Adani Group debt: అదానీ అప్పులు.. ఏడాదిలో 21% పైకి
Adani Group debt: అదానీ గ్రూప్ అప్పులు గత ఏడాది కాలంలో 21% పెరిగాయి. మార్చి చివరకు అదానీ తీసుకున్న రుణాల్లో అంతర్జాతీయ బ్యాంకుల వాటా 29 శాతంగా ఉంది. ఏడేళ్ల కిందట ఈ విభాగం నుంచి నిధులు సమీకరించిందే లేదు.
మార్చి 31కి రూ.2.3 లక్షల కోట్లు
అంతర్జాతీయ బ్యాంకుల నుంచి మూడో వంతు రుణాలు
అదానీ గ్రూప్ అప్పులు గత ఏడాది కాలంలో 21% పెరిగాయి. మార్చి చివరకు అదానీ తీసుకున్న రుణాల్లో అంతర్జాతీయ బ్యాంకుల వాటా 29 శాతంగా ఉంది. ఏడేళ్ల కిందట ఈ విభాగం నుంచి నిధులు సమీకరించిందే లేదు. మార్చి 31 నాటికి అదానీ గ్రూప్ (Adani Group)లోని 7 నమోదిత కంపెనీల రుణాలు ఏడాది క్రితంతో పోలిస్తే 20.7% పెరిగి రూ.2.3 లక్షల కోట్లకు చేరినట్లు ఈ అంశాలతో సంబంధమున్న వ్యక్తులను ఉటంకిస్తూ ఒక ఆంగ్ల వార్తా సంస్థ పేర్కొంది. మొత్తం అప్పుల్లో బాండ్ల ద్వారా సమీకరించిన రుణాలు 2016లో 14 శాతం కాగా.. 2023 మార్చి చివరకు 39 శాతానికి చేరాయి. దేశీయ బ్యాంకుల నుంచి సేకరించిన రుణాలూ తక్కువగా ఏమీ లేవు. ఎస్బీఐకి రూ.27,000 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని ఫిబ్రవరిలో గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీయే వెల్లడించారు. భారీ విస్తరణ ప్రణాళికల కారణంగా 2019 నుంచీ రుణాలు స్థిరంగా పెరుగుతూ వచ్చాయి.
పెరుగుతున్న చెల్లింపు సామర్థ్యం: భారత్లోని గుజరాత్లో ప్రారంభమైన అదానీ గ్రూప్ (Adani Group).. ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్తో వ్యాపార సంబంధాలు నెరపడం చూస్తుంటే.. ఎంత బాగా అంతర్జాతీయంగా అనుసంధానం అవుతోందన్నది అర్థమవుతోందని ఆ వార్తా సంస్థ పేర్కొంది. అయితే అమెరికా షార్ట్సెల్లర్ హిండెన్బర్గ్ రీసెర్చ్ నివేదిక అనంతరం, అదానీకిచ్చే రుణాల విషయంలో సంస్థల పరిశీలనలు కఠినమయ్యాయి. ఈ నివేదిక వెలుగు చూశాక, కుదేలైన అదానీ గ్రూప్ (Adani Group)షేర్లు, డాలరు బాండ్లు ఇంకా పూర్తిగా కోలుకోలేదు. అంటే రాబోయే కాలంలో అదానీ గ్రూప్ మరింత ఎక్కువమొత్తం డబ్బులు చెల్లించాల్సి రావొచ్చు. అయితే రుణ నిష్పత్తి మెరుగుపడుతున్నందున చెల్లించే సామర్థ్యమూ పెరిగిందని ఆ వార్తా సంస్థ అంటోంది.
