IDFC First Bank: ఆ బ్యాంకుల బాటలోనే ఐడీఎఫ్సీ.. క్రెడిట్ కార్డు ప్రయోజనాల్లో కోత
IDFC First Bank: ప్రైవేటురంగానికి చెందిన ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ తన క్రెడిట్ కార్డ్ ప్రయోజనాల్లో కీలక మార్పులు చేసింది. లాంజ్ యాక్సెస్, రివార్డ్ పాయింట్ల ప్రయోజనాల్లో కొత్త నిబంధనల్ని ప్రకటించింది.
IDFC First Bank | ఇంటర్నెట్డెస్క్: ప్రైవేటురంగానికి చెందిన ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ (IDFC First Bank) తన క్రెడిట్ కార్డ్ రివార్డు ప్రయోజనాల్లో కీలక మార్పులు చేసింది. లాంజ్ యాక్సెస్, రివార్డ్ పాయింట్లకు సంబంధించిన నిబంధనలను మార్చింది. మే 1 నుంచి ఈ మార్పులు అమల్లోకి రాబోతున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, యస్ బ్యాంక్.. వంటి ప్రధాన బ్యాంకులు లాంజ్ యాక్సెస్, రివార్డ్ పాయింట్లలో ఇప్పటికే పరిమితులు విధించాయి. తాజాగా ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ కూడా తన క్రెడిట్ కార్డ్ ప్రయోజనాల్లో కోత విధించింది. ఈ విషయాన్ని ఇ- మెయిల్ ద్వారా కార్డ్హోల్డర్లకు తెలియజేసింది.
ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ అందిస్తున్న క్రెడిట్ కార్డు సాయంతో ఆన్లైన్లో రూ.20,000 ఖర్చు చేస్తే ఆరు రెట్ల రివార్డు పాయింట్లు వచ్చేవి. మే 1 నుంచి అవి మూడు రెట్లకు తగ్గనున్నాయి. అయితే రూ.20 వేల కంటే ఎక్కువ ఖర్చు చేస్తే 10 రెట్ల రివార్డు పాయింట్లను పొందొచ్చు. ఇక ఎడ్యుకేషన్, వాలెట్ లోడ్, ప్రభుత్వ సేవలకు సంబంధించిన లావాదేవీలపై రివార్డు పాయింట్లు మూడు రెట్లకు సవరించనుంది. ఐడీఎఫ్సీ అందిస్తున్న ఫస్ట్ ప్రైవేట్ క్రెడిట్ కార్డ్ మినహా అన్ని రకాల క్రెడిట్ కార్డులకు ఈ నిబంధనలు వర్తిస్తాయి.
- అలాగే, క్రెడిట్ కార్డ్తో చేసే గ్యాస్, కరెంట్ బిల్, ఇంటర్నెట్ వంటి యుటిలిటీ చెల్లింపులపై సర్ఛార్జి విధించనుంది. యుటిలిటీ బిల్లు చెల్లింపుల మొత్తం రూ.20 వేలు దాటితే 1 శాతం సర్ఛార్జితో పాటు జీఎస్టీ వసూలు చేయనుంది. ఐడీఎఫ్సీ ఫస్ట్ ప్రైవేటు కార్డ్, ఎల్ఐసీ క్లాసిక్ క్రెడిట్ కార్డ్, ఎల్ఐసీ సెలెక్ట్ క్రెడిట్ కార్డ్లపై యుటిలిటీ సర్ఛార్జ్ వర్తించవు.
- కాంప్లిమెంటరీ ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ విషయంలో ఐడీఎఫ్సీ నిబంధనల్ని సవరించింది. ప్రస్తుత నెలలో ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ పొందాలంటే మునుపటి నెలలో కార్డ్ ద్వారా కనీసం రూ.20వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది.
- ఐడీఎఫ్సీ ఫస్ట్ సెలెక్ట్ క్రెడిట్ కార్డ్దారులకు ప్రతి త్రైమాసికానికి ఉచితంగా అందించే దేశీయ ఎయిర్పోర్ట్ లాంజ్ సందర్శనల సంఖ్యను 4 నుంచి 2కు తగ్గించింది. ఇక ఫస్ట్ వెల్త్ క్రెడిట్ కార్డు యూజర్లకు దేశీయ, అంతర్జాతీయ లాంజ్ల్లోకి కాంప్లిమెంటరీ గెస్ట్ సందర్శనల సంఖ్యను కూడా ఏడాదికి 4 నుంచి 2కు కుదించింది.
