Reliance: రిలయన్స్ రిటైల్లోకి రూ.8,278 కోట్లు!
ఖతార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ (క్యూఐఏ) తమ పూర్తి స్థాయి అనుబంధ సంస్థ ద్వారా రూ.8,278 కోట్ల పెట్టుబడులను రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (ఆర్ఆర్వీఎల్)లో పెట్టనుంది.
పెట్టుబడులు పెట్టనున్న ఖతార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ
దిల్లీ: ఖతార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ (క్యూఐఏ) తమ పూర్తి స్థాయి అనుబంధ సంస్థ ద్వారా రూ.8,278 కోట్ల పెట్టుబడులను రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (ఆర్ఆర్వీఎల్)లో పెట్టనుంది. ఈ విషయాన్ని రిలయన్స్ రిటైల్ మాతృ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) బుధవారం ప్రకటించింది. ఆర్ఆర్వీఎల్ ప్రీ-మనీ ఈక్విటీ విలువ రూ.8.278 లక్షల కోట్లుగా పరిగణించి, ఖతార్ సంస్థ పెట్టుబడులు పెట్టిందని నియంత్రణ సంస్థలకు ఆర్ఐఎల్ సమాచారమిచ్చింది. ఈ లెక్కన క్యూఐఏ పెట్టుబడి ఆర్ఆర్వీఎల్లో 0.99 శాతానికి సమానం.
ఆర్ఆర్వీఎల్ తన అనుబంధ, అసోసియేట్ సంస్థల ద్వారా దేశంలోనే అతి పెద్ద రిటైల్ వ్యాపారాన్ని కొనసాగిస్తోంది. 18,500 పైచిలుకు విక్రయశాలలతో, ఇంటిగ్రేటెడ్ ఓమ్నీ ఛానెల్ నెట్వర్క్ను కలిగి ఉంది. ‘ఆర్ఆర్వీఎల్లో పెట్టుబడిదారుగా క్యూఐఏని స్వాగతిస్తున్నాం. క్యూఐఏ అంతర్జాతీయ అనుభవం, విలువ సృష్టిలో బలమైన ట్రాక్ రికార్డు ఆర్ఆర్వీఎల్ను ప్రపంచ స్థాయి సంస్థగా అభివృద్ధి చేయడంలో సహకరిస్తాయని నమ్ముతున్నాం. భారతీయ ఆర్థిక వ్యవస్థపై విదేశీయులకు ఉన్న సానుకూల దృక్పథంతో పాటు రిలయన్స్ రిటైల్ వ్యాపార నమూనా, వ్యూహం, అమలు సామర్థ్యాలను గమనించే క్యూఐఏ పెట్టుబడులు పెడుతోంద’ని ఆర్ఆర్వీఎల్ డైరెక్టర్ ఈశా అంబానీ వెల్లడించారు. ‘భారత్లో వేగంగా వృద్ధి చెందుతున్న రిటైల్ విపణిలో ఉన్న వినూత్న కంపెనీలకు మద్దతు ఇచ్చేందుకు క్యూఐఏ కట్టుబడి ఉంది. రిలయన్స్ రిటైల్కు ఉన్న బలమైన దూరదృష్టి, ఆకర్షణీయ వృద్ధి అవకాశాలు మమ్మల్ని పెట్టుబడులు పెట్టేందుకు ప్రేరేపించాయ’ని క్యూఐఏ సీఈఓ మన్సూర్ ఇబ్రహీం అల్-మహమూద్ తెలిపారు.
2020లో రూ.47,265 కోట్లు!: 2020లో ఆర్ఆర్వీఎల్ 6.4 బిలియన్ డాలర్ల (రూ.47,265 కోట్ల) పెట్టుబడుల్ని సమీకరించింది. అంతర్జాతీయ ప్రైవేటు ఈక్విటీ ఫండ్స్కు అప్పట్లో 10.09% వాటా విక్రయించి ఈ పెట్టుబడులు సేకరించింది. అప్పుడు ఆర్ఆర్వీఎల్ విలువను రూ.4.2 లక్షల కోట్లుగా లెక్కగట్టారు. ఇప్పుడు అంతకు దాదాపు రెట్టింపయ్యింది. ఈ రంగంలో ఈ స్థాయిలో నిధులు రావడం అదే తొలిసారి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
Amazon: అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ వచ్చేసింది. మే 2 నుంచి ఈ సేల్ ప్రారంభం కానుందని ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ వెల్లడించింది. -
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు
మారుతీ సుజుకీ త్వరలోనే అందుబాటు ధరలో హైబ్రిడ్ కార్లను తీసుకురావడంపై పని చేస్తోంది. -
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
ఐటీ రంగంలో ఉద్యోగుల సంఖ్య నానాటికీ తగ్గుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో టాప్-5 ఐటీ సంస్థల్లోనే ఉద్యోగుల సంఖ్య 69 వేల వరకు తగ్గింది. -
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్
గూగుల్లో ఉద్యోగం మొదలుపెట్టి 20 ఏళ్లు అయిందని సీఈఓ సుందర్ పిచాయ్ (Sundar Pichai) వెల్లడించారు. ఈ మేరకు ఓ పోస్టు పెట్టారు. -
మహిళా ఆవిష్కర్తలు పెరగాలి
మనదేశంలో మహిళా ఆవిష్కర్తల సంఖ్య తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని, ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. -
వరుస లాభాలకు విరామం
సూచీల అయిదు రోజుల లాభాల ర్యాలీకి కళ్లెం పడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించారు. -
2047 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ
తెలంగాణ 2047 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల (రూ.85 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా మారేందుకు భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తన వంతు పాత్ర పోషిస్తుందని సీఐఐ తెలంగాణ ఛైర్మన్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి డి ప్రసాద్ అన్నారు. -
హార్లిక్స్ ‘హెల్త్ డ్రింక్’ కాదు
హిందుస్థాన్ యునిలీవర్(హెచ్యూఎల్) తన బ్రాండ్ హార్లిక్స్ లేబుల్పై కీలక మార్పులు చేసింది. గతంలో ‘హెల్త్ ఫుడ్ డ్రింక్స్’ కేటగిరిలో ఉన్న హార్లిక్స్ను ‘ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్’ కేటగిరిలోకి మార్చింది. -
రిలయన్స్కు రేటింగ్ సంస్థల ‘జై’
2024 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్కు అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఎస్ అండ్ పీ, ఫిచ్ జై కొట్టాయి. -
భారత జీడీపీ వృద్ధి 6.6 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో భారత జీడీపీ వృద్ధి 6.6 శాతంగా నమోదుకావొచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. -
మారుతీకి విక్రయాల జోష్
జనవరి-మార్చి త్రైమాసికంలో మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం 47.8 శాతం పెరిగి రూ.3,877.70 కోట్లుగా నమోదైంది. -
హెచ్సీఎల్ టెక్ లాభం రూ.3,986 కోట్లు
దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.3,986 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.3,983 కోట్లుగా ఉంది. -
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు ఎస్ఎఫ్బీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు నిర్దేశిత అర్హతలను కలిగి ఉన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల (ఎస్ఎఫ్బీ) నుంచి దరఖాస్తులను ఆహ్వానించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. -
సంక్షిప్త వార్తలు(6)
అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఏహెచ్ఈఎల్) అనుబంధ సంస్థ అపోలో హెల్త్కో లిమిటెడ్(అపోలో 24/7)కు రూ.2,475 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయి. -
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
Flipkart: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది.
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి 2898 ఏడీ’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
-
నక్కపల్లి వద్ద ఘోర ప్రమాదం: ముగ్గురి మృతి
-
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు