SpiceJet: స్పైస్జెట్లో 15 శాతం ఉద్యోగుల తొలగింపు?
SpiceJet: స్పైస్జెట్లో ప్రస్తుతం 9,000 మంది పనిచేస్తున్నారు. వీరిలో దాదాపు 15 శాతం మందిని తీసివేసే యోచనలో కంపెనీ ఉన్నట్లు సమాచారం.
SpiceJet | దిల్లీ: ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన దేశీయ విమానయాన సంస్థ స్పైస్జెట్ (SpiceJet) ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమైంది. దాదాపు 1,350 మందిని తీసివేయనున్నట్లు సమాచారం. కంపెనీలో పనిచేస్తున్న సిబ్బందిలో ఇది 15 శాతానికి సమానం. వ్యయ నియంత్రణలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. సిబ్బంది వేతనాలు భారంగా మారాయని.. గతకొన్ని నెలలుగా వాటి చెల్లింపుల్లోనూ ఆలస్యమవుతోందని సమాచారం. జనవరి నెల వేతనం ఇప్పటికీ కొంతమందికి అందలేదని తెలుస్తోంది. ఉద్యోగుల తొలగింపుపై కంపెనీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
స్పైస్జెట్లో (SpiceJet) ప్రస్తుతం 9,000 మంది పనిచేస్తున్నారు. వీరిలో దాదాపు 10-15 శాతం మందిని తొలగించే యోచనలో కంపెనీ ఉన్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఓ అధికారి వెల్లడించారు. దీనిపై ఈవారం జరగబోయే సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. ప్రస్తుతం సర్వీసులో ఉన్న విమానాలతో పోలిస్తే సిబ్బంది సంఖ్య అదనంగా ఉందని చెప్పారు. వీరిని తొలగించటం వల్ల సంస్థకు ఏటా రూ.100 కోట్ల వరకు ఆదా అవుతుందని అంచనా.
ఉద్యోగుల తొలగింపుల నిమిత్తం ఇప్పటికే ఆయా విభాగాలకు సమాచారం అందించిన స్పైస్జెట్ వారి వివరాలు తెప్పించుకుందని మరో అధికారి వెల్లడించారు. ‘రీజినల్ కనెక్టివిటీ స్కీమ్ (RCS)’ కింద ఉన్న కొన్ని మార్గాల్లో కంపెనీ సేవలను నిలిపివేసిందని.. అక్కడ ఉన్న సిబ్బందిని బదిలీ చేయటం సాధ్యం కావటం లేదని తెలిపారు. ప్రస్తుతం స్పైస్జెట్ (SpiceJet) 40 విమానాలను నడుపుతోంది. వీటిలో పదింటిని లీజు కింద తీసుకుంది. నిధులను పొదుపుగా వాడుకోవాలని.. ఖర్చులను తానే స్వయంగా పర్యవేక్షిస్తానని సంస్థ ఛైర్మన్, ఎండీ అజయ్సింగ్ గతనెల సీనియర్ అధికారులతో జరిపిన సమావేశంలో నొక్కి చెప్పారు.
ఆర్థిక కష్టాలు, న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటున్న స్పైస్జెట్ (SpiceJet) నిధుల సమీకరణ పనిలో పడింది. ప్రిఫరెన్షియల్ బేసిస్ కింద సెక్యూరిటీలను జారీ చేసి రూ.2,250 కోట్లు సమీకరించనున్నట్లు గతంలో తెలిపింది. అందులో భాగంగా జనవరి 26న రూ.744 కోట్లు అందుకున్నట్లు వెల్లడించింది. మిగిలిన వాటి సమీకరణలో ఆలస్యమవుతున్నట్లు సమాచారం. ప్రభుత్వ అత్యవసర క్రెడిట్లైన్ గ్యారంటీ స్కీమ్ కింద రూ.1,000 కోట్లు అందుకుంది. అజయ్ సింగ్ స్వయంగా మరో రూ.500 కోట్లు చొప్పిస్తామని ప్రకటించారు. మరోవైపు ఈ కంపెనీకి విమానాలను లీజుకిచ్చినవారు తమ బకాయిలను చెల్లించటం లేదంటూ ఇటీవల కోర్టును ఆశ్రయించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
3 ఏళ్లలో రూ.3,000 కోట్లు.. అపోలో హాస్పిటల్స్ పెట్టుబడులు!
