TATA Sons IPO: అదే జరిగితే.. భారత్లో అతిపెద్ద ఐపీఓ టాటా గ్రూప్ నుంచే!
TATA Sons: టాటా సన్స్ను ఆర్బీఐ సెప్టెంబర్ 14న ‘అప్పర్ లేయర్ ఎన్బీఎఫ్సీగా’ వర్గీకరించింది. నిబంధనల ప్రకారం ఈ కేటగిరీలో చేరిన కంపెనీలు మూడేళ్లలో స్టాక్ మార్కెట్లలో లిస్ట్ కావాల్సి ఉంటుంది.
TATA Sons IPO | ఇంటర్నెట్ డెస్క్: టాటా గ్రూప్ మాతృసంస్థ టాటా సన్స్ త్వరలో ఐపీఓ (TATA Sons IPO)కి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ అదే జరిగితే.. ఇప్పటి వరకు భారత్లో ఇదే అతిపెద్ద ఐపీఓ అవ్వొచ్చని అంచనా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవల టాటా సన్స్ను ‘అప్పర్ లేయర్ నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ’గా వర్గీకరించింది. నిబంధనల ప్రకారం.. ఈ కేటగిరీలోకి వచ్చిన కంపెనీ.. మూడేళ్లలో స్టాక్ మార్కెట్లలో లిస్ట్ కావాల్సి ఉంటుంది.
టాటా సన్స్ను ఆర్బీఐ సెప్టెంబర్ 14న ‘అప్పర్ లేయర్ ఎన్బీఎఫ్సీగా’ వర్గీకరించింది. నిబంధనల ప్రకారం మూడేళ్లలో అంటే 2025 సెప్టెంబర్ 14 నాటికి ఈ కంపెనీ ఐపీఓ (TATA Sons IPO) ప్రక్రియ పూర్తి చేసుకొని స్టాక్ మార్కెట్లో లిస్ట్ కావాలి. మరో టాటా గ్రూప్ కంపెనీ టాటా క్యాపిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా అప్పర్ లేయర్ ఎన్బీఎఫ్సీగా వర్గీకరణ పొందింది. కానీ, ఇది టాటా సన్స్లో విలీనం కానున్న నేపథ్యంలో ప్రత్యేకంగా ఐపీఓకి రావాల్సిన అవసరం ఉండదని నిపుణులు అంటున్నారు. ఈ కేటగిరీలో చేరిన కంపెనీలపై నియంత్రణా చర్యలు పటిష్ఠంగా ఉంటాయి.
టాటా సన్స్ ప్రస్తుత విలువ రూ.11 లక్షల కోట్లని అంచనా! ఒకవేళ దీంట్లో ఐదు శాతం వాటాలను విక్రయించాలనుకుంటే.. అప్పుడు ఐపీఓ పరిమాణం రూ.55,000 కోట్లు అవుతుంది. ఇదే జరిగితే భారత్లో ఇప్పటి వరకు ఇదే అతిపెద్ద ఐపీఓగా నిలుస్తుంది. ప్రస్తుతానికి రూ.21,000 కోట్లు సమీకరించిన ఎల్ఐసీ ఐపీఓనే అతిపెద్దది.
మరో మార్గమూ ఉంది..
