Medi Assist IPO: మెడి అసిస్ట్ ఐపీఓ ప్రారంభం.. పూర్తి వివరాలివే..!
Medi Assist IPO: రూ.1,172 కోట్ల సమీకరణ లక్ష్యంతో మెడి అసిస్ట్ ఐపీఓ జనవరి 15న ప్రారంభమైంది. 17వ తేదీ వరకు షేర్లకు బిడ్లు దాఖలు చేయొచ్చు.
Medi Assist IPO | ఇంటర్నెట్ డెస్క్: థర్డ్పార్టీ ఇన్సూరెన్స్ అడ్మినిస్ట్రేటర్ మెడి అసిస్ట్ హెల్త్కేర్ సర్వీసెస్ పబ్లిక్ ఇష్యూ (Medi Assist Healthcare Services IPO) బుధవారం ప్రారంభమైంది. ధరల శ్రేణి రూ.397-418. గరిష్ఠ ధర వద్ద రూ.1,172 కోట్లు సమీకరించనుంది. ఇప్పటికే యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.352 కోట్లు సమకూర్చుకుంది. జనవరి 17 వరకు షేర్లకు బిడ్లు దాఖలు చేయొచ్చు. మదుపర్లు కనీసం 35 షేర్లకు (ఒక లాట్) రూ.14,630 పెట్టుబడిగా పెట్టాలి.
ఈ ఐపీఓలో (Medi Assist Healthcare Services IPO) ఎలాంటి కొత్త షేర్లను జారీ చేయడం లేదు. ప్రమోటర్లు, పెట్టుబడిదారులు తమ వాటాలో నుంచి 2.8 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయిస్తున్నారు. దీంతో ఈ పబ్లిక్ ఇష్యూలో సమీకరించిన నిధులు పూర్తిగా వారికే చెందనున్నాయి. మెడి అసిస్ట్ను సాక్షి కబ్రా 2002లో బెంగళూరు కేంద్రంగా ప్రారంభించారు. 2011లో బెస్సెమర్ వెంచర్స్ వాటాలు కొనుగోలు చేసింది. అదే సంవత్సరం అనిల్ అంబానీ గ్రూప్ 80 శాతం వాటాలు సొంతం చేసుకుంది. తర్వాత మెజారిటీ వాటాను ఇన్వెస్టర్కార్ప్కు విక్రయించింది. ప్రస్తుతం ఈ సంస్థ 21.65 శాతంతో అతిపెద్ద వాటాదారుగా ఉంది.
దేశవ్యాప్తంగా 1,069 పట్టణాల్లో 18 వేల ఆస్పత్రులు మెడి అసిస్ట్ నెట్వర్క్లో ఉన్నాయి. దాదాపు 35 బీమా కంపెనీలు ఈ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఈ కంపెనీ ప్రాథమిక కస్టమర్లు బీమా సంస్థలే. గ్రూప్ పాలసీల ద్వారానే అత్యధిక ఆదాయం ఆర్జిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడిక్లెయిమ్ సర్వీసుల నుంచి 10 శాతం ఆదాయం సమకూరుతోంది. సెప్టెంబర్ 2023 నాటికి 6,200 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.
మెడి అసిస్ట్ ఐపీఓ వివరాలు సంక్షిప్తంగా..
- ఐపీఓ తేదీలు: జనవరి 15-17
- ధరల శ్రేణి: రూ.397-418
- షేరు ముఖ విలువ: రూ.5
- కనీసం కొనాల్సిన షేర్ల సంఖ్య: 35 (ఒక లాట్)
- కనీస పెట్టుబడి: రూ.14,630
- అలాట్మెంట్ తేదీ: జనవరి 18
- రిఫండ్ తేదీ: జనవరి 19
- లిస్టింగ్ తేదీ: జనవరి 22
(గమనిక: ఐపీఓలో పెట్టుబడి నష్టభయంతో కూడుకున్న వ్యవహారం. పై వివరాలు కేవలం సమాచారం కోసం మాత్రమే. ఐపీఓలో మదుపు చేయడం పూర్తిగా మీ వ్యక్తిగత నిర్ణయం.)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు
మారుతీ సుజుకీ త్వరలోనే అందుబాటు ధరలో హైబ్రిడ్ కార్లను తీసుకురావడంపై పని చేస్తోంది. -
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
ఐటీ రంగంలో ఉద్యోగుల సంఖ్య నానాటికీ తగ్గుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో టాప్-5 ఐటీ సంస్థల్లోనే ఉద్యోగుల సంఖ్య 69 వేల వరకు తగ్గింది. -
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్
గూగుల్లో ఉద్యోగం మొదలుపెట్టి 20 ఏళ్లు అయిందని సీఈఓ సుందర్ పిచాయ్ (Sundar Pichai) వెల్లడించారు. ఈ మేరకు ఓ పోస్టు పెట్టారు. -
మహిళా ఆవిష్కర్తలు పెరగాలి
మనదేశంలో మహిళా ఆవిష్కర్తల సంఖ్య తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని, ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. -
వరుస లాభాలకు విరామం
సూచీల అయిదు రోజుల లాభాల ర్యాలీకి కళ్లెం పడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించారు. -
2047 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ
తెలంగాణ 2047 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల (రూ.85 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా మారేందుకు భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తన వంతు పాత్ర పోషిస్తుందని సీఐఐ తెలంగాణ ఛైర్మన్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి డి ప్రసాద్ అన్నారు. -
హార్లిక్స్ ‘హెల్త్ డ్రింక్’ కాదు
హిందుస్థాన్ యునిలీవర్(హెచ్యూఎల్) తన బ్రాండ్ హార్లిక్స్ లేబుల్పై కీలక మార్పులు చేసింది. గతంలో ‘హెల్త్ ఫుడ్ డ్రింక్స్’ కేటగిరిలో ఉన్న హార్లిక్స్ను ‘ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్’ కేటగిరిలోకి మార్చింది. -
రిలయన్స్కు రేటింగ్ సంస్థల ‘జై’
2024 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్కు అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఎస్ అండ్ పీ, ఫిచ్ జై కొట్టాయి. -
భారత జీడీపీ వృద్ధి 6.6 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో భారత జీడీపీ వృద్ధి 6.6 శాతంగా నమోదుకావొచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. -
మారుతీకి విక్రయాల జోష్
జనవరి-మార్చి త్రైమాసికంలో మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం 47.8 శాతం పెరిగి రూ.3,877.70 కోట్లుగా నమోదైంది. -
హెచ్సీఎల్ టెక్ లాభం రూ.3,986 కోట్లు
దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.3,986 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.3,983 కోట్లుగా ఉంది. -
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు ఎస్ఎఫ్బీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు నిర్దేశిత అర్హతలను కలిగి ఉన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల (ఎస్ఎఫ్బీ) నుంచి దరఖాస్తులను ఆహ్వానించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. -
సంక్షిప్త వార్తలు(6)
అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఏహెచ్ఈఎల్) అనుబంధ సంస్థ అపోలో హెల్త్కో లిమిటెడ్(అపోలో 24/7)కు రూ.2,475 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయి. -
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
Flipkart: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది.
తాజా వార్తలు (Latest News)
-
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు
-
వాటిని తెంచుకున్నంత సులువుగా ప్రేమను వదులుకోలేకపోయా: కమల్ హాసన్
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
-
అధికారిక ప్రకటనే లేదు.. ‘రామాయణ’ షూట్ ఫొటోలు వైరల్
-
హెలికాప్టర్లో తూలి పడిపోయిన మమతా బెనర్జీ
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్