TATA Sons IPO: అదే జరిగితే.. భారత్లో అతిపెద్ద ఐపీఓ టాటా గ్రూప్ నుంచే!
TATA Sons: టాటా సన్స్ను ఆర్బీఐ సెప్టెంబర్ 14న ‘అప్పర్ లేయర్ ఎన్బీఎఫ్సీగా’ వర్గీకరించింది. నిబంధనల ప్రకారం ఈ కేటగిరీలో చేరిన కంపెనీలు మూడేళ్లలో స్టాక్ మార్కెట్లలో లిస్ట్ కావాల్సి ఉంటుంది.
TATA Sons IPO | ఇంటర్నెట్ డెస్క్: టాటా గ్రూప్ మాతృసంస్థ టాటా సన్స్ త్వరలో ఐపీఓ (TATA Sons IPO)కి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ అదే జరిగితే.. ఇప్పటి వరకు భారత్లో ఇదే అతిపెద్ద ఐపీఓ అవ్వొచ్చని అంచనా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవల టాటా సన్స్ను ‘అప్పర్ లేయర్ నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ’గా వర్గీకరించింది. నిబంధనల ప్రకారం.. ఈ కేటగిరీలోకి వచ్చిన కంపెనీ.. మూడేళ్లలో స్టాక్ మార్కెట్లలో లిస్ట్ కావాల్సి ఉంటుంది.
టాటా సన్స్ను ఆర్బీఐ సెప్టెంబర్ 14న ‘అప్పర్ లేయర్ ఎన్బీఎఫ్సీగా’ వర్గీకరించింది. నిబంధనల ప్రకారం మూడేళ్లలో అంటే 2025 సెప్టెంబర్ 14 నాటికి ఈ కంపెనీ ఐపీఓ (TATA Sons IPO) ప్రక్రియ పూర్తి చేసుకొని స్టాక్ మార్కెట్లో లిస్ట్ కావాలి. మరో టాటా గ్రూప్ కంపెనీ టాటా క్యాపిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా అప్పర్ లేయర్ ఎన్బీఎఫ్సీగా వర్గీకరణ పొందింది. కానీ, ఇది టాటా సన్స్లో విలీనం కానున్న నేపథ్యంలో ప్రత్యేకంగా ఐపీఓకి రావాల్సిన అవసరం ఉండదని నిపుణులు అంటున్నారు. ఈ కేటగిరీలో చేరిన కంపెనీలపై నియంత్రణా చర్యలు పటిష్ఠంగా ఉంటాయి.
టాటా సన్స్ ప్రస్తుత విలువ రూ.11 లక్షల కోట్లని అంచనా! ఒకవేళ దీంట్లో ఐదు శాతం వాటాలను విక్రయించాలనుకుంటే.. అప్పుడు ఐపీఓ పరిమాణం రూ.55,000 కోట్లు అవుతుంది. ఇదే జరిగితే భారత్లో ఇప్పటి వరకు ఇదే అతిపెద్ద ఐపీఓగా నిలుస్తుంది. ప్రస్తుతానికి రూ.21,000 కోట్లు సమీకరించిన ఎల్ఐసీ ఐపీఓనే అతిపెద్దది.
మరో మార్గమూ ఉంది..
అయితే, ఐపీఓకి రావడం కాకుండా టాటా సన్స్కు మరో మార్గం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. ఐపీఓకి రావొద్దనుకుంటే కంపెనీని పునర్వ్యవస్థీకరించడం వల్ల ఆర్బీఐ నిబంధనల నుంచి మినహాయింపు పొందే వెసులుబాటు ఉంటుందని తెలిపారు. అయితే, టాటా సన్స్ విషయంలో అలా జరగకపోవచ్చునని విశ్లేషిస్తున్నారు. మార్కెట్లోని పరిస్థితులు, ఆయా రంగాల పనితీరును చూసుకొని టాటా సన్స్ పబ్లిక్ ఇష్యూ (TATA Sons IPO)కి వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంచనా వేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!
SBI Credit Card: ఎస్బీఐ కార్డు విమాన ప్రయాణికుల కోసం మూడు ప్రత్యేక క్రెడిట్ కార్డులను తీసుకొచ్చింది. వాటిలోని ప్రయోజనాలు, ఫీజుల వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం..! -
చైనాలో ఎలాన్ మస్క్ ఆకస్మిక పర్యటన!
Elon Musk: దాదాపు వారం క్రితం ఎలాన్ మస్క్ భారత పర్యటనను రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఆకస్మికంగా చైనాలో పర్యటిస్తున్నట్లు సంబంధిత వ్యక్తులు తెలిపారు. -
రూ.49కే బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ సబ్స్క్రిప్షన్
BSNL Cinemaplus: బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ పేరిట ఓటీటీ ప్యాకేజీలను అందిస్తోంది. దీంట్లో మొత్తం మూడు ప్యాక్లు ఉన్నాయి. తాజాగా స్టార్టర్ ప్యాక్ ధరను సంస్థ కుదించింది. -
వేసవిలో ఫోన్ ఛార్జింగ్ వేగం తగ్గుతుంది..? ఎందుకు?
వేసవిలో స్మార్ట్ఫోన్ ఛార్జింగ్లో వేగం మందగిస్తుంది. దీనికి కారణమేంటి? ఎందుకు వేగం తగ్గుతుంది? -
ఐసీఐసీఐ లాభం రూ.11,672 కోట్లు
ఐసీఐసీఐ బ్యాంక్ ఆర్థిక ఫలితాలకు తక్కువ కేటాయింపులు కలిసివచ్చాయి. దీంతో మార్చి త్రైమాసికంలో బ్యాంక్ ఏకీకృత నికర లాభం 18.5 శాతం వృద్ధి చెంది రూ.11,672 కోట్లకు చేరుకుంది. -
ఒకే పాలసీలోనే అన్ని ధీమాలు
అందరికీ బీమా పాలసీలను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఐఆర్డీఏఐ) ఒక ప్రామాణిక పాలసీ ‘బీమా విస్తార్’ను అందుబాటులోకి తీసుకురానుంది. -
హైదరాబాద్లో కార్యాలయాల అద్దె లావాదేవీలు పెరిగాయ్
కార్పొరేట్ల నుంచి గిరాకీ స్థిరంగా ఉండటంతో ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో కార్యాలయాల అద్దె లావాదేవీలు 13 శాతం వృద్ధితో 1.34 కోట్ల చదరపు అడుగులకు చేరిందని స్థిరాస్తి సేవలను అందించే వెస్టియన్ తెలిపింది. -
మ్యూచువల్ ఫండ్ కొత్త పథకాల్లోకి రూ.66,364 కోట్లు
గత ఆర్థిక సంవత్సరంలో మ్యూచువల్ ఫండ్ సంస్థలు(ఏఎంసీ) 185 కొత్త పథకాలను(ఎన్ఎఫ్ఓ-న్యూ ఫండ్ ఆఫర్) విడుదల చేశాయి. -
వైద్య ఉత్పత్తుల రంగంలో భారత్ కీలకం
వైద్య ఉత్పత్తుల రంగంలో భారతదేశానికి ఎంతో ముఖ్యమైన బాధ్యత ఉన్నట్లు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్ఎఫ్డీఏ) కమిషనర్ డాక్టర్ రాబర్ట్ కాలిఫ్ అన్నారు. -
ఆర్బీఎల్ బ్యాంక్ లాభంలో 30% వృద్ధి
జనవరి- మార్చి త్రైమాసికంలో ఆర్బీఎల్ బ్యాంక్ నికర లాభం 30 శాతం పెరిగి రూ.353 కోట్లకు చేరింది. -
యెస్ బ్యాంక్ లాభం రెట్టింపు
జనవరి- మార్చి త్రైమాసికంలో యెస్ బ్యాంక్ నికర లాభం స్టాండలోన్ పద్ధతిలో రూ.452 కోట్లుగా నమోదైంది. -
పూరీ విమానాశ్రయం ప్రాజెక్టు పోటీలో జీఎంఆర్, అదానీ గ్రూపు, ఫెయిర్ఫాక్స్?
ఒడిశా రాష్ట్రంలోని పూరీలో కొత్త విమానాశ్రయాన్ని నిర్మించి, నిర్వహించే అవకాశం కోసం జీఎంఆర్, అదానీ గ్రూపు, విదేశీ సంస్థ అయిన ఫెయిర్ఫాక్స్ పోటీ పడుతున్నాయి. -
భారత్లో షార్ప్ సెమీ కండక్టర్ల యూనిట్
జపాన్ ఎలక్ట్రానిక్ దిగ్గజం షార్ప్ దేశంలో సెమీకండక్టర్ ఫ్యాబ్ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. -
సంక్షిప్త వార్తలు
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సీకే బిర్లా గ్రూపు కంపెనీ, హెచ్ఐఎల్ లిమిటెడ్, పైపులు- ఫిట్టింగ్స్ వ్యాపారంలోకి విస్తరిస్తోంది. -
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
ఐటీ రంగంలో ఉద్యోగుల సంఖ్య నానాటికీ తగ్గుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో టాప్-5 ఐటీ సంస్థల్లోనే ఉద్యోగుల సంఖ్య 69 వేల వరకు తగ్గింది. -
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
Amazon: అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ వచ్చేసింది. మే 2 నుంచి ఈ సేల్ ప్రారంభం కానుందని ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
పాక్ ఉప ప్రధానిగా ఇశాక్ డార్ నియామకం
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
-
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
-
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!