అయితే, ఐపీఓకి రావడం కాకుండా టాటా సన్స్కు మరో మార్గం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. ఐపీఓకి రావొద్దనుకుంటే కంపెనీని పునర్వ్యవస్థీకరించడం వల్ల ఆర్బీఐ నిబంధనల నుంచి మినహాయింపు పొందే వెసులుబాటు ఉంటుందని తెలిపారు. అయితే, టాటా సన్స్ విషయంలో అలా జరగకపోవచ్చునని విశ్లేషిస్తున్నారు. మార్కెట్లోని పరిస్థితులు, ఆయా రంగాల పనితీరును చూసుకొని టాటా సన్స్ పబ్లిక్ ఇష్యూ (TATA Sons IPO)కి వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంచనా వేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐటీ సెజ్ల్లో స్థలాలకు గిరాకీ
ఐటీ/ఐటీఈఎస్ ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్)ని అభివృద్ధి చేసిన ఒక డెవలపర్ విజ్ఞప్తి నేపథ్యంలో.. అందులో ప్రాసెసింగేతర ప్రాంతాలకు సెజ్ హోదాను రద్దు చేసే అధికారం అంతర్ మంత్రిత్వ శాఖల బోర్డుకు ఉందని ఒక అధికారిక నోటిఫికేషన్ స్పష్టం చేసింది. -
వచ్చే బడ్జెట్లో అద్భుత ప్రకటనలుండవు
వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న వెల్లడించే తన ఆరో బడ్జెట్లో ‘అద్భుత ప్రకటనలు’ ఉండవని, సార్వత్రిక ఎన్నికలకు ముందు కేవలం ఓట్ ఆన్ అకౌంట్గానే సమర్పిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. వచ్చే ఏడాది ఏప్రిల్- మే నెలల్లో సార్వత్రిక ఎన్నికల అనంతరం, కొత్త ప్రభుత్వం జులైలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెడుతుందని సీఐఐ గ్లోబల్ ఎకనమిక్ పాలసీ ఫోరమ్లో మంత్రి తెలిపారు. -
సంస్థల్లో నియామకాలు 12% తగ్గాయ్
వేర్వేరు రంగాల కార్యాలయాల్లో నైపుణ్యంతో కూడిన (వైట్-కాలర్) ఉద్యోగాల నియామకాలు గత 2 నెలల్లో తగ్గినట్లు నౌకరీ జాబ్స్పీక్ సూచీ నివేదిక వెల్లడించింది. ఇందుకు సంబంధించిన ఉద్యోగ పోస్టింగ్లు 2022 అక్టోబరు, నవంబరులో 2781 కాగా, ఈ ఏడాది అదే సమయంలో 12 శాతం తగ్గి 2,433 కు పరిమితమయ్యాయని తెలిపింది. -
2025కు పునరుత్పాదక ఇంధన సామర్థ్యం 170 గిగా వాట్లకు: ఇక్రా
దేశంలో పునరుత్పాదక ఇంధన సామర్థ్యం 2025 నాటికి 170 గిగా వాట్లకు చేరుకుంటుందని ఇక్రా వైస్ ప్రెసిడెంట్, సెక్టార్ హెడ్ - కార్పొరేట్ రేటింగ్స్ వి.విక్రమ్ అంచనా వేశారు. ప్రస్తుతం దేశీయ పునరుత్పాదక ఇంధన సామర్థ్యం 130 గిగా వాట్లుగా ఉంది. -
ఏడు రోజుల జోరుకు విరామం
సూచీల ఏడు రోజుల వరుస లాభాలకు గురువారం అడ్డుకట్ట పడింది. ఇటీవల భారీగా పెరిగిన షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించడమే ఇందుకు కారణం. బలహీన అంతర్జాతీయ సంకేతాలు ప్రభావం చూపాయి. ఆర్బీఐ పరపతి నిర్ణయాలు శుక్రవారం (నేడు) వెలువడనుండటంతో, మదుపర్లు కొంత అప్రమత్తత పాటించారు. -
వివో కేసులో తొలి ఛార్జిషీట్ దాఖలు
చైనాకు చెందిన స్మార్ట్ఫోన్ కంపెనీ వివో అనుబంధ సంస్థ వివో ఇండియాపై, మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఛార్జిషీట్ దాఖలు చేసింది. వివోతో పాటు మరికొందరిపై వచ్చిన మనీలాండరింగ్ ఆరోపణలపై దర్యాప్తు చేసిన ఈడీ, తొలి ఛార్జిషీట్ను ప్రత్యేక కోర్టులో వేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద వివో ఇండియాపై అభియోగాలు మోపింది. -
దూసుకెళ్తున్న ఈవీలు
విద్యుత్ వాహనాల (ఈవీల) అమ్మకాలు రాణిస్తున్నాయి. విద్యుత్తు విభాగంలో ప్రయాణికులు- వాణిజ్య వాహనాలు కలిపి నవంబరులో 1,52,606 యూనిట్లు అమ్ముడైనట్లు వాహన డీలర్ల సమాఖ్య ఫాడా గురువారం వెల్లడించింది. -
1 నుంచి హ్యుందాయ్ ధరల పెంపు
వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా (హెచ్ఎమ్ఐఎల్), జనవరి 1 నుంచి ధరలు పెంచనున్నట్లు ప్రకటించింది. పెరిగిన ముడి పదార్థాల ధరలు, ప్రతికూల మారకపు రేటు, అధిక కమొడిటీ ధరల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. -
స్టార్బక్స్కు రూ.91,500 కోట్ల నష్టం
సియాటెల్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న స్టార్బక్స్ కార్పొరేషన్ ఆదాయంపై, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల ప్రభావం వేగంగా కనిపించింది. విక్రయాలు తగ్గడంతో, సుమారు 11 బిలియన్ డాలర్ల (సుమారు రూ.91,500 కోట్ల) మేర విలువను కంపెనీ నష్టపోయింది. -
పంచదార ధరల అదుపునకు చర్యలు
దేశంలో పెరుగుతున్న చక్కెర ధరలను అదుపు చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇథనాల్ ఉత్పత్తికి చెరకు రసం వినియోగించకుండా నిషేధం విధిస్తూ, చక్కెర మిల్లులు, డిస్టిలరీలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. దేశీయ అవసరాలకు తగినంత చక్కెరను అందుబాటులో ఉంచడంతో పాటు, ధరలు అదుపులో ఉంచేందుకే ఈ నిర్ణయం తీసుకుంది. -
ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్లో వార్బర్గ్ పింకస్ 1.3 శాతం వాటా విక్రయం
ఐడీఎఫ్సీ బ్యాంక్లో అమెరికాకు చెందిన ప్రైవేటు ఈక్విటీ సంస్థ వార్బర్గ్ పింకస్ 1.3 శాతం వాటాను రూ.790.18 కోట్లకు విక్రయించింది. ఓపెన్ మార్కెట్ లావాదేవీ ద్వారా ఈ విక్రయం జరిగింది. ఈ వార్తలతో బీఎస్ఈలో ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ షేరు 3.02 శాతం నష్టపోయి రూ.87.69 వద్ద ముగిసింది. -
వచ్చే బడ్జెట్లో అద్భుత ప్రకటనలుండవు
వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న వెల్లడించే తన ఆరో బడ్జెట్లో ‘అద్భుత ప్రకటనలు’ ఉండవని, సార్వత్రిక ఎన్నికలకు ముందు కేవలం ఓట్ ఆన్ అకౌంట్గానే సమర్పిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. వచ్చే ఏడాది ఏప్రిల్- మే నెలల్లో సార్వత్రిక ఎన్నికల అనంతరం, కొత్త ప్రభుత్వం జులైలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెడుతుందని సీఐఐ గ్లోబల్ ఎకనమిక్ పాలసీ ఫోరమ్లో మంత్రి తెలిపారు. -
భారత్ 8% వృద్ధి సాధిస్తుంది
మన ఆర్థిక వ్యవస్థకు 8 శాతం వృద్ధి సాధించే సత్తా ఉందని నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ సుమన్ బెర్రీ పేర్కొన్నారు. కార్మిక శక్తి బలంగా ఉండటంతో పాటు ప్రజాస్వామ పరంగా సంస్థాగత అనుభవం ఉందని అభిప్రాయపడ్డారు. దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే ఉత్తర భారతదేశం అంతగా రాణించడం లేదని, సార్వభౌమ వ్యవస్థలో ఇది ఉద్రిక్తతలను సృష్టించొచ్చని అన్నారు. -
సంక్షిప్త వార్తలు
ఇటీవలి కొద్ది నెలలుగా భారత అంకురాల్లో జపాన్కు చెందిన సాఫ్ట్బ్యాంక్ తన వాటాలుతగ్గించుకుంటూ వస్తోంది. ఆన్లైన్లో ఆర్డర్లు తీసుకుని, ఆహారాన్ని సరఫరా చేసే జొమాటోలో కూడా రూ.1,125.5 కోట్ల (135 మిలియన్ డాలర్ల) విలువైన షేర్లను సాఫ్ట్బ్యాంక్ విక్రయించనుందని ఒక ఆంగ్ల వార్తా సంస్థ పేర్కొంది.


తాజా వార్తలు (Latest News)
-
విద్యుత్పైనే తొలి గురి!.. ఆ శాఖ కార్యదర్శిపై సీఎం ఆగ్రహం
-
‘నీ భార్యను అమ్మేసైనా డబ్బు కట్టాల్సిందే!’
-
Mrunal Thakur: త్వరలోనే పెళ్లి చేసుకుంటా: మృణాల్ ఠాకూర్
-
Pawan Kalyan: పవన్ కల్యాణ్- సురేందర్ రెడ్డి కాంబో.. నేపథ్యమిదే!
-
‘వరకట్నం’గా BMW, 15 ఎకరాల భూమి డిమాండ్.. వైద్యురాలి ఆత్మహత్య
-
IPL 2024: గుజరాత్ టైటాన్స్కు మరో షాక్ తప్పదా! షమి ఫ్రాంఛైజీ మారతాడా?