Jio Swiggy plan: స్విగ్గీ వన్ లైట్ సబ్స్క్రిప్షన్తో జియో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్
Jio Swiggy festive prepaid plan: పండగ సీజన్ నేపథ్యంలో జియో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ను తీసుకొచ్చింది. ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసేవాళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని స్విగ్గీ సబ్స్క్రిప్షన్తో కూడిన ప్లాన్ను ప్రవేశపెట్టింది.
ఇంటర్నెట్ డెస్క్: దేశీయ ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో.. కస్టమర్ల అభిరుచి, అవసరాలకు అనుగుణంగా ప్రీపెయిడ్ ప్లాన్ల (Jio Prepaid Plan)ను తీసుకొస్తుంటుంది. తాజాగా ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్లను ఎక్కువగా ఉపయోగించే వారిని దృష్టిలో ఉంచుకొని ఓ కొత్త ప్లాన్ను ప్రవేశపెట్టింది. ఈ మేరకు స్విగ్గీతో చేతులు కలిపింది. పండగ సీజన్ను దృష్టిలో ఉంచుకొని ఈ ప్లాన్ను తీసుకొచ్చినట్లు జియో తెలిపింది.
ప్లాన్ వివరాలు..
రూ.866తో రీఛార్జ్ చేసుకుంటే ‘స్విగ్గీ వన్ లైట్’ (Swiggy One Lite subscription) మూడు నెలల సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. ప్లాన్ ప్రారంభ ఆఫర్ కింద ఇప్పుడు రీఛార్జ్ చేసుకునే వారికి రూ.50 క్యాష్బ్యాక్ కూపన్ కూడా ఇస్తున్నట్లు జియో పేర్కొంది. ఇది మైజియో అకౌంట్లో ఉంటుందని.. తదుపరి రీఛార్జ్లో రూ.50 తగ్గింపు లభిస్తుందని తెలిపింది. ఫుడ్ డెలివరీ సబ్స్క్రిప్షన్తో వచ్చిన తొలి టెలికాం ప్లాన్ ఇదేనని జియో పేర్కొంది. ఈ ప్లాన్లో ఉచిత 5జీ డేటా, రోజుకు 2జీబీ 4జీ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్లు కూడా ఉంటాయి. జియోయాప్లకు యాక్సెస్ కూడా లభిస్తుంది. ఇవన్నీ 84 రోజుల వ్యాలిడిటీతో వస్తాయి.
స్విగ్గీ సబ్స్క్రిప్షన్తో..
స్విగ్గీ వన్ లైట్ సబ్స్క్రిప్షన్ (Swiggy One Lite subscription)తో యూజర్లకు రూ.600 విలువ చేసే ప్రయోజనాలు ఉంటాయని జియో ఓ ప్రకటనలో తెలిపింది. రూ.149 కంటే ఎక్కువ విలువ చేసే ఫుడ్ ఆర్డర్లలో పదింటిపై ఉచిత హోమ్ డెలివరీ ఉంటుందని పేర్కొంది. రూ.199 కంటే ఎక్కువ విలువ చేసే 10 ఇన్స్టామార్ట్ ఆర్డర్లపై కూడా ఎలాంటి డెలివరీ ఛార్జీలు ఉండవని తెలిపింది. ఇన్స్టామార్ట్, ఫుడ్ ఆర్డర్లపై సర్జ్ ఛార్జీ కూడా ఉండబోదని స్పష్టం చేసింది. ఫుడ్ డెలివరీ రెస్టారెంట్లు అందించే సాధారణ ఆఫర్లపై 30 శాతం అదనపు రాయితీ కూడా లభిస్తుందని తెలిపింది. రూ.60 కంటే అధిక విలువ చేసే స్విగ్గీ జీనీ డెలివరీలపైనా 10 శాతం రాయితీ ఉంటుందని వెల్లడించింది.
