Grammarly Story: ఇంగ్లిషులో అక్షర దోషాలు దిద్ది కోటీశ్వరులయ్యారు!
మనం రాసే వాక్యాల్లో అన్వయ లోపాలు, అక్షర దోషాలు ఒక్కోసారి విపరీతార్థాలకు దారి తీస్తాయి.
ఇంటర్నెట్ డెస్క్: మనం రాసే వాక్యాల్లో అన్వయ లోపాలు, అక్షర దోషాలు ఒక్కోసారి విపరీతార్థాలకు దారి తీస్తాయి. ఎదుటి వ్యక్తులకు తప్పుడు సందేశాన్ని పంపిస్తాయి. మన మాతృభాషలోనైతే కొంత జాగ్రత్తగా వ్యవహరించే అవకాశం ఉంటుంది. కానీ, ఆంగ్లం వంటి ఇతర భాషల్లోనైతే మరీ పట్టుంటే తప్ప దోషరహిత వాక్యాలను నిర్మించలేం. ఇదిలా ఉంటే.. కార్పొరేటు కంపెనీలు, ఉన్నత ఉద్యోగాల్లో మెయిళ్లు పంపడం రోజువారీ పనుల్లో భాగం. మెయిళ్లలో తప్పులు దొర్లితే అర్థమే మారిపోవచ్చు. ఇక అది ఎక్కడికి దారితీస్తుందనేది చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఆంగ్లంలో అలాంటి దోషాలను, లోపాలను సవరించాలన్న ఆలోచనతో వచ్చిందే ‘గ్రామర్లీ’ సాఫ్ట్వేర్.
ఆ ముగ్గురి ఆలోచనే..
ఇంగ్లిషు ప్రపంచ భాషగా మారిపోయింది. కొన్ని దేశాల్లో మాత్రమే ఇది మాతృభాష. అయినప్పటికీ.. బ్రిటిషు పాలన పర్యవసానంగా అంతటా అధికార భాషగా చలామణీ అవుతోంది. అయినా, తప్పుల్లేకుండా రాయడంలో మాత్రం చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. యావత్తు ప్రపంచం దోషరహిత ఇంగ్లిషుని రాయాలని మ్యాక్స్ లిట్విన్, అలెక్స్ షెవ్చెంకో, డిమిత్రో లైడర్ అనే ముగ్గురు యువకులు తలిచారు. ఆ ఆలోచన నుంచి పుట్టిందే గ్రామర్లీ యాప్. వర్క్ ఫ్రమ్ హోం పని సంస్కృతి పెరిగిన తర్వాత దీనికి మరింత ఆదరణ లభించింది. మెయిళ్లతో సహవాసం చేసే కార్పొరేట్లకు ఇప్పుడు గ్రామర్లీ ఒక సాధనంగా మారిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు!
ఏటా 14 లక్షల పదాలు..
శాన్ఫ్రాన్సిస్కో కేంద్రంగా పనిచేస్తున్న గ్రామర్లీ కృత్రిమ మేధ సాయంతో మన రాత నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది. 2009లో దీన్ని ప్రారంభించారు. బ్రాడ్ హూవర్ అనే వెంచర్ క్యాపిటలిస్ట్ ప్రస్తుతం సీఈఓగా ఉన్నారు. 600 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా రోజుకి 3 కోట్ల మంది గ్రామర్లీని వినియోగిస్తున్నారు. ఏటా 14 లక్షల పదాలను విశ్లేషిస్తారు. ఆంగ్లం మాతృభాషగా లేని దేశాల్లో దీనికి మంచి ఆదరణ ఉంది. ఇంకా చాలా ప్రాంతాలకు దీన్ని విస్తరించాల్సి ఉందని హూవర్ తెలిపారు.
వారివురు కోటీశ్వరులు..
