JFSL: అదానీ, కోల్ ఇండియాను దాటేసిన జియో ఫైనాన్షియల్!
JFSL Value: జియో ఫైనాన్షియల్ విలువను రూ.1.72 లక్షల కోట్లుగా లెక్కగట్టారు. దీంతో మార్కెట్ విలువ పరంగా 32వ అతిపెద్ద సంస్థగా అవతరించింది.
దిల్లీ: ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి వేరుపడిన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (JFSL) ఆరంభంలోనే అదరగొట్టింది. 21 బిలియన్ డాలర్ల (రూ.1.72 లక్షల కోట్లు) విలువతో దేశంలోనే 32వ అతి విలువైన సంస్థగా నిలిచింది. త్వరలో స్టాక్ ఎక్స్ఛేంజీల్లో నమోదు కానున్న ఈ కంపెనీ.. అప్పుడే మార్కెట్ విలువ పరంగా కొన్ని ప్రధాన కంపెనీల కంటే ముందు వరుసలో నిలిచింది.
ఆర్ఐఎల్ తన వ్యాపార ఆర్థిక సేవల విభాగమైన రిలయన్స్ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్స్ను (జియో ఫైనాన్షియల్ సర్వీసెస్)ను విభజించేందుకు ఇవాళ ప్రీ మార్కెట్ సెషన్ను నిర్వహించారు. ఇందులో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ విలువను నిర్ధారించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ క్రితం రోజు ముగింపు విలువ.. ప్రత్యేక సెషన్లో వచ్చిన విలువ మధ్య వ్యత్యాసాన్ని ఈ స్థిర విలువగా నిర్థారించారు. దీంతో జియో ఫైనాన్షియల్ షేరు విలువ రూ.261.85గా లెక్కగట్టారు. అంతకుముందు దీని విలువ రూ.160 నుంచి రూ.190 వరకు ఉండొచ్చని వివిధ బ్రోకరేజీ సంస్థలు అంచనా వేశాయి.
Infosys: ఇన్ఫీ లాభం 11 శాతం వృద్ధి.. భవిష్యత్ అంచనాల్లో కోత
కొత్తగా ఏర్పడిన జియో ఫైనాన్షియల్ మార్కెట్ విలువ రూ.1.72 లక్షల కోట్లుగా తేలింది. అదానీ గ్రూప్నకు చెందిన అదానీ పోర్ట్స్, అదానీ గ్రీన్ ఎనర్జీతో పాటు టాటా స్టీల్, కోల్ ఇండియా, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఐఓసీ, బజాజ్ ఆటో వంటి ప్రముఖ కంపెనీల కంటే దీని విలువే అధికం కావడం గమనార్హం. త్వరలో జేఎఫ్ఎస్ఎల్ షేర్లు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో అందుబాటులోకి రానుంది. అప్పటి వరకు ఈ షేరు విలువను రోజువారీ నిఫ్టీ సూచీ విలువ మదింపునకు పరిగణనలోకి తీసుకుంటారు. ఎక్స్ఛేంజీల్లో షేరు నమోదయ్యాక.. మూడు రోజుల పాటు నిఫ్టీ 50 సూచీలో 51వ కంపెనీ షేరుగా జియో ఫైనాన్షియల్ కొనసాగుతుంది.
రిలయన్స్ నుంచి విభజన అనంతరం ఐదో అతిపెద్ద ఫైనాన్షియర్గా జియో ఫైనాన్షియల్ అవతరించనుంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న పేటీఎం, బజాజ్ ఫైనాన్స్కు గట్టి పోటీ ఇవ్వనుంది. ఇప్పటికే రిలయన్స్కు దేశంలో విస్తృతమైన నెట్వర్క్ ఉంది. సుమారు 42 కోట్ల మంది జియో వినియోగదారులతో పాటు, 17 వేల రిలయన్స్ రిటైల్ స్టోర్లు జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ వృద్ధికి తోడ్పడనున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐసీఐసీఐ లాభం రూ.11,672 కోట్లు
ఐసీఐసీఐ బ్యాంక్ ఆర్థిక ఫలితాలకు తక్కువ కేటాయింపులు కలిసివచ్చాయి. దీంతో మార్చి త్రైమాసికంలో బ్యాంక్ ఏకీకృత నికర లాభం 18.5 శాతం వృద్ధి చెంది రూ.11,672 కోట్లకు చేరుకుంది. -
ఒకే పాలసీలోనే అన్ని ధీమాలు
అందరికీ బీమా పాలసీలను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఐఆర్డీఏఐ) ఒక ప్రామాణిక పాలసీ ‘బీమా విస్తార్’ను అందుబాటులోకి తీసుకురానుంది. -
హైదరాబాద్లో కార్యాలయాల అద్దె లావాదేవీలు పెరిగాయ్
కార్పొరేట్ల నుంచి గిరాకీ స్థిరంగా ఉండటంతో ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో కార్యాలయాల అద్దె లావాదేవీలు 13 శాతం వృద్ధితో 1.34 కోట్ల చదరపు అడుగులకు చేరిందని స్థిరాస్తి సేవలను అందించే వెస్టియన్ తెలిపింది. -
మ్యూచువల్ ఫండ్ కొత్త పథకాల్లోకి రూ.66,364 కోట్లు
గత ఆర్థిక సంవత్సరంలో మ్యూచువల్ ఫండ్ సంస్థలు(ఏఎంసీ) 185 కొత్త పథకాలను(ఎన్ఎఫ్ఓ-న్యూ ఫండ్ ఆఫర్) విడుదల చేశాయి. -
వైద్య ఉత్పత్తుల రంగంలో భారత్ కీలకం
వైద్య ఉత్పత్తుల రంగంలో భారతదేశానికి ఎంతో ముఖ్యమైన బాధ్యత ఉన్నట్లు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్ఎఫ్డీఏ) కమిషనర్ డాక్టర్ రాబర్ట్ కాలిఫ్ అన్నారు. -
ఆర్బీఎల్ బ్యాంక్ లాభంలో 30% వృద్ధి
జనవరి- మార్చి త్రైమాసికంలో ఆర్బీఎల్ బ్యాంక్ నికర లాభం 30 శాతం పెరిగి రూ.353 కోట్లకు చేరింది. -
యెస్ బ్యాంక్ లాభం రెట్టింపు
జనవరి- మార్చి త్రైమాసికంలో యెస్ బ్యాంక్ నికర లాభం స్టాండలోన్ పద్ధతిలో రూ.452 కోట్లుగా నమోదైంది. -
పూరీ విమానాశ్రయం ప్రాజెక్టు పోటీలో జీఎంఆర్, అదానీ గ్రూపు, ఫెయిర్ఫాక్స్?
ఒడిశా రాష్ట్రంలోని పూరీలో కొత్త విమానాశ్రయాన్ని నిర్మించి, నిర్వహించే అవకాశం కోసం జీఎంఆర్, అదానీ గ్రూపు, విదేశీ సంస్థ అయిన ఫెయిర్ఫాక్స్ పోటీ పడుతున్నాయి. -
భారత్లో షార్ప్ సెమీ కండక్టర్ల యూనిట్
జపాన్ ఎలక్ట్రానిక్ దిగ్గజం షార్ప్ దేశంలో సెమీకండక్టర్ ఫ్యాబ్ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. -
సంక్షిప్త వార్తలు
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సీకే బిర్లా గ్రూపు కంపెనీ, హెచ్ఐఎల్ లిమిటెడ్, పైపులు- ఫిట్టింగ్స్ వ్యాపారంలోకి విస్తరిస్తోంది. -
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
ఐటీ రంగంలో ఉద్యోగుల సంఖ్య నానాటికీ తగ్గుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో టాప్-5 ఐటీ సంస్థల్లోనే ఉద్యోగుల సంఖ్య 69 వేల వరకు తగ్గింది. -
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
Amazon: అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ వచ్చేసింది. మే 2 నుంచి ఈ సేల్ ప్రారంభం కానుందని ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈ సెల్యూట్ ఆయన కోసమే.. తొలి హాఫ్ సెంచరీ అంకితం: ధ్రువ్ జురెల్
-
నా ముఖం కాదు.. మార్కులు చూడండి: ట్రోలర్లకు యూపీ టాపర్ దీటైన జవాబు
-
ఆర్చరీ వరల్డ్ కప్లో భారత్ అద్భుతం.. ఒలింపిక్ ఛాంపియన్ను ఓడించి స్వర్ణం కైవసం
-
అర్ధరాత్రి వైకాపా ఎమ్మెల్యే సోదరుడి హల్చల్.. తెదేపా సానుభూతిపరులపై దాడి
-
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు.. బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ అరెస్ట్
-
ఆదుకుంటానన్నావ్.. పీల్చి పిప్పి చేశావ్!!