విదేశాలకు రూ.7 లక్షలకు మించి పంపితే 20% టీసీఎస్
విదేశీ పర్యటనల ప్యాకేజీ, లిబరలైజ్డ్ రెమిటెన్సిస్ పథకం (ఎల్ఆర్ఎస్) కింద విదేశాలకు భారతీయులు పంపే నిధుల విలువ రూ.7 లక్షలు మించితే అక్టోబరు 1 నుంచి మూలం వద్ద 20 శాతం పన్నును వసూలు(టీసీఎస్) చేయనున్నారు.
విదేశీ పర్యటనల ప్యాకేజీలకూ
అక్టోబరు 1 నుంచి అమల్లోకి
దిల్లీ: విదేశీ పర్యటనల ప్యాకేజీ, లిబరలైజ్డ్ రెమిటెన్సిస్ పథకం (ఎల్ఆర్ఎస్) కింద విదేశాలకు భారతీయులు పంపే నిధుల విలువ రూ.7 లక్షలు మించితే అక్టోబరు 1 నుంచి మూలం వద్ద 20 శాతం పన్నును వసూలు(టీసీఎస్) చేయనున్నారు. ప్రస్తుతం ఎల్ఆర్ఎస్ కింద విదేశాలకు ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.7 లక్షలకు పైగా పంపితే టీసీఎస్ 5 శాతంగా ఉంది. రూ.7 లక్షల వరకైతే ప్రస్తుతం ఎలాంటి టీసీఎస్ లేదు. ఇకపై కూడా ఇదే కొనసాగనుంది. మరోవైపు విదేశీ పర్యాటక ప్యాకేజీలకు ప్రస్తుతం 5% టీసీఎస్ ఉంది. అక్టోబరు 1 నుంచి రూ.7 లక్షల వరకు ప్యాకేజీకి 5 శాతం, అంతకుమించితే 20% టీసీఎస్ వర్తిస్తుంది. వైద్య చికిత్సలు, విద్యకు వార్షిక వ్యయం రూ.7 లక్షలు చొప్పున మించితే 5 శాతం టీసీఎస్ కట్టాలి. విదేశాల్లో చదువుల కోసం తీసుకునే రుణాల విలువ రూ.7 లక్షలు మించితే 0.5% టీసీఎస్ వర్తిస్తుంది. వాస్తవానికి ఎల్ఆర్ఎస్ కింద విదేశాలకు నిధులు పంపించడానికి, విదేశీ పర్యాటక ప్యాకేజీలకు టీసీఎస్ను జులై 1 నుంచి 20 శాతానికి పెంచాలని బడ్జెట్లోనే ప్రతిపాదించారు. అయితే ఆ తర్వాత దీనిని అక్టోబరు 1కి వాయిదా వేశారు. ఎల్ఆర్ఎస్ కింద.. భారత్లోని ఒక వ్యక్తి ఆర్బీఐ అనుమతి లేకుండానే వార్షికంగా 2.5 లక్షల డాలర్ల వరకు పంపించొచ్చు. 2.5 లక్షల డాలర్లు లేదా అంతకుమించి విదేశీ కరెన్సీ రూపంలో పంపించాలంటే ఆర్బీఐ అనుమతి తీసుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేడు స్టాక్మార్కెట్ ప్రత్యేక సెషన్.. దూసుకెళ్లిన సూచీలు
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు శనివారం కొంతసేపు పనిచేశాయి. ఈ ప్రత్యేక సెషన్లో సూచీలు లాభాల్లో సాగుతున్నాయి. -
నవ లిమిటెడ్.. రుణ రహితం
ఫెర్రో అల్లాయ్స్, మైనింగ్, విద్యుదుత్పత్తిలో నిమగ్నమై ఉన్న నవ లిమిటెడ్, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో ఏకీకృత ఖాతాల ప్రకారం రూ.951.6 కోట్ల ఆదాయాన్ని, రూ.255.1 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. -
వసూళ్లు 27%.. వదులుకుంది 73%
నిరర్థక ఆస్తులుగా మారిన రుణాల నుంచి వసూళ్లకు చేపట్టిన దివాలా పరిష్కార ప్రక్రియ, ఆర్థిక సంస్థలకు ఎంతగా ఉపయోగ పడుతోందో ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. -
నలుపు రంగులో అపాచీ ఆర్టీఆర్ 160
టీవీఎస్ మోటార్ తన ‘అపాచీ 160 ఆర్టీఆర్’ బైక్లో బ్లాక్ డార్క్ ఎడిషన్ (నలుపు రంగు)ను తీసుకొచ్చింది. -
టీవీ ఛానళ్లతో పాటు ఓటీటీ ప్రసారాలూ.. స్మార్ట్ ప్లస్ను ఆవిష్కరించిన డిష్ టీవీ
టీవీ ఛానళ్లతోపాటు, ఓటీటీ ప్రసారాలూ అందించే స్మార్ట్ ప్లస్ సేవలు ప్రారంభిస్తున్నట్లు డైరెక్ట్-టు-హోమ్ సేవలను అందించే డిష్ టీవీ ప్రకటించింది. -
2031కి రిటైల్ విపణి రెట్టింపు
భారత వినియోగ వస్తు- సేవల విపణి 2031 కల్లా రెట్టింపు కావొచ్చని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అభిప్రాయపడ్డారు. -
మదుపర్ల సంపద రూ.410 లక్షల కోట్లకు
వరుసగా రెండో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. ఎం అండ్ ఎం, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. అయితే విదేశీ మదుపర్ల అమ్మకాలు కొనసాగడంతో లాభాలు పరిమితమయ్యాయి. -
ప్రస్తుత కంపెనీలకూ ప్రోత్సాహకాలు!
విద్యుత్ వాహన (ఈవీ) నూతన విధానాన్ని అనుసరించి, పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న సంస్థలకు ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేయనుంది. -
విదేశీ ఫండ్ల ఆస్తుల్లో 20% వరకే మన మార్కెట్లకు! : సెబీ ప్రతిపాదన
మ్యూచువల్ ఫండ్లలో విదేశీ పెట్టుబడులను మరింత సులభతరం చేసే దిశగా మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ కొన్ని చర్యలను ప్రతిపాదించింది. -
కియా కార్లు అద్దెకూ తీసుకోవచ్చు.. హైదరాబాద్ సహా 6 నగరాల్లో
కారు కొంటే బీమా - నిర్వహణ ఖర్చుల వంటివి తప్పవు. మరో కొత్త మోడల్ కొనుగోలుకు పాత కారు విక్రయించాలంటే తగిన ధర వస్తుందో రాదో అనే బెంగ ఒకటి. -
సంక్షిప్త వార్తలు(5)
కేన్సర్ వ్యాధి చికిత్సలో వినియోగించే కాబోజాంటినిబ్ ట్యాబ్లెట్లను హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎంఎస్ఎన్ ల్యాబ్స్ ఉత్పత్తి చేసి, జైడస్ లైఫ్సైన్సెస్కు సరఫరా చేయనుంది. -
ఇక కంటితోనే స్క్రీన్ను ఆపరేట్ చేసేలా: త్వరలో యాపిల్ కొత్త ఫీచర్లు
Apple: దివ్యాంగులు కూడా ఐఫోన్, ఐప్యాడ్లను సులువుగా వినియోగించేందుకు వీలుగా యాపిల్ కొత్త ఫీచర్లును త్వరలోనే తీసుకురానున్నట్లు వెల్లడించింది. -
ఆరోగ్యకరమైన ఆహారం.. జొమాటోలో కొత్త ఫీచర్
Zomato: జొమాటోలో కొత్త ఫీచర్ని తీసుకొచ్చినట్లు కంపెనీ సీఈఓ దీపిందర్ గోయల్ ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు. ఇంతకీ ఆ ఫీచర్ ఎలా ఉపయోగపడనుందంటే..
తాజా వార్తలు (Latest News)
-
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..
-
బస్సులో చెలరేగిన మంటలు.. 8 మంది సజీవ దహనం
-
మనీషా కొయిరాలకు క్షమాపణలు చెప్పిన సోనాక్షి సిన్హా.. ఎందుకంటే!
-
కెమెరామన్.. ప్లీజ్ ఆడియో ఆన్ చేయొద్దు: రోహిత్ శర్మ
-
కిర్గిస్థాన్లో అల్లర్లు.. భారత విద్యార్థులకు కేంద్రం అలర్ట్
-
నేడు స్టాక్మార్కెట్ ప్రత్యేక సెషన్.. దూసుకెళ్లిన సూచీలు