దాదాపు 40 కోట్ల సబ్స్క్రైబర్లు ఉన్న జియో.. ఎప్పటికప్పుడు యూజర్ల అవసరాలకు అనుగుణంగా కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను తీసుకొస్తుంటుంది. క్రికెట్ టోర్నీల సమయంలో ఫ్యాన్స్ కోసం ప్రత్యేక పథకాలను ప్రవేశపెడుతుంటుంది. అలాగే సినీ ప్రియుల కోసం ఎప్పటికప్పుడు వివిధ ఓటీటీ యాప్లతో కూడిన ప్రీపెయిడ్ ప్లాన్లను రూపొందిస్తుంటుంది. ఆగస్టులో నెట్ఫ్లిక్స్తో కూడిన రెండు ప్లాన్లను ప్రవేశపెట్టింది. వీటి ధర రూ.1,099, రూ.1,499. వ్యాలిడిటీ 84 రోజులు, అపరిమిత 5జీ డేటాతో పాటు, రోజుకి 2జీబీ 4జీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్ కూడా లభిస్తాయి. రూ.1,099 ప్లాన్తో కేవలం నెట్ఫ్లిక్స్ మొబైల్ సబ్స్క్రిప్షన్ మాత్రమే లభిస్తుంది. అదే రూ.1,499 ప్లాన్తో రీఛార్జ్ చేసుకున్నవాళ్లకు పెద్ద స్క్రీన్లలో కూడా వీక్షించేలా నెట్ఫ్లిక్స్ బేసిక్ సబ్స్క్రిప్షన్ వస్తుంది. మరోవైపు జూన్లో జియోసావన్ ప్రో సబ్స్క్రిప్షన్తో జియో ఐదు ప్లాన్లను తీసుకొచ్చింది. వీటి ధర రూ.269 నుంచి 789 మధ్య ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు
మారుతీ సుజుకీ త్వరలోనే అందుబాటు ధరలో హైబ్రిడ్ కార్లను తీసుకురావడంపై పని చేస్తోంది. -
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
ఐటీ రంగంలో ఉద్యోగుల సంఖ్య నానాటికీ తగ్గుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో టాప్-5 ఐటీ సంస్థల్లోనే ఉద్యోగుల సంఖ్య 69 వేల వరకు తగ్గింది. -
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్
గూగుల్లో ఉద్యోగం మొదలుపెట్టి 20 ఏళ్లు అయిందని సీఈఓ సుందర్ పిచాయ్ (Sundar Pichai) వెల్లడించారు. ఈ మేరకు ఓ పోస్టు పెట్టారు. -
మహిళా ఆవిష్కర్తలు పెరగాలి
మనదేశంలో మహిళా ఆవిష్కర్తల సంఖ్య తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని, ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. -
వరుస లాభాలకు విరామం
సూచీల అయిదు రోజుల లాభాల ర్యాలీకి కళ్లెం పడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించారు. -
2047 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ
తెలంగాణ 2047 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల (రూ.85 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా మారేందుకు భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తన వంతు పాత్ర పోషిస్తుందని సీఐఐ తెలంగాణ ఛైర్మన్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి డి ప్రసాద్ అన్నారు. -
హార్లిక్స్ ‘హెల్త్ డ్రింక్’ కాదు
హిందుస్థాన్ యునిలీవర్(హెచ్యూఎల్) తన బ్రాండ్ హార్లిక్స్ లేబుల్పై కీలక మార్పులు చేసింది. గతంలో ‘హెల్త్ ఫుడ్ డ్రింక్స్’ కేటగిరిలో ఉన్న హార్లిక్స్ను ‘ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్’ కేటగిరిలోకి మార్చింది. -
రిలయన్స్కు రేటింగ్ సంస్థల ‘జై’
2024 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్కు అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఎస్ అండ్ పీ, ఫిచ్ జై కొట్టాయి. -
భారత జీడీపీ వృద్ధి 6.6 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో భారత జీడీపీ వృద్ధి 6.6 శాతంగా నమోదుకావొచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. -
మారుతీకి విక్రయాల జోష్
జనవరి-మార్చి త్రైమాసికంలో మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం 47.8 శాతం పెరిగి రూ.3,877.70 కోట్లుగా నమోదైంది. -
హెచ్సీఎల్ టెక్ లాభం రూ.3,986 కోట్లు
దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.3,986 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.3,983 కోట్లుగా ఉంది. -
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు ఎస్ఎఫ్బీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు నిర్దేశిత అర్హతలను కలిగి ఉన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల (ఎస్ఎఫ్బీ) నుంచి దరఖాస్తులను ఆహ్వానించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. -
సంక్షిప్త వార్తలు(6)
అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఏహెచ్ఈఎల్) అనుబంధ సంస్థ అపోలో హెల్త్కో లిమిటెడ్(అపోలో 24/7)కు రూ.2,475 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయి. -
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
Flipkart: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది.
తాజా వార్తలు (Latest News)
-
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు
-
వాటిని తెంచుకున్నంత సులువుగా ప్రేమను వదులుకోలేకపోయా: కమల్ హాసన్
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
-
అధికారిక ప్రకటనే లేదు.. ‘రామాయణ’ షూట్ ఫొటోలు వైరల్
-
హెలికాప్టర్లో తూలి పడిపోయిన మమతా బెనర్జీ
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్