.600 కోట్లు లభించింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదేకాలంలో ఇతర ఆదాయం రూ.50 కోట్లు మాత్రమే. దీనివల్ల ఈసారి నికరలాభం భారీగా పెరిగింది.
ఉత్తర అమెరికాకు కొత్త ఔషధాలు: జూన్ త్రైమాసికంలో కెనడా, ఉత్తర అమెరికా మార్కెట్లలో డాక్టర్ రెడ్డీస్, 6 కొత్త ఔషధాలు విడుదల చేసింది. సమీప భవిష్యత్తులో అమెరికాలో మరో 25 కొత్త ఔషధాలు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. తాజా ఫలితాలపై కంపెనీ సహఛైర్మన్, ఎండీ జీవీ ప్రసాద్ స్పందిస్తూ, తమ ఔషధాల శ్రేణిని పెంచుకోవటం ద్వారా, వ్యాపారాన్ని గణనీయంగా విస్తరించే యత్నాల్లో నిమగ్నమైనట్లు పేర్కొన్నారు.
దేశీయ మార్కెట్లో 26 శాతం వృద్ధి : జూన్ త్రైమాసికంలో ఉత్తర అమెరికాలో 2 శాతం, ఐరోపాలో 4 శాతం వృద్ధిని డాక్టర్ రెడ్డీస్ నమోదు చేసింది. రష్యాలో మాత్రం అమ్మకాలు 9 శాతం తగ్గాయి. అదే సమయంలో దేశీయ మార్కెట్లో ఎంతో అధికంగా 26 శాతం వృద్ధి నమోదైంది. కొన్ని అప్రధాన ఔషధ బ్రాండ్లను విక్రయించడం, నొవార్టిస్ నుంచి కొన్ని ఉత్పత్తులు సొంతం చేసుకోవడం, కొత్త ఔషధాలు కొన్ని విడుదల చేయడం వల్ల దేశీయ మార్కెట్లో అధిక వృద్ధి నమోదు చేసే అవకాశం వచ్చినట్లు డాక్టర్ రెడ్డీస్ వివరించింది.
బూస్టర్ డోసుగా స్పుత్నిక్ లైట్ టీకా: మొదటి రెండు డోసులుగా ఏ టీకా తీసుకున్నా, బూస్టర్ డోసుగా స్పుత్నిక్ లైట్ టీకాను ఇచ్చేందుకు వీలుగా సిద్ధం చేస్తున్నట్లు డాక్టర్ రెడ్డీస్ సీఈఓ ఎరెజ్ ఇజ్రాయెల్ తెలిపారు. దీనికి సంబంధించి దేశీయంగా తాము నిర్వహిస్తున్న క్లినికల్ పరీక్షలు తుది దశలో ఉన్నాయని అన్నారు. దీనికి భారతదేశంలో అనుమతి వచ్చిన తర్వాత, ఇతర దేశాల్లోకి విడుదల చేసే సన్నాహాలు చేపడతామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోరమాండల్ ఇంటర్నేషనల్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్
ఎరువులు, రసాయనాలు, సస్య రక్షణ మందుల కంపెనీ, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్కు నూతన ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్ నియమితులయ్యారు. -
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల కోసం డాక్టర్ రెడ్డీస్, నెస్లే సంయుక్త సంస్థ
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల విక్రయాలను దేశీయ మార్కెట్లో గణనీయంగా పెంచుకునే లక్ష్యంతో నెస్లే ఇండియా, డాక్టర్ రెడ్డీస్ చేతులు కలిపాయి. -
వ్యవసాయ రుణాలు మరింత వేగంగా
వ్యవసాయ రుణాల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విభాగమైన ఆర్బీఐహెచ్తో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్) భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
2023-24లో 1.03 లక్షల పేటెంట్లు మంజూరు
2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ 1.03 లక్షల పేటెంట్లను మంజూరు చేసినట్లు కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్ అండ్ ట్రేడ్మార్క్స్ ఉన్నత్ పండిట్ గురువారం వెల్లడించారు. -
బజాజ్ ఫైనాన్స్ లాభం రూ.3,825 కోట్లు
బజాజ్ ఫైనాన్స్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.3,825 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.3,158 కోట్లతో పోలిస్తే ఇది 21% అధికం. -
