Mark Zuckerberg : మార్క్ జుకర్ బర్గ్ మంచి బాస్ కాదట.. మెటా మెజారిటీ ఉద్యోగుల అభిప్రాయం!
తమ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ (Mark Zuckerberg) మంచి బాస్ కాదని మెటా (Meta) మెజారిటీ ఉద్యోగులు (Employees) భావిస్తున్నట్లు ఓ అంతర్గత సర్వేలో వెల్లడైంది. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలపై వారు పెదవి విరిచినట్లు తేలింది.
ఇంటర్నెట్ డెస్క్ : ఫేస్బుక్ (Facebook) మాతృసంస్థ మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ (Mark Zuckerberg) తన కంపెనీని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఇటీవలి కాలంలో కొన్ని అనూహ్య నిర్ణయాలు తీసుకున్నారు. దాంతో ఉద్యోగుల్లో ఆయనపై విశ్వాసం సన్నగిల్లినట్లు ఓ సర్వేలో వెల్లడైంది.
మెటాను తిరుగులేని సంస్థగా నిలబెట్టేందుకు సీఈవో మార్క్ జుకర్ బర్గ్ ఇటీవల కొన్ని సంస్కరణలు చేపట్టాడు. అందులో భాగంగా ఈ ఏడాదిని ‘సమర్థత సంవత్సరం’గా ప్రకటించాడు. ఈ సందర్భంగా కంపెనీని మరింత బలంగా, అతి చురుకైన సంస్థగా తీర్చిదిద్దే యోచనతో ఉన్నట్లు అంతర్గత సమావేశంలో వెల్లడించాడు. అయితే ఆయన తీసుకున్న మెజారిటీ నిర్ణయాలు ఉద్యోగులకు ఏ మాత్రం నచ్చలేదు. గతేడాది 11 వేల ఉద్యోగాలకు కోత పెట్టిన జుకర్బర్గ్.. ఈ ఏడాది మార్చిలో మరో 10వేల మందికి ఉద్వాసన పలుకుతున్నట్లు ప్రకటించాడు. ఈ నేపథ్యంలో మెటాలో ఓ అంతర్గత సర్వే చేపట్టగా ఉద్యోగుల్లో ఎక్కువ మంది జుకర్ బర్గ్ నాయకత్వం పట్ల అసంతృప్తిగా ఉన్నట్లు తేలింది. కేవలం 26 శాతం మంది మాత్రమే ఆయన నాయకత్వాన్ని విశ్వసిస్తున్నారని వాల్స్ట్రీట్ జర్నల్ నివేదిక వెల్లడించింది.
మంచి బాస్ కాదట!
సర్వే నివేదిక ప్రకారం 26 శాతం మంది ఉద్యోగులు జుకర్ బర్గ్ నాయకత్వాన్ని నమ్ముతున్నారు. గతేడాది అక్టోబరులో నిర్వహించిన సర్వేలో ఈ సంఖ్య కేవలం ఐదు శాతమే అధికంగా ఉందట. ఈ ఏడాది మేలో మెటా తమ ఉద్యోగులకు లే ఆఫ్లు ప్రకటించింది. తాజా సర్వే అంతకు ముందే చేపట్టినా ఎక్కువ మంది జుకర్ బర్గ్ మంచి బాస్ కాదనే అభిప్రాయం వ్యక్త పరిచారు. ఇక 43 శాతం మంది ఉద్యోగులు కంపెనీలో తమ పనికి విలువ ఉందని భావిస్తున్నారట. మూకుమ్మడి తొలగింపుల కారణంగా ఉద్యోగుల్లో నైతిక స్థ్యైర్యం దెబ్బతింటోందని తాజా నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది మార్చిలో 10 వేల మందిని తొలగించాలని మెటా తొలుత భావించింది. తరువాత ఆ సంఖ్యను 4వేలకు పరిమితం చేసింది. మిగిలిన 6 వేల మందికి మేలో లే ఆఫ్లు ప్రకటించింది. ఇలా తొలగించిన వారిలో ఎక్కువ శాతం మంది పనిలో సమర్థులేనట. అయినప్పటికీ వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా ఈ ఉద్వాసనలు జరిగాయి.
ఎక్కువ స్థిరత్వం.. తక్కువ ఉద్యోగస్వామ్యం
మెటా సీఈవో జుకర్ బర్గ్ ఆలోచన ఉద్యోగుల అభిప్రాయానికి భిన్నంగా ఉంది. ఆయన కంపెనీలో ఎక్కువ స్థిరత్వం, తక్కువ ఉద్యోగస్వామ్యం ఉండాలని కోరుకుంటున్నారు. ఇదే విషయాన్ని ఓ సమావేశంలో చెబుతూ మెటా ‘స్క్రాపియర్ ప్లేస్’లో ఉండాలని ఆకాంక్షించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రూ.49కే బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ సబ్స్క్రిప్షన్
BSNL Cinemaplus: బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ పేరిట ఓటీటీ ప్యాకేజీలను అందిస్తోంది. దీంట్లో మొత్తం మూడు ప్యాక్లు ఉన్నాయి. తాజాగా స్టార్టర్ ప్యాక్ ధరను సంస్థ కుదించింది. -
వేసవిలో ఫోన్ ఛార్జింగ్ వేగం తగ్గుతుంది..? ఎందుకు?
వేసవిలో స్మార్ట్ఫోన్ ఛార్జింగ్లో వేగం మందగిస్తుంది. దీనికి కారణమేంటి? ఎందుకు వేగం తగ్గుతుంది? -
ఐసీఐసీఐ లాభం రూ.11,672 కోట్లు
ఐసీఐసీఐ బ్యాంక్ ఆర్థిక ఫలితాలకు తక్కువ కేటాయింపులు కలిసివచ్చాయి. దీంతో మార్చి త్రైమాసికంలో బ్యాంక్ ఏకీకృత నికర లాభం 18.5 శాతం వృద్ధి చెంది రూ.11,672 కోట్లకు చేరుకుంది. -
ఒకే పాలసీలోనే అన్ని ధీమాలు
అందరికీ బీమా పాలసీలను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఐఆర్డీఏఐ) ఒక ప్రామాణిక పాలసీ ‘బీమా విస్తార్’ను అందుబాటులోకి తీసుకురానుంది. -
హైదరాబాద్లో కార్యాలయాల అద్దె లావాదేవీలు పెరిగాయ్
కార్పొరేట్ల నుంచి గిరాకీ స్థిరంగా ఉండటంతో ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో కార్యాలయాల అద్దె లావాదేవీలు 13 శాతం వృద్ధితో 1.34 కోట్ల చదరపు అడుగులకు చేరిందని స్థిరాస్తి సేవలను అందించే వెస్టియన్ తెలిపింది. -
మ్యూచువల్ ఫండ్ కొత్త పథకాల్లోకి రూ.66,364 కోట్లు
గత ఆర్థిక సంవత్సరంలో మ్యూచువల్ ఫండ్ సంస్థలు(ఏఎంసీ) 185 కొత్త పథకాలను(ఎన్ఎఫ్ఓ-న్యూ ఫండ్ ఆఫర్) విడుదల చేశాయి. -
వైద్య ఉత్పత్తుల రంగంలో భారత్ కీలకం
వైద్య ఉత్పత్తుల రంగంలో భారతదేశానికి ఎంతో ముఖ్యమైన బాధ్యత ఉన్నట్లు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్ఎఫ్డీఏ) కమిషనర్ డాక్టర్ రాబర్ట్ కాలిఫ్ అన్నారు. -
ఆర్బీఎల్ బ్యాంక్ లాభంలో 30% వృద్ధి
జనవరి- మార్చి త్రైమాసికంలో ఆర్బీఎల్ బ్యాంక్ నికర లాభం 30 శాతం పెరిగి రూ.353 కోట్లకు చేరింది. -
యెస్ బ్యాంక్ లాభం రెట్టింపు
జనవరి- మార్చి త్రైమాసికంలో యెస్ బ్యాంక్ నికర లాభం స్టాండలోన్ పద్ధతిలో రూ.452 కోట్లుగా నమోదైంది. -
పూరీ విమానాశ్రయం ప్రాజెక్టు పోటీలో జీఎంఆర్, అదానీ గ్రూపు, ఫెయిర్ఫాక్స్?
ఒడిశా రాష్ట్రంలోని పూరీలో కొత్త విమానాశ్రయాన్ని నిర్మించి, నిర్వహించే అవకాశం కోసం జీఎంఆర్, అదానీ గ్రూపు, విదేశీ సంస్థ అయిన ఫెయిర్ఫాక్స్ పోటీ పడుతున్నాయి. -
భారత్లో షార్ప్ సెమీ కండక్టర్ల యూనిట్
జపాన్ ఎలక్ట్రానిక్ దిగ్గజం షార్ప్ దేశంలో సెమీకండక్టర్ ఫ్యాబ్ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. -
సంక్షిప్త వార్తలు
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సీకే బిర్లా గ్రూపు కంపెనీ, హెచ్ఐఎల్ లిమిటెడ్, పైపులు- ఫిట్టింగ్స్ వ్యాపారంలోకి విస్తరిస్తోంది. -
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
ఐటీ రంగంలో ఉద్యోగుల సంఖ్య నానాటికీ తగ్గుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో టాప్-5 ఐటీ సంస్థల్లోనే ఉద్యోగుల సంఖ్య 69 వేల వరకు తగ్గింది. -
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
Amazon: అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ వచ్చేసింది. మే 2 నుంచి ఈ సేల్ ప్రారంభం కానుందని ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
రూ.49కే బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ సబ్స్క్రిప్షన్
-
నవాబులు, సుల్తాన్ల అరాచకాలపై మౌనమా?: రాహుల్పై మోదీ ధ్వజం
-
ధోనీ ‘ఐపీఎల్’ జర్నీ సక్సెస్కు కారణమిదే!
-
పండుగాడికి పద్దెనిమిదేళ్లు .. ‘పోకిరి’ ఆసక్తికర విశేషాలు..
-
ఇరాక్లో దారుణం.. సోషల్ మీడియా స్టార్ హత్య
-
లఖ్నవూపై సూపర్ ఇన్నింగ్స్.. పొట్టి కప్ రేసులోకి సంజూ!