Twitter- Elon Musk: మస్క్.. మీ ఆలోచన సరైంది కాదు!
ఎలాన్ మస్క్కు ట్విటర్ ఉద్యోగులు లేఖ రాశారు. సిబ్బందిని తొలగించాలనే ఆలోచన సరైంది కాదని తెలిపారు. అలా చేస్తే కంపెనీ కార్యకలాపాలు దెబ్బతింటాయని హెచ్చరించారు.
శాన్ఫ్రాన్సిస్కో: ట్విటర్ కొనుగోలు ఒప్పందంలో నెలకొన్న సందిగ్ధత ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో ఇటీవల వెలుగులోకి వచ్చిన ఓ వ్యవహారంపై కంపెనీ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ట్విటర్ను సొంతం చేసుకుంటే దాదాపు 75 శాతం మంది ఉద్యోగుల్ని తొలగిస్తారని ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ఆందోళన చెందిన ఉద్యోగులు కంపెనీ యాజమాన్యాన్ని వివరణ కోరారు. తాజాగా కొంతమంది ఎలాన్ మస్క్కు బహిరంగ లేఖ రాశారు.
సిబ్బందిని తొలగించాలన్న మస్క్ నిర్ణయం అనాలోచితమైందని ఉద్యోగులు లేఖలో పేర్కొన్నారు. దీనివల్ల ప్రజల సమాచార బట్వాడాకు తీవ్ర ముప్పు వాటిల్లుతుందని వ్యాఖ్యానించారు. ట్విటర్పై యూజర్లకు ఉన్న నమ్మకాన్ని వమ్ము చేసినట్లేనని తెలిపారు. పైగా ఉద్యోగులపై బహిరంగ బెదిరింపులకు దిగుతున్నట్లుగా భావించాల్సి ఉంటుందన్నారు. ఇలా నిరంతర వేధింపుల మధ్య పని చేయడం కష్టతరమని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు ప్రస్తుత, భవిష్యత్తు యాజమాన్యం ముందు ఉద్యోగులు కొన్ని కీలక డిమాండ్లను ఉంచారు.
ఉద్యోగులను తొలగించే విషయంలో కంపెనీలో న్యాయబద్ధమైన విధానాలు ఉండాలని లేఖలో డిమాండ్ చేశారు. అలాగే ప్రస్తుతం ట్విటర్ యాజమాన్యం కల్పిస్తున్న ‘ఇంటి నుంచి పని’ వంటి ప్రయోజనాలన్నింటినీ కొనసాగించాలని మస్క్ను కోరారు. ట్విటర్ను నడిపే విషయంలోనూ కంపెనీ ఉద్యోగులు, మస్క్ మధ్య సైద్ధాంతికపరమైన వ్యత్యాసం ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే జాతి, జెండర్, వైకల్యం, రాజకీయ అభిప్రాయాల ఆధారంగా ఉద్యోగులపై పక్షపాతం చూపించొద్దని కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టాటా మోటార్స్ పెట్టుబడులు రూ.43,000 కోట్లు!
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తమ పెట్టుబడుల ప్రణాళికను టాటా మోటార్స్ గ్రూప్ మరింత పెంచుకుంది. -
జీడీపీ వృద్ధి 6.7శాతం!
గత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో దేశ వృద్ధి రేటు 6.7 శాతంగా నమోదు కావొచ్చని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ అంచనా వేసింది. -
కృత్రిమ మేధపై వ్యయాలు మూడింతలు
మన దేశంలో కృత్రిమ మేధ (ఏఐ)పై వ్యయాలు 2027 నాటికి మూడింతలు పెరిగి 5 బిలియన్ డాలర్ల (సుమారు రూ.41,500 కోట్ల)కు చేరొచ్చని ఇంటెల్-ఐడీసీ నివేదిక వెల్లడించింది. -
వ్యాపార వృద్ధిలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకు అగ్రస్థానం
గత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకు (పీఎస్బీ)ల మొత్తం వ్యాపారం, డిపాజిట్ల సేకరణలో అధిక వృద్ధిరేటును బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బీఓఎం) నమోదు చేసింది. -
2024లో ఈక్విటీ ఫండ్లలోకి రూ.1.3 లక్షల కోట్లు
దేశీయ ఈక్విటీ మార్కెట్లపై మ్యూచువల్ ఫండ్లు (ఎంఎఫ్) ఎంతో నమ్మకం ఉంచుతున్నాయి. ఈ ఏడాది (2024)లో ఇప్పటికే సుమారు రూ.1.3 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడం ఇందుకు నిదర్శనం. -
మేమూ వినియోగించుకునే అవకాశమివ్వండి
విమాన ఇంధన (ఏటీఎఫ్) సరఫరా, నిల్వ కోసం ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్ సంస్థలు వినియోగించుకుంటున్న పైపులైన్లు, నిల్వ కేంద్రాలను తమకూ అందుబాటులోకి తేవాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) ప్రభుత్వాన్ని కోరింది. -
పసుపు కిందకు!
పసిడి జూన్ కాంట్రాక్టు ఈవారం సానుకూల ధోరణిలో చలిస్తే రూ.74,412 వద్ద నిరోధం ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. -
ఎండీహెచ్, ఎవరెస్ట్కు మరిన్ని చిక్కులు
అగ్రగామి మసాలా బ్రాండ్లు ఎండీహెచ్, ఎవరెస్ట్లకు చెందిన మసాలా పొడుల ఉత్పత్తుల్లో నాణ్యతా లోపాలపై దర్యాప్తు చేస్తున్నట్లు న్యూజిలాండ్ ఆహార భద్రతా సంస్థ వెల్లడించింది. -
చైనా స్థిరాస్తి రంగానికి ఊరట
దీర్ఘకాలంగా క్షీణిస్తున్న స్థిరాస్తి రంగాన్ని ఆదుకోవడానికి చైనా చర్యలు ప్రకటించింది. అమ్ముడుపోని గృహాలను, భూములను తిరిగి కొనుగోలు చేయడానికి వందల కోట్ల డాలర్లను కేటాయించింది. -
భారత్ వృద్ధి 6.6%
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) లో భారత ఆర్థిక వ్యవస్థ 6.6% వృద్ధి రేటును నమోదు చేయొచ్చని మూడీస్ రేటింగ్స్ అంచనా వేసింది. -
సంక్షిప్త వార్తలు
ఎడ్టెక్ సంస్థ బైజూస్ సలహా మండలి నుంచి ఎస్బీఐ మాజీ ఛైర్మన్ రజనీశ్ కుమార్, ఇన్ఫోసిస్ మాజీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ మోహన్దాస్ పాయ్ వైదొలగనున్నారు. -
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..
Mobile Apps: స్మార్ట్ఫోన్ వినియోగదారులు కచ్చితంగా భద్రతకు ప్రాధాన్యమివ్వాలి. యాప్ను డౌన్లోడ్ చేసుకునే ముందు యాప్ స్టోర్, గోప్యతా విధానాలు, డేటా సేకరణ, సమీక్షలు, మానిటైజేషన్ పద్ధతులు, వివిధ అనుమతుల వంటి అంశాలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
-
‘బ్లూ ఆరిజిన్’ ప్రయోగం విజయవంతం.. అంతరిక్షయానం చేసిన తొలి తెలుగు వ్యక్తి
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..
-
దాన్ని రికార్డు చేయొద్దని కోరినా.. ప్రసారం చేశారు: రోహిత్ మండిపాటు