పెద్దగా అంకురించలేదు
భారతీయ అంకురాలకు 2023 చేదు జ్ఞాపకాలనే మిగిల్చింది. ప్రపంచ వ్యాప్తంగా అంకురాలకు పెట్టుబడుల విషయంలో ‘ఫండింగ్ వింటర్’ను పాటించడంతో దాని ప్రభావం మన అంకురాలపైనా పడింది.
మూడొంతులు తగ్గిన పెట్టుబడులు
ఏడాదిలో రెండే యూనికార్న్లు
ఈనాడు - హైదరాబాద్
భారతీయ అంకురాలకు 2023 చేదు జ్ఞాపకాలనే మిగిల్చింది. ప్రపంచ వ్యాప్తంగా అంకురాలకు పెట్టుబడుల విషయంలో ‘ఫండింగ్ వింటర్’ను పాటించడంతో దాని ప్రభావం మన అంకురాలపైనా పడింది. కొత్త ఏడాదిలోనైనా మంచి రోజులు వస్తాయా అని అంకుర వ్యవస్థాపకులు ఎదురుచూస్తున్నారు. కొవిడ్ మహమ్మారి సమయంలో ఎన్నో కొత్త అంకురాలు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా ఎడ్యుటెక్, హెల్త్టెక్ విభాగాల్లో మంచి వృద్ధి కనిపించింది. కానీ, 2022 నుంచి వీటికి గడ్డుకాలం మొదలయ్యింది. ఎంత వేగంగా వృద్ధిలోకి వచ్చాయో.. అదే రీతిలో పతనమయ్యాయి. అనేక సంస్థలు తమ వ్యాపారాలను మూసేశాయి. బైజూస్, ఫార్మ్ఈజీ వంటి సంస్థల విలువ 85-90 శాతానికి క్షీణించింది.
పెట్టుబడులు తగ్గాయ్..
అంకురాలకు కీలకం పెట్టుబడులు. ఈ ఏడాది అంకురాలకు వచ్చిన మొత్తం పెట్టుబడుల విలువ రూ.67,562 కోట్ల (8.14బిలియన్ డాలర్లు) మేరకే ఉంది. 2022లో ఈ పెట్టుబడులు దాదాపు రూ.2 లక్షల కోట్ల (24.3 బిలియన్ డాలర్ల ) వరకూ ఉన్నాయి. 2021లో రూ.2.90 లక్షల కోట్లు (35 బిలియన్ డాలర్లు)గా ఉన్నాయి. 2016లో వచ్చిన 4.6 బిలియన్ డాలర్ల పెట్టుబడి తర్వాత ఇదే అత్యల్పం కావడం గమనార్హం. లెన్స్కార్ట్, ఉడాన్, బిల్డర్.ఏఐ, జెప్టో, పెరిఫియోస్ సాఫ్ట్వేర్ లాంటి సంస్థలకు అధిక మొత్తంలో పెట్టుబడులు వచ్చాయి.
తగ్గిన యూనికార్న్లు...: దేశీయ యూనికార్న్ల (100 కోట్ల డాలర్ల విలువ) సంఖ్య 2023లో క్షీణించింది. 2022 నాటికి 110 యూనికార్న్లు ఉండగా, ఈ ఏడాది నవంబరు నాటికి వీటి సంఖ్య 72కు పడిపోయినట్లు ఫండమెంటమ్ పార్ట్నర్షిప్ నివేదిక వెల్లడించింది. ఈ ఏడాదిలో మొత్తం రెండు అంకురాలు మాత్రమే యూనికార్న్ హోదా సాధించాయి. ఇందులో జెప్టో, ఇన్క్రెడ్ ఉన్నాయి.
‘లేఆఫ్’ల సంవత్సరం..
ఉద్యోగ నియామకాల విషయంలో 2023లో కాస్త గందరగోళ పరిస్థితులే కనిపించాయి. అంకుర సంస్థలు దాదాపు 16,398 మందికి పైగా ఉద్యోగులను తొలగించాయి. ఎడ్యుటెక్ సంస్థ బైజూస్ అత్యధికంగా 2,500 మందికిపైగా ఉద్యోగులను పక్కన పెట్టింది.
పరిస్థితులు మారుతాయ్..
కొత్త ఏడాదిలో అంకురాలకు పెట్టుబడులు పెరిగే అవకాశం ఉందని ఈ రంగంలోని నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికే వెంచర్ క్యాపిటలిస్ట్ (వీసీ)సంస్థలు పలు సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ముందుకు వస్తున్నాయని పెట్టుబడి అంశాలను పర్యవేక్షించే సంస్థలు చెబుతున్నాయి. అయితే, 2021తో పోలిస్తే మాత్రం తక్కువ స్థాయిలోనే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
19 ఏళ్ల తర్వాత టాటాల ఐపీఓ
టాటా గ్రూప్ నుంచి 19 ఏళ్ల తర్వాత ఐపీఓ వచ్చింది. చివరి సారిగా 2004లో టీసీఎస్ ఐపీఓకు రాగా.. ఈ ఏడాదిలో టాటా టెక్నాలజీస్ నవంబరు 30న ఐపీఓకొచ్చింది. రూ.3,042 కోట్ల ఈ ఐపీఓకు నిమిషాల వ్యవధిలోనే పూర్తి స్పందన వచ్చింది. గడువు పూర్తయ్యేసరికి 70 రెట్ల బిడ్లు దాఖలయ్యాయి. ఇష్యూ ధర రూ.500 అయితే రూ.1200 వద్ద అంటే 140 శాతం ప్రీమియంతో లిస్టయింది. డిసెంబరు 29న రూ.1182 వద్ద స్థిరపడింది.
40 బిలియన్ డాలర్ల విలీనం
హెచ్డీఎఫ్సీ బ్యాంక్.. భారత్లోనే అతిపెద్ద మార్కెట్ విలువ గల బ్యాంకు. హెచ్డీఎఫ్సీ.. ప్రపంచవ్యాప్త ఎన్బీఎఫ్సీల్లో అందరికీ సుపరిచితమైన పేరు. ఈ రెండూ విజయవంతంగా 40 బిలియన్ డాలర్ల విలీనాన్ని పూర్తి చేసినట్లు జులై 1న ప్రకటించాయి. భారత కార్పొరేట్ చరిత్రలోనే అతిపెద్ద విలీనాల్లో ఒకటిగా ఇది నిలిచిపోయింది. ఆ సయయంలో హెచ్డీఎఫ్సీ వాటాదార్లకు ప్రతీ 25 షేర్లకు 42 హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు లభించాయి. విలీనం అయిన కొద్ది రోజులకే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 100 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువను అధిగమించింది.
గోఫస్ట్.. రెక్కలు విరిగాయ్
మే 2.. ఈ తేదీ ముందు వరకు గోఫస్ట్లో అంతా బాగానే ఉందనుకున్నారు. ఆ రోజున స్వచ్ఛందంగా దివాలా ప్రక్రియకు ఆ కంపెనీ దరఖాస్తు చేయడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. మొత్తం విమానాలన్నిటి కార్యకలాపాలనూ అదే రోజున నిలిపివేసింది. పలు బ్యాంకులు ఇక గోఫస్ట్కు డబ్బులిచ్చేది లేదని చెప్పాయి. అయితే దివాలాకు కారణం ప్రాత్ అండ్ విట్నీ ఇచ్చిన ఇంజిన్లేనని ఆరోపించిన గోఫస్ట్.. దీనిపై పరిహారాన్నీ కోరింది. ఇంజిన్ల వల్ల కంపెనీకి రూ.10,000 కోట్ల నష్టం వాటిల్లిందని సంస్థ ప్రమోటరు నస్లీ వాడియా ఇటీవలే పేర్కొన్నారు.
భారీ స్థాయిలో విమానాల ఆర్డర్లు
గోఫస్ట్ వంటి విమానయాన సంస్థ దివాలా ప్రకటించడం పక్కనపెడితే.. ఈ ఏడాదిలో అత్యంత భారీ స్థాయిలో విమానాలకు ఆర్డర్లు వెళ్లాయి. ముఖ్యంగా ఎయిరిండియా తన పునరుజ్జీవం కోసం ఏకంగా 470 విమానాలకు 70 బిలియన్ డాలర్లతో జూన్లో ఆర్డరు పెట్టింది. ఇందులో 250 ఎయిర్బస్ విమానాలు, 220 బోయింగ్ జెట్లు ఉన్నాయి. ఇది జరిగిన కొద్ది రోజులకే ఇండిగో సైతం ఎయిర్బస్ వద్ద 500 విమానాలకు ఆర్డరు చేసింది.
‘చిప్లు’ ఉడకలేదు
కరోనా సమయంలో చిప్ కొరతను ఎదుర్కొన్న తర్వాత సెమీకండక్టర్ తయారీపై భారత్ మొగ్గుచూపింది. ముఖ్యంగా వేదాంతా-ఫాక్స్కాన్ సంయుక్త సంస్థ ఈ సంక్లిష్ట పరిశ్రమలోకి అడుగుపెడతామని ప్రకటించినపుడు పరిశ్రమ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూశాయి. పీఎల్ఐ పథకం కింద గుజరాత్లో ప్లాంటు ఏర్పాటు చేయాల్సింది కూడా. అయితే ఈ జేవీ నుంచి వైదొలుగుతున్నట్లు జులైలో ఫాక్స్కాన్ ప్రకటించింది. అయితే అమెరికా దిగ్గజం మైక్రాన్ మాత్రం సనంద్లో అసెంబ్లీ, టెస్టింగ్, మార్కింగ్, ప్యాకేజింగ్ యూనిట్ను ఏర్పాటు చేస్తామని ప్రకటించడం ఊరటనిచ్చింది.
విడిగా.. ఐటీసీ హోటల్స్
ఐటీసీ అనగానే సిగరెట్లు, హోటళ్లు, ఎఫ్ఎమ్సీజీ వస్తువులు గుర్తుకు వస్తాయి. అయితే హోటళ్ల వ్యాపారాన్ని ‘ఐటీసీ హోటల్స్’గా విభజించడానికి ఐటీసీ ఈ ఏడాదిలోనే ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా ప్రతీ 10 ఐటీసీ షేర్లకు హోటళ్ల వ్యాపారంలో ఒక షేరును ఇవ్వనుంది. ఐటీసీ హోటల్స్ అనేది స్వతంత్రంగా కార్యకలాపాలు జరుపుతుందని కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. 2024లో ఐటీసీ హోటల్స్ లిస్టయ్యే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐదు రోజుల వరుస నష్టాలకు బ్రేక్.. స్వల్ప లాభాల్లో సూచీలు
Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 75 పాయింట్లు, నిఫ్టీ 42 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
ఇంగ్లాండ్ నుంచి భారత్కు లక్ష కిలోల బంగారం తరలింపు
Gold Reserves: ఆర్బీఐ దగ్గర బంగారంలో కొంత మొత్తం ఇతర దేశాల్లో నిల్వ ఉంది. అందులోభాగంగా కొంత బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వద్ద కూడా స్టోర్ చేసింది. దాంట్లో పెద్ద మొత్తాన్ని తాజాగా భారత్కు తీసుకొచ్చింది. -
ఇకపై గూగుల్ మెసేజ్లనూ ఎడిట్ చేయొచ్చు
Google Messages: గూగుల్ మెసేజెస్ కొత్త ఫీచర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై ఇందులో పంపే సందేశాల్లో ఏవైనా తప్పులుంటే ఎడిట్ చేసే అవకాశం కల్పించింది. -
క్విక్ కామర్స్లోకి రిలయన్స్.. 30 నిమిషాల్లో డెలివరీ?
JioMart: జియోమార్ట్ పేరిట రిలయన్స్ ఇప్పటికే నిత్యావసర సరకులను అందిస్తున్న విషయం తెలిసిందే. దీంట్లోనే క్విక్ కామర్స్ విభాగాన్ని తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. -
స్ల్పెండర్కు 30 ఏళ్లు.. అధునాతన ఫీచర్లతో కొత్త వెర్షన్ విడుదల
Splendor Plus Xtec: స్ల్పెండర్ మార్కెట్లోకి వచ్చి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా హీరో కొత్త వెర్షన్ను విడుదల చేసింది. -
భారీ లాభాల్లో మార్కెట్లు.. 22,600 పైన నిఫ్టీ.. 500 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్
Stock Market Opening bell: ఉదయం 9:27 గంటల సమయంలో సెన్సెక్స్ 525 పాయింట్ల లాభంతో 74,410 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 130 పాయింట్లు లాభపడి 22,619 దగ్గర కొనసాగుతోంది. -
2030కి రూ.10.80 లక్షల కోట్లకు
కొవిడ్ పరిణామాలతో దేశ ఔషధ పరిశ్రమ రంగంలో గణనీయ మార్పులు వచ్చాయని ఫార్మాస్యూటికల్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఫార్మాగ్జిల్) డైరెక్టర్ జనరల్ ఉదయ్భాస్కర్ పేర్కొన్నారు. -
ఆర్బీఐ బ్యాలన్స్షీట్ రూ.70.48 లక్షల కోట్లు
ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశంగా భారత్ కొనసాగుతుందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7% వృద్ధిని నమోదు చేయగలదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అంచనా వేస్తోంది. -
22,500 దిగువకు నిఫ్టీ
లోహ, మన్నికైన వినిమయ వస్తువులు, ఐటీ షేర్లకు అమ్మకాలు వెల్లువెత్తడంతో వరుసగా అయిదో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ నష్టపోయాయి. -
విపణిలోకి గోద్రెజ్ మై ఫార్మ్ పాలు
తాజా పాలను నేరుగా వ్యవసాయ క్షేత్రం నుంచి ఇంటికి అందించేలా గోద్రెజ్ మై ఫార్మ్ పాలను గోద్రెజ్ అగ్రోవెట్ లిమిటెడ్ అనుబంధ సంస్థ క్రీమ్లైన్ డైరీ ప్రొడక్ట్స్ అందుబాటులోకి తీసుకొచ్చింది. -
‘జియో ఫైనాన్స్’ యాప్
యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్), డిజిటల్ బ్యాంకింగ్ సేవలు అందించేందుకు ప్రయోగాత్మకంగా ‘జియో ఫైనాన్స్’ బీటా/ పైలట్ వెర్షన్ యాప్ను విడుదల చేసినట్లు జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ గురువారం వెల్లడించింది. -
76% పెరిగిన అపోలో హాస్పిటల్స్ లాభం
అపోలో హాస్పిటల్స్ ఏకీకృత ఖాతాల ప్రకారం మార్చి త్రైమాసికానికి రూ.4,944 కోట్ల ఆదాయంపై రూ.254 కోట్ల నికర లాభం నమోదైంది. -
కొహాన్స్ లైఫ్ సైన్సెస్తో సువెన్ ఫార్మా విలీనం
కొహాన్స్ లైఫ్ సైన్సెస్తో సువెన్ ఫార్మాస్యూటికల్స్ విలీనానికి ఎన్ఎస్ఈ, బీఎస్ఈలు అనుమతి ఇచ్చినట్లు సువెన్ ఫార్మా గురువారం వెల్లడించింది. -
ఫోన్పే నుంచి 6 రుణ పథకాలు
ఫోన్పే తన ప్లాట్ఫామ్ మీద 6 విభాగాల్లో సెక్యూర్డ్ రుణ పథకాలను అందుబాటులోకి తెచ్చింది. -
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తగ్గాయ్
గత ఆర్థిక సంవత్సరంలో మన దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్డీఐ) 3.49% తగ్గి 44.42 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. -
క్లెయిమ్ చేయని డిపాజిట్లు బ్యాంకుల్లో రూ.78,213 కోట్లు
బ్యాంకుల వద్ద 2024 మార్చి చివరకు క్లెయిమ్ చేయని (అన్క్లెయిమ్డ్) డిపాజిట్లు 26% పెరిగి రూ.78,213 కోట్లకు చేరాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గురువారం వార్షిక నివేదికలో తెలిపింది. -
అత్యంత ప్రభావశీల కంపెనీల్లో రిలయన్స్, టాటా గ్రూప్
ప్రపంచంలో అత్యంత ప్రభావశీల 100 కంపెనీల జాబితాను టైమ్స్ సంస్థ విడుదల చేసింది. ఇందులో ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా గ్రూప్ ఉన్నాయి. -
సంక్షిప్తవార్తలు (4)
గత ఆర్థిక సంవత్సరానికి (2023-24) ఓయో సుమారు రూ.100 కోట్ల నికర లాభాన్ని ఆర్జించినట్లు ఆ సంస్థ వ్యవస్థాపకుడు రితేశ్ అగర్వాల్ వెల్లడించారు. -
చిన్నారుల కలలు నిజం అయ్యేలా..
కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. పిల్లలకు బడిలో చేరింది మొదలు.. ఉన్నత విద్య వరకూ అంతా డబ్బుతోనే ముడిపడి ఉంటుంది. ఆర్థికంగా ఇదొక సవాలు లాంటిదే. చిన్నారులు వృద్ధిలోకి రావడానికి తల్లిదండ్రులు నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. -
క్రెడిట్ కార్డు..ఈ రుసుములు చూశారా?
అత్యవసరాల్లో కొనుగోళ్లు చేసేందుకు క్రెడిట్ కార్డు ఎంతో ఉపయోగపడుతుంది. దీనివల్ల ప్రయోజనాలు అధికమే. -
మ్యూచువల్ ఫండ్లు మదుపు మార్గంలో వైవిధ్యంగా
కష్టపడి సంపాదించిన సొమ్మును స్టాక్ మార్కెట్లో మదుపు చేయాలనుకుంటున్నారా? నేరుగా షేర్లు కొనడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
గంటలతరబడి విమానం ఆలస్యం.. ఎయిరిండియాకు డీజీసీఏ నోటీసులు
-
రివ్యూ: గం గం.. గణేశా.. ఆనంద్ దేవరకొండ క్రైమ్ కామెడీ మూవీ మెప్పించిందా?
-
రూ.3లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన కుషాయిగూడ సీఐ, ఎస్ఐ
-
ఐదు రోజుల వరుస నష్టాలకు బ్రేక్.. స్వల్ప లాభాల్లో సూచీలు
-
రివ్యూ: భజే వాయు వేగం.. కార్తికేయ హిట్ కొట్టారా?