గత ఏడాది నవంబరులో గ్రామర్లీ 200 మిలియన్ డాలర్లు సేకరించింది. దీంతో ప్రపంచంలో అతిపెద్ద యూనికార్న్లలో ఒకటిగా అవతరించింది. ప్రస్తుతం కంపెనీ విలువ 13 బిలియన్ డాలర్లుగా నిపుణులు అంచనా వేశారు. వర్క్ ఫ్రమ్ హోం పెరిగిన తర్వాత తమ బిజినెస్ మరింత ఊపందుకుందని హూవర్ వెల్లడించారు. కంపెనీలో ఉన్న వాటాల ద్వారా ముగ్గురు వ్యవస్థాపకుల్లో ఇద్దరు బిలియనీర్లుగా అవతరించారు. మ్యాక్స్, అకెక్స్ ఇరువురూ చెరి 2.4 బిలియన్ డాలర్ల సంపద కలిగి ఉన్నట్లు బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ద్వారా తెలుస్తోంది. హూవర్, లైడర్ మాత్రం వారి వాటాలను వెల్లడించడానికి ఇష్టపడలేదు. కానీ, ఉద్యోగుల బృందంగా తమకు మెజారిటీ వాటా ఉందని పేర్కొన్నారు. సాధారణంగా ఉక్రెయిన్లో కమొడిటీ వ్యాపారం ద్వారా అక్కడి వ్యాపారవేత్తలు భారీగా సంపాదిస్తుంటారు. కానీ, అందుకు భిన్నంగా ఓ టెక్ ఆధారిత యాప్ ద్వారా వీరివురు ఆర్జిస్తుండడం విశేషం.
ఆలోచన అక్కడి నుంచి వచ్చింది..
1990లో యూనివర్శిటీలో ఎంబీఏ చేస్తున్న సమయంలో మ్యాక్స్, అలెక్స్ ఒకరికొకరు పరిచమయ్యారు. తర్వాత వారు అమెరికా, కెనడాకు వెళ్లిపోయారు. అక్కడ వారు పనిచేస్తున్న కంపెనీలో ‘ప్లేజరిజం’ (plagiarism - గ్రంథచౌర్యం)ను అరికట్టేందుకు చేస్తున్న పని నుంచే గ్రామర్లీ ఆలోచన పుట్టిందని మ్యాక్స్ తెలిపారు. ఇంగ్లిషు మాతృభాష కాని తమకు ఎదురైన సవాళ్ల నుంచే దీన్ని రూపొందించామని వివరించారు. 2014లో బేసిక్ ఫీచర్లతో ఉచిత ప్లాన్ను అందుబాటులోకి తీసుకొచ్చిన తర్వాత గ్రామర్లీకి ఆదరణ పెరిగిందని తెలిపారు. తర్వాత ఉచిత బ్రౌజర్ ఎక్స్టెన్షన్లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. మరింత లోతైన సాయం కావాలంటే నిర్ణీత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఇక వర్క్ ఫ్రమ్ హోం వచ్చిన తర్వాత గ్రామర్లీని ఉపయోగించే వారి సంఖ్య మరింత పెరిగింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంటి కోసం సిద్ధం ఇలా
సొంతిల్లు కొనాలనే ఆలోచనతో ఉన్నారా? మీ దగ్గర ఎంత డబ్బుంది? గృహరుణం ఎంత తీసుకోవాలి? ఇలాంటి లెక్కలన్నీ వేసుకున్నారా? ఈ సమయంలో తీసుకునే చిన్న జాగ్రత్తలతోనే లక్షల రూపాయలు ఆదా చేసుకునేందుకు మార్గం దొరుకుతుంది -
ఫిక్స్డ్ డిపాజిట్లు వడ్డీపై పన్ను పడకుండా...
బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయా? ఆదాయపు పన్ను పరిధిలో లేనప్పుడు మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్) పడకుండా చూసుకుంటున్నారా? ఇందుకోసం ఏం చేయాలో తెలుసా? బ్యాంకు లేదా సంస్థల దగ్గర ఫారం 15జీ లేదా 15హెచ్ను సమర్పించాల్సి ఉంటుంది. అప్పుడే మీకు మూలం వద్ద పన్ను కోత విధించరు. -
జీవిత బీమా.. మీ బాధ్యతలను తీర్చేలా
మీ నెలవారీ ఆదాయం కిరాణా సామగ్రి, బిల్లులు చెల్లించడం, పిల్లల ఫీజులు, ఇతర ఖర్చులను తీర్చడంలో మీకు ఎలాంటి ఇబ్బందులూ రాకుండా చూసుకుంటుంది. మీ బడ్జెట్ ఖర్చులను పక్కన పెడితే.. మీ నెలవారీ ఆదాయంలో కొంత భాగాన్ని ఆరోగ్య అత్యవసర ఖర్చులు, పదవీ విరమణ ప్రణాళికలు, పిల్లల ఉన్నత విద్యలాంటి వాటి కోసం పొదుపు, మదుపు చేయాల్సిన అవసరమూ ఉంటుంది. -
బేరమాడితే తగ్గేను ప్రీమియం
కారు బీమా ఒక బాధ్యత. ఏడాదికోసారి దీన్ని పునరుద్ధరిస్తూనే ఉండాలి. అప్పుడే దీన్ని మీరు రోడ్డు మీద ఎలాంటి భయాలూ లేకుండా నడపగలరు. బీమా రక్షణ లేకుంటే.. అటు చట్టపరంగానూ, ఇటు ఆర్థికంగానూ చిక్కులు తప్పవు. -
నిఫ్టీ 50 షేర్లలో పెట్టుబడికి...
