TCS: టీసీఎస్ కీలక నిర్ణయం.. ‘హైబ్రిడ్’కు గుడ్బై..!
ప్రముఖ ఐటీ సేవల సంస్థ టీసీఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 1 నుంచి ఉద్యోగులంతా వారంలో ఐదు రోజుల పాటు కార్యాలయాలకు రావాల్సిందేనని సూచించింది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) హైబ్రిడ్ వర్కింగ్ పాలసీకి గుడ్బై చెప్పింది. అక్టోబర్ 1 నుంచి ఉద్యోగులంతా కార్యాలయాలకు రావాలని సూచించింది. ఇప్పటికే ఈ మేరకు ఉద్యోగులకు సమాచారం ఇచ్చిందని ఓ ఆంగ్ల వెబ్సైట్ పేర్కొంది. వచ్చే నెల నుంచి వారంలో ఐదు రోజుల పాటు కార్యాలయాలకు వచ్చి పనిచేయాల్సిందేనని కంపెనీ పేర్కొంది. ఇతర కంపెనీలూ టీసీఎస్ను అనుసరించే అవకాశం ఉంది.
కరోనా సమయంలో మొదలైన పూర్తి వర్క్ఫ్రమ్ అనంతరం.. ఈ హైబ్రిడ్ వర్క్ సంస్కృతి మొదలైంది. దీంతో చాలా మంది ఉద్యోగులు వారంలో మూడు రోజులు మాత్రమే కార్యాలయాలకు వెళ్లి మిగిలిన రెండ్రోజులు ఇంటి నుంచి పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో కంపెనీ సీఈఓ, చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ పేరిట ఉద్యోగులు ఐదు రోజులూ కార్యాలయాలకు రావాల్సిందేనంటూ ఇ-మెయిల్స్ వెళ్లినట్లు తెలిసింది. దీంతో అక్టోబర్ 1 నుంచి ఉద్యోగులు కార్యాలయాలకు రావాల్సిందేనంటూ ఆయా డివిజన్ల మేనేజర్లు సూచిస్తున్నారు.
అమెజాన్ పండగ సేల్లో TVలపై ఆఫర్లివే..
ఉద్యోగులంతా కార్యాలయాలకు రావడం ఎంత అవసరమో కంపెనీ 2022-23 వార్షిక నివేదికలో స్పష్టంగా పేర్కొంది. కంపెనీలో పనిచేస్తున్న వారిలో సగం మంది ఉద్యోగులు 2020 మార్చి తర్వాత నియమితులైన వారేనని అందులో ప్రస్తావించింది. వీరంతా సీనియర్లు, లీమ్ లీడర్ల నుంచి ఎంతో నేర్చుకోవాల్సి ఉంటుందని, వారి నడవడిక, ఆలోచనా తీరు నుంచి కొత్త వారు తెలుసుకోవాల్సింది చాలా ఉంటుందని పేర్కొంది. ఉద్యోగులు పరస్పరం చర్చించుకోకుండా అభివృద్ధి సాధ్యం కాదని, కాబట్టి ఈ ఏడాదిలోనే దశలవారీగా ఉద్యోగులను కార్యాలయాలకు రప్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడింది. ఇందులో భాగంగా టీసీఎస్ తాజా నిర్ణయం తీసుకుంది. దేశంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీ అయిన టీసీఎస్లో దాదాపు 6 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తనఖా బంగారం పోతే బ్యాంకుదే బాధ్యత
ఆర్థిక అవసరాలు వస్తే ఇంట్లోని బంగారు ఆభరణాలను తనఖా పెట్టి, నగదు అప్పు తెచ్చుకోవడం సులభమైన మార్గం. -
టెక్ ప్రపంచానికి హైదరాబాదీ ఉత్పత్తులు
ఇంటర్నెట్ కూడా సరిగా లేని రోజుల్లో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ మైక్రోసాఫ్ట్, మనదేశంలో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలనుకోవడం నిజంగా సాహసమే. అప్పటికి, వేరే ప్రాంతం నుంచి సాఫ్ట్వేర్ ఉత్పత్తి ప్రక్రియను అమెరికాలోని ప్రధాన కార్యాలయంతో ఎలా అనుసంధానించాలనే విషయంపైనా స్పష్టత లేదు. -
ఈడీ చర్యలతో ప్రభుత్వ బ్యాంకులకు రూ.15,183 కోట్లు వెనక్కి
మనీ లాండరింగ్ నిరోధక చట్టాల కింద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) జప్తు చేసిన రూ.15,186.64 కోట్లలో దాదాపు అంతా ప్రభుత్వ రంగ బ్యాంకులకు వెనక్కి ఇచ్చినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభలో తెలిపారు. -
21,791 నకిలీ జీఎస్టీ రిజిస్ట్రేషన్లు గుర్తించాం
