Stock Market: కొనసాగుతున్న లాభాల జైత్రయాత్ర.. 18,850 ఎగువన నిఫ్టీ!
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా ఎనిమిదో రోజూ లాభాల్లో దూసుకెళ్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూలం సంకేతాలు అందుకు దోహదం చేస్తున్నాయి.
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీల్లో లాభాల జైత్రయాత్ర కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లలోని ర్యాలీ అందుకు దోహదం చేస్తోంది. అమెరికాలో వడ్డీరేట్ల పెంపులో వేగాన్ని తగ్గించనున్నట్లు ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ బుధవారం ప్రకటించారు. దీంతో అక్కడి సూచీలు ఏప్రిల్ తర్వాత తొలిసారి ‘200 డే మూవింగ్ యావరేజ్’ ఎగువన ట్రేడింగ్ను ముగించాయి. ఆసియా- పసిఫిక్ సూచీల్లోనూ ర్యాలీ కొనసాగుతోంది. మరోవైపు సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో అంచనాలకు అనుగుణంగా భారత జీడీపీ 6.3 శాతంగా నమోదైంది. విదేశీ మదుపర్లు బుధవారం ఏకంగా రూ.9,000 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. ఇవన్నీ సూచీల పరుగుకు కారణమవుతున్నాయి.
ఈ పరిణామాల మధ్య ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్ 409 పాయింట్ల లాభంతో 63,509 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 110 పాయింట్లు ఎగబాకి 18,869 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 81.02 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, విప్రో, హెచ్సీఎల్ టెక్, టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎల్అండ్టీ, టాటా స్టీల్, హెచ్డీఎఫ్సీ లాభాల్లో కొనసాగుతున్నాయి. ఏషియన్ పెయింట్స్, హెచ్యూఎల్, పవర్గ్రిడ్, ఎంఅండ్ఎం, ఏషియన్ పెయింట్స్, మారుతీ, ఐటీసీ, ఎన్టీపీసీ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.
గమనించాల్సిన స్టాక్స్...
ఆల్స్టోమ్ ఇండియా, టిటాగఢ్ వ్యాగన్స్, సీమెన్స్: 200 లైట్వెయిట్ వందే భారత్ రైళ్ల తయారీ కోసం భారతీయ రైల్వే బిడ్లను ఆహ్వానించింది. రూ.26,000 కోట్లు విలువ చేసే ఈ ఆర్డర్ కోసం బిడ్లు దాఖలు చేసిన ఐదు కంపెనీల్లో ఆల్స్టోమ్ ఇండియా, టిటాగఢ్ వ్యాగన్స్, సీమెన్స్ ఉన్నాయి.
టీసీఎస్: యూకేకు చెందిన ‘రైల్ డేటా మార్కెట్ప్లేస్’ రూపకల్పన, అభివృద్ధి, అమలు, నిర్వహణకు సంబంధించిన కాంట్రాక్టును ‘రైల్ డెలివరీ గ్రూప్’ నుంచి సొంతం చేసుకున్న టీసీఎస్ తెలిపింది.
అపోలో హాస్పిటల్స్: రూ.105 కోట్లు విలువ చేసే ‘నాన్-కన్వర్టబుల్ డిబెంచర్స్’ జారీకి బుధవారం అపోలో హాస్పిటల్స్ బోర్డు ఆమోదం తెలిపింది.
మనాలీ పెట్రోకెమికల్స్: యూకే కేంద్రంగా పనిచేస్తున్న పెన్ గ్లోబ్ను మనాలీ పెట్రోకెమికల్స్ సొంతం చేసుకుంది. ఫోమ్ కంట్రోల్ ఏజెంట్స్, ల్యూబ్రికెంట్స్, సర్ఫేస్ కోటింగ్స్, రిలీజ్ ఏజెంట్స్, సిలికోన్ ఎమల్షన్స్ తయారీలో పెన్ గ్లోబ్ మార్కెట్ లీడర్గా కొనసాగుతోంది.
కేపీఐ గ్రీన్ ఎనర్జీ: 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్ల జారీకి కేపీఐ గ్రీన్ ఎనర్జీ బోర్డు బుధవారం జరిగిన సమావేశంలో సిఫార్సు చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోరమాండల్ ఇంటర్నేషనల్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్
ఎరువులు, రసాయనాలు, సస్య రక్షణ మందుల కంపెనీ, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్కు నూతన ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్ నియమితులయ్యారు. -
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల కోసం డాక్టర్ రెడ్డీస్, నెస్లే సంయుక్త సంస్థ
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల విక్రయాలను దేశీయ మార్కెట్లో గణనీయంగా పెంచుకునే లక్ష్యంతో నెస్లే ఇండియా, డాక్టర్ రెడ్డీస్ చేతులు కలిపాయి. -
వ్యవసాయ రుణాలు మరింత వేగంగా
వ్యవసాయ రుణాల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విభాగమైన ఆర్బీఐహెచ్తో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్) భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
2023-24లో 1.03 లక్షల పేటెంట్లు మంజూరు
2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ 1.03 లక్షల పేటెంట్లను మంజూరు చేసినట్లు కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్ అండ్ ట్రేడ్మార్క్స్ ఉన్నత్ పండిట్ గురువారం వెల్లడించారు. -
బజాజ్ ఫైనాన్స్ లాభం రూ.3,825 కోట్లు
బజాజ్ ఫైనాన్స్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.3,825 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.3,158 కోట్లతో పోలిస్తే ఇది 21% అధికం. -
బీజింగ్ ఆటోషో జిగేల్
చైనాలో అతిపెద్ద వాహన ప్రదర్శన ‘బీజింగ్ ఆటో షో’ గురువారం ప్రారంభమైంది. ఇందులో మొత్తం 117 కొత్త మోడళ్లు ప్రదర్శించనున్నారు. -
ఇండస్ఇండ్ బ్యాంక్ డివిడెండ్ 165%
ఇండస్ఇండ్ బ్యాంక్, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.2,349 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
మదుపర్ల సంపద రూ.404 లక్షల కోట్లకు
కొనుగోళ్ల జోరుతో వరుసగా అయిదో రోజూ సూచీలు మెరిశాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, లోహ షేర్లు రాణించడంతో సెన్సెక్స్ మళ్లీ 74,000 పాయింట్ల ఎగువకు చేరింది. నిఫ్టీ 22,500 స్థాయిని అందుకుంది. -
ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు రూ.700 కోట్లు: దివీస్
దివీస్ లేబొరేటరీస్ రూ.700 కోట్లతో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోనుంది. దీర్ఘకాలిక మందుల సరఫరా నిమ్తితం ఒక ఔషధ కంపెనీతో కాంట్రాక్టు కుదుర్చుకోనున్నట్లు, దీనికి అవసరమైన అదనపు ఉత్పత్తి సామర్ధ్యం కోసం రూ.700 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని దివీస్ లేబొరేటరీస్ గురువారం వెల్లడించింది. -
సంక్షిప్తవార్తలు(6)
హైదరాబాద్కు ‘ఇంటర్కాంటినెంటల్’ హోటల్ను పరిచయం చేయడం కోసం ఐహెచ్జీ హోటల్స్ అండ్ రిసార్ట్స్తో బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ జట్టుకట్టింది. -
ఆరోగ్య బీమా అందరికీ అందేలా...
అందరికీ బీమా పాలసీలను అందించాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. -
మ్యూచువల్ ఫండ్లు..కేవైసీని పూర్తి చేశారా?
ఆర్థిక లక్ష్యాలను సాధించే క్రమంలో పెట్టుబడులు ఎంతో కీలకం. దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకూ ఇవి అవసరం. చాలామంది మ్యూచువల్ ఫండ్లను ఇందుకు సరైన మార్గంగా నమ్ముతున్నారు. -
పన్ను విధానం ఎంచుకుందామిలా...
ITR: గత ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు తరుణం వచ్చేసింది. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు కొత్త, పాత పన్ను విధానంలో దేన్ని ఎంచుకోవాలన్న సందేహంలో ఉన్నారు. -
క్రెడిట్ స్కోరు పెరగాలంటే
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఒక వ్యక్తికి రుణాన్ని ఇచ్చేటప్పుడు ముఖ్యంగా పరిశీలించేది క్రెడిట్ స్కోరు. రుణగ్రహీత చరిత్ర, అతని అర్హతను తెలుసుకునేందుకూ ఇది ఉపయోగపడుతుంది. -
అప్పు చేసి.. పెట్టుబడి వద్దు
రెండేళ్ల క్రితం వాహన రుణం తీసుకున్నాను. దీనిపై ఇప్పుడు రూ.4 లక్షల వరకూ టాపప్ రుణం ఇస్తామని బ్యాంకు చెబుతోంది. -
ఉత్పత్తి రంగంలో మదుపు
దేశీయ వినియోగం, ఎగుమతులు పెరుగుతున్న నేపథ్యంలో మన దేశంలో ఉత్పత్తి రంగం గతంలో ఎన్నడూ లేనంత అధిక వృద్ధిని నమోదు చేయబోతోంది. -
ప్రయాణంలో తోడుగా..
ప్రయాణాలు చేసే వారికి ఉపయోగపడేలా ఎస్బీఐ కార్డ్ కొత్త క్రెడిట్ కార్డును తీసుకొచ్చింది. ఎస్బీఐ కార్డ్ మైల్స్ ఎలైట్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ ప్రైమ్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ పేర్లతో మూడు రకాలుగా అందిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
-
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్.. వైకాపాకు సీఎం రమేశ్ హెచ్చరిక
-
రారండోయ్.. ఓటేయడానికి ఆంధ్రాకు
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
-
ఓ అన్న మాట్లాడాల్సిన మాటలేనా?.. షర్మిల చీరపై జగన్ అభ్యంతరకర వ్యాఖ్యలు
-
కూకట్పల్లిలో హత్యాచారం కేసు.. 45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