నవి మ్యూచువల్ ఫండ్ కొత్తగా ఒక నిఫ్టీ 50 ఈటీఎఫ్ పథకాన్ని తీసుకొచ్చింది. నవీ నిఫ్టీ 50 ఈటీఎఫ్ అనే ఈ పథకం ఎన్ఎఫ్ఓ నేటితో ముగియనుంది. ఎన్ఎఫ్ఓలో కనీస పెట్టుబడి రూ.250. ఓపెన్ ఎండెడ్ పథకం. -
Elon Musk: బాల్యంలో కష్టాలు పడ్డా.. వదంతులకు చెక్ పెడుతూ మస్క్ పోస్ట్
Elon Musk: ఎలాన్ మస్క్ ట్విటర్ వేదికగా అనేక విషయాలను పంచుకుంటుంటారు. అనేక మంది ట్వీట్లకు తన దైన శైలిలో స్పందిస్తుంటారు. ఇటీవల గనులపై వస్తున్న ఆరోపణలపై మరోసారి సుదీర్ఘ ట్వీట్ చేశారు. -
Mukesh Ambani: ముకేశ్ అంబానీ.. 20 ఏళ్ల ఇండస్ట్రీ
రిలయన్స్ ఇండస్ట్రీస్ విస్తరణలో ముకేశ్ అంబానీ కీలక పాత్ర పోషించారు. తండ్రి మరణం తర్వాత కంపెనీ బాధ్యతలు చేపట్టిన ఆయన సంస్థను అనేక రంగాలకు విస్తరించారు. -
Retirement: 50 ఏళ్లకే రిటైర్.. తర్వాత ఎలా? నితిన్ కామత్ సూచనలు
ఒకప్పటిలాగా 60 ఏళ్లు పనిచేసి, పదవీ విరమణ చేసే రోజులు కావివి. ఆధునిక యువత 50 ఏళ్లకే ఉద్యోగం మానేసి, తమకు నచ్చినట్లుగా జీవించేందుకు సిద్ధం అవుతున్నారు. వైద్యపరమైన పురోగతి కారణంగా ఆయుర్దాయం 80కి చేరింది. -
Nellore: చదువు మానేసి.. చాయ్తో రూ.5 కోట్లు
ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరుకు చెందిన ఆ యువకుడు.. ఆస్ట్రేలియాలో ఓ దిగ్గజ యూనివర్సిటీలో బీబీఏ (బ్యాచిలర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్) చదివి.. మంచి ఉద్యోగం చేయాలనే లక్ష్యంతో విమానం ఎక్కాడు. -
లక్ష కోట్లకు చేర్చిన ఉక్కు మహిళ!
తక్కువమంది ఎంచుకునే రంగంలో అడుగుపెట్టడానికి సంకోచించేవారే ఎక్కువ. అమ్మాయిలను చదివించడమే గొప్పనుకునే రోజుల్లో ఆ సాహసం చేశారు సోమ మోండల్. ఓ మహిళ.. నాయకురాలన్న ఊహే కష్టమైన వేళ ఆ స్థానాన్ని అధిరోహించారు. -
Zepto: చిటికేసి... వేల కోట్లు సృష్టించిన చిన్నోళ్లు!
ఇంకా వయసు 20 దాటలేదు... చదువు పూర్తి కాలేదు....అలాంటి వారు... అప్పటికే మార్కెట్లో 20 ఏళ్ల అనుభవమున్నవారిని ఇంటర్వ్యూ చేస్తుంటే వచ్చిన వారికి అనుమానం! ఈ కుర్రాళ్లా మా సామర్థ్యాన్ని నిర్ణయించేదని? వీళ్లా మాకు కొలువిచ్చేదని? ఆ -
Rakesh Jhunjhunwala: ఆయన జీవితమే ఓ ఆర్థిక మంత్రం..!
భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో ఓ అధ్యాయం ముగిసింది. భారత్లో ఈక్విటీ మదుపర్లకు బెంచ్మార్క్గా చెప్పుకునే రాకేశ్ ఝున్ఝున్వాలా ఆదివారం ఉదయం కన్నుమూశారు. -
Savitri Jindal: ఆసియా సంపన్న మహిళ.. సావిత్రి జిందాల్
ఆసియాలోనే అత్యంత సంపన్న మహిళగా భారత్కు చెందిన సావిత్రి జిందాల్ అగ్రస్థానంలో నిలిచారు. జిందాల్ గ్రూప్ ఛైర్పర్సన్ అయిన ఆమె నికర సంపద 11.3 బిలియన్ -
తక్కువ నష్టానికీ వ్యూహాలు!
‘ప్రపంచమంతా అధిక ధరలతో.. ఆ ప్రభావం వల్ల ఏర్పడుతున్న మందగమనంలో నడుస్తోంది. ఈ నేపథ్యంలో, మదుపర్లు.. ముఖ్యంగా తొలిసారి డబ్బులు పెడుతున్నవారు తక్కువగా నష్టపోయే వ్యూహాన్ని అనుసరించాల’ని స్విస్ పెట్టుబడిదారు,‘ది గ్లూమ్ బూమ్ డూమ్’ ఎడిటర్ మార్క్ ఫాబర్ సూచిస్తున్నారు. ‘అమెరికాలో వడ్డీరేట్లు అధికంగా పెంచబోరని, 6 నెలల్లో తగ్గించడం ప్రారంభం కావచ్చ’ని వార్తా సంస్థ ‘ఇన్ఫామిస్ట్’కిచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ముఖ్యాంశాలివీ.. -
Gita Gopinath: ‘గీత’లు చెరిపేస్తూ.. మరో ఘనత సాధించిన గీతా గోపీనాథ్..!
ఈ ఏడాది ప్రారంభంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి(IMF)కి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా నియమితులై రికార్డు సృష్టించారు భారత సంతతికి చెందిన గీతా గోపినాథ్. -
దాన లక్ష్ములు!
‘నా సంపదలో సగం దానం చేస్తా’ రెండేళ్ల క్రితం మెకంజీ స్కాట్ మాట ఇది! అన్నట్టుగానే ఏటా ఆమె దానాలతో అందర్నీ ఆశ్చర్యపరుస్తూ వచ్చారు. -
Microsoft India COO: జీవితం పిజ్జా లాంటిది.. ఆ ఐదూ ఉండాల్సిందే!
‘జీవితంలో ఎదగాలంటే నిత్య విద్యార్థిగా ఉండాల్సిందే!’ చాలామంది ప్రముఖులు ఆచరించే విజయసూత్రమిది. -
‘యూనికార్న్’ అంటే నమ్మలేకపోయా!
మహిళలు సాంకేతిక రంగంలో.. అదే విధంగా ఆర్థిక రంగంలో ఉండటం చూశాం. కానీ ఈ రెండూ కలగలసిన ఫిన్టెక్ రంగంలో మాత్రం చాలా అరుదు. -
జోడీ నెంబర్ 1
కంబైన్డ్ స్టడీతో మార్కులు కొల్లగొట్టిన విద్యార్థుల్ని చూశాం. సివిల్స్ సాధించిన భార్యాభర్తల గాథలు విన్నాం. -
ఆఫీసు బాయ్ నుంచి కోట్ల వ్యాపారం దాకా!
‘ఇది కాదు... ఇది కానే కాదు. నేను ఉండాల్సిన చోటు ఇది కాదు... నేను చేరుకోవాల్సిన గమ్యం ఇది కాదు... అందుకోవాల్సిన లక్ష్యం ఇంకా నా -
ఆ రోజు... చనిపోతాననుకున్నా!
గౌతమ్ అదానీ.. దేశంలోని అత్యంత ధనవంతుల జాబితాలో అంబానీతో పోటీపడుతున్న ఈ వ్యాపార దిగ్గజం అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కు అధినేత.