వచ్చే మూడేళ్లలో రూ.3,000 కోట్ల పెట్టుబడులకు అపోలో హాస్పిటల్స్ సన్నాహాలు చేస్తోంది. అమెరికాకు చెందిన దిగ్గజ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అడ్వెంట్ ఇంటర్నేషనల్తో ఒప్పందం ఫలితంగా, వస్తున్న నిధులకు మరికొంత జతచేసి, సంస్థ విస్తరణ కార్యకలాపాలపై పెట్టుబడి పెట్టాలని అపోలో నిర్ణయించింది. -
కార్పొరేట్ ఫలితాలు.. అమెరికా వడ్డీరేట్లే కీలకం
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం రాణించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈవారంలో వెలువడే పెద్ద కంపెనీల ఆర్థిక ఫలితాలకు తోడు, వడ్డీరేట్లపై బుధవారం వెల్లడయ్యే అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు మార్కెట్కు దిశానిర్దేశం చేయొచ్చంటున్నారు. -
అదానీకనెక్స్ రూ.11,520 కోట్ల రుణ సమీకరణ
అదానీ ఎంటర్ప్రైజెస్, ఎడ్జ్కనెక్స్ సంయుక్తంగా డేటా కేంద్రాల కోసం నెలకొల్పిన సంస్థ అదానీకనెక్స్ 1.44 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.11,520 కోట్ల) వరకు రుణం సమీకరించినట్లు ప్రకటించింది. -
బ్యాంకుల రుణవృద్ధి అంతంతే!
దేశంలో ఆర్థిక వృద్ధి బలంగా ఉన్నందున బ్యాంకుల లాభదాయకత, ఆస్తుల నాణ్యత ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ పటిష్ఠంగా ఉంటుందని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ అంచనా వేసింది. -
చైనాలో ఎలాన్ మస్క్
అమెరికా విద్యుత్తు కార్ల తయారీ సంస్థ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ హఠాత్తుగా చైనాలో పర్యటిస్తున్నారు. -
వెండిపై ఆచితూచి!
పసిడి జూన్ కాంట్రాక్టు ఈవారం సానుకూల ధోరణిలో చలిస్తే రూ.72,462 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. ఈ స్థాయిని అధిగమిస్తే రూ.72,944; రూ.73,425 వరకు రాణించే అవకాశం ఉంటుంది. -
74500 ఎగువన కొత్త గరిష్ఠాలకు!
సానుకూల అంతర్జాతీయ సంకేతాల మద్దతుతో గత వారం దేశీయ సూచీలు లాభపడ్డాయి. బాండ్ రాబడులు పెరగడం, భౌగోళిక ఉద్రిక్తతలు, చమురు ధరలు ప్రభావం చూపాయి. -
సంక్షిప్త వార్తలు
స్టాక్ మార్కెట్లు, బీమా కంపెనీలు, ఆన్లైన్ చెల్లింపు గేట్వే ఇంటర్మీడియర్లు, క్రిప్టో కరెన్సీ సేవల ప్రొవైడర్లకు భారత ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్ఐయూ) తాజా హెచ్చరికలు జారీ చేసింది. -
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!
SBI Credit Card: ఎస్బీఐ కార్డు విమాన ప్రయాణికుల కోసం మూడు ప్రత్యేక క్రెడిట్ కార్డులను తీసుకొచ్చింది. వాటిలోని ప్రయోజనాలు, ఫీజుల వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం..!
తాజా వార్తలు (Latest News)
-
తాత, నానమ్మల పెళ్లంట.. మనవలే పెద్దలంట!
-
అరగంట కరెంట్ కట్.. కీసర డీఈపై సస్పెన్షన్ వేటు
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!