బీజింగ్ ఆటోషో జిగేల్
చైనాలో అతిపెద్ద వాహన ప్రదర్శన ‘బీజింగ్ ఆటో షో’ గురువారం ప్రారంభమైంది. ఇందులో మొత్తం 117 కొత్త మోడళ్లు ప్రదర్శించనున్నారు. -
ఇండస్ఇండ్ బ్యాంక్ డివిడెండ్ 165%
ఇండస్ఇండ్ బ్యాంక్, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.2,349 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
మదుపర్ల సంపద రూ.404 లక్షల కోట్లకు
కొనుగోళ్ల జోరుతో వరుసగా అయిదో రోజూ సూచీలు మెరిశాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, లోహ షేర్లు రాణించడంతో సెన్సెక్స్ మళ్లీ 74,000 పాయింట్ల ఎగువకు చేరింది. నిఫ్టీ 22,500 స్థాయిని అందుకుంది. -
ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు రూ.700 కోట్లు: దివీస్
దివీస్ లేబొరేటరీస్ రూ.700 కోట్లతో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోనుంది. దీర్ఘకాలిక మందుల సరఫరా నిమ్తితం ఒక ఔషధ కంపెనీతో కాంట్రాక్టు కుదుర్చుకోనున్నట్లు, దీనికి అవసరమైన అదనపు ఉత్పత్తి సామర్ధ్యం కోసం రూ.700 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని దివీస్ లేబొరేటరీస్ గురువారం వెల్లడించింది. -
సంక్షిప్తవార్తలు(6)
హైదరాబాద్కు ‘ఇంటర్కాంటినెంటల్’ హోటల్ను పరిచయం చేయడం కోసం ఐహెచ్జీ హోటల్స్ అండ్ రిసార్ట్స్తో బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ జట్టుకట్టింది. -
ఆరోగ్య బీమా అందరికీ అందేలా...
అందరికీ బీమా పాలసీలను అందించాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. -
మ్యూచువల్ ఫండ్లు..కేవైసీని పూర్తి చేశారా?
ఆర్థిక లక్ష్యాలను సాధించే క్రమంలో పెట్టుబడులు ఎంతో కీలకం. దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకూ ఇవి అవసరం. చాలామంది మ్యూచువల్ ఫండ్లను ఇందుకు సరైన మార్గంగా నమ్ముతున్నారు. -
పన్ను విధానం ఎంచుకుందామిలా...
ITR: గత ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు తరుణం వచ్చేసింది. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు కొత్త, పాత పన్ను విధానంలో దేన్ని ఎంచుకోవాలన్న సందేహంలో ఉన్నారు. -
క్రెడిట్ స్కోరు పెరగాలంటే
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఒక వ్యక్తికి రుణాన్ని ఇచ్చేటప్పుడు ముఖ్యంగా పరిశీలించేది క్రెడిట్ స్కోరు. రుణగ్రహీత చరిత్ర, అతని అర్హతను తెలుసుకునేందుకూ ఇది ఉపయోగపడుతుంది. -
అప్పు చేసి.. పెట్టుబడి వద్దు
రెండేళ్ల క్రితం వాహన రుణం తీసుకున్నాను. దీనిపై ఇప్పుడు రూ.4 లక్షల వరకూ టాపప్ రుణం ఇస్తామని బ్యాంకు చెబుతోంది. -
ఉత్పత్తి రంగంలో మదుపు
దేశీయ వినియోగం, ఎగుమతులు పెరుగుతున్న నేపథ్యంలో మన దేశంలో ఉత్పత్తి రంగం గతంలో ఎన్నడూ లేనంత అధిక వృద్ధిని నమోదు చేయబోతోంది. -
ప్రయాణంలో తోడుగా..
ప్రయాణాలు చేసే వారికి ఉపయోగపడేలా ఎస్బీఐ కార్డ్ కొత్త క్రెడిట్ కార్డును తీసుకొచ్చింది. ఎస్బీఐ కార్డ్ మైల్స్ ఎలైట్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ ప్రైమ్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ పేర్లతో మూడు రకాలుగా అందిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల