EV Sales: ఈవీల విక్రయాల్లో తమిళనాడు టాప్‌.. 40% అమ్మకాలు ఈ రాష్ట్రంలోనే..

EV Sales: దేశవ్యాప్తంగా అమ్ముడైన మొత్తం విద్యుత్‌ వాహనాల్లో 40 శాతం ఒక్క తమిళనాడు రాష్ట్రంలోనే విక్రయమవడం విశేషం. ఈవీల విక్రయాల్లో దక్షిణాది రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది.

Published : 25 Sep 2023 17:09 IST

చెన్నై: దేశంలో విద్యుత్ వాహనాలకు (electric vehicles) ఆదరణ పెరుగుతోంది. ఈ ఏడాది ఇప్పటికే దేశవ్యాప్తంగా 10లక్షలకు పైగా ఈవీలు అమ్ముడవ్వగా.. అందులో అత్యధిక విక్రయాలతో తమిళనాడు (Tamil Nadu) టాప్‌లో ఉంది. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాలను ఉటంకిస్తూ తమిళనాడు ప్రభుత్వం సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. (EV Sales)

ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబరు వరకు దేశవ్యాప్తంగా 10,44,600 విద్యుత్ వాహనాలు (electric vehicles) విక్రయాలకు రిజిస్టర్‌ అయినట్లు గణాంకాలు పేర్కొన్నాయి. ఇందులో 4,14,802 వాహనాలు ఒక్క తమిళనాడులోనే అమ్ముడవడం విశేషం. ఇందులో అత్యధికంగా ఓలా ఎలక్ట్రిక్‌ వాహనాలు 1.75లక్షల యూనిట్లు కాగా.. 1.12లక్షల టీవీఎస్‌ మోటార్‌ వాహనాలు విక్రయమయ్యాయి. అత్యధికంగా చెన్నై, కొయంబత్తూర్‌, తిరుచిరాపల్లి, మదురై, సేలం ప్రాంతాల్లో ఈవీ విక్రయాలు గణనీయంగా పెరిగినట్లు తమిళనాడు సర్కారు ఓ అధికారిక ప్రకటనలో పేర్కొంది.

ఈ ఫోన్లలో త్వరలో వాట్సప్‌ బంద్‌.. లిస్ట్‌ ఇదిగో..

‘‘ప్రపంచంలోనే విద్యుత్‌ వాహనాల కేంద్రంగా తమిళనాడు మారనుంది. ఇప్పటికే ఆటో తయారీ రంగంలో దూసుకెళ్తోన్న రాష్ట్రం.. ఇప్పుడు ఈవీ పాలసీని విజయవంతంగా అమలు చేస్తోంది. 2030 నాటికి దేశవ్యాప్తంగా విక్రయమయ్యే విద్యుత్‌ వాహనాల్లో 30 శాతం తమిళనాడు నుంచే ఉత్పత్తి అవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం’’ అని రాష్ట్ర ప్రభుత్వం తమ ప్రకటనలో పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు