Mera Bill Mera Adhikar: రశీదు అడగండి.. అప్లోడ్ చేయండి.. రూ.కోటి బహుమతి పొందండి
వినియోగదార్లు తాము జరిపే కొనుగోళ్లన్నింటికీ విక్రయదార్ల నుంచి రశీదును అడగడాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ‘మేరా బిల్ మేరా అధికార్’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
నెలవారీ ప్రైజ్మనీలు కూడా
‘మేరా బిల్ మేరా అధికార్’ను ప్రారంభించనున్న ప్రభుత్వం
వినియోగదార్లలో రశీదు అడిగే సంస్కృతిని ప్రోత్సహించేందుకే
దిల్లీ: వినియోగదార్లు తాము జరిపే కొనుగోళ్లన్నింటికీ విక్రయదార్ల నుంచి రశీదును అడగడాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ‘మేరా బిల్ మేరా అధికార్’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ప్రతి త్రైమాసికంలో లక్కీడ్రా నిర్వహించి, రూ.1 కోటి చొప్పున రెండు బంపర్ బహుమతులు ఇవ్వనున్నట్లు తెలిపింది. సెప్టెంబరు 1 నుంచి 12 నెలల కాలానికి ప్రయోగాత్మక పద్ధతిలో (పైలట్ ప్రాజెక్ట్) ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ప్రతి నెలా లక్కీ డ్రాలో 800 జీఎస్టీ రశీదులను ఎంపిక చేసి.. రూ.10,000 చొప్పున ప్రైజ్ మనీ ఇవ్వనున్నట్లు ఆర్థిక శాక తెలిపింది. లక్కీడ్రాలో ఎంపిక చేసిన మరో 10 రశీదులకు రూ.10 లక్షల చొప్పున అందజేయనున్నట్లు పేర్కొంది. బంపర్ బహుమతి కోసం త్రైమాసికానికి ఓసారి డ్రా తీస్తారు. ఇందుకోసం గత మూడు నెలల నుంచి బంపర్ డ్రా నెలలో 5వ తేదీ వరకు అప్లోడ్ చేసిన రశీదుల నుంచి విజేతను ఎంపిక చేస్తారు. వినియోగదార్లలో రశీదు అడగాలనే సంస్కృతిని పెంచే ఉద్దేశంలో భాగంగానే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆర్థిక శాఖ తెలిపింది. అస్సామ్, గుజరాత్, హరియాణా, కేంద్ర పాలిత ప్రాంతాలైన పుదుచ్చేరి, దాద్రా అండ్ నగర్ హవేలి, డామన్ అండ్ డయ్యూలో దీనిని ప్రారంభిస్తున్నట్లు పేర్కొంది.
డ్రాకు అర్హత పొందాలంటే..
- ముందు నెలలో ఇచ్చిన బీ2సీ రశీదులన్నింటినీ తదుపరి నెల 5వ తేదీ కల్లా అప్లోడ్ చేస్తేనే.. నెలవారీ డ్రాకి అర్హత లభిస్తుంది.
- ఒక నెలలో గరిష్ఠంగా ఒక వ్యక్తి 25 రశీదులను అప్లోడ్ చేసేందుకు వీలుంటుంది.
- ఈ రశీదులను ‘మేరా బిల్ మేరా అధికార్’ మొబైల్ అప్లికేషన్లోను, ‘వెబ్.మెరాబిల్.జీఎస్టీ.గవ్.ఇన్’ అనే వెబ్పోర్టల్లోనూ అప్లోడ్ చేసుకోవచ్చు.
- లక్కీ డ్రాకు అర్హత పొందాలంటే రశీదు విలువ కనీసం రూ.200గా నిర్ణయించారు.
- జీఎస్టీ నమోదిత సరఫరాదార్ల నుంచి వినియోగదార్లు తీసుకున్న రశీదులను మాత్రమే డ్రాకు పరిగణనలోకి తీసుకుంటారు.
- రశీదును అప్లోడ్ చేసే సమయంలో.. సరఫరాదారు జీఎస్టీ గుర్తింపు సంఖ్య, రశీదు సంఖ్య, రశీదు తేదీ, రశీదు విలువ, వినియోగదారు రాష్ట్రం/ కేంద్ర పాలిత ప్రాంతం తదితర వివరాలను పొందుపర్చాల్సి ఉంటుంది.
- డ్రాలో విజేతగా ఎంపికైన వాళ్లు.. ఎంపికైనట్లుగా సమాచారం వచ్చిన తేదీ నుంచి 30 రోజుల్లోగా యాప్/ వెబ్పోర్టల్ ద్వారా తమ పాన్, ఆధార్ కార్డ్, బ్యాంకు ఖాతా లాంటి అదనపు వివరాలను తెలియజేయాల్సి ఉంటుంది. ఈ వివరాలను ఉపయోగించి ఆ విజేతకు బహుమతి మొత్తాన్ని పంపిస్తామని ఆర్థిక శాఖ తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చైనాలో ఎలాన్ మస్క్ ఆకస్మిక పర్యటన!