మెరుగుదల ఇదీ..: కంపెనీ తన రుణాలను తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని తెలిపే కీలక గణాంకాలు మెరుగయ్యాయి. నికర రుణాలకు; రన్ రేట్ ఎబిటాకు మధ్య నిష్పత్తి 2013లో 7.6 శాతంగా ఉండగా.. 2022-23 కల్లా అది 3.2 శాతానికి పరిమితమయింది. రన్ రేట్ ఎబిటా అనేది కంపెనీ ఇటీవలి ఆర్థిక పనితీరును లెక్కిస్తుంది. అదానీ గ్రూప్ (Adani Group) తన రుణాలను మరింత తగ్గించుకోవాలని అనుకుంటోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..
Mobile Apps: స్మార్ట్ఫోన్ వినియోగదారులు కచ్చితంగా భద్రతకు ప్రాధాన్యమివ్వాలి. యాప్ను డౌన్లోడ్ చేసుకునే ముందు యాప్ స్టోర్, గోప్యతా విధానాలు, డేటా సేకరణ, సమీక్షలు, మానిటైజేషన్ పద్ధతులు, వివిధ అనుమతుల వంటి అంశాలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి. -
ఎయిర్లైన్స్ లాభాల్లో బిగ్ జంప్.. ఉద్యోగులకు 8 నెలల జీతం బోనస్..
అంచనాలకు మించి లాభాలు నమోదు చేయడంతో సింగపూర్ ఎయిర్లైన్స్ తన ఉద్యోగులకు 8 నెలల జీతాన్ని బోనస్గా అందిస్తున్నట్లు ప్రకటించింది. -
అందుకే భారత్తో వాణిజ్య బంధం తెగిపోయింది: పాక్
Pakistan: పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్ మధ్య సంబంధాలు క్షీణించిన విషయం తెలిసిందే. ఇరు దేశాల మధ్య వాణిజ్యం సైతం దెబ్బతింది. తాజాగా దీనిపై ఆ దేశ విదేశాంగ మంత్రి స్పందించారు. -
Artificial Intelligence: ఎటు చూసినా ఏఐ...
మనదేశంలో ఏఐ (కృత్రిమ మేధ) వినియోగం శరవేగంగా పెరుగుతోంది. కార్యాలయాల్లో అధిక శాతం ఉద్యోగులు ఈ నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సమర్థంగా సేవలు అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. -
స్టాక్ మార్కెట్.. ఎఫ్అండ్ఓపై ఎందుకింత మోజు..?
దేశంలో పొదుపు మొత్తాలు ఎఫ్అండ్ఓ (ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్) ట్రేడ్లోకి వెళ్తున్నాయని, దీనిపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోందని కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారుడు వి.అనంత నాగేశ్వరన్ అన్నారు. -
మన సమాచారం సురక్షితమేనా?
దేశంలో డిజిటల్ ఆర్థిక లావాదేవీలు విపరీతంగా పెరుగుతున్నాయి. అదే సమయంలో సైబర్ నేరాల సంఖ్యా అధికమవుతోంది. వీటిని నివారించేందుకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఎప్పటికప్పుడు తమ వివరాల్లో మార్పులేమైనా ఉంటే సమర్పించాలని ఖాతాదారులను కోరుతున్నాయి. -
ఐసీఐసీఐ మాజీ ఛైర్మన్ వాఘుల్ కన్నుమూత
ప్రభుత్వ రంగంలోని ఐసీసీఐని ప్రైవేటు సంస్థగా మార్చడంలో కీలక పాత్ర పోషించిన నారాయణ్ వాఘుల్ (88) ఆరోగ్య సమస్యలతో శనివారం చెన్నైలోని ఒక ఆసుపత్రిలో మరణించారు. బ్యాంకింగ్ పరిశ్రమలో ఆయన ప్రస్థానం 1960లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రారంభమైంది. -
ఓయో ఐపీఓ దరఖాస్తు ఉపసంహరణ!
తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) కోసం సెబీకి సమర్పించిన దరఖాస్తును ఓయో ఉపసంహరించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కంపెనీ రీఫైనాన్సింగ్ ప్రణాళికను ఖరారు చేసే పనిలో ఉందని.. ఈ ప్రక్రియ పూర్తయ్యాక తిరిగి ఐపీఓకు దరఖాస్తు చేసే యోచనలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
ఆభరణాల దిగుమతులు భారీగా పెరిగాయ్
ఈ ఏడాది ఏప్రిల్లో దేశంలోకి పసిడి ఆభరణాల దిగుమతులు భారీగా పెరిగి రూ.2225 కోట్ల (268.04 మిలియన్ డాలర్ల) స్థాయికి చేరాయని జెమ్ అండ్ జువెలరీ ఎగుమతుల ప్రోత్సాహక మండలి తెలిపింది. 2023 ఏప్రిల్లో ఇవి సుమారుగా రూ.267 కోట్ల (32.12 మిలియన్ డాలర్ల) స్థాయిలోనే ఉన్నాయి. -
చైనా ఈవీలు, లోహాలపై దిగుమతి సుంకాల పెంపు
చైనాలో తయారయ్యే విద్యుత్ వాహనాలు (ఈవీ), అత్యాధునిక బ్యాటరీలు, సోలార్ సెల్స్, వైద్య సామగ్రితో పాటు అక్కడ నుంచి దిగుమతి అయ్యే ఉక్కు, అల్యూమినియంపై కొత్త టారిఫ్లు విధిస్తామని బైడెన్ ప్రభుత్వం ప్రకటించింది. -
ప్రత్యేక ట్రేడింగ్లో స్వల్ప లాభాలు
విదేశీ మదుపర్ల కొనుగోళ్ల మద్దతుతో ప్రత్యేక ట్రేడింగ్ సెషన్లో సూచీలు స్వల్ప లాభాలతో ముగిశాయి. ప్రాథమిక సైట్లో వైఫల్యం తలెత్తినా ఎదుర్కొనేందుకు వాటి సంసిద్ధతను తనిఖీ చేయడానికి బీఎస్ఈ, ఎన్ఎస్ఈలు ఈ ప్రత్యేక ట్రేడింగ్ సెషన్ను శనివారం రెండు దఫాలుగా నిర్వహించాయి. -
వ్యవసాయ అంకురాలు దూసుకెళ్తున్నాయ్
అనుకూల వ్యాపార విధానాలు, ప్రభుత్వ మద్దతు కారణంగా గత తొమ్మిదేళ్లలో వ్యవసాయ - అనుబంధ రంగాల్లో అంకురాల సంఖ్య దాదాపు 7,000కు పైగా పెరిగిందని అఖిల భారత రైతు సంఘాల సమాఖ్య (ఫైఫా) వెల్లడించింది. -
సంక్షిప్త వార్తలు
దొడ్ల డెయిరీ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ.787.4 కోట్ల ఆదాయం, రూ.46.8 కోట్ల నికర లాభం, రూ.7.79 ఈపీఎస్ నమోదు చేసింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఆదాయం రూ.724.3 కోట్లు, నికరలాభం రూ.22.5 కోట్లు, ఈపీఎస్ రూ.3.76 ఉన్నాయి. -
50ఎంపీ సెల్ఫీ కెమెరాతో టెక్నో నుంచి రెండు కొత్త మొబైల్స్
Tecno: టెక్నో కెమన్ సిరీస్లో రెండు కొత్త మొబైల్స్ను లాంచ్ చేసింది. వాటి ధర, ఫీచర్ల విషయాలపై ఓ లుక్కేద్దాం..
తాజా వార్తలు (Latest News)
-
పీర్జాదిగూడ మేయర్, కార్పొరేటర్ల కిడ్నాప్నకు కాంగ్రెస్ యత్నం: హరీశ్రావు
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
బహిరంగ సభ మధ్యలోనే వెనుదిరిగిన రాహుల్.. కారణమిదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
నిలిచిపోయిన కాగజ్నగర్, నవజీవన్ ఎక్స్ప్రెస్ రైళ్లు .. ప్రయాణికుల ఆందోళన
-
భార్య, కుమారుడు వేధిస్తున్నారు, భరణం ఇప్పించండి - మాజీ మంత్రి వేడుకోలు