Tata Tech IPO: టాటా టెక్ ఐపీఓ ధరల శ్రేణి రూ.రూ.475-500.. కనీసం ఎంత పెట్టుబడి పెట్టాలంటే?
Tata Tech IPO: ఇప్పటికే ఐపీఓ తేదీలను ప్రకటించిన టాటా టెక్.. తాజాగా పబ్లిక్ ఇష్యూ పూర్తి వివరాలను వెల్లడించింది.
Tata Tech IPO | ఇంటర్నెట్ డెస్క్: మదుపర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్న టాటా టెక్ ఐపీఓ (Tata Tech IPO) పూర్తి వివరాలు వెల్లడయ్యాయి. నవంబరు 22న ప్రారంభం కానున్న ఈ పబ్లిక్ ఇష్యూ 24న ముగియనున్నట్లు ఆ కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. తాజాగా ధరల శ్రేణి, కనీస పెట్టుబడి సహా ఇతర కీలక సమాచారాన్ని వెల్లడించింది. ఐపీఓలో ఒక్కో షేరు ధరల శ్రేణిని రూ.475-500గా నిర్ణయించింది. ఈ లెక్కన అత్యధిక ధర వద్ద కంపెనీ రూ.3,042 కోట్లు సమీకరించనుంది. రిటైల్ మదుపరులు కనీసం 30 షేర్లను కొనాలని నిబంధన విధించింది. దీని ప్రకారం గరిష్ఠ ధర వద్ద కనీసం రూ.15 వేలు పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది.
ఈ ఐపీఓ (Tata Tech IPO)లో 6.08 కోట్ల షేర్లను టాటా టెక్ అందుబాటులో ఉంచుతోంది. ఇది కంపెనీ పెయిడ్ అప్ ఈక్విటీ షేర్ క్యాపిటల్లో 15 శాతానికి సమానం. ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా టాటా మోటార్స్ తమ వాటాలో 11.4 శాతాన్ని ఉపసంహరించుకుంటోంది. అదనంగా ఆల్ఫా టీసీ హోల్డింగ్స్ 2.4 శాతం, టాటా క్యాపిటల్ గ్రోత్ ఫండ్-I 1.2 శాతం వాటాలను విక్రయిస్తున్నాయి. ఐపీఓ (Tata Tech IPO) పరిమాణాన్ని గణనీయంగా తగ్గించారు. తొలుత 9.57 కోట్ల షేర్లను విక్రయించాలనుకున్నారు. కానీ, దాన్ని తాజాగా 6.08 కోట్లకు కుదించారు. ఈ ఐపీఓ పూర్తిగా ‘ఆఫర్ ఫర్ సేల్’ ప్రాతిపదికన జరుగుతున్న నేపథ్యంలో సమీకరించిన నిధులు కంపెనీకి చెందబోవు. ఈ ఐపీఓలో 10 శాతం వాటాను ప్రత్యేకంగా టాటా మోటార్స్ వాటాదారుల కోసం రిజర్వ్ చేశారు.
2004లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ను పబ్లిక్ ఇష్యూకు తీసుకొచ్చిన టాటా గ్రూప్ దాదాపు రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ మరో సంస్థను ఐపీఓ (Tata Tech IPO)కు తీసుకురావడం ఇదే. కంపెనీకి 18 అంతర్జాతీయ డెలివరీ కేంద్రాలున్నాయి. దాదాపు 11 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇంజినీరింగ్, పరిశోధన-అభివృద్ధి (ఈఆర్అండ్డీ) సేవలు, డిజిటల్ ఎంటర్ప్రైజ్ సర్వీసెస్ (డీఈఎస్), ఎడ్యుకేషన్ ఆఫరింగ్స్, వాల్యూ యాడెడ్ రీసెల్లింగ్ అండ్ ఐప్రోడక్ట్స్ ఆఫరింగ్స్ విభాగాల్లో వ్యాపారాలున్నాయి. టాటా మోటార్స్, జాగ్వార్ ల్యాండ్రోవర్ సహా టాటా గ్రూప్లోని ఇతర సంస్థలకు ఇది ప్రధానంగా సేవలందిస్తోంది.
టీపీజీ క్లైమెట్ తొమ్మిది శాతం వాటా కొనుగోలు చేసిన సమయంలో టాటా టెక్ విలువను చివరిసారి రూ.16,300 కోట్లుగా అంచనా వేశారు. 2022 డిసెంబరుతో ముగిసిన తొమ్మిది నెలల వ్యవధిలో వార్షిక ప్రాతిపదికన కంపెనీ ఆదాయం 15 శాతం పెరిగి రూ.3,052 కోట్లకు చేరింది. నికర లాభం రూ.407 కోట్లుగా నమోదైంది.
ఐపీఓ వివరాలు సంక్షిప్తంగా..
- ఐపీఓ తేదీలు: నవంబరు 22-24
- ఒక్కో షేరు ముఖ విలువ : రూ.2
- ధరల శ్రేణి : రూ.475- 500
- కనీసం ఆర్డర్ చేయాల్సిన షేర్లు : 30 (ఒక లాట్)
- కనీస పెట్టుబడి: రూ.15,000 (గరిష్ఠ ధర వద్ద)
- షేర్ల కేటాయింపు తేదీ : నవంబరు 30
- రిఫండ్ల ప్రారంభ తేదీ : డిసెంబరు 1
- డీమ్యాట్ ఖాతాకు షేర్ల బదిలీ : డిసెంబరు 4
- లిస్టింగ్ తేదీ : డిసెంబరు 5
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!
