Satya Nadella: గూగుల్ విధానాలే.. ప్రత్యర్థుల ఎదుగుదలకు అడ్డు: సత్య నాదెళ్ల
Satya Nadella: సెర్చింజన్ వ్యాపారంలో గూగుల్ గుత్తాధిపత్యం చలాయిస్తోందని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల అన్నారు. అయితే, గూగుల్ అనుసరిస్తున్న విధానాల వల్ల ప్రత్యర్థి సంస్థలు ఎదగడం లేదని ఆరోపించారు.
వాషింగ్టన్: సెర్చింజన్ మార్కెట్లో గూగుల్ ఆధిపత్యం వల్ల ప్రత్యర్థి సంస్థలు ఎదగడం చాలా కష్టంగా మారిందని మైక్రోసాఫ్ట్ (Microsoft) సీఈఓ సత్య నాదెళ్ల (Satya Nadella) ఆరోపించారు. ఈ క్రమంలో గూగుల్ (Google) అనుసరిస్తున్న వ్యాపార పద్ధతులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. యూఎస్లోని ఓ కోర్టులో మాట్లాడుతూ ఆయన (Satya Nadella) సోమవారం ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా ప్రభుత్వం, గూగుల్ (Google) మధ్య జరుగుతున్న యాంటిట్రస్ట్ విచారణలో ఆయన తన వాదన వినిపించారు.
గూగుల్ (Google) తన గుత్తాధిపత్యాన్ని నిలబెట్టుకోవడం కోసం యాపిల్ వంటి సంస్థలకు బిలియన్ల డాలర్లు చెల్లించినట్లు అమెరికా న్యాయ విభాగానికి చెందిన న్యాయవాదులు ఈ కేసులో వాదనలు వినిపించారు. ఈ కేసులోనే నాదెళ్ల (Satya Nadella) సైతం తమ సంస్థ వాదనలను కోర్టు ముందుంచారు. గూగుల్ (Google)కు పోటీగా మైక్రోసాఫ్ట్ బింగ్ అనే సెర్చింజన్ను తీసుకొచ్చింది. 2009 నుంచి మార్కెట్ వాటాను పెంచుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తోంది. అయితే, యాపిల్తో గూగుల్ (Google) చేసుకున్న ఒప్పందాల వల్ల తమ బింగ్ పోటీ పడలేకపోతోందని నాదెళ్ల అన్నారు. గూగుల్ (Google) దీన్ని ‘ఆదరణ’గా చెబుతున్నప్పటికీ.. తాము మాత్రం ‘ఆధిపత్యం’గానే భావిస్తామని వ్యాఖ్యానించారు.
మెగా సేల్స్కు రెడీనా..? అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి..
ప్రపంచంలోని తొలి ప్రముఖ సెర్చ్ ఇంజన్గా గూగుల్ (Google) భారీ ఎత్తున డేటా సేకరించిందని అమెరికా ప్రభుత్వం వాదించింది. అలాగే తొలి కంపెనీగా నెట్వర్క్ను భారీగా విస్తరించిందని తెలిపింది. ఇదే ఆ కంపెనీకి వాణిజ్య ప్రకటనలు, వినియోగదారులను అందించే శక్తిమంతమైన సాధనంగా ఉపయోగపడిందని పేర్కొంది. ఈ వాదనకు నాదెళ్ల సైతం మద్దతు పలికారు. కనీస మార్కెట్ వాటా లేకుండా గూగుల్ (Google) ఆధిపత్యాన్ని కొల్లగొట్టడం అంత సులభం కాదని అన్నారు.
‘డిఫాల్ట్’పైనే అంతా ఆధారపడి ఉంటుంది..
ఒక సెర్చింజన్ విజయం దాని పంపిణీ పైనే ఆధారపడి ఉంటుందని నాదెళ్ల తెలిపారు. ఈ నేపథ్యంలో యాపిల్కు భారీ ఎత్తున చెల్లించడానికి తాము సిద్ధమయ్యాయని వెల్లడించారు. సెర్చింజన్ను ‘డిఫాల్ట్’ (ఇన్బిల్ట్)గా ఇవ్వడంపైనే అంతా ఆధారపడి ఉంటుందని వివరించారు. యూజర్లు సులువుగా తమకు నచ్చిన యాప్నకు బదిలీ అవుతారని గూగుల్ చేస్తున్న వాదనలో నిజం లేదని పేర్కొన్నారు. ‘సఫారీ’ బ్రౌజర్లో డిఫాల్ట్గా ఉంటే బింగ్ రూపురేఖలే మారిపోతాయని తెలిపారు. కానీ, గూగుల్ (Google)తో జట్టుకట్టిన యాపిల్ ఏటా బిలియన్ల డాలర్ల ఆదాయాన్ని పొందుతోందన్నారు. ఈ కారణంగానే బింగ్ వెనుకబడిపోయిందన్నారు.
ఈ వ్యాపార నమూనా పునర్వ్యవస్థీకరణ కోసం ప్రభుత్వం జోక్యం చేసుకోవడమో లేక భారీ మార్పు వస్తుందనే ఆశతో బింగ్పై భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతున్నట్లు నాదెళ్ల (Satya Nadella)తెలిపారు. ఏఐ చాట్బాట్ చాట్జీపీటీపై తొలినాళ్లలో కొంత వరకు ఆసక్తి కనిపిస్తున్నప్పటికీ.. గూగుల్ ఆధిపత్యాన్ని మార్చడంలో ఇది పెద్దగా ప్రభావం చూపకపోవచ్చునని అభిప్రాయపడ్డారు. బింగ్కు సైతం ఏఐ సాంకేతికతను జోడిస్తూ మైక్రోసాఫ్ట్ కొన్ని మార్పులు చేసిన విషయం తెలిసిందే. అది గూగుల్ గుత్తాధిపత్యాన్ని తగ్గిస్తుందని ఆశించారు. కానీ, గూగుల్ కూడా ఆ దిశగా ఏఐ టూల్స్ను ప్రవేశపెట్టడం వేగవంతం చేసింది. దీంతో భవిష్యత్తులో చివరకు ఏఐలోనూ ఇరు కంపెనీల మధ్య ఒక విష వలయం ఏర్పడే అవకాశం ఉందని నాదెళ్ల ఆందోళన వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
3 ఏళ్లలో రూ.3,000 కోట్లు.. అపోలో హాస్పిటల్స్ పెట్టుబడులు!
వచ్చే మూడేళ్లలో రూ.3,000 కోట్ల పెట్టుబడులకు అపోలో హాస్పిటల్స్ సన్నాహాలు చేస్తోంది. అమెరికాకు చెందిన దిగ్గజ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అడ్వెంట్ ఇంటర్నేషనల్తో ఒప్పందం ఫలితంగా, వస్తున్న నిధులకు మరికొంత జతచేసి, సంస్థ విస్తరణ కార్యకలాపాలపై పెట్టుబడి పెట్టాలని అపోలో నిర్ణయించింది. -
కార్పొరేట్ ఫలితాలు.. అమెరికా వడ్డీరేట్లే కీలకం
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం రాణించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈవారంలో వెలువడే పెద్ద కంపెనీల ఆర్థిక ఫలితాలకు తోడు, వడ్డీరేట్లపై బుధవారం వెల్లడయ్యే అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు మార్కెట్కు దిశానిర్దేశం చేయొచ్చంటున్నారు. -
అదానీకనెక్స్ రూ.11,520 కోట్ల రుణ సమీకరణ
అదానీ ఎంటర్ప్రైజెస్, ఎడ్జ్కనెక్స్ సంయుక్తంగా డేటా కేంద్రాల కోసం నెలకొల్పిన సంస్థ అదానీకనెక్స్ 1.44 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.11,520 కోట్ల) వరకు రుణం సమీకరించినట్లు ప్రకటించింది. -
బ్యాంకుల రుణవృద్ధి అంతంతే!
దేశంలో ఆర్థిక వృద్ధి బలంగా ఉన్నందున బ్యాంకుల లాభదాయకత, ఆస్తుల నాణ్యత ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ పటిష్ఠంగా ఉంటుందని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ అంచనా వేసింది. -
చైనాలో ఎలాన్ మస్క్
అమెరికా విద్యుత్తు కార్ల తయారీ సంస్థ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ హఠాత్తుగా చైనాలో పర్యటిస్తున్నారు. -
వెండిపై ఆచితూచి!
పసిడి జూన్ కాంట్రాక్టు ఈవారం సానుకూల ధోరణిలో చలిస్తే రూ.72,462 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. ఈ స్థాయిని అధిగమిస్తే రూ.72,944; రూ.73,425 వరకు రాణించే అవకాశం ఉంటుంది. -
74500 ఎగువన కొత్త గరిష్ఠాలకు!
సానుకూల అంతర్జాతీయ సంకేతాల మద్దతుతో గత వారం దేశీయ సూచీలు లాభపడ్డాయి. బాండ్ రాబడులు పెరగడం, భౌగోళిక ఉద్రిక్తతలు, చమురు ధరలు ప్రభావం చూపాయి. -
సంక్షిప్త వార్తలు
స్టాక్ మార్కెట్లు, బీమా కంపెనీలు, ఆన్లైన్ చెల్లింపు గేట్వే ఇంటర్మీడియర్లు, క్రిప్టో కరెన్సీ సేవల ప్రొవైడర్లకు భారత ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్ఐయూ) తాజా హెచ్చరికలు జారీ చేసింది. -
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!
SBI Credit Card: ఎస్బీఐ కార్డు విమాన ప్రయాణికుల కోసం మూడు ప్రత్యేక క్రెడిట్ కార్డులను తీసుకొచ్చింది. వాటిలోని ప్రయోజనాలు, ఫీజుల వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం..!
తాజా వార్తలు (Latest News)
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
-
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
-
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!