Elon Musk: దాదాపు వారం క్రితం ఎలాన్ మస్క్ భారత పర్యటనను రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఆకస్మికంగా చైనాలో పర్యటిస్తున్నట్లు సంబంధిత వ్యక్తులు తెలిపారు. -
రూ.49కే బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ సబ్స్క్రిప్షన్
BSNL Cinemaplus: బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ పేరిట ఓటీటీ ప్యాకేజీలను అందిస్తోంది. దీంట్లో మొత్తం మూడు ప్యాక్లు ఉన్నాయి. తాజాగా స్టార్టర్ ప్యాక్ ధరను సంస్థ కుదించింది. -
వేసవిలో ఫోన్ ఛార్జింగ్ వేగం తగ్గుతుంది..? ఎందుకు?
వేసవిలో స్మార్ట్ఫోన్ ఛార్జింగ్లో వేగం మందగిస్తుంది. దీనికి కారణమేంటి? ఎందుకు వేగం తగ్గుతుంది? -
ఐసీఐసీఐ లాభం రూ.11,672 కోట్లు
ఐసీఐసీఐ బ్యాంక్ ఆర్థిక ఫలితాలకు తక్కువ కేటాయింపులు కలిసివచ్చాయి. దీంతో మార్చి త్రైమాసికంలో బ్యాంక్ ఏకీకృత నికర లాభం 18.5 శాతం వృద్ధి చెంది రూ.11,672 కోట్లకు చేరుకుంది. -
ఒకే పాలసీలోనే అన్ని ధీమాలు
అందరికీ బీమా పాలసీలను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఐఆర్డీఏఐ) ఒక ప్రామాణిక పాలసీ ‘బీమా విస్తార్’ను అందుబాటులోకి తీసుకురానుంది. -
హైదరాబాద్లో కార్యాలయాల అద్దె లావాదేవీలు పెరిగాయ్
కార్పొరేట్ల నుంచి గిరాకీ స్థిరంగా ఉండటంతో ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో కార్యాలయాల అద్దె లావాదేవీలు 13 శాతం వృద్ధితో 1.34 కోట్ల చదరపు అడుగులకు చేరిందని స్థిరాస్తి సేవలను అందించే వెస్టియన్ తెలిపింది. -
మ్యూచువల్ ఫండ్ కొత్త పథకాల్లోకి రూ.66,364 కోట్లు
గత ఆర్థిక సంవత్సరంలో మ్యూచువల్ ఫండ్ సంస్థలు(ఏఎంసీ) 185 కొత్త పథకాలను(ఎన్ఎఫ్ఓ-న్యూ ఫండ్ ఆఫర్) విడుదల చేశాయి. -
వైద్య ఉత్పత్తుల రంగంలో భారత్ కీలకం
వైద్య ఉత్పత్తుల రంగంలో భారతదేశానికి ఎంతో ముఖ్యమైన బాధ్యత ఉన్నట్లు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్ఎఫ్డీఏ) కమిషనర్ డాక్టర్ రాబర్ట్ కాలిఫ్ అన్నారు. -
ఆర్బీఎల్ బ్యాంక్ లాభంలో 30% వృద్ధి
జనవరి- మార్చి త్రైమాసికంలో ఆర్బీఎల్ బ్యాంక్ నికర లాభం 30 శాతం పెరిగి రూ.353 కోట్లకు చేరింది. -
యెస్ బ్యాంక్ లాభం రెట్టింపు
జనవరి- మార్చి త్రైమాసికంలో యెస్ బ్యాంక్ నికర లాభం స్టాండలోన్ పద్ధతిలో రూ.452 కోట్లుగా నమోదైంది. -
పూరీ విమానాశ్రయం ప్రాజెక్టు పోటీలో జీఎంఆర్, అదానీ గ్రూపు, ఫెయిర్ఫాక్స్?
ఒడిశా రాష్ట్రంలోని పూరీలో కొత్త విమానాశ్రయాన్ని నిర్మించి, నిర్వహించే అవకాశం కోసం జీఎంఆర్, అదానీ గ్రూపు, విదేశీ సంస్థ అయిన ఫెయిర్ఫాక్స్ పోటీ పడుతున్నాయి. -
భారత్లో షార్ప్ సెమీ కండక్టర్ల యూనిట్
జపాన్ ఎలక్ట్రానిక్ దిగ్గజం షార్ప్ దేశంలో సెమీకండక్టర్ ఫ్యాబ్ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. -
సంక్షిప్త వార్తలు
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సీకే బిర్లా గ్రూపు కంపెనీ, హెచ్ఐఎల్ లిమిటెడ్, పైపులు- ఫిట్టింగ్స్ వ్యాపారంలోకి విస్తరిస్తోంది. -
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
ఐటీ రంగంలో ఉద్యోగుల సంఖ్య నానాటికీ తగ్గుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో టాప్-5 ఐటీ సంస్థల్లోనే ఉద్యోగుల సంఖ్య 69 వేల వరకు తగ్గింది. -
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
Amazon: అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ వచ్చేసింది. మే 2 నుంచి ఈ సేల్ ప్రారంభం కానుందని ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ వెల్లడించింది.