SBI Credit Card: ఎస్బీఐ కార్డు విమాన ప్రయాణికుల కోసం మూడు ప్రత్యేక క్రెడిట్ కార్డులను తీసుకొచ్చింది. వాటిలోని ప్రయోజనాలు, ఫీజుల వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం..! -
చైనాలో ఎలాన్ మస్క్ ఆకస్మిక పర్యటన!
Elon Musk: దాదాపు వారం క్రితం ఎలాన్ మస్క్ భారత పర్యటనను రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఆకస్మికంగా చైనాలో పర్యటిస్తున్నట్లు సంబంధిత వ్యక్తులు తెలిపారు. -
రూ.49కే బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ సబ్స్క్రిప్షన్
BSNL Cinemaplus: బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ పేరిట ఓటీటీ ప్యాకేజీలను అందిస్తోంది. దీంట్లో మొత్తం మూడు ప్యాక్లు ఉన్నాయి. తాజాగా స్టార్టర్ ప్యాక్ ధరను సంస్థ కుదించింది. -
వేసవిలో ఫోన్ ఛార్జింగ్ వేగం తగ్గుతుంది..? ఎందుకు?
వేసవిలో స్మార్ట్ఫోన్ ఛార్జింగ్లో వేగం మందగిస్తుంది. దీనికి కారణమేంటి? ఎందుకు వేగం తగ్గుతుంది? -
ఐసీఐసీఐ లాభం రూ.11,672 కోట్లు
ఐసీఐసీఐ బ్యాంక్ ఆర్థిక ఫలితాలకు తక్కువ కేటాయింపులు కలిసివచ్చాయి. దీంతో మార్చి త్రైమాసికంలో బ్యాంక్ ఏకీకృత నికర లాభం 18.5 శాతం వృద్ధి చెంది రూ.11,672 కోట్లకు చేరుకుంది. -
ఒకే పాలసీలోనే అన్ని ధీమాలు
అందరికీ బీమా పాలసీలను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఐఆర్డీఏఐ) ఒక ప్రామాణిక పాలసీ ‘బీమా విస్తార్’ను అందుబాటులోకి తీసుకురానుంది. -
హైదరాబాద్లో కార్యాలయాల అద్దె లావాదేవీలు పెరిగాయ్
కార్పొరేట్ల నుంచి గిరాకీ స్థిరంగా ఉండటంతో ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో కార్యాలయాల అద్దె లావాదేవీలు 13 శాతం వృద్ధితో 1.34 కోట్ల చదరపు అడుగులకు చేరిందని స్థిరాస్తి సేవలను అందించే వెస్టియన్ తెలిపింది. -
మ్యూచువల్ ఫండ్ కొత్త పథకాల్లోకి రూ.66,364 కోట్లు
గత ఆర్థిక సంవత్సరంలో మ్యూచువల్ ఫండ్ సంస్థలు(ఏఎంసీ) 185 కొత్త పథకాలను(ఎన్ఎఫ్ఓ-న్యూ ఫండ్ ఆఫర్) విడుదల చేశాయి. -
వైద్య ఉత్పత్తుల రంగంలో భారత్ కీలకం
వైద్య ఉత్పత్తుల రంగంలో భారతదేశానికి ఎంతో ముఖ్యమైన బాధ్యత ఉన్నట్లు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్ఎఫ్డీఏ) కమిషనర్ డాక్టర్ రాబర్ట్ కాలిఫ్ అన్నారు. -
ఆర్బీఎల్ బ్యాంక్ లాభంలో 30% వృద్ధి
జనవరి- మార్చి త్రైమాసికంలో ఆర్బీఎల్ బ్యాంక్ నికర లాభం 30 శాతం పెరిగి రూ.353 కోట్లకు చేరింది. -
యెస్ బ్యాంక్ లాభం రెట్టింపు
జనవరి- మార్చి త్రైమాసికంలో యెస్ బ్యాంక్ నికర లాభం స్టాండలోన్ పద్ధతిలో రూ.452 కోట్లుగా నమోదైంది. -
పూరీ విమానాశ్రయం ప్రాజెక్టు పోటీలో జీఎంఆర్, అదానీ గ్రూపు, ఫెయిర్ఫాక్స్?
ఒడిశా రాష్ట్రంలోని పూరీలో కొత్త విమానాశ్రయాన్ని నిర్మించి, నిర్వహించే అవకాశం కోసం జీఎంఆర్, అదానీ గ్రూపు, విదేశీ సంస్థ అయిన ఫెయిర్ఫాక్స్ పోటీ పడుతున్నాయి. -
భారత్లో షార్ప్ సెమీ కండక్టర్ల యూనిట్
జపాన్ ఎలక్ట్రానిక్ దిగ్గజం షార్ప్ దేశంలో సెమీకండక్టర్ ఫ్యాబ్ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. -
సంక్షిప్త వార్తలు
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సీకే బిర్లా గ్రూపు కంపెనీ, హెచ్ఐఎల్ లిమిటెడ్, పైపులు- ఫిట్టింగ్స్ వ్యాపారంలోకి విస్తరిస్తోంది. -
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
ఐటీ రంగంలో ఉద్యోగుల సంఖ్య నానాటికీ తగ్గుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో టాప్-5 ఐటీ సంస్థల్లోనే ఉద్యోగుల సంఖ్య 69 వేల వరకు తగ్గింది. -
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
Amazon: అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ వచ్చేసింది. మే 2 నుంచి ఈ సేల్ ప్రారంభం కానుందని ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
-
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
-
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!
-
అత్యాచారం చేసి.. కాల్చిన ఇనుప రాడ్డుతో ముఖంపై పేరు రాసి..