- రెంట్ పే ఆప్షన్ జరిపే లావాదేవీలపై ఛార్జీలను పెంచింది. ప్రతి లావాదేవీకి రూ.249+ 18 శాతం జీఎస్టీ లేదా 1 శాతం+ 18 శాతం జీఎస్టీ ఏది ఎక్కువైతే దాన్ని విధిస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రత్యేక ట్రేడింగ్ సెషన్.. సెన్సెక్స్ 88+, నిఫ్టీ @ 22,500
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు శనివారం కొంతసేపు పనిచేశాయి. ఈ ప్రత్యేక సెషన్లో సూచీలు లాభపడ్డాయి. -
నవ లిమిటెడ్.. రుణ రహితం
ఫెర్రో అల్లాయ్స్, మైనింగ్, విద్యుదుత్పత్తిలో నిమగ్నమై ఉన్న నవ లిమిటెడ్, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో ఏకీకృత ఖాతాల ప్రకారం రూ.951.6 కోట్ల ఆదాయాన్ని, రూ.255.1 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. -
వసూళ్లు 27%.. వదులుకుంది 73%
నిరర్థక ఆస్తులుగా మారిన రుణాల నుంచి వసూళ్లకు చేపట్టిన దివాలా పరిష్కార ప్రక్రియ, ఆర్థిక సంస్థలకు ఎంతగా ఉపయోగ పడుతోందో ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. -
నలుపు రంగులో అపాచీ ఆర్టీఆర్ 160
టీవీఎస్ మోటార్ తన ‘అపాచీ 160 ఆర్టీఆర్’ బైక్లో బ్లాక్ డార్క్ ఎడిషన్ (నలుపు రంగు)ను తీసుకొచ్చింది. -
టీవీ ఛానళ్లతో పాటు ఓటీటీ ప్రసారాలూ.. స్మార్ట్ ప్లస్ను ఆవిష్కరించిన డిష్ టీవీ
టీవీ ఛానళ్లతోపాటు, ఓటీటీ ప్రసారాలూ అందించే స్మార్ట్ ప్లస్ సేవలు ప్రారంభిస్తున్నట్లు డైరెక్ట్-టు-హోమ్ సేవలను అందించే డిష్ టీవీ ప్రకటించింది. -
2031కి రిటైల్ విపణి రెట్టింపు
భారత వినియోగ వస్తు- సేవల విపణి 2031 కల్లా రెట్టింపు కావొచ్చని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అభిప్రాయపడ్డారు. -
మదుపర్ల సంపద రూ.410 లక్షల కోట్లకు
వరుసగా రెండో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. ఎం అండ్ ఎం, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. అయితే విదేశీ మదుపర్ల అమ్మకాలు కొనసాగడంతో లాభాలు పరిమితమయ్యాయి. -
ప్రస్తుత కంపెనీలకూ ప్రోత్సాహకాలు!
విద్యుత్ వాహన (ఈవీ) నూతన విధానాన్ని అనుసరించి, పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న సంస్థలకు ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేయనుంది. -
విదేశీ ఫండ్ల ఆస్తుల్లో 20% వరకే మన మార్కెట్లకు! : సెబీ ప్రతిపాదన
మ్యూచువల్ ఫండ్లలో విదేశీ పెట్టుబడులను మరింత సులభతరం చేసే దిశగా మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ కొన్ని చర్యలను ప్రతిపాదించింది. -
కియా కార్లు అద్దెకూ తీసుకోవచ్చు.. హైదరాబాద్ సహా 6 నగరాల్లో
కారు కొంటే బీమా - నిర్వహణ ఖర్చుల వంటివి తప్పవు. మరో కొత్త మోడల్ కొనుగోలుకు పాత కారు విక్రయించాలంటే తగిన ధర వస్తుందో రాదో అనే బెంగ ఒకటి. -
సంక్షిప్త వార్తలు(5)
కేన్సర్ వ్యాధి చికిత్సలో వినియోగించే కాబోజాంటినిబ్ ట్యాబ్లెట్లను హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎంఎస్ఎన్ ల్యాబ్స్ ఉత్పత్తి చేసి, జైడస్ లైఫ్సైన్సెస్కు సరఫరా చేయనుంది. -
ఇక కంటితోనే స్క్రీన్ను ఆపరేట్ చేసేలా: త్వరలో యాపిల్ కొత్త ఫీచర్లు
Apple: దివ్యాంగులు కూడా ఐఫోన్, ఐప్యాడ్లను సులువుగా వినియోగించేందుకు వీలుగా యాపిల్ కొత్త ఫీచర్లును త్వరలోనే తీసుకురానున్నట్లు వెల్లడించింది. -
ఆరోగ్యకరమైన ఆహారం.. జొమాటోలో కొత్త ఫీచర్
Zomato: జొమాటోలో కొత్త ఫీచర్ని తీసుకొచ్చినట్లు కంపెనీ సీఈఓ దీపిందర్ గోయల్ ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు. ఇంతకీ ఆ ఫీచర్ ఎలా ఉపయోగపడనుందంటే..
తాజా వార్తలు (Latest News)
-
మళ్లీ ట్రెండింగ్లోకి రాజమౌళి - మహేశ్ల ప్రాజెక్ట్.. కారణమిదే!
-
23 వరకు ఏపీ, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు
-
ఐదేళ్లుగా పవిత్రతో నా భర్త సహజీవనం: చందు భార్య శిల్ప
-
బెంగళూరు-చెన్నై కీలక పోరు.. వాతావరణ పరిస్థితి ఎలా ఉండనుందంటే?
-
నా మనవడు తప్పు చేస్తే..: ప్రజ్వల్ లైంగిక దౌర్జన్యం కేసుపై దేవెగౌడ స్పందన
-
10 ఏళ్లలో 31వేల కి.మీ రైల్వే మార్గం నిర్మాణం: అశ్వినీ వైష్ణవ్