Amazon: ఒకే ఒక్క షేరు కొన్న అమెజాన్ అధినేత బెజోస్!
Amazon: అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ ప్రపంచ కుబేరుల జాబితాలో మూడో స్థానంలో ఉన్నారు. ఆయన ఒకే షేరు కొనడంపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతోంది!
వాషింగ్టన్: అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ (Jeff Bezos) ఇటీవల కంపెనీకి చెందిన ఒకే ఒక్క షేరును కొనుగోలు చేశారు. అదేంటి ప్రపంచ కుబేరుల జాబితాలో మూడో స్థానంలో ఉన్న వ్యక్తి.. ఒక్క షేరు కొనడమేంటి? అనుకుంటున్నారా! వినడానికి కొంత ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజమే. ఈ విషయాన్ని ఆయన స్వయంగా స్టాక్ ఎక్స్ఛేంజీలకిచ్చిన సమాచారంలో వెల్లడించారు.
జెఫ్ బెజోస్ (Jeff Bezos) 2002 తర్వాత షేరు కొనడం ఇదే తొలిసారి. అప్పటి నుంచి ఆయన అమ్మడమే తప్ప కొనింది లేదు. 2002 నుంచి ఇప్పటి వరకు దాదాపు 30 బిలియన్ డాలర్లు విలువ చేసే షేర్లను విక్రయించి వచ్చిన డబ్బును వివిధ వ్యాపారాల్లోకి మళ్లించారు. తాజాగా రెండు వారాల క్రితం 114.77 డాలర్లతో ఒక షేరు కొన్నారు. గత శుక్రవారం మార్కెట్లు ముగిసే సమయానికి అమెజాన్ (Amazon) షేరు విలువ 124 డాలర్ల వద్ద స్థిరపడింది. అంటే బెజోస్ (Jeff Bezos) కొన్న షేరుపై 10 డాలర్ల లాభాన్ని ఆర్జించారు.
అమెజాన్ (Amazon) 1997లో పబ్లిక్ లిస్టింగ్కు వచ్చింది. అప్పటి నుంచి బెజోస్ (Jeff Bezos) ఒక్కసారి కూడా స్టాక్స్ను పరిహారంగా పొందలేదు. ప్రస్తుతం ఆయనకు కంపెనీలో 10 శాతం వాటా ఉంది. ప్రస్తుతం ఉన్న తన 148 బిలియన్ డాలర్ల సంపదలో అమెజాన్ (Amazon) షేర్ల వాటానే అధికం. తాజాగా బెజోస్ కేవలం ఒక్క స్టాక్ మాత్రమే కొనడం వెనకున్న వ్యూహం ఏంటనేది మాత్రం తెలియదు. అయితే, ఒక షేరును కొనడంతో పాటు ఎనిమిది మిలియన్ డాలర్లు విలువ చేసే 69,290 షేర్లను ఓ లాభాపేక్షలేని సంస్థకు విరాళంగా కూడా ఇచ్చారు.
బెజోస్ (Jeff Bezos) ఒక్క షేరు మాత్రమే కొనుగోలు చేయడంపై సోషల్ మీడియాలో అనేక ఊహాగానాలు వస్తున్నాయి. కొంతమంది సరదాగా పోస్ట్లు పెడుతున్నారు. బహుశా బెజోస్ (Jeff Bezos) ఎవరికైనా అమెజాన్ షేరును బహుమతిగా ఇవ్వడానికి తీసుకొని ఉండొచ్చని ఓ వ్యక్తి ట్వీట్ చేశాడు. మరొకరేమో అనుకోకుండా క్లిక్ చేయడం వల్ల అలా జరిగిపోయి ఉంటుందని మరొకరు ఫన్నీగా కామెంట్ చేశాడు. బహుశా ఒక్క షేరు కొంటే బెజోస్ (Jeff Bezos)కు కంపెనీలో నియంత్రిత వాటా దక్కుతుందేమో అని ఇంకొకరు అంచనా వేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు
మారుతీ సుజుకీ త్వరలోనే అందుబాటు ధరలో హైబ్రిడ్ కార్లను తీసుకురావడంపై పని చేస్తోంది. -
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
ఐటీ రంగంలో ఉద్యోగుల సంఖ్య నానాటికీ తగ్గుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో టాప్-5 ఐటీ సంస్థల్లోనే ఉద్యోగుల సంఖ్య 69 వేల వరకు తగ్గింది. -
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్
గూగుల్లో ఉద్యోగం మొదలుపెట్టి 20 ఏళ్లు అయిందని సీఈఓ సుందర్ పిచాయ్ (Sundar Pichai) వెల్లడించారు. ఈ మేరకు ఓ పోస్టు పెట్టారు. -
మహిళా ఆవిష్కర్తలు పెరగాలి
మనదేశంలో మహిళా ఆవిష్కర్తల సంఖ్య తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని, ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. -
వరుస లాభాలకు విరామం
సూచీల అయిదు రోజుల లాభాల ర్యాలీకి కళ్లెం పడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించారు. -
2047 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ
తెలంగాణ 2047 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల (రూ.85 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా మారేందుకు భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తన వంతు పాత్ర పోషిస్తుందని సీఐఐ తెలంగాణ ఛైర్మన్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి డి ప్రసాద్ అన్నారు. -
హార్లిక్స్ ‘హెల్త్ డ్రింక్’ కాదు
హిందుస్థాన్ యునిలీవర్(హెచ్యూఎల్) తన బ్రాండ్ హార్లిక్స్ లేబుల్పై కీలక మార్పులు చేసింది. గతంలో ‘హెల్త్ ఫుడ్ డ్రింక్స్’ కేటగిరిలో ఉన్న హార్లిక్స్ను ‘ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్’ కేటగిరిలోకి మార్చింది. -
రిలయన్స్కు రేటింగ్ సంస్థల ‘జై’
2024 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్కు అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఎస్ అండ్ పీ, ఫిచ్ జై కొట్టాయి. -
భారత జీడీపీ వృద్ధి 6.6 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో భారత జీడీపీ వృద్ధి 6.6 శాతంగా నమోదుకావొచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. -
మారుతీకి విక్రయాల జోష్
జనవరి-మార్చి త్రైమాసికంలో మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం 47.8 శాతం పెరిగి రూ.3,877.70 కోట్లుగా నమోదైంది. -
హెచ్సీఎల్ టెక్ లాభం రూ.3,986 కోట్లు
దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.3,986 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.3,983 కోట్లుగా ఉంది. -
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు ఎస్ఎఫ్బీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు నిర్దేశిత అర్హతలను కలిగి ఉన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల (ఎస్ఎఫ్బీ) నుంచి దరఖాస్తులను ఆహ్వానించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. -
సంక్షిప్త వార్తలు(6)
అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఏహెచ్ఈఎల్) అనుబంధ సంస్థ అపోలో హెల్త్కో లిమిటెడ్(అపోలో 24/7)కు రూ.2,475 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయి. -
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
Flipkart: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది.
తాజా వార్తలు (Latest News)
-
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు
-
వాటిని తెంచుకున్నంత సులువుగా ప్రేమను వదులుకోలేకపోయా: కమల్ హాసన్
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
-
అధికారిక ప్రకటనే లేదు.. ‘రామాయణ’ షూట్ ఫొటోలు వైరల్
-
హెలికాప్టర్లో తూలి పడిపోయిన మమతా బెనర్జీ
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్