ఇకపై బ్యాంకుల్లోనూ మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్
mahila samman savings certificate: మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీమ్కు పోస్టాఫీసుల్లోనే కాకుండా అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో, కొన్ని ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకుల్లోనూ ఇక నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇంటర్నెట్ డెస్క్: ఇప్పటి వరకు ‘మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్’ (mahila samman savings certificate) ఖాతాను పోస్టాఫీసుల్లో మాత్రమే తెరవడానికి మహిళలకు అవకాశం ఉండేది. ఇప్పుడు బ్యాంకుల ద్వారా కూడా ఈ పథకంలో చేరేందుకు కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఇకపై అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనూ ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే, ప్రైవేట్ బ్యాంకులైన ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంకుల్లో కూడా ఈ స్కీమ్లో చేరడానికి మహిళలకు అవకాశం ఉంది.
మహిళా సమ్మాన్ సేవింగ్స్ స్కీమ్: ఎక్కువ మంది మహిళలు పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం 2023 బడ్జెట్లో మహిళల కోసం వన్-టైమ్ సేవింగ్స్ స్కీం అయిన ‘మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్’ను ప్రవేశపెట్టింది. ఈ పథకంలో మహిళ తన కోసం లేదా మైనర్ బాలిక తరఫున సంరక్షకుడు ఖాతాను తెరవొచ్చు.
వడ్డీ: ఇది ప్రభుత్వ హామీ ఉన్న పథకం. దీనిపై 7.5% ఫిక్స్డ్ వడ్డీ రేటు లభిస్తుంది. మెచ్యూరిటీ సమయంలో డిపాజిట్ చేసిన మొత్తం, వడ్డీ కలిపి ఇస్తారు.
కాలవ్యవధి: ఈ స్కీమ్ కాలవ్యవధి రెండేళ్లు మాత్రమే. ఈ స్కీమ్ 2023, ఏప్రిల్ 1 నుంచి 2025 మార్చి 31 వరకు మాత్రమే మదుపు చేయడానికి అవకాశం ఉంది. డిపాజిట్ను 2 ఏళ్లు ఉంచితే, వడ్డీ కూడా 2 ఏళ్ల సమయానికి మాత్రమే చెల్లిస్తారు. మెచ్యూరిటీ అనంతరం కూడా డిపాజిట్ను ఈ స్కీమ్లో ఉంచేస్తే.. 2 ఏళ్ల తర్వాత కాలానికి పొదుపు ఖాతా వడ్డీ మాత్రమే దక్కుతుంది.
డిపాజిట్: ఈ పథకం కింద కనీస డిపాజిట్ రూ.1000, గరిష్ఠ పరిమితి రూ.2 లక్షలు. ఒకసారి రూ.2 లక్షల్లోపు డిపాజిట్ చేస్తే మళ్లీ డిపాజిట్ చేయడానికి 3 నెలలు వేచి ఉండాలి.
ఉపసంహరణ: ఖాతా తెరిచిన తేదీ నుంచి ఒక సంవత్సరం తర్వాత, అర్హత ఉన్న బ్యాలెన్స్లో 40% ఉపసంహరణకు ప్రభుత్వం అనుమతిస్తుంది.
మెచ్యూరిటీకి ముందే ఖాతాను క్లోజ్ చేయొచ్చు: ఖాతాదారుడు మరణించిన సందర్భంలో ఖాతాను ముందుగానే మూసేయొచ్చు. ఖాతాదారుడు తీవ్ర ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు సంబంధిత పత్రాలను సమర్పించి ఖాతాను ముందుగానే క్లోజ్ చేయొచ్చు. ఇలాంటి సందర్భంలో డిపాజిట్, వడ్డీ కలిపి ఇచ్చేస్తారు. అయితే, ఖాతా తెరిచిన 6 నెలల తర్వాత ఎటువంటి కారణం చెప్పకుండా ఖాతాను మూసివేస్తే.. అప్పుడు వడ్డీపై 2% కోత విధిస్తారు. అంటే డిపాజిట్ మొత్తం 5.5% వడ్డీ మాత్రమే చెల్లిస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్టాక్ మార్కెట్... పెట్టుబడులు.. కాస్త అప్రమత్తంగా
ఎన్నికలు.. ఇతర కారణాలతో స్టాక్ మార్కెట్లు మిశ్రమంగా స్పందిస్తున్నాయి. ఒకవైపు అంతర్జాతీయ మదుపరులు మన మార్కెట్లపై నిరాశావాద దృక్పథంతో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు పెట్టుబడులు పెట్టడానికి ఇదే సరైన తరుణం అంటూ సానుకూల మాటలు.. -
జీవిత బీమా పన్ను ఆదాకు మించి
ఆదాయపు పన్ను మినహాయింపు గురించి ఆలోచించే వారు ముందుగా చూసేది బీమా పాలసీలనే. పన్ను ప్రణాళికలను ప్రారంభించాల్సిన సమయం కావడంతో బీమా సంస్థలూ ఇప్పుడు పలు కొత్త పాలసీలతో ముందుకు వస్తుంటాయి. -
స్త్రీధన్ అంటే ఏంటి ?వివాహితలు తెలుసుకోవాల్సినవి
స్త్రీధన్ (ఆస్తి) అనేది మహిళ వివాహ సమయంలో తన తల్లిదండ్రులు, బంధువులు, వరుడు వైపు వారు, మొదలైన వారి నుంచి పొందే సంపద. దీనిపై హక్కులు ఎవరివి? -
ఆరోగ్య బీమా.. ఎంత ఉండాలి?
