UPI Payments: మరింత విస్తరించనున్న యూపీఐ చెల్లింపుల పరిధి
ఆర్బీఐ యూపీఐ చెల్లింపుల పరిధిని మరింత విస్తరించే దిశగా నిర్ణయం తీసుకుంది.
ముంబయి: కీలక వడ్డీరేట్ల పెంపుతో పాటు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ బుధవారం మరో కీలక ప్రకటన చేశారు. ‘భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ (BBPS)’, యూపీఐ (UPI) పరిధిని విస్తరించే ప్రణాళిక గురించి కూడా ప్రస్తావించారు. పన్ను చెల్లింపులు, అద్దె నుంచి పాఠశాల ఫీజుల వరకు ఏ రకమైన చెల్లింపునైనా చేయడానికి వినియోగదారులు త్వరలో BBPSని ఉపయోగించుకోవచ్చని శక్తికాంత దాస్ తెలిపారు. అన్ని రకాల చెల్లింపులు, వసూళ్లను చేర్చడానికి BBPS పరిధిని మెరుగుపరచనున్నట్లు దాస్ వెల్లడించారు. అలాగే వ్యక్తిగత వినియోగదారులతో పాటు విక్రేతలు కూడా దీన్ని ఉపయోగించుకునేలా మారుస్తున్నట్లు పేర్కొన్నారు.
UPIలో ‘సింగిల్-బ్లాక్-అండ్-మల్టిపుల్ డెబిట్’ ఫంక్షనాలిటీని ప్రవేశపెట్టాలని RBI నిర్ణయించింది. దీంతో వినియోగదారులు ఇకపై తమ ఖాతాల్లోని నిధులను ఒక ప్రత్యేకమైన అవసరం కోసం వేరుచేసి బ్లాక్ చేసి ఉంచగలుగుతారు. ఇది సెక్యూరిటీలలో పెట్టుబడులు, ఆన్లైన్ షాపింగ్, హోటల్ బుకింగ్లకు సంబంధించిన చెల్లింపులను మరింత సులభతరం చేస్తుంది. ప్రస్తుతం, యూపీఐ కస్టమర్లు మ్యూచువల్ ఫండ్ సిప్, నెట్ఫ్లిక్స్, డిస్నీ+ హాట్స్టార్ మొదలైన ఓటీటీలు, మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్లు, డీటీహెచ్ మొదలైన వాటి చెల్లింపులు చేస్తున్నారు. ఇది యూపీఐ ఆటోపే సౌకర్యం ద్వారా సాధ్యపడుతోంది. ‘వర్చువల్ పేమెంట్ అడ్రస్’, QR కోడ్ ద్వారా ఇ-కామర్స్ చెల్లింపులు చేయడానికీ యూపీఐ ఉపయోగపడుతోంది.
నెలనెలా లేదా ఒక నిర్దిష్ట కాలపరిమితితో కూడిన పునరావృత చెల్లింపులు లేదా ఒకేసారి చేసే చెల్లింపుల కోసం ప్రస్తుతం కస్టమర్ బ్యాంక్ ఖాతాలోని నిధులను బ్లాక్ చేసే వ్యవస్థ అందుబాటులో ఉంది. దీన్ని కస్టమర్ నుంచి అనుమతి పొంది విక్రేతలు చేస్తుంటారు. అయితే, ఆర్బీఐ తాజాగా ప్రతిపాదించిన కొత్త మార్పు వల్ల ఒక్కసారి పొందిన అనుమతితో విక్రేతలు పలుసార్లు నిధులను కట్ చేసుకునే వెసులుబాటు కలుగుతుంది. అయితే, నిధుల మొత్తంపై మాత్రం పరిమితి ఉంటుంది. ఉదాహరణకు మీరు హోటల్ని బుక్ చేసుకున్నారనుకుందాం. దానికి సంబంధించిన చెల్లింపును యూపీఐ ద్వారా చేశారు. గడువు ముగిసిన తర్వాత కూడా అక్కడే ఉంటే మరోసారి యూపీఐ యాప్ను తెరిచి చెల్లింపునకు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ, కొత్త ఫంక్షనాలిటీ అందుబాటులోకి వస్తే.. మీ గడువు ముగిసిన తర్వాత కూడా హోటల్లో ఉన్నట్లయితే ఆటోమేటిక్గా తర్వాతి చెల్లింపు జరిగిపోతుంది. అదే ఆన్లైన్ షాపింగ్ విషయానికి వస్తే.. కొంత మొత్తాన్ని మీరు ముందే ఈ-కామర్స్ వెబ్సైట్ ద్వారా బ్లాక్ చేసుకోవచ్చు. షాపింగ్ చేసిన ప్రతిసారి దాన్నుంచి డబ్బులు కట్ అవుతూ ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రైవేట్ పేమెంట్ వ్యాలెట్స్ తరహాలోనే యూపీఐలోనూ కొత్త ఆప్షన్ రాబోతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆరోగ్య బీమా మరింత భారం
పెరుగుతున్న ఆసుపత్రి ఖర్చులను తట్టుకునేందుకు ఆరోగ్య బీమా తప్పనిసరిగా మారింది. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఇటీవలి కాలంలో ఆరోగ్య బీమా పాలసీలకు సంబంధించి కొన్ని కీలక మార్పులు చేసింది. -