జీఎస్టీ అధికారులు రెండు నెలల పాటు (ఈ ఏడది మే 16 నుంచి జులై 15 వరకు) నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో 21,791 నకిలీ జీఎస్టీ రిజిస్ట్రేషన్లు గుర్తించారని, రూ.24,000 కోట్ల మేర పన్ను ఎగవేసినట్లుగా తేల్చారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. -
69,000 శిఖరంపై సెన్సెక్స్
వరుసగా ఆరో రోజూ లాభపడిన సెన్సెక్స్, నిఫ్టీ కొత్త గరిష్ఠాలకు చేరాయి. విద్యుత్, బ్యాంకింగ్, యుటిలిటీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో చరిత్రలో తొలిసారిగా సెన్సెక్స్ 69,000 పాయింట్ల ఎగువన ముగిసింది. -
2030కి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్
భారత్ 2030 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ అంచనా వేసింది. 2023-24లో దేశ జీడీపీ వృద్ధి 6.4 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. -
ఏఏఏఐ అధ్యక్షుడిగా ప్రశాంత్ కుమార్ మళ్లీ ఎన్నిక
2023-24 ఏడాదికి అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఏఏఐ) అధ్యక్షుడిగా గ్రూప్ ఎం మీడియా (ఇండియా) ప్రై.లి. దక్షిణాసియా సీఈఓ ప్రశాంత్ కుమార్ మరోసారి ఎన్నికయ్యారు. -
క్యాబ్ సేవల విభాగంలోకి ర్యాపిడో
రైడ్ సేవలు అందించే ర్యాపిడో, క్యాబ్ సేవల విభాగంలోకి అడుగుపెట్టినట్లు ప్రకటించింది. ఈ విభాగంలో ఆధిపత్యం చెలాయిస్తున్న ఓలా, ఉబర్ వంటి సంస్థలతో ర్యాపిడో పోటీపడనుంది. -
అదానీ గ్రూపు చేతికి సంఘీ ఇండస్ట్రీస్
సంఘీ ఇండస్ట్రీస్ను గౌతమ్ అదానీకి చెందిన అంబుజా సిమెంట్స్ లిమిటెడ్ స్వాధీనం చేసుకుంది. ఒక్కో షేరుకు రూ.121.90 చొప్పున చెల్లించి, ఈ లావాదేవీని పూర్తి చేసింది. -
వినియోగ బైక్ల వ్యాపారంలోకి రాయల్ ఎన్ఫీల్డ్
మోటార్సైకిల్ తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ తాజాగా వినియోగ (ప్రీ-ఓన్డ్) బైక్ల వ్యాపారంలోకి అడుగుపెట్టింది. ‘రీఓన్’ పేరుతో ఈ వ్యాపారాన్ని నిర్వహించనుంది. -
ఎన్ఎస్ఈ నుంచి మరో కొత్త సూచీ
ఎన్ఎస్ఈకి చెందిన సూచీల సేవల అనుబంధ సంస్థ ఎన్ఎస్ఈ ఇండిసెస్.. నిఫ్టీ 50 సూచీలో కొత్త రకం సూచీని తీసుకొచ్చింది. ‘నిఫ్టీ 50 నెట్ టోటల్ రిటర్న్ సూచీ’గా దీనిని వ్యవహరిస్తారు. -
యూకో బ్యాంక్ ఖాతాదారుల్లో డబ్బుల జమ కేసులో సీబీఐ తనిఖీలు
యూకో బ్యాంకుకు చెందిన 41,000 మంది ఖాతాదార్ల ఖాతాల్లోకి మొత్తంగా రూ.820 కోట్లు జమ అయిన వ్యవహారంపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదుచేసింది. -
సంక్షిప్త వార్తలు(7)
గ్రాఫైట్ ఎలక్ట్రోడ్స్ ఉత్పత్తి చేసే సంస్థ గ్రాఫైట్ ఇండియా లిమిటెడ్, హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న గోడి ఇండియా అనే సంస్థలో 31% వాటా కొనుగోలు చేస్తోంది. -
Steve Jobs: స్టీవ్ జాబ్స్ సంతకం.. రూ.333 చెక్కుకు రూ.20 లక్షలు..!
Steve Jobs: యాపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ సంతకం చేసిన 47 ఏళ్ల నాటి చెక్కు రూ.20లక్షలకు పైగా అమ్ముడుపోయే అవకాశం ఉందని ‘ఆర్ఆర్ ఆక్షన్స్’ సంస్థ వెల్లడించింది.


తాజా వార్తలు (Latest News)
-
Congress: కొత్త ఎమ్మెల్యేలకు చిన్నారెడ్డి, నాగేశ్వర్ పాఠాలు
-
Donakonda: అబ్బో.. దొనకొండపై ప్రేమే!
-
Malkajgiri: మల్కాజిగిరి సెంటిమెంట్.. మూడు ఎన్నికల్లో సంచలనాలు
-
Sircilla: సిరిసిల్లలో పాత కథ పునరావృతం
-
Komatireddy: రేవంత్కు శుభాకాంక్షలు తెలిపిన కోమటిరెడ్డి
-
పాక్ అమ్మాయి.. భారత్ అబ్బాయి.. కొవిడ్ కష్టాలు దాటి కల్యాణం