ఆరోగ్య బీమా పాలసీ తీసుకునేటప్పుడు, బీమా తీసుకునే వ్యక్తి.. అనేక విషయాలను పరిగణనలోకి తీసుకుని బీమా మొత్తాన్ని ఎంచుకోవడం చాలా అవసరం. -
పెట్టుబడికి బంగారు బాట...
ధర ఎంతన్నది సంబంధం లేకుండా మన దేశంలో బంగారానికి ఎప్పుడూ గిరాకీ ఉంటుంది. ఇక ప్రత్యేక సందర్భాల్లో చెప్పాల్సిన పనిలేదు. -
మదుపు చేయాలి.. లక్ష్యం చేరేదాకా
స్టాక్ మార్కెట్లు కొంత అనిశ్చితితో ఉన్నప్పటికీ గరిష్ఠ స్థాయుల వద్ద కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈక్విటీల్లో ప్రత్యక్షంగా మదుపు చేస్తున్న వారి సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతోంది. -
కష్టకాలంలో కుటుంబానికి ఆర్థిక ధీమా
అనుకోని ప్రమాదం కుటుంబంలో ఆర్జించే పెద్ద దిక్కును కోల్పోయేలా చేస్తుంది. ఆ వ్యక్తిపై ఆధారపడిన వారికి ఒక్కసారిగా ఏం చేయాలో తెలియని పరిస్థితి. -
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
Akshaya Tritiya 2024: అక్షయ తృతీయకు బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే హాల్మార్కింగ్ను ఎలా చెక్ చేయాలో తెలుసా? -
ఆరోగ్య బీమాలో నెట్వర్క్ ఆసుపత్రుల ప్రాధాన్యత ఏమిటి?
ప్రతి ఆరోగ్య బీమా సంస్థ తన పాలసీదారులకు నగదు రహిత చికిత్సనందించడానికి కొన్ని ఆసుపత్రులతో భాగస్వామ్యాన్ని (టై-అప్) కలిగి ఉంటుంది. దీని వల్ల పాలసీదారులకు ప్రయోజనమేంటో ఇక్కడ తెలుసుకుందాం.. -
తీవ్ర వ్యాధుల చికిత్సకు ఆర్థిక భరోసా
అనారోగ్యం ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో చెప్పలేం. ఓవైపు పెరుగుతున్న వైద్య చికిత్స ఖర్చులతో కేవలం ఆరోగ్య బీమా పాలసీ ఒక్కటే ఉంటే సరిపోని రోజులివి. -
వేతనంలోఎంత పొదుపు చేయాలంటే
వచ్చిన ఆదాయాన్నంతా ఖర్చు చేస్తే.. భవిష్యత్ లక్ష్యాలను సాధించడం కష్టమవుతుంది. కాబట్టి, పొదుపు, పెట్టుబడులపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. -
ఫిక్స్డ్ డిపాజిట్.. ఈ పత్రాలు ఇచ్చారా?
బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయా? వీటిపై వచ్చే వడ్డీపై మూలం వద్ద పన్ను మినహాయింపు (టీడీఎస్) విధించకుండా ఫారం 15జీ / ఫారం15హెచ్ సమర్పించేందుకు సమయం ఇదే. -
ప్రభుత్వ సంస్థల్లో
ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మ్యూచువల్ ఫండ్ కొత్తగా ఒక ఈటీఎఫ్ (ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్) పథకాన్ని తీసుకొచ్చింది. ఆదిత్య బిర్లా సన్ లైఫ్ నిఫ్టీ పీఎస్ఈ ఈటీఎఫ్ అనే ఈ పథకం ఎన్ఎఫ్ఓ ముగింపు తేదీ ఈ నెల 16. కనీస పెట్టుబడి రూ.500. నిఫ్టీ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ (పీఎస్) ఇండెక్స్ ఆధారంగా రూపొందించిన ఓపెన్ ఎండెడ్ పథకం ఇది. -
క్రెడిట్ కార్డుల ద్వారా క్యాష్బ్యాక్ ఎలా సంపాదించాలి?
క్యాష్బ్యాక్ క్రెడిట్ కార్డులు మీరు వస్తువులను కొనుగోలు చేయడానికి మీ కార్డు స్వైప్ చేసినప్పుడు కొంత డబ్బును తిరిగి పొందేందుకు ఉపయోగపడతాయి. -
ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులున్నాయా? ఈ ప్రయోజనాలు తెలుసా?
Credit cards: సులభంగా క్రెడిట్ కార్డులు జారీ చేస్తుండటంతో చాలా మంది ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డుల్ని ఉపయోగిస్తున్నారు. వాటిని ఎలా సమర్థంగా వినియోగించాలో తెలుసుకోండిలా.. -
సెక్షన్ 54F.. బంగారం విక్రయించి ఇల్లు కొనుగోలు చేస్తే పన్నుండదు!
Section 54F: వారసత్వంగా వచ్చిన ఆభరణాలను విక్రయించగా వచ్చిన మొత్తాన్ని ఇల్లు కొనుగోలుకు వినియోగిస్తే.. మూలధన లాభాల పన్ను వర్తించదని ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 54ఎఫ్ చెబుతోంది. -
ఆరోగ్య బీమా.. ఏ వయసులోనైతే మేలు..?
ఒక వ్యక్తి యుక్త వయసులోనే ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవడం వల్ల ప్రీమియం తగ్గింపు సహా అనేక ప్రయోజనాలుంటాయి. అవేంటో తెలుసుకోండి.. -
ఆరోగ్య బీమా అందరికీ అందేలా...
అందరికీ బీమా పాలసీలను అందించాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. -
మ్యూచువల్ ఫండ్లు..కేవైసీని పూర్తి చేశారా?
ఆర్థిక లక్ష్యాలను సాధించే క్రమంలో పెట్టుబడులు ఎంతో కీలకం. దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకూ ఇవి అవసరం. చాలామంది మ్యూచువల్ ఫండ్లను ఇందుకు సరైన మార్గంగా నమ్ముతున్నారు. -
పన్ను విధానం ఎంచుకుందామిలా...
ITR: గత ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు తరుణం వచ్చేసింది. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు కొత్త, పాత పన్ను విధానంలో దేన్ని ఎంచుకోవాలన్న సందేహంలో ఉన్నారు. -
క్రెడిట్ స్కోరు పెరగాలంటే
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఒక వ్యక్తికి రుణాన్ని ఇచ్చేటప్పుడు ముఖ్యంగా పరిశీలించేది క్రెడిట్ స్కోరు. రుణగ్రహీత చరిత్ర, అతని అర్హతను తెలుసుకునేందుకూ ఇది ఉపయోగపడుతుంది.
తాజా వార్తలు (Latest News)
-
పిన్నెల్లి సోదరులను జైలుకు పంపాలి.. ఘర్షణలకు వారే కారణం: మాజీ మంత్రి నక్కా ఆనందబాబు
-
పిఠాపురంలో మద్యం ఇవ్వలేదు.. డబ్బు పంచలేదు: మాజీ ఎమ్మెల్యే వర్మ
-
గెలిచేది కూటమే.. మెజార్టీ ఎంత?.. ఐపీఎల్ను మరిపిస్తున్న ఫలితాలు
-
క్షణక్షణం ఉత్కంఠ.. పోలింగ్ నాటి ఘటనలతో గ్రామాల్లో ఉద్రిక్తత
-
అమెరికాలో తెలుగు యువకుడి దుర్మరణం: ప్రమాదం నుంచి బయటపడి.. మరో కారు ఢీకొని...!
-
విశాఖలో ‘చంద్రగిరి’ దందా!!