IPO updates: వచ్చేవారం నాలుగు ఐపీఓలు.. 7 లిస్టింగ్లు
IPO updates: వచ్చేవారం కూడా స్టాక్ మార్కెట్లో ఐపీఓల సందడి కొనసాగనుంది. ఇందులో 2 మెయిన్బోర్డు ఐపీఓలు, 2 ఎస్ఎంఈ సెగ్మెంట్కు చెందిన ఐపీఓలు ఉన్నాయి.
IPO updates | ఇంటర్నెట్ డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లలో ఐపీఓల (IPO) సందడి కొనసాగుతోంది. మార్కెట్లలో అనుకూల పరిస్థితులు ఉండడంతో ఈ ఏడాది పొడవునా ఇదే ధోరణి కొనసాగే అవకాశం ఉందని అనలిస్టులు భావిస్తున్నారు. ఈక్రమంలో వచ్చేవారం మరో నాలుగు ఐపీఓలు సబ్స్క్రిప్షన్కు రానున్నాయి. మెయిన్బోర్డు కేటగిరీలో జునిపెర్ హోటల్స్, జీపీటీ హెల్త్కేర్ రూ.2000 కోట్లు సమీకరించేందుకు ఐపీఓకు వస్తున్నాయి. ఎస్ఎంఈ సెగ్మెంట్లో జెనిత్ డ్రగ్స్, డ్రీమ్ రోల్ టెక్ సబ్స్క్రిప్షన్కు రానున్నాయి. మరోవైపు గత వారం సబ్స్క్రిప్షన్కు వచ్చిన విభోర్ స్టీల్ సహా మరో ఆరు ఎస్ఎంఈ సెగ్మెంట్కు చెందిన కంపెనీలు వచ్చే వారమే లిస్టింగ్కు రానున్నాయి.
జునిపెర్ హోటల్స్ ఐపీఓ: హయత్ (Hyatt) బ్రాండ్పై హోటల్స్ను నిర్వహిస్తున్న జునిపెర్ హోటల్స్ సంస్థ ఫిబ్రవరి 21 నుంచి 23 వరకు సబ్స్క్రిప్షన్కు అందుబాటులో ఉంటుంది. రూ.1800 కోట్లు ఇష్యూ ద్వారా సమీకరించనుంది. రూ.10 ముఖ విలువ కలిగిన ఫ్రెష్ షేర్లను కంపెనీ జారీ చేయనుంది. ఒక్కో షేరు ధరల శ్రేణిని రూ.342-360గా నిర్ణయించింది. ఇందులో క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్లకు 75 శాతం, 15 శాతం నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు, 10 శాతం రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయించారు. మార్కెట్ నుంచి సమీకరించిన నిధులను రుణాలు తిరిగి చెల్లించేందుకు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నారు.
జీపీటీ హెల్త్కేర్ ఐపీఓ: ఐఎల్ఎస్ హాస్పిటల్ బ్రాండ్పై మధ్యస్థాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ను నిర్వహిస్తున్న కోల్కతాకు చెందిన జీపీటీ హెల్త్కేర్ ఐపీఓ ఫిబ్రవరి 22న ప్రారంభమై 26తో ముగియనుంది. ఐపీఓ ధరల శ్రేణి వెల్లడి కాలేదు. రూ.40 కోట్ల విలువైన షేర్లను ఫ్రెష్ ఇష్యూ ద్వారా 2.6 కోట్ల ఈక్విటీ షేర్లను ఆఫర్ ఫర్ సేల్ ద్వారా విక్రయానికి ఉంచనున్నారు. ఫ్రెష్ ఇష్యూ ద్వారా సమకూరిన నిధులను రుణాల తిరిగి చెల్లింపులకు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నారు.
ఎస్ఎంఈ సెగ్మెంట్లో జెనిత్ డ్రగ్స్ ఐపీఓ ఫిబ్రవరి 19న ప్రారంభమై.. 22 వరకు అందుబాటులో ఉంటుంది. రూ.40.6 కోట్లు సమీకరించనుంది. డ్రీమ్రోల్ టెక్ ఐపీఓ ఫిబ్రవరి 20న ప్రారంభమై 22న ముగియనుంది. రూ.29 కోట్లు సమీకరించనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రూ.49కే బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ సబ్స్క్రిప్షన్
BSNL Cinemaplus: బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ పేరిట ఓటీటీ ప్యాకేజీలను అందిస్తోంది. దీంట్లో మొత్తం మూడు ప్యాక్లు ఉన్నాయి. తాజాగా స్టార్టర్ ప్యాక్ ధరను సంస్థ కుదించింది. -
వేసవిలో ఫోన్ ఛార్జింగ్ వేగం తగ్గుతుంది..? ఎందుకు?
వేసవిలో స్మార్ట్ఫోన్ ఛార్జింగ్లో వేగం మందగిస్తుంది. దీనికి కారణమేంటి? ఎందుకు వేగం తగ్గుతుంది? -
ఐసీఐసీఐ లాభం రూ.11,672 కోట్లు
ఐసీఐసీఐ బ్యాంక్ ఆర్థిక ఫలితాలకు తక్కువ కేటాయింపులు కలిసివచ్చాయి. దీంతో మార్చి త్రైమాసికంలో బ్యాంక్ ఏకీకృత నికర లాభం 18.5 శాతం వృద్ధి చెంది రూ.11,672 కోట్లకు చేరుకుంది. -
ఒకే పాలసీలోనే అన్ని ధీమాలు
అందరికీ బీమా పాలసీలను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఐఆర్డీఏఐ) ఒక ప్రామాణిక పాలసీ ‘బీమా విస్తార్’ను అందుబాటులోకి తీసుకురానుంది. -
హైదరాబాద్లో కార్యాలయాల అద్దె లావాదేవీలు పెరిగాయ్
కార్పొరేట్ల నుంచి గిరాకీ స్థిరంగా ఉండటంతో ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో కార్యాలయాల అద్దె లావాదేవీలు 13 శాతం వృద్ధితో 1.34 కోట్ల చదరపు అడుగులకు చేరిందని స్థిరాస్తి సేవలను అందించే వెస్టియన్ తెలిపింది. -
మ్యూచువల్ ఫండ్ కొత్త పథకాల్లోకి రూ.66,364 కోట్లు
గత ఆర్థిక సంవత్సరంలో మ్యూచువల్ ఫండ్ సంస్థలు(ఏఎంసీ) 185 కొత్త పథకాలను(ఎన్ఎఫ్ఓ-న్యూ ఫండ్ ఆఫర్) విడుదల చేశాయి. -
వైద్య ఉత్పత్తుల రంగంలో భారత్ కీలకం
వైద్య ఉత్పత్తుల రంగంలో భారతదేశానికి ఎంతో ముఖ్యమైన బాధ్యత ఉన్నట్లు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్ఎఫ్డీఏ) కమిషనర్ డాక్టర్ రాబర్ట్ కాలిఫ్ అన్నారు. -
ఆర్బీఎల్ బ్యాంక్ లాభంలో 30% వృద్ధి
జనవరి- మార్చి త్రైమాసికంలో ఆర్బీఎల్ బ్యాంక్ నికర లాభం 30 శాతం పెరిగి రూ.353 కోట్లకు చేరింది. -
యెస్ బ్యాంక్ లాభం రెట్టింపు
జనవరి- మార్చి త్రైమాసికంలో యెస్ బ్యాంక్ నికర లాభం స్టాండలోన్ పద్ధతిలో రూ.452 కోట్లుగా నమోదైంది. -
పూరీ విమానాశ్రయం ప్రాజెక్టు పోటీలో జీఎంఆర్, అదానీ గ్రూపు, ఫెయిర్ఫాక్స్?
ఒడిశా రాష్ట్రంలోని పూరీలో కొత్త విమానాశ్రయాన్ని నిర్మించి, నిర్వహించే అవకాశం కోసం జీఎంఆర్, అదానీ గ్రూపు, విదేశీ సంస్థ అయిన ఫెయిర్ఫాక్స్ పోటీ పడుతున్నాయి. -
భారత్లో షార్ప్ సెమీ కండక్టర్ల యూనిట్
జపాన్ ఎలక్ట్రానిక్ దిగ్గజం షార్ప్ దేశంలో సెమీకండక్టర్ ఫ్యాబ్ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. -
సంక్షిప్త వార్తలు
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సీకే బిర్లా గ్రూపు కంపెనీ, హెచ్ఐఎల్ లిమిటెడ్, పైపులు- ఫిట్టింగ్స్ వ్యాపారంలోకి విస్తరిస్తోంది. -
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
ఐటీ రంగంలో ఉద్యోగుల సంఖ్య నానాటికీ తగ్గుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో టాప్-5 ఐటీ సంస్థల్లోనే ఉద్యోగుల సంఖ్య 69 వేల వరకు తగ్గింది. -
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
Amazon: అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ వచ్చేసింది. మే 2 నుంచి ఈ సేల్ ప్రారంభం కానుందని ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
టాలీవుడ్లో చరిత్ర లిఖించిన రోజు.. ఎన్ని బ్లాక్బస్టర్లు విడుదలయ్యాయంటే?
-
శంషాబాద్ ఎయిర్పోర్టు సమీపంలో చిరుత సంచారం!
-
రూ.49కే బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ సబ్స్క్రిప్షన్
-
నవాబులు, సుల్తాన్ల అరాచకాలపై మౌనమా?: రాహుల్పై మోదీ ధ్వజం
-
ధోనీ ‘ఐపీఎల్’ జర్నీ సక్సెస్కు కారణమిదే!
-
పండుగాడికి పద్దెనిమిదేళ్లు .. ‘పోకిరి’ ఆసక్తికర విశేషాలు..