GST Council: ఆన్లైన్ గేమింగ్పై 28% పన్ను.. జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం
GST Council 50th meeting: ఆన్లైన్ గేమింగ్పై 28 శాతం పన్ను విధించేందుకు జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది. మొత్తం విలువపై ఈ పన్ను వర్తిస్తుందని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
దిల్లీ: ఆన్లైన్ గేమింగ్, క్యాసినో, గుర్రపు పందేలపై (Online Gaming) ఎట్టకేలకు నిర్ణయం వెలువడింది. బెట్టింగ్ మొత్తంపై 28 శాతం జీఎస్టీ విధించాలని జీఎస్టీ కౌన్సిల్ (GST council) నిర్ణయించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) నేతృత్వంలో మంగళవారం జరిగిన 50వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఆయా రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశం అనంతరం జీఎస్టీ కౌన్సిల్లో తీసుకున్న నిర్ణయాలను నిర్మలా సీతారామన్ మీడియాకు వెల్లడించారు.
ఆన్లైన్ గేమింగ్పై తొలుత ముఖ విలువ మీద పన్ను వేయాలా? గేమింగ్ ఆదాయంపై పన్ను వేయాలా? ప్లాట్ఫామ్ ఫీజు మీద మాత్రమే పన్నువేయాలా? అనేది మంత్రుల బృందం చర్చించింది. అయితే, మొత్తం విలువ మీద పన్ను విధించాలని కౌన్సిల్ నిర్ణయించినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. నైపుణ్యానికి సంబంధించిన ఆటైనా, డబ్బుల పందెంతో ఆడే ఆటైనా ఆన్లైన్ గేమ్లకు 28 శాతం జీఎస్టీ వర్తిస్తుందని పేర్కొన్నారు. అలాగే, క్యాన్సర్ ఔషధం దినుటక్సిమాబ్ (కార్జిబా)తో పాటు అరుదైన వ్యాధులతో బాధపడే రోగులు దిగుమతి చేసుకునే ఆహారంపై జీఎస్టీ మినహాయించాలని కౌన్సిల్ నిర్ణయించిందని నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రైవేటు కంపెనీల ఉపగ్రహ ప్రయోగ సేవలనూ జీఎస్టీ నుంచి మినహాయిస్తున్నట్లు తెలిపారు. సినిమా హాళ్లలో విక్రయించే ఆహారం, పానీయాలపై పన్ను 18శాతం కాకుండా 5శాతం విధించడంతో పాటు అప్పీలేట్ ట్రిబ్యునళ్ల ఏర్పాటు జీఎస్టీ మండలి నిర్ణయం తీసుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రూ.49కే బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ సబ్స్క్రిప్షన్
BSNL Cinemaplus: బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ పేరిట ఓటీటీ ప్యాకేజీలను అందిస్తోంది. దీంట్లో మొత్తం మూడు ప్యాక్లు ఉన్నాయి. తాజాగా స్టార్టర్ ప్యాక్ ధరను సంస్థ కుదించింది. -
వేసవిలో ఫోన్ ఛార్జింగ్ వేగం తగ్గుతుంది..? ఎందుకు?
వేసవిలో స్మార్ట్ఫోన్ ఛార్జింగ్లో వేగం మందగిస్తుంది. దీనికి కారణమేంటి? ఎందుకు వేగం తగ్గుతుంది? -
ఐసీఐసీఐ లాభం రూ.11,672 కోట్లు
ఐసీఐసీఐ బ్యాంక్ ఆర్థిక ఫలితాలకు తక్కువ కేటాయింపులు కలిసివచ్చాయి. దీంతో మార్చి త్రైమాసికంలో బ్యాంక్ ఏకీకృత నికర లాభం 18.5 శాతం వృద్ధి చెంది రూ.11,672 కోట్లకు చేరుకుంది. -
ఒకే పాలసీలోనే అన్ని ధీమాలు
అందరికీ బీమా పాలసీలను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఐఆర్డీఏఐ) ఒక ప్రామాణిక పాలసీ ‘బీమా విస్తార్’ను అందుబాటులోకి తీసుకురానుంది. -
హైదరాబాద్లో కార్యాలయాల అద్దె లావాదేవీలు పెరిగాయ్
కార్పొరేట్ల నుంచి గిరాకీ స్థిరంగా ఉండటంతో ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో కార్యాలయాల అద్దె లావాదేవీలు 13 శాతం వృద్ధితో 1.34 కోట్ల చదరపు అడుగులకు చేరిందని స్థిరాస్తి సేవలను అందించే వెస్టియన్ తెలిపింది. -
మ్యూచువల్ ఫండ్ కొత్త పథకాల్లోకి రూ.66,364 కోట్లు
గత ఆర్థిక సంవత్సరంలో మ్యూచువల్ ఫండ్ సంస్థలు(ఏఎంసీ) 185 కొత్త పథకాలను(ఎన్ఎఫ్ఓ-న్యూ ఫండ్ ఆఫర్) విడుదల చేశాయి. -
వైద్య ఉత్పత్తుల రంగంలో భారత్ కీలకం
వైద్య ఉత్పత్తుల రంగంలో భారతదేశానికి ఎంతో ముఖ్యమైన బాధ్యత ఉన్నట్లు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్ఎఫ్డీఏ) కమిషనర్ డాక్టర్ రాబర్ట్ కాలిఫ్ అన్నారు. -
ఆర్బీఎల్ బ్యాంక్ లాభంలో 30% వృద్ధి
జనవరి- మార్చి త్రైమాసికంలో ఆర్బీఎల్ బ్యాంక్ నికర లాభం 30 శాతం పెరిగి రూ.353 కోట్లకు చేరింది. -
యెస్ బ్యాంక్ లాభం రెట్టింపు
జనవరి- మార్చి త్రైమాసికంలో యెస్ బ్యాంక్ నికర లాభం స్టాండలోన్ పద్ధతిలో రూ.452 కోట్లుగా నమోదైంది. -
పూరీ విమానాశ్రయం ప్రాజెక్టు పోటీలో జీఎంఆర్, అదానీ గ్రూపు, ఫెయిర్ఫాక్స్?
ఒడిశా రాష్ట్రంలోని పూరీలో కొత్త విమానాశ్రయాన్ని నిర్మించి, నిర్వహించే అవకాశం కోసం జీఎంఆర్, అదానీ గ్రూపు, విదేశీ సంస్థ అయిన ఫెయిర్ఫాక్స్ పోటీ పడుతున్నాయి. -
భారత్లో షార్ప్ సెమీ కండక్టర్ల యూనిట్
జపాన్ ఎలక్ట్రానిక్ దిగ్గజం షార్ప్ దేశంలో సెమీకండక్టర్ ఫ్యాబ్ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. -
సంక్షిప్త వార్తలు
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సీకే బిర్లా గ్రూపు కంపెనీ, హెచ్ఐఎల్ లిమిటెడ్, పైపులు- ఫిట్టింగ్స్ వ్యాపారంలోకి విస్తరిస్తోంది. -
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
ఐటీ రంగంలో ఉద్యోగుల సంఖ్య నానాటికీ తగ్గుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో టాప్-5 ఐటీ సంస్థల్లోనే ఉద్యోగుల సంఖ్య 69 వేల వరకు తగ్గింది. -
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
Amazon: అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ వచ్చేసింది. మే 2 నుంచి ఈ సేల్ ప్రారంభం కానుందని ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
రూ.49కే బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ సబ్స్క్రిప్షన్
-
నవాబులు, సుల్తాన్ల అరాచకాలపై మౌనమా?: రాహుల్పై మోదీ ధ్వజం
-
ధోనీ ‘ఐపీఎల్’ జర్నీ సక్సెస్కు కారణమిదే!
-
పండుగాడికి పద్దెనిమిదేళ్లు .. ‘పోకిరి’ ఆసక్తికర విశేషాలు..
-
ఇరాక్లో దారుణం.. సోషల్ మీడియా స్టార్ హత్య
-
లఖ్నవూపై సూపర్ ఇన్నింగ్స్.. పొట్టి కప్ రేసులోకి సంజూ!