IPO update: రాశి ఫెరిఫెరల్స్ ఐపీఓకు భారీ స్పందన
IPO update: ఈ నెల 7న ప్రారంభమైన మూడు ఐపీఓల సబ్స్క్రిప్షన్ గడువు నేటితో ముగిసింది. ఇందులో రాశి పెరిఫెరల్స్ ఐపీఓకు భారీ స్పందన లభించింది.
IPO News | దిల్లీ: ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్స్ టెక్నాలజీ ప్రొడక్ట్లను డిస్ట్రిబ్యూట్ చేసే రాశి పెరిఫెరెల్స్ ఐపీఓకు (Rashi Peripherals IPO) మదుపరుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈనెల 7న సబ్స్క్రిప్షన్కు వచ్చిన ఈ ఐపీఓ నేటితో ముగిసింది. రూ.600 కోట్ల పరిమాణం కలిగిన ఈ ఐపీఓ 59.71 రెట్లు సబ్స్క్రైబ్ అయ్యింది. 1,42,37,289 (1.42 కోట్లు) షేర్లు విక్రయానికి ఉంచగా.. 85,01,64,480 (85 కోట్లు) బిడ్లు దాఖలయ్యాయి. సబ్స్క్రిప్షన్లో భాగంగా క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ బయ్యర్ల నుంచి 143.66 రెట్ల స్పందన వచ్చింది. నాన్-ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు 52.75 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్ల పోర్షన్ 10.44 రెట్లు చొప్పున బిడ్లు అందుకున్నాయి.
- జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఐపీఓకు 18.50 రెట్లు స్పందన వచ్చింది. 1,01,16,284 (1 కోటి) షేర్లు అందుబాటులో ఉంచగా.. 18,71,96,580 కోట్ల షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. క్యూఐబీ కోటా 38.75 రెట్లు, ఎన్ఐఐ కోటా 25.05 రెట్లు, రిటైల్ పోర్షన్ 5.46 రెట్లు సబ్స్క్రైబ్ అయ్యింది. ఒక్కో షేరు ధరల శ్రేణిని రూ.393-411గా నిర్ణయించారు.
- క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఐపీఓ చివరిరోజు పూర్తయ్యేనాటికి 4 రెట్లు సబ్స్క్రైబ్ అయ్యింది. రూ.523 కోట్లు సమీకరించే ఉద్దేశంతో 81,47,373 షేర్లను అందుబాటులో ఉంచగా.. 3,26,04,288 షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. క్యూఐబీల కోటా 6.64 రెట్లు, ఎన్ఐఐలు 4.05 రెట్లు, రిటైల్ పోర్షన్ 2.49 రెట్లు చొప్పున సబ్స్క్రైబ్ అయ్యాయి.
- ఎంటెరో హెల్త్కేర్ సొల్యూషన్స్ రూ.1600 కోట్ల విలువైన పబ్లిక్ ఇష్యూ తొలిరోజు 10 శాతం సబ్స్క్రైబ్ అయ్యింది. రిటైల్ పోర్షన్ 45 శాతం, నాన్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల విభాగంలో 4 శాతం సబ్స్క్రిప్షన్ లభించింది. సబ్స్క్రిప్షన్ 13తో ముగియనుంది. ఇందుకు ధర శ్రేణిగా రూ.1,195- 1,258 నిర్ణయించారు. గరిష్ఠ ధర వద్ద కంపెనీ రూ.1600 కోట్లు సమీకరించనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు
మారుతీ సుజుకీ త్వరలోనే అందుబాటు ధరలో హైబ్రిడ్ కార్లను తీసుకురావడంపై పని చేస్తోంది. -
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
ఐటీ రంగంలో ఉద్యోగుల సంఖ్య నానాటికీ తగ్గుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో టాప్-5 ఐటీ సంస్థల్లోనే ఉద్యోగుల సంఖ్య 69 వేల వరకు తగ్గింది. -
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్
గూగుల్లో ఉద్యోగం మొదలుపెట్టి 20 ఏళ్లు అయిందని సీఈఓ సుందర్ పిచాయ్ (Sundar Pichai) వెల్లడించారు. ఈ మేరకు ఓ పోస్టు పెట్టారు. -
మహిళా ఆవిష్కర్తలు పెరగాలి
మనదేశంలో మహిళా ఆవిష్కర్తల సంఖ్య తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని, ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. -
వరుస లాభాలకు విరామం
సూచీల అయిదు రోజుల లాభాల ర్యాలీకి కళ్లెం పడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించారు. -
2047 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ
తెలంగాణ 2047 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల (రూ.85 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా మారేందుకు భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తన వంతు పాత్ర పోషిస్తుందని సీఐఐ తెలంగాణ ఛైర్మన్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి డి ప్రసాద్ అన్నారు. -
హార్లిక్స్ ‘హెల్త్ డ్రింక్’ కాదు
హిందుస్థాన్ యునిలీవర్(హెచ్యూఎల్) తన బ్రాండ్ హార్లిక్స్ లేబుల్పై కీలక మార్పులు చేసింది. గతంలో ‘హెల్త్ ఫుడ్ డ్రింక్స్’ కేటగిరిలో ఉన్న హార్లిక్స్ను ‘ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్’ కేటగిరిలోకి మార్చింది. -
రిలయన్స్కు రేటింగ్ సంస్థల ‘జై’
2024 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్కు అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఎస్ అండ్ పీ, ఫిచ్ జై కొట్టాయి. -
భారత జీడీపీ వృద్ధి 6.6 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో భారత జీడీపీ వృద్ధి 6.6 శాతంగా నమోదుకావొచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. -
మారుతీకి విక్రయాల జోష్
జనవరి-మార్చి త్రైమాసికంలో మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం 47.8 శాతం పెరిగి రూ.3,877.70 కోట్లుగా నమోదైంది. -
హెచ్సీఎల్ టెక్ లాభం రూ.3,986 కోట్లు
దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.3,986 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.3,983 కోట్లుగా ఉంది. -
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు ఎస్ఎఫ్బీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు నిర్దేశిత అర్హతలను కలిగి ఉన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల (ఎస్ఎఫ్బీ) నుంచి దరఖాస్తులను ఆహ్వానించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. -
సంక్షిప్త వార్తలు(6)
అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఏహెచ్ఈఎల్) అనుబంధ సంస్థ అపోలో హెల్త్కో లిమిటెడ్(అపోలో 24/7)కు రూ.2,475 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయి. -
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
Flipkart: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది.
తాజా వార్తలు (Latest News)
-
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు
-
వాటిని తెంచుకున్నంత సులువుగా ప్రేమను వదులుకోలేకపోయా: కమల్ హాసన్
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
-
అధికారిక ప్రకటనే లేదు.. ‘రామాయణ’ షూట్ ఫొటోలు వైరల్
-
హెలికాప్టర్లో తూలి పడిపోయిన మమతా బెనర్జీ
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్