కేకేఆర్ చేతికి హెల్తియమ్ మెడ్టెక్
సర్జికల్ సూదుల ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న బెంగళూరు సంస్థ హెల్తియమ్ మెడ్టెక్లో మెజార్టీ వాటాను, అంతర్జాతీయ ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడుల సంస్థ కేకేఆర్ రూ.7,000 కోట్ల (840 మిలియన్ డాలర్ల)కు కొనుగోలు చేయనుందని తెలిసింది. -
సైబర్ దాడులు.. మనపై ఎక్కువే
అమెరికా, బ్రిటన్ తర్వాత అంతర్జాతీయంగా ‘ఫిషింగ్’ దాడులను అత్యధికంగా ఎదుర్కొంటున్నది మన దేశమే. భారత దేశంపై జరిగిన సైబర్ దాడుల్లో 33% టెక్నాలజీ రంగంపైనే కనిపించాయని స్కేలర్ అనే సైబర్ భద్రతా సంస్థ తన నివేదికలో పేర్కొంది. -
ప్రయాణ - పర్యాటకంలో 5.82 కోట్ల ఉద్యోగాలు!
దేశీయంగా పర్యాటకానికి గిరాకీ పెరుగుతున్న నేపథ్యంలో, ఆ రంగంతో పాటు ప్రయాణ రంగంలోనూ ఉపాధికి భారీ అవకాశాలు కలగనున్నాయి. -
ఎయిరిండియా క్యాబిన్ లగేజీ ఉచిత పరిమితి తగ్గింపు
దేశీయ మార్గాల్లో క్యాబిన్ లగేజీ ఉచిత పరిమితిని ఈనెల 2 నుంచి తగ్గించినట్లు ఎయిరిండియా తెలిపింది. తక్కువ ధర ఉండే ఎకానమీ తరగతి ప్రయాణికులు ఇకపై 15 కిలోలే ఉచితంగా క్యాబిన్ లగేజీగా తీసుకెళ్లొచ్చని వెల్లడించింది. -
కోటక్ బ్యాంక్ లాభం రూ.5,302 కోట్లు
ప్రైవేటు రంగ కోటక్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.5,302 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది. 2022-23 ఇదే కాల లాభంతో పోలిస్తే ఇది 25% అధికం. -
రెండేళ్లలో మళ్లీ చిన్న కార్ల హవా
దేశీయ విపణిలో చిన్న కార్ల విభాగం 2026 చివరికల్లా లేదా 2027 నాటికి పుంజుకునే అవకాశం ఉందని మారుతీ సుజుకీ ఇండియా అంచనా వేస్తోంది. -
రూ.15,000 కోట్ల రుణాల కోసం వొడాఫోన్ ఐడియా యత్నాలు!
ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంకులతో పాటు ప్రైవేటు రంగ బ్యాంకుల నుంచీ రూ.15,000 కోట్ల (1.8 బిలియన్ డాలర్ల) రుణాలు తీసుకునేందుకు వొడాఫోన్ ఐడియా చర్చలు సాగిస్తోందని సమాచారం. -
మన ఎగుమతులకు అంతర్జాతీయ అనిశ్చితులే బెంగ
అంతర్జాతీయంగా భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతుండటం వల్ల, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దేశీయ ఎగుమతులపై ప్రభావం పడే అవకాశం ఉందని ఎగుమతిదార్ల సంఘం ఫియో అంచనా వేస్తోంది. -
పేటీఎం సీఓఓ భవీశ్ గుప్తా రాజీనామా
పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ ప్రెసిడెంట్, చీఫ్ ఆపరేటింగ్ అధికారి (సీఓఓ) భవీశ్ గుప్తా రాజీనామా చేశారు. పేటీఎంలో రుణ వ్యాపారం, ఆన్లైన్, ఆఫ్లైన్ చెల్లింపులు, కాంప్లియెన్సెస్ తదితర విభాగాలను భవీశ్ నడిపించేవారు. -
సంక్షిప్త వార్తలు
డీమార్ట్ సూపర్మార్కెట్లను నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్మార్ట్స్, మార్చి త్రైమాసికంలో రూ.563 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.460 కోట్లతో పోలిస్తే, ఇది 22.39% అధికం. -
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు
layoffs: ప్రపంచవ్యాప్తంగా చిన్నా, పెద్దా తేడా లేకుండా పలు కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ఈ ఏడాది ఒక్క ఏప్రిల్ నెలలోనే 20 వేల మందిని